21, సెప్టెంబర్ 2020, సోమవారం

సముద్ర తీరాన

 🌊సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది.అతను వెంటనే 

" ఈ సముద్రం మహా దొంగ"అని రాశాడు.


కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు.ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో

 "ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు. 


ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు.అతని తల్లి 

"ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి" అని

రాసింది. 


ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో 

"‘ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను " అని రాశాడు.


అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. 

వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. 


రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు...


ఇంకా,

ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు.వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.


ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు.చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి.దాన్ని తొలగించి ముందుకు అడుగు వేయండి.


*🙂వినయం,విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది...*

*😊మనస్సాక్షి ,భగవంతుడు ఒప్పుకునేలా జీవించాలి...*

కామెంట్‌లు లేవు: