21, అక్టోబర్ 2024, సోమవారం

ఆశ్వీయుజ మాసంలో

 🙏ఆశ్వీయుజ మాసంలో

ఈశ్వరునికి అన్నాభిషేకం..!!🙏

    


🌿అన్నం పరబ్రహ్మ స్వరూపం.

సమస్త ప్రాణికోటి అన్నజీవులు. వాటివాటికి తగిన ఆహారం లభించకపోతే ఎక్కువ రోజులు జీవించలేవు. అందుచేత అన్నదానం చేసేవారిని అన్నదాతా!  సుఖీభవా ! అని ఆశీర్వదిస్తారు. 


🌸అన్నాన్ని సృష్టించి మనకు ప్రసాదించే వరప్రదాతగా శివపురాణాలు  ఈశ్వరుని కీర్తిస్తున్నాయి.  


🌿అన్నాన్ని  నిందించరాదని

శివస్వరూపమని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ఏది జీవుల ప్రాణాలను నిలబెడుతున్పదో , ఏది లేకపోతే ప్రాణాలు పోతున్నాయో

అది పరబ్రహ్మ స్వరూపం.

అన్నం బ్రహ్మం  అని

వివరిస్తున్నాయి పురాణాలు.


🌸అలాటి అన్నం యొక్క మహాత్యాన్ని,విశిష్టత ను తెలిపేది ఆశ్వీయుజ పౌర్ణమి నాడు

కాశీ అన్నపూర్ణాదేవి అన్నాన్ని బిక్షగా పెట్టి  ఈశ్వరుని దోషాన్ని తొలగించిన రోజు ఈ ఆశ్వీయుజ పౌర్ణమి తిధినాడే.


🌿దక్షునిచే శపించబడిన చంద్రుడు ఈశ్వరుని కరుణతో

తన కళలను తిరిగి పొంది సంపూర్ణంగా ప్రకాశించిన రోజు కూడా

యీ పౌర్ణమి రోజునే.


🌸ఆశ్వీయుజ మాస పౌర్ణమినాడు

ఈశ్వరునికి ఆన్నాభిషేక ఉత్సవం వైభవంగా జరుపుతారు. ఆనాడే

చంద్రుడు ఆన్నాభిషేకం జరిపాడని పురాణ కధలు వివరిస్తున్నాయి.


ఒకానొక కాలంలో అన్నదానాలకు

చిదంబరం ప్రసిధ్ధిపొందిన క్షేత్రం.


🌿చిదంబరం ఆలయంలో అనునిత్యం ఈశ్వరునికి అన్నాభిషేకం 

జరిగేది. ఆదిశంకరులు

ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చిన సమయంలో అన్నాకర్షణయంత్రం ప్రతిష్టించినట్లు చెప్తారు.

అందువలన తిల్లైనాధుని దర్శనంతో ఎవరి గృహంలోనూ  అన్నానికి కొఱత వుండదు అని  అంటారు.


🌸అన్నమయకోశమైన యీ దేహానికి అన్నమే ఆధారం. ఒక్కొక్క

అన్నపు మెతుకు  ఒక్కొక్క

శివలింగ రూపం. ఉన్నతమైన యీ అన్నాన్ని ఈశ్వరునికి నివేదించే

ఉత్సవం ఆశ్వీయుజ పౌర్ణమి నాడు జరుగుతుంది.


🌿ఆశ్వీయుజ మాసంలోనే అన్నాభిషేకం

జరగడానికి మరో కారణం కూడా పెద్దవారు చెప్తారు.

ఆశ్వీయుజమాసం వానలు కురిసే కాలం. పెద్ద పెద్ద తుఫానులు, వరదలు ఏర్పడే కాలం. అందువలన ఇళ్ళు కోల్పోయినవారంతా ఆ 

శివాలయాలలో తల దాచుకునేవారు.

ఊరంతటికి అక్కడే వంటలు చేసి వినియోగించేవారు.


🌸అటువంటి  సమయంలో

జీవులకి ఆహారం సమకూరుస్తున్న పరమశివునికి ముందుగా భక్తితో నివేదించి తర్వాత

ప్రసాదంగా  ఆ ఆహారం తీసుకునేవారు. అభిషేకాన్నము మిగిలిపోతే పారవేయకుండా నీళ్ళలో కలిపేవారు.

ఇందువలన జలచరాలకు కూడా

ఆహారం లభించి ప్రాణాలు నిల్పుకునేవి.  భూసారం బలపడి ప్రకృతి వనరులు చక్కని పంటలనిచ్చేవి.


🌿అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి  70 రకాల  ద్రవ్యాలతో అభిషేకించ వచ్చని ఆగమాలు వివరిస్తున్నాయి.

వాటిలో శివాంశమైన అన్నాభిషేకం  చేయడం వలన ఆహారానికి కరువు ఏర్పడదు.


🌸అన్నదోషాలవంటివి తొలగి పోతాయని పురాణ గ్రంధాలు వివరిస్తున్నాయి.

పంచభూతాత్మకుడైన  పరమేశ్వరునికి పంచభూతాల ద్వారా సృష్టించబడిన 

అన్నంతో అభిషేకం చేసినప్పుడు ఆయన పరమానంద

భరితుడవుతున్నాడని ఆధ్యాత్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి.


🌿మనిషి ప్రధాన సమస్యయైన ఆకలి బాధను తొలగించే మహోన్నత సేవ అన్నదానం. భగవంతుని పేర అన్నదానాన్ని జరపడమే యీ ఆశ్వీయుజ అన్నాభిషేకం.


🌸ఆశ్వయుజ అన్నాభిషేకం

చేసిన వారి కుటుంబాలకి

సకల సౌభాగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి.


🌿పూర్ణకళలతో ప్రకాశించే

చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి శక్తి వంతమైన తన 

కాంతి ప్రసరింపచేసినందున

మానవుల మనోబలం , బుధ్ధిశక్తి  పెరిగి

కార్యాలన్నీ సక్రమంగా సిధ్ధిస్తాయి.


🌸అభిషేకానికి మరొక విశిష్టత వున్నది. ఏ అభిషేకమైనా  ఆ అలంకరణలో 24 నిముషాలు మాత్రం వుండాలని ఆగమ విధి. కొన్ని ప్రాంతాలలో 48 నిముషాలు  వుంటుంది. ఆ అలంకరణ ఎక్కువ సమయం వుండకూడదు.


🌿అన్నాభిషేక అలంకారం మాత్రం ఒక గంటా, గంటన్నర మాత్రం వుండవచ్చు.

ఇదే అన్నాభిషేక విశిష్టత.

ఎక్కువ సమయం ఈశ్వరుని

దేహం మీద వున్న అన్నం

ఉత్కృష్టమైన ప్రసాదంగా

మారుతుంది. 


🌸ఇందువలన యీ ప్రసాదం

భుజించిన ,  శారీరక రుగ్మతలు గుణమౌతాయి, దేహకాంతి

ఏర్పడుతుంది. సంతానం

లేని వారికి సంతాన భాగ్యం

కలిగుతుందని భక్తులు

ధృఢంగా నమ్ముతారు....

కామెంట్‌లు లేవు: