26, జనవరి 2021, మంగళవారం

స్త్రీలు రుద్రాక్షలు

 *🍃స్త్రీలు రుద్రాక్షలు ధరించవచ్చునా ?🍃*




అయాచితంగా ,సులభంగా,ఎక్కువ శ్రమపడకుండా లభించే అమూల్య వస్తువులను అలక్ష్యం చేసే గుణం మానవులకి ఎక్కువే.


ఆలయ ఉత్సవాల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో

దైవీకశక్తి గల రుద్రాక్షలను 

పూజాగదిలో పెట్టి  పూజించి 

కంఠంలో ధరించడం వలన

అద్భుత శక్తులు పొంద వచ్చును. రుద్రాక్షలలో అయస్కాంత శక్తి వున్నది. 

అది మనలోని చైతన్య శక్తితో

చేరినప్పడు, మనసుకు ప్రశాంతతను కలిగించి ఆలోచనా శక్తిని

పెంపొందిస్తుంది.  మంచి ఆలోచనలు  కలగడం వలనసజ్జనుల సాంగత్యం   ఏర్పడి సత్చింతనతో సత్కార్యాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. రుద్రాక్షధారణ వలన సాత్విక గుణాలు ఏర్పడే అవకాశముంది. అలాటివారిలో దైవచింతన వుంటుంది. విద్యార్థులు రుద్రాక్షలు మెడలో ధరిస్తే  మేధస్సు పెరుగుతుంది.

రుద్రాక్షలు ధరించినట్లయిన పవిత్రగంగలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. 

గంగ స్నానం వలన

చేసిన పాపాలు తొలగిపోతాయని

ఐహీకం. మానవుడి అనేక కష్టనష్టాలకు కారణం అతడు చేసే పాపాలే.  విజ్ఞానశాస్త్ర రీతిగా చూసినా   యీ దైవీక

రుద్రాక్షలను  ధరించిన వారికి

దీర్ఘాయువు, సిరి సంపదలు ప్రాప్తిస్తాయని జాబాల ఉపనిషత్  తెలుపుతున్నది.  ఒకటి నుండి14 ముఖాలదాకా రుద్రాక్షలు వున్నాయి.అనేక శారీరక ,మానసిక రుగ్మతల తీవ్రతను  రుద్రాక్షలు

తగ్గిస్తాయని  పరిశోధకులు

తెలుపుతున్నారు.  సర్వవేళలా రుద్రాక్షలను

ధరించ వచ్చును.


శివ దీక్ష తీసుకున్న స్త్రీలు

రుద్రాక్షలను ఎల్లవేళలా ధరించవచ్చును. సాధారణ గృహిణులు మాత్రం పూజా వ్రత సమయాలలో మాత్రమే  ధరించాలి. తరువాత, వాటిని మెడలో నుండి తీసివేసి పూజా గదులలో వుంచాలి.🍃

కామెంట్‌లు లేవు: