31, ఆగస్టు 2021, మంగళవారం

తిరుమల తిరుపతి గోవిందా !

 వందేమాతరం

 

తిరుమల తిరుపతి గోవిందా !

 

గత రెండు సంవత్సరాలుగా అధ్యాత్మికంగా కాక ఎడారిమత పాలనలో అక్కడ జరుగుతున్న వికృత కార్యకలాపాల వలన తిరుమల ప్రతీరోజు వార్తా శీర్షికల్లో  కనిపిస్తోంది.

 

కరోనా పేరు చెప్పి ఉచిత దర్శనం రద్దు చేసారు. ప్రస్తుతం ఆంధ్రాలో అవనీతి ఆనవాయితీ కాబట్టి 300 రూపాయలిస్తే కరోనా రాదనుకొంటా, ఆ దర్శనం మాత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా కొనసాగుతోంది.

కొండక్రింద తిరుపతిలో కూడా దైవ దర్శనాలకి ఎటువంటి ఆంక్షలు లేవు. 

 

కరోనా పేరు చెప్పి  ప్రజల  దృష్టికి అందని మరోక భయంకరమైన కుట్ర అక్కడ జరుగుతోంది.   తిరుపతి ప్రాదాన్యత తగ్గించడానికి మెల్లగ కొండపై వసతి సౌకర్యాలు తగ్గించుకొంటూ వస్తున్నారు.

 

ఈ మధ్య సాంప్రదాయ భోజనం  అంటూ ఒక క్రొత్త ప్రక్రియ మెదలుపెట్టారు. ఇది ఫక్తు వ్యాపారం. తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను దెబ్బతీసే ఒక కుతంత్రం.   తిరుమలని ఒక holiday spot గా తయారుచేసి , ఆ  పేరుమీద అన్ని మతాలవాళ్లని అక్కడ చేర్చి , అసలైన భక్తుల్లో అభద్రత, అసౌకర్యం కలగచేసి వారిని తిరుమలకి దూరం చేయడమే దీని వెనుక ఒక్క ప్రణాళిక.  ఇంతకముందు డా. రాజశేకర్ రెడ్డి  గారు 7 కొండలు కాదు 2 కొండలే అంటూ తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసారు. మిగిలిన 5 కొండల్లో Holiday resorts, amusement parts ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు  అప్పటి ఉడిపి పెజావర్ పిఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వేశతీర్థ స్వామి వారు వెంటనే జరగబోయే ఉపద్రవాన్ని గుర్తించి ముందుండి ప్రజా ఉద్యమాన్ని నడపడం వల్ల ఆ దుష్టుల కల కలగానే మిగిలిపోయింది. ఆనాటి ఆ ఉప్పొంగిన ప్రజా ఉధ్యమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలగడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ మత మౌడ్యులు ఆ రోజుల్లో  తిరుమల కొండల్లో ఎన్నో శిలువలు పాతారు. 

 

గత కొన్ని సంవత్సరాలుగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని, హైందవ ధర్మానికి పొంచి వస్తున్న ముప్పు గ్రహించి హిందువుల్లో వస్తున్న సంఘటిత స్పందన ఈ విషయంలో స్పష్టంగా కనిపించింది. ప్రజల్లో, ముఖ్యంగా సాంఘీక మాధ్యమాల ద్వారా పెల్లుబికిన నిరసనలకు భయపడి ప్రభుత్వం తనకు తెలియకుండా జరిగిన విషయమని,  ఆ తప్పును అన్నిటికి  పాపాలబైరవులైన అధికారులపై నెట్టేసి, ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిది. ఇక్కడ కోసమేరుపెమిటంటే, అదేదో ప్రభుత్వపు గొప్పతనంగా కొన్నిమన  సంఘాలే పొగడడం.

 

ఇక్కడ ఒక విషయం చర్చించులోవాలి, తిరుపతి వెళ్ళినవాళ్ళకి భోజనం ఉచితంగా పెట్టాలా అని కొందరు మాధ్యామాల్లో ప్రశ్నించారు. అలా అన్నవాళ్ళు ఎవరు?, వారి వెనుక ఉన్నదేవరు?, అని తెలిసిన విషయాలనే  ఆరా తీస్తూ ఆయాసపడడం కన్నా, దాని వెనుక ఉన్న నిగూడార్ధాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.  ఉచితంగా ఎందుకు పెట్టాలి అన్నారంటే, అక్కడ జరిగే నిత్యాన్నదాన పథకానికి ఎసరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టే అని అర్థమవుతోంది.

 

స్వామివారి దర్శనానికి వచ్చే వారందరూ  హుండీలో రూపాయి వేసినా , కోట్లు వేసినా , స్వామివారికి కోట్లతో అభారణాలు చేయించినా, పేద, ధనిక తేడా లేకుండా అందరూ  అన్నసత్రంలో భోజనం చేసేది ప్రసాదమనే భక్తితోనే. ఈ విధంగా రోజూ కొన్ని వేలమంది పేదవారికి కడుపునింపుతున్న ఈ కార్యక్రమానికి ఎందరో గుప్తదాతలు సామాగ్రిని చేరుస్తూ చేయూతనిస్తున్నది అచంచలమైన భక్తితోనే అన్న విషయాన్ని దేవాలయ అధికారులు విస్మరిస్తున్నారు.

ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో  దేవస్థాన నిర్వహణపై ఆందోళన కలిగినపుడు, ప్రస్తుత ఛైర్మన్ ఎంపికలో  పలు అనుమానాలు తలేత్తినపుడు, ఆయన  హిందువు కాదు అని ఆరోపణలు  వచ్చినపుడు, ఆయన అందిరికన్నా పెద్ద హిందువని, నిత్యం గోపూజ చేస్తారని, ఆయన అధ్వర్యంలో దేవస్థానానికి ఎటువంటి ఢోకా ఉండదని, గత అనుభావాల దృష్టా  ఎటువంటి దుశ్చర్యకు ఒడగట్టరని ఆశపడ్డ వాళ్ళల్లో నేనూ ఒకడిని. అందుకు ఇప్పుడు చింతిస్తున్నాను.


ప్రతీ హిందూ దేవాలయంలోనూ  అన్నదానం జరుగుతుంది. ఇది వేల సంవత్సరాలుగా హైదవ సమాజంలో వస్తున అనావాయతీ.  అసలు అన్నదానం ఎందుకు చేస్తారు?

 

మనిషికి ఉన్న పంచ కోశములైన అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూలశరీరానికి  సంబందించినది. మనిషి మనుగడకు అతి ముఖ్యమైన ఈ అన్నమయ కోశములో ప్రవేశించే పదార్థము(అందుకే దానిని అన్నము అంటాము) ప్రాణ శక్తిగా మారి మనిషి ప్రాణాన్ని  నిలుపుతుంది.

 

హైందవ సంస్కృతిలోని గొప్పదనమదే . హిందూ దేవాలయాల్లో నిరంతరంగా జరుగుతున్న ఆన్నదాన ప్రక్రియ వెనుక ఉన్న సంకల్ప లక్ష్యం కూడా సమాజ శ్రేయస్సే.

 

ఇంతటి గొప్ప సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి వేల సంవత్సరాలుగా ఎడారి మతాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ వారు కృతకృత్యులైనా పూర్తిగా నిర్వీర్యం చేయలేక పోయారు. దానికి కారణం మన సంస్కృతి యుక్క గొప్పదనం , హిందూజాతి ప్రజల సంఘటిత  సంకల్పమే.

 

కానీ, మనం తెలుసుకోవలసిన నిజమేమిటంటే , మన దేశ స్వాతంత్రం అనంతరమే మన ధర్మానికి యెక్కువ నష్టం జరిగింది.  ప్రస్తుత తరుణంలో అందరం సంఘటితమై ఎదురునిలువవలసిన సమయం ఆసన్నమైంది. నీ, నా తరతమ భేధం లేకుండా అందరం ఈ ఉధ్యమంలో పాత్ర వహించవలసిందే.

 

ధర్మాన్ని  నాశనం చేసేవాడికి  ప్రాంతీయ భావంతోనో , కుల ప్రాతిపదికతోనో , భాష మత్తుతోనో  మద్దతు పలకం మానుకోవాలి.

 

ఇక్కడ ఒక విషయం, వారి దుశ్చర్యలు ఇంతటితో ఆగిపోవు, సమస్యలు సమిసిపోవు.  అధికారంలో వారికి ఆయువు దొరికినప్పుడేల్లా వారి ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి . కాబట్టి వారి ఆయువు తెలుసుకొని దెబ్బ కొట్టడమే సమస్యకు పరిష్కారం.  సంఘటితంగా నిలవడమే సమాధానం.

 

మీ తరువాయి తరాలకి బ్రతకడమే కాదు భారతీయత కూడా నేర్పండి

 

మీ

 

మృశి

30.08.2021

కామెంట్‌లు లేవు: