*2056*
*కం*
హృద్యంబుగ రచియించగ
పద్యంబుకు విలువ హెచ్చు పదపడి జనులన్.
సేద్యంబగు రచనలెపుడు
సద్యంబులకన్న వెలుగు సతతము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! హృదయాలను తాకే విధంగా రచించినప్పుడే పద్యం విలువ పెరుగుతుంది. కృషి చేసి చేసే రచన వేగంగా అప్పటికప్పుడే చేసిన రచన కంటే గొప్పగా ఉంటుంది.
*సందేశం*:-- అవధానాదులలో వెంటనే చేసే కవనం వారి సాహిత్య ప్రకర్షను తెలుపగలవే గానీ సందేశాత్మకంగా ఉండే అవకాశం తక్కువ.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి