14, జులై 2024, ఆదివారం

నీ తీరు మార్చుకో

 నా చిన్నప్పుడు విజయవాడ దుర్గ గుడిలో ప్రతి శుక్రవారం రాత్రి పవళింపు సేవ జరిగేది..మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళేది..కాసేపు పూజ చూసాక నేను అక్కడ ఉన్న నా ఈడు పిల్లలతో ఆడుకుని ఇంటికి వచ్చేవాడిని..మా అమ్మ అక్కడ ఇచ్చిన ప్రసాదం ఇంటికి తెచ్చి రాత్రి అట్టి పెట్టి పొద్దున్న లేచాక స్నానం చేయగానే దానిని తినిపించేది..ఇవాళ అలా కనీసం వారానికి ఒక సారి అన్నా పిల్లలను గుడికి తెచ్చే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? గుడిలో వారానికి ఒక సారి అన్నా ఏదో ఒక వైదిక కార్యక్రమం చేసి భక్తులు సామూహికంగా కలిసే అవకాశం ఏర్పడుతోందా?.. హిందూ ధర్మానికి ఆపద వేరే వాళ్ళ వల్లే కాదు..మన సంస్కృతి ని మనం సరిగాఆచరణ చేయని మూలంగా కూడా వస్తుంది..ఇది సరిదిద్దుకోకుండా ఏవేవో రాలీలు,కేసులు అంటే ఉపయోగం ఏముంటుంది?..నీ తీరు మార్చుకో నేడు.. లోకం ఎలా మారుతుందో చూడు..👌👌

కామెంట్‌లు లేవు: