13-21-గీతా మకరందము
క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
ప్రకృతి పురుషులను గురించి ఇంకను వివరముగ తెలుపుచున్నారు–
కార్యకారణకర్తృత్వే*
హేతుః ప్రకృతిరుచ్యతే
పురుషస్సుఖదుఃఖానాం
భోక్తృత్వే హేతురుచ్యతే
తాత్పర్యము:- కార్యకారణములను గలుగజేయుటయందు ప్రకృతి హేతువనియు, సుఖదుఃఖముల ననుభవించుటయందు పురుషుడే హేతువనియు చెప్పబడుచున్నది.
వ్యాఖ్య:- కార్యమనగా శరీరము. కారణమనగా ఇంద్రియ మనోబుద్ధ్యహంకారములు, పంచభూతములు, శబ్లాదివిషయములు - వీనియన్నింటిని గలుగజేయునది (హేతువు) ప్రకృతి. ప్రకృతి జడమైనది. కావున సుఖదుఃఖముల ననుభవింపలేదు. పురుషుడు చిద్రూపుడు, అసంగుడు. కావున ఆతనికి సుఖదుఃఖభోక్తృత్వము యుండజాలదు. అయినను ప్రకృతియొక్క సంయోగముచే ఆయా సుఖదు:ఖాదులను పురుషుడు(ఆత్మ) అనుభవించునట్లు తోచుచున్నాడు. అంతియేకాని వాస్తవముగ నతనికి కర్తృత్వభోక్తృత్వాదులు ఏవియునులేవు.
~~~~
* కార్యకరణకర్తృత్వే - పాఠాంతరము
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి