1, డిసెంబర్ 2022, గురువారం

పుట్టకొండ దివ్యక్షేత్రం


స్థలపురాణం

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని పుట్టకొండ (వల్మీకాద్రి)అను ఈ దివ్యక్షేత్రం కాకినాడ పట్టణము నకు 20కి.మీ.దూరంలో ఉన్నది.

"వల్మీకం"అనగా పుట్ట లక్చ్మీసమేతుడై, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు భక్తులను కటాక్చిస్తున్నారు.

శ్రీలక్ష్మీనరసింహస్వామి గా పుట్టపై

స్వయం వ్యక్తమగుటచే ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన చెట్లతో అక్కడ అక్కడ పడి ఉన్న రాళ్ళతో

నిర్మానుష్యంగా ఉండేది.గోదావరి

నదికి చెందిన ఒక పాయ,దాని ప్రక్కనే ఒక పుట్ట కొండంత ఉండేది.త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి దక్చిణ భారతదేశ యాత్రలు చేస్తూ ఈ ప్రాంతం నకు

చేరుకున్నారు.ఈ యాత్ర చేస్తూ

స్వయం వ్యక్తమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని గుర్తించి స్వామి వారిని ఆరాదించెను.అదే సందర్భంగా గోదావరి నది కి వరదలు రావడం

మూలమున ఈ కొండ "తుల్యభాగ"నదీజలములలో

మునిగిపోయి కరిగిపోయినవి.అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు ఆ

కొండపైన ఉండుటచే వారి క్రిందనే పుట్టయున్నది.ఆ పుట్టపై స్వామి స్వయం వ్యక్తమగుట వలన శ్రీస్వామి వారి పాదాలు ఉన్న ప్రదేశంలో అనేక గ్రామాలు ఏర్పడ్డాయి.ఫలితంగా తుల్యభాగ నదీపాయ కాలువ రూపములో సముద్రంలో లో కలుస్తున్నది.స్వామివారి పాదాలు పుట్టలో ఉన్నాయి ఇప్పటికీ పైభాగం మాత్రమే కనబడుతున్నది.పెద్దాపురం ప్రాంతాన్ని పరిపాలించిన "వత్సవాయి"రాజవంశస్తులు వారి కులదైవం గా పూజించేవారు.వీరు తమిళనాడు రాష్ట్రం లోని "తిరుక్కోలూర్"(ఆళ్వార్ తిరుపతి) ప్రాంతం నుండి "పరవస్తు వంశంవారిని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యపూజలు,కైంకర్యములు, సేవలు సక్రమముగా జరుగుటకు గాను భూములను ఇచ్చియున్నారు.ఈ పరవస్తు వంశంలో 9వ తరం వారు అయిన శ్రీ పి.అప్పన్ అనంతాచార్యులు ఆలయం లో విధులు నిర్వర్తిస్తున్నారు.స్వామివారికి జరుగు ఉత్సవములు కు, పరవస్తు కుటుంబ సభ్యులు, మరియు బంధు వర్గము సహాయం అందించుచున్నారు. అధ్యనోత్సవములు,కళ్యాణోత్సవములు,విశేషమైనవి.భీష్మ ఏకాదశి

నాడు జరుగు రధోత్సవం చాలా విశేషమైనది.అనగా రధము మీద ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది.అనగా రధము మీద ఉన్న స్వామి వారిని సేవించుకున్నచో మరుజన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది.రోజూ రాత్రి సమయంలో ఆ ఆలయం లో (క్షీరము) పాలు ఉంచుతారు.ఆ పాలను స్వామివారు సేవిస్తారని నానుడి.పాంచరాత్ర ఆగమము విధానంగా స్వామి వారి కి ఆరాధనోత్సవాలు తిరుమంజనాలు(అభిషేకాలు)

జరుగుతాయి.2ఏకాదశులు, పౌర్ణమి, అమావాస్య,మాస సంక్రమణం, పర్వదినాలు అభిషేకాలు పరిష్కారం చూపిస్తాయని నానుడి.ఈ క్షేత్రం

గొల్లలమామిడాడ, బిక్కవోలు గ్రామాలు కు దగ్గరగా గండ్రేడు అనే గ్రామం దగ్గర ఉంది.ఈ ప్రాంతం లో ఉన్న ఈ ఆలయం నకు సరైన ప్రాధాన్యం, ప్రాచుర్యం లేకుండా ఉంది,ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిదని ఆలయ అర్చకులు ద్వారా తెలిసింది.ఈ స్వామి వారు పుట్ట పైభాగం మాత్రమే కనిపిస్తుంది, పాదాలు కొండ క్రింద ఉంది.ఈ సమీపంలో నే తుల్యభాగ నది ప్రవహిస్తోంది.ఈ గ్రామాలు అయినటువంటి గొల్లలమామిడాడ లో శ్రీ సూర్యనారాయణ స్వామి, మరియు కోదండరామ స్వామి దేవాలయం లు ఎంతో ప్రాశస్త్యం పొందినవి.బిక్కవోలు గ్రామంలో వెలసిన స్వయంభూ విఘ్నేశ్వరుడు, స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే ఈ ప్రాంతం లోని పుట్టకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.ఈ గ్రామాలు సమీపంలోనే ఉన్న ఊళపల్లి గ్రామం లోని శివాలయం కూడా అగస్త్యేశ్వరస్వామి వారి ప్రతిష్ట.ఇది కూడా తుల్యభాగ నది ప్రాంతం లో ఉన్నది.సరైన ప్రాచుర్యం లేకుండా ఉన్నాయి.వీటిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి ఆయురారోగ్యాలను కలుగతాయని ప్రాచుర్యం.

కామెంట్‌లు లేవు: