8, ఫిబ్రవరి 2021, సోమవారం

మన మహర్షులు - 11

 మన మహర్షులు - 11


 కచ మహర్షి 


🍁🍁🍁🍁


కచుడు దేవతల గురువైన  బృహస్పతి పుత్రుడు  .


ఆ సమయంలో రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యని నేర్చుకుని రాక్షసుల్ని బ్రతికిస్తున్నాడు.


 వృషపర్వుడనే రాక్షస రాజు శుక్రాచార్యుణ్ణి తన దగ్గరే ఉండమన్నాడు ఇద్దరూ కలిసి రాక్షసులకి చావు లేకుండా చేస్తున్నారు


దేవతలు ఏంచెయ్యాలా అనే ఆలోచనలో పడ్డారు. ఎలాగయినా మృత సంజీవని విద్యని శుక్రాచార్యుడి నుండి పొందాలని బృహస్పతి కొడుకయిన కచుణ్ణి పంపేందుకు నిర్ణయించుకున్నారు.


 కచుడు దైవకార్యం కాబట్టి ఆపనికి అంగీకరించి బయలుదేరి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ఆచార్యా! నేను బృహస్పతి కొడుకుని. మీదగ్గర విద్య

నేర్చుకోవాలని వచ్చానని చెప్పాడు. నన్ను మీ శిష్యుడిగా అనుగ్రహించమని ప్రార్ధించాడు కచుడు.


దేవతలవైపు వాడయినా చిన్నవాడు, సుకుమారుడు, ప్రకాశవంతుడు, ప్రశాంతుడు అంతేకాక బృహస్పంతటి గొప్పవాడికి కొడుకు అయిన తనని అడుగుతున్నప్పుడు కాదని అనలేక ఆలోచించి, చివరికి కచుడిని శిష్యుడిగా అంగీకరించాడు శుక్రాచార్యుడు


గురుసేవ చేస్తూ, గురువుగారి కూతురయిన దేవయాని ఏంచెప్తే అది చేస్తూ గురువుగారికి ప్రియ శిష్యుడు, దేవయానికి ప్రియ మిత్రుడూ అయ్యాడు కచుడు


ఇది చూసి రాక్షసులకి ఈర్ష్యగా ఉండేది. వాళ్ళకి బృహస్పతి అన్యాయం చేస్తున్నాడని కచుడిని ఎలాగయినా చంపెయ్యాలని నిర్ణయించుకున్నారు.


ఒకనాడు కచుడు ఆవుల్ని తోలుకుని వస్తుంటే అతన్ని చంపి శవాన్ని చెట్టుకి కట్టేశారు. అది చూసి దేవయాని ఏడ్చి, అతన్ని బ్రతికించమని తండ్రిని అడిగింది. 

శుక్రుడు కచుడిని బ్రతికించాడు


ఇలా కాదని కచుడిని చంపి, కాల్చి బూడిద చేసి మధువులో కలిపి శుక్రాచార్యుడితో తాగించారు రాక్షసులు. మళ్ళీ దేవయాని తన స్నేహితుణ్ణి బ్రతికించమని తండ్రిని ప్రార్ధించింది


శుక్రాచార్యుడు ఎక్కడ వెతికినా తన దివ్యదృభష్టికే కచుడు కనపడలేదు. చివరకి తన కడుపులోనే వున్నాడని తెలుసుకుని కడుపులోవున్న కచుణ్జి కడుపులోనే బ్రతికించాడు కచుడు గురువు గారూ! నేనెలా బయటికి రావాలి? నేను బయటకి వస్తే మీరు చచ్చిపోతారుకదా! అన్నాడు


గురువు, “వత్సా! నేను నీకు మృతసంజీవని విద్య నేర్పిస్తే నువ్వు బయటకు వచ్చాక నన్ను బ్రతికిస్తావు. కానీ, దానివల్ల నన్నే నమ్ముకున్న రాక్షసులకి కీడు జరుగుతుంది. విద్య వినయం, గురుభక్తి వున్న నీకు నేర్పించకుండా దాచుకుంటే నేను గురువుని అవను. అది అధర్మమవుతుంది. ఏది ఏమైనా కానీ, నీకు మృతసంజీవని విద్య నేర్పుతాను. నువ్వు బయటకి వచ్చి నన్ను బ్రతికించమన్నాడు శుక్రాచార్యుడు


లోకోత్తరమైన మృతసంజీవని విద్యని, లోకోత్తరుడైన కచునికి లోకోత్తర పద్ధతిలో లోకోత్తరుడైన గురువు శుక్రాచార్యుడు నేర్పించాడు. కచుడు బయటకివచ్చి, గురువుగార్ని బ్రతికించాడు


. ఆ గురుశిష్యుల మీద పుష్పవర్షం కురిసింది. దేవయాని ఎంతో ఆనందపడింది. 


విద్యా విషయంలో శత్రు, మిత్ర భేదభావం చూపించకుండా శిష్యుడికి విద్య నేర్పించి

మహా పురుషుడయ్యాడు శుక్రాచార్యుడు


కచుడు దేవలోకానికి వెడుతూ దేవయానికి చెప్పాడు. దేవయాని కచుణ్ణి తనను పెళ్ళిచేసుకోమని అడిగింది. గురువుగారి కూతుర్ని చేసుకోవడం అధర్మమని హితవు చెప్పాడు కచుడు.


 దేవయాని "నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనిచెయ్య"దని శపించింది కచుణ్ణి,


కచుడు నేను నేర్చుకున్నది నా కోసం కాదనీ నా వలన గ్రహించిన వాళ్ళకి పని చేస్తుందనీ చెప్పి, నన్ను కారణం లేకుండా శపించావు గనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళి చేసుకోకుండా శపిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు


మృతసంజీవని విద్య నేర్చుకుని వచ్చాక కచుణ్ణి చూసి బృహస్పతి, దేవతలు సంతోషించారు


ఇది కచ మహర్షి కథ...


కచుడు చిన్నవాడైనా ఎంత పెద్ద పని సాధించుకొచ్చాడో చూడండి! సాహసం తో సాధించలేనిది ఏదీ లేదు కదా...


🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: