21, సెప్టెంబర్ 2020, సోమవారం

శివకుమార స్వామి

 ఈ రోజు ఒకరు YouTube లో శ్రీ #శివకుమార స్వామి గారి వీడియో చూశాక నన్ను అడిగారు, #శివకుమార స్వామి ఎవరు అని, ఆయన మరణించినప్పుడు ఎందుకు అన్ని కోట్ల మంది ప్రజలు బాధ పడ్డారు అని. 


అప్పుడు నేను అడిగాను సరే నీకు మదర్ థెరిసా తెలుసా? అని 


అతను, అయ్యో ఎందుకు తెలియదు "ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీత, చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఆమె గురించి ఒక పేరా కూడా ఉంది" అని. 


నేను చెప్పాను, సరే అయితే ఆమె ఇక్కడికి వచ్చి చేసిన సేవ అనే పనులు దానితో చేసిన #మతప్రచారం, #మతమార్పిడి, మీడియా ఆమెకి ఇచ్చిన ప్రాదాన్యం గురించి వదిలేయ్యు. 

కానీ అసలు ఏమీ ఆశించకుండా

శివకుమార స్వామి వారు 132 #విద్యాసంస్థలను స్థాపించి ఏటా 50,000 మంది #గ్రాడ్యుయేట్లను, సంవత్సరానికి 10,000 మంది #గురుకుల్ విద్యార్థులకు విద్యను అందిస్తూ సాంప్రదాయ విద్యావిషయక అభ్యాసాన్ని పరిరక్షిస్తు, అలాగే అందులో ఉన్న అంతమంది విద్యార్థులందరికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ, ఏటా 5 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చే వ్యవసాయ కార్యక్రమాలను చేస్తూ, ఇలాంటి ఇంక ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ స్వామి శివకుమార స్వామి గారి గురించి భారతదేశంలో పుట్టిన మనకు ఇంక తెలియకపోవడం ఒక విధంగా సిగ్గుచేటు. అది మన దౌర్భాగ్యం. ..


ఇంత చేసిన ఆ స్వామిని మీడియా అతని ప్రయత్నాలను మరియు విజయాలను హైలైట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు, ఎందుకంటే అతను ఎప్పుడూ #కాశాయ వస్త్రం కట్టుకొని, కుంకుమ ధరించేవారు..

కామెంట్‌లు లేవు: