21, సెప్టెంబర్ 2020, సోమవారం

మనిషికి చావు గుర్తురాకూడదు

 శుభోదయం.


మనిషికి చావు గుర్తురాకూడదు. చావుని మరిచిపోయిన వాడే సంసారం లో వుండగలడు. అందుకే మృత్యువుని దాచేస్తూ వుంటారు. శ్మశానాన్ని ఊరికి దూరంగా ఉంచుతారు. మృత్యువు గుర్తు వచ్చినవాడి సంసారం సన్న్యాసం అవుతుంది. అజ్ఞానంలో వరం శాపం లా అనిపిస్తే, జ్ఞానం లో శాపం కూడా వరంలా అనిపిస్తుంది.


జీవితంలో సమస్త కర్మలను కోరిక ఆధారంగా కాకుండా, నిష్కామ కర్మ ఆధారంగా చేయాలి. ఇందులో ఒక సౌలభ్యం ఉంది. కర్మ అవుతున్నంత సేపు కోరిక, ఆశ ఉండవు. కర్మ పూర్తవగానే ఆనందం తో నిండిపోతాము.


కోరికలే సంసారం. కోరికనేది వున్నంతకాలం బంధం ఉంటుంది. బంధం లేనప్పుడు ఏది ఉంటుందో అది మోక్షం. శాంతితో నిండిన మనస్సు అనేది ఉండదు. అశాంతి పేరే మనసు. వాసనాలని వదలి వేయాలి. భవిష్యత్తుని వదలి వేయాలి. కలలని వదలి వేయాలి. చివరకు నిన్ను నీవే వదలి వేయాలి. నీలో భగవంతుడు వున్నట్లుగా జీవించాలి. నీవు కర్మ చేయగానే, ఆ కర్మఫలం స్వీకరించడానికి పరమాత్మ నీ వెనకే వున్నట్లుగా కర్మలు చేస్తూవుండాలి.

కామెంట్‌లు లేవు: