15, ఫిబ్రవరి 2025, శనివారం

సప్త చిరంజీవులు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

         *సప్త చిరంజీవులు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అశ్వత్థామా బలిర్వ్యాసో*. 

*హనుమాంశ్చ విభీషణః ।*

*కృపః పరశురామశ్చ*

*సప్త ఏతైః చిరంజీవినః ॥*


*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం*

*మార్కండేయమథాష్టమం ।*

*జీవేత్ వర్షశ్శతమ్ సొపి*

*సర్వవ్యాధి వివర్జిత ॥*


*శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు, వామనుడి అనుగ్రహమువలన బలిచక్రవర్తి,  లోకహితముకై వ్యాసుడు, శ్రీరామభక్తితో హనుమంతుడు, శ్రీ రాముడి అనుగ్రహమువలన విభీషణుడు, విచిత్రజన్మము వలన కృపుడు, ఉత్క్రుష్ట తపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి।*


*వీరి తర్వాత శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శత వర్ష ఆయుష్మంతులౌతారని పై  శ్లోక తాత్పర్యము.*


*చిరజీవులు లేదా చిరంజీవులంటే చావులేనివారని అర్థం.*


*అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెపుతున్నాయి.*


*పుట్టిన రోజున పాలు, బెల్లం, నువ్వులు కలిపిన మిశ్రమాన్ని దేవునికి నైవేద్యం నివేదించి, పై శ్లోకమును చదివి, ఆ మిశ్రమాన్ని  మూడు సార్లు తీర్థంలా తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణ వచనం.*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

కామెంట్‌లు లేవు: