9, జూన్ 2024, ఆదివారం

సమున్నతంగా నిలిచిన వెల్లాయ్ గోపురం

 సమున్నతంగా నిలిచిన వెల్లాయ్ గోపురం ! వెల్ల అంటే సున్నం తెలుగులో ! తెల్లగా ఉంటుంది ! తెల్లగా ఉంటుంది కాబట్టి వెల్లాయ్ గోపురం అని పిలిచారనుకున్నారా ? కాదు !

..

రంగనాథ స్వామి గుడిలోని 20 కి పైగా ఉన్నగోపురాలు అన్ని రకరకాల రంగులలో ఉంటాయి ! ఈగోపురమొక్కటే తెల్లగా ఉంటుంది ! గత 1100 ఏళ్ళనుండీ అదే రంగు ! తెలుపు !!!

...

ఒక మహాతల్లి త్యాగానికి బలిదానానికి కృతజ్ఞతతో మనము పెట్టుకున్న పేరు ! 

...

ఎవరా తల్లి ఏమా కధ ? 

...

కధ పెద్దది సంక్షిప్తంగా చెపుతాను ! 

...

సుల్తాన్ సేనలు శ్రీరంగాన్ని చుట్టుముట్టాయి ! కాఫిర్ల అంతు చూడాలనే పంతంతో వచ్చారు వాళ్ళు ! శ్రీరంగం ప్రజలు ధైర్యంగానే ఎదుర్కొన్నారు ! కానీ విధర్మీయుల పశుబలం ముందు నిలబడలేక ఓడిపోయి 12000 మంది ప్రాణాలు అర్పించారు ! 

...

సేనలు మూలమూర్తిని సమీపించకుండా ఒక దేవదాసి వారికి తన నృత్యంతో కనువిందు చేసింది ! సుల్తానుయొక్క సైనికకమాండరును మాయలో పడవేసి ఆ గోపురం ఎక్కించి ఒక్క ఉదుటున అక్కడినుండి తోసివేసింది ! తానూ వారి చేతికి చిక్కి చావటం ఇష్టం లేక గోపురం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది ! ఈ సమయాన్ని అక్కడి అర్చకుడు చక్కగా వినియోగించుకొని స్వామిని మధురై తరలించివేశాడు ! ఈ సంఘటన C.E 1323 లో జరిగింది !

..

సుల్తన్ సేనలు దోచిన సొమ్ము 20 బండ్లకు నిండుగా ఎక్కించి తరలించుకు పోయారు !!!

...

ఆవిడే లేకపోతే ? శ్రీరంగం కళతప్పేది ! హంపివిజయనగరం కన్నా ముందే ధ్వంసమయి ఉండేది !!!

...

ఆ మహాతల్లి పేరు "" వెల్లాయ్ ""

...

అమ్మా ! మీ వంటి వారి త్యాగాలే సనాతన ధర్మానికి ఊపిరిపోసి నిలబెడుతూ వచ్చాయి !!!

...

ఆతల్లికి సహస్రాధిక పాదాభివందనాలు !

...

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: