14, అక్టోబర్ 2021, గురువారం

బతుకమ్మ పండుగ

 బతుకమ్మ పండుగ న, లేక నివాళి న....


దసరా పండుగ లో దేవి అవతారాలు.....ఒక రోజు ఒక అలంకారం, ఇంకో రోజు ఇంకో అలంకారం చేసి 9 రోజుల పండుగ చేసు కుంటారు. ముఖ్యముగా చెప్పవలసి వస్తే, స్త్రీ మూర్తి, మహిళ ... ఈమె పకృతి లో ఒక భాగము, ఈమెకు గొప్ప స్థానం ఇవ్వాలని చెబుతుంది. స్త్రీ లేని ది పకృతి లేదు అని చెబుతుంది. ఈ దేవత చాలా powerful అని ...నమ్ముతారు... మనిషి పుట్టిన తరువాత దేవుడు పుట్టాడు అని నమ్మని వారు... ఎవ్వరూ powerful, ఎది వాస్తవము అని కొద్ది సేపు ప్రక్కన పెడితే.....


ముస్లిం ల దండ యాత్ర, గోల్కొండ కోట ముస్లిం ల వశము అయిన తరువాత, ఆ ముస్లిం పాలకులు దొరల పై ఆధార పడ్డారు. ఒక విధముగా చెప్పాలి అంటే, దొరలు ముస్లిం పాలకులను ప్రసన్నం చేసుకున్నారు వారి బలహీనతలను అర్థం చేసుకొని... వారి బలహీనతలను సంతృప్తి పరచి, దొరలు వారికి దగ్గర అయ్యారు. దొరలు ఏన్ని అక్రమాలు, అన్యాయాలు చేసిన పట్టించు కాకుండా వారికే వత్తాసు పలికారు. ప్రజల తో మమేకం కాకుండా, ప్రజల దగ్గరికి వెళ్లకుండ, దొరలు చెప్పేది అవాస్తవము, మోసం అని తెలిసి కూడా, దొరలు చెప్పినదే వేదం అని వారికి పెద్ద పీట వేశారు.....ముస్లిం ప్రభువులు తమ చేతి లో కీలు బొమ్మలు అని, దొరలు అగాయిత్యలకు పాల్పడ్డారు కొన్ని వందల ఎండ్లు... అయితే కొందరు మంచి దొరలు కూడా ఉన్నారు, ప్రజలను కన్న బిడ్డల కన్న ఎక్కువగా ప్రేమించారు, వారికి సేవ చేశారు. ఇక్కడ మనం మాటలాడు కోవలసింది ఈ సందర్భం లో తప్పుడు పనులు చేసిన దొరల గురించి....ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకున్న దొరలు చాలా తక్కువ, వందలో ఒక్కరూ ఇద్దరు ఉండవచ్చు....దొంగ దొరలు ప్రజల మాన ప్రాణాలను హరించరు, వారి మాట వినని వారికి నిలువ నీడ లేకుండా చేశారు. అప్పుడు ముఖ్యముగా కుల వృత్తులు ఉన్నాయి.  


 గోల్కొండ రాజులు, ఆ తరువాత నిజం పాలన సాగింది...దొరలు వీరి లో కొందరు అధిక కులస్తులు ఉన్నారు, మరి కొందరు అధిక కులస్తులు కానీ వారు కూడా ఉన్నారు అంటే ఇప్పటి బీసీ లు కొందరు... ప్రజలను చదువు కొనివ్వ లేదు, త్రాగు బోతులను చేశారు, దేవుడు దయ్యం అనే భయం ముసుగులో, మూఢ నమ్మకాలను అలవాటు చేసి, వారిని అంధకారము లో ఉంచి దొరలు వారి పబ్బం గడుపుకున్నరు. 


బడుగు బలహీనవర్గాల అడ పిల్లలను దొర దగ్గర పడుకో బెట్టలనే నియమం ను తయారు చేశారు. ఎడ్డి జనం గుడ్డి జనం ఈ నియమం ను గుడ్డీ గా అమలు చేశారు.

దొర కు బలహీన వర్గాల ప్రజలు అందరూ వంగి వంగి దండలు పెట్టే వారు. దొరల లకు ఎదురు తిరిగిన వారిని తప్పుడు కేసు లల్లో పెట్టీ పోలీస్ (రజకారులతో) కొట్టించేవారు, జైలుకు పంపించే వారు. ఎదురు తిరిగిన ఆడవారిని బలవంతముగా అనుభవించి చంపి వేయించే వారు. హిందూ మతములో దొరల కన్న ముందు ఒక వర్గం పూజారులు ఇంకో వింత ఆచారం పెట్టారు. పెండ్లి అయిన తరువాత మూడు రోజులు పెండ్లి కూతురు ఆ పూజరితో గడపాలని, అత్త గారి ఇంటికి వెళ్లా వలసిన అమ్మాయి, పూజారి ఇంటికి పంపే వారు. బడుగు బలహీనవర్గాల ఆడపిల్ల లకు విలువైన కన్యత్వం ను దూరం చేశారు. ఎందరో కన్నె పిల్లలు దొరల దోపిడీ కి గురి అయ్యారు. ఇది నిత్య కృత్యం అయ్యింది అప్పుడు, ప్రతి ఊరిలో దొరల అమనుషాలకు.  


ఆ విధముగా ప్రాణాలు కోల్పోయిన కొందరు అడ పిల్లల గుర్తుగా, దసరా పండుగ సందర్భంగా గా బతుకమ్మ ను ఏర్పాటు చేశారు. దేవి అమ్మ వారు చాలా powerful అని, ఈ 9 రోజులు బతుకమ్మను పూలతో ఏర్పాటు చేసి దొరల పాలనకు, వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అమ్మాయిలను కాపాడాలని, పాటలు పాడుతూ, మహిళలను చైతన్య వంతులుగా చేయడానికి, సామూహిక బతుకమ్మ ను ఏర్పాటు చేశారు.  


ఒక్కో పువ్వు ను ఒక్కో కన్నె పిల్లగా భావిస్తూ, ఒక్కో రకం పువ్వును పెట్టీ, పువ్వుల నే కన్నె పిల్లలుగా భావిస్తూ, కన్నె పిల్లలను రక్షించాలని, బతుక నివ్వలని, దీన గాథలను వర్ణిస్తూ, ఆడ పిల్లల ను దొరల బారి నుండి రక్షించాలని, వారిని దొరలు వదిలి పెట్టాలని ఈ సందర్భం గా అనేక పాటలు పడుతారు మహిళలు ఆ పూల చుట్టూ తిరుగుతూ.....


గతంలో పాడిన దీన గాథలు ఇప్పుడు ప్రచారం లో లేవు. గౌరీ (పార్వతి దేవి) పేరుతో అనేక పాటలు పాడుతున్నారు. ఇప్పటి పాటలలో దొరల అకృత్యాలు లేవు, అవి అన్నీ కనుమరుగు అయ్యాయి. బతుకమ్మ అంటే అమ్మను బతుక నియండి అని అర్థం. అమ్మ అంటే ఒక స్త్రీ మూర్తి. ఆడ పిల్లలను బతుక నియాండి స్వే చ్చ గా, హుందా తనం గా అని అర్థం. ఈ చరిత్ర ప్రతి తెలంగాణ ఆడ పిల్లకు తెలియాలి. చరిత్ర తెలియ కుండ, ఫిల్మ్ పాటలు పాడితే లాభం లేదు.

గతం లో దొరలు ఆడపిల్ల లను పాడు చేస్తే, ఇప్పుడు మద్యం మత్తులో మానవ మృగాలు ఉన్నాయి. 6 నెలల పిల్లల నుండి 60 ఎండ్లా వారిని వావి వరుసలు మరిచి మాన భంగలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మగ మానవ మృగాల నుండి కాపాడ డానికి ప్రతి ఆడ పిల్ల చైతన్య వంతు రాలు కావడానికి బతుకమ్మ పేరుతో పాటలు పాడి, గతం లో బలి అయిన ఆడ పిల్లలను స్మరిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ బతుకమ్మ ఉద్యమాన్ని చేయాలి.  


అయితే తెలంగాణ బతుకమ్మ దీన గాథలకు , దేవి నవ రాత్రు ల ఆలంకరాలకు, పూజలకు సంబంధం లేదని అంటారు... గౌరీ దేవత అంటే పార్వతి దేవి. పార్వతి దేవి కూడా గత జన్మలో శివుడి ని ప్రేమించి పెండ్లి చేసుకుంటుంది. ప్రేమ పెండ్లి నచ్చని ఆమె తండ్రి, ఆమెను అవమానానికి గురి చేస్తాడు. అవమానాన్ని భరించ లేని పార్వతి అగ్ని గుండం లో పడి ఆత్మ హత్య చేసుకుంది అనే ఒక కథ ప్రచారం లో ఉంది. అంటే యువ మహిళలకు తమకు నచ్చిన వాడిని పెండ్లి చేసుకునే స్వె చ్చ ను ఇవ్వాలి అని ఈ సందర్భం గా గుర్తు చేసుకోవాలి....

కామెంట్‌లు లేవు: