13, మే 2024, సోమవారం

యోగులు వందనీయులే

 "మంత్రే తీర్ధే ద్విజే *దైవే* దైవజ్ఞే..

యాదృశీ భావనా సిద్థిర్భవతి తాదృశీ"  



అన్నారు కనుక ఎవరి మనసు ఏ రూపాన్ని దైవంగా పట్టుకున్నా తప్పులేదు కానీ వేలం వెఱ్ఱి గా కారాదు. వైదిక ధర్మం, సదాచారం, సత్సంప్రదాయం, సనాతన ధర్మానికి పెద్దపీట వేయకపోతే అంత ఆచరణీయం కాదేమోననీ. అవైదికం గా ఉన్నచో దత్త సంప్రదాయం అని చెప్పిదాటవేస్తున్నారేమోనని అనిపిస్తుంది. యజనం ప్రాధాన్యత కోల్పోవడం, ప్రతిష్టాత్మకమైన దేవతా మూర్తిని అందరూ స్పృశించడం, ఇంకా చాలా.. హైందవ ధర్మానికి గొడ్డలిపెట్టు వంటిదని అనిపిస్తుంది. శౌచం, నిష్ఠ.. ఇత్యాదులు ఆవశ్యకం కనుక ... తత్సంప్రదాయ రాహిత్యం శిష్ఠాచారం కాదని (నేను తప్పు కావచ్చు) నాకు అనిపించింది. కానీ మహానుభావులు, యోగులు వందనీయులే. 🙇‍♂️

కామెంట్‌లు లేవు: