15, మే 2023, సోమవారం

సాదాకా మేలుకో-1

 సాదాకా మేలుకో-1

84 లక్షల జీవరాశుల్లో ఒక జంతువే.అదే మనిషి  కేవలం మాట్లాడ్డం వల్ల మనిషి 83,99,999 జీవరాశుల కంటే చాలా భిన్నం, ప్రత్యేకం అయ్యాడు.మనిషి మాట్లాడటమే కాదు తనకన్నా ఎంతో పెద్దగా వున్న జంతువులను లొంగదీసుకోగలుగుతున్నాడు, అడివిలో సింహమే రాజు అంతేకాదు మిగితా జంతువులన్నీ కూడా సింహానికి భయపడవలసిందే. సింహం కన్నా ఎంతో పెద్దగా వున్న ఏనుగు కూడా సింహాన్ని చూసి పరుగులిడుతుంది.  సింహం తన వాడి ఐన కోరలతో, గోళ్ళతో చీల్చి  చండాడుతుంది. నిజానికి ఏనుగు ఎదురుతిరిగితే సింహం ఏనుగు ఒక్క కాలును కూడా కదల్చలేదు.  కానీ ఏనుగు కన్నా సింహం ఎంతో తెలివి అయినది కావటం వలన సింహం ఏనుగు మీద విజయాన్ని పొందగలుగుతున్నది. 

అనాదిగా మనం చూస్తూ వున్నాము బలమైన  వానికన్నా తెలివియిన వాడే ఎంతో సమర్ధవంతంగా తన పనులు చేసుకోవటమే కాకుండా బలమైనవానిమీద విజయాన్ని పొందుతున్నాడు. 

ఒక్కమాటలో చెప్పాలంటే బలము కన్నా తెలివే ఎంతో శ్రేష్టం అని మనకు తెలుస్తుంది. ప్రతి మనిషి బలముకన్న తెలివికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. అట్లా అని శారీరికంగా బలహీనులు కమ్మని కాదు అర్ధము, బలముకూడా ఏందో విలువైనది, ఉపయుక్తమైనది. దానికి తోడు బుద్ధికూడా కలిసివుంటే రెండు ఎంతోరాణిస్తాయి. అది ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. 

మానవునికి బుద్ది జ్ఞ్యానం కలిగి వుండటము వలన వాటిని సరైన మార్గంలో పెట్టుకోవటం చాలా మంచిది. వాటివలననే మనిషి తన జీవిత పరమావధి, పరమార్ధం ఏమిటని ఆలోచించగలుగుతాడు. ఆలా అలోచించి మానమహర్షులు మనకు అనేకానేక విషయాలను వారి దివ్య జ్ఞ్యానంముతో తెలిపారు. చివరికి మానవ పరమార్ధం జన్మరాహిత్యమైన మోక్షం ఒక్కటే అని నిర్ధారణ చేశారు. మనకు వున్నజ్ఞ్యానులలో శ్రీ ఆదిశంకరాచార్యులు అగ్రగణ్యులు. వారి "వివేక్ చూడామణిలో" శ్లోకాన్ని పరికించండి. 

జంతూనాం నరజన్మ దుర్లభమ



జీవులకు తొలుత మానవజన్మము ప్రాప్తించుటయే దుర్లభము. 


 84 లక్షల జీవరాశిగా మన శాస్త్రాలు చెపుతున్నాయి, అటువంటప్పుడు మానవ జన్మ పొందటం ఎంతటి అసాధ్యమో తెలుసుకోండి. 

కాబట్టి ఈ విషయం సాధకులు అందరు గ్రహించి తమ జన్మకు కారణం జన్మను సార్ధకతను చేసుకొనే జన్మరాహిత్య మార్గము అయిన మోక్షమార్గాన్ని ఎంచుకొని, ఉత్తముడైన గురువుని ఆశ్రయించి మోక్షార్ధి కావాలి. 

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

చేరువేల భార్గవ శర్మ  


 


కామెంట్‌లు లేవు: