30, ఏప్రిల్ 2022, శనివారం

శంకర జయంతి

 ॐ  శంకర జయంతి ప్రత్యేకం - 1

    (మే 6వ తేదీ వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి) 


     మన దేశ స్వరూప స్వభావాలు రోజురోజుకీ మారిపోతున్న ఈ పరిస్థితులలో, జగద్గురు ఆది శంకరులు చూపిన బాట అన్ని విషయాలలోనూ, ఎప్పటికీ అందరికీ అనుసరణీయం. 

     అది సర్వులూ వ్యక్తిగతంగానూ, సమాజపరంగానూ అవలంబించి, పరమేశ్వరుని తెలుసుకొని అనుభూతి పొందే  విధానం. దానిలో, 

1. అవతారం - ఆవశ్యకత 

2. శంకరుల కాలం 

3. జాతీయ సమైగ్రత 

4. సాంఘిక దురాచారం - అస్పృశ్యత 

5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం 

6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు 

7. వివిధ స్తోత్రాలు 

8. అద్వైత సిద్ధాన్తమ్ 

9. మహావాక్య చతుష్టయము 

    (నాలుగు మహా వాక్యాలు) వంటి విషయాలపై, 

      ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయమై తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

    అవి పరిశీలిస్తే, 

    గత కాలమాన పరిస్థితులలో మాత్రమే కాక, 

    ఏ కాలంలో నైనా, 

    ఏ పరిస్థితులలోనైనా,  సర్వమానవాళి సుఖశాంతులతో జీవిస్తూ, తమలోని దైవాన్ని గుర్తించి, తాము బ్రహ్మస్వరూపంగా మారి, జీవన్ముక్తి పొందేవిధంగా ఆదిశంకరులు దేశాన్ని తీర్చిదిద్దారని అవగతమవుతుంది. 

       ఆ జగద్గురువులు అందించిన సామాజిక, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపదలను కులమతాలకతీతంగా భారతీయులంతా గ్రహించి, ఆచరిస్తూ, వసుధైక కుటుంబంగా అందరినీ ఈ విధానంలోనికి తీసుకురావాలి. 

      తద్వారా ప్రపంచశాంతికి మార్గం సుగమం చేయవలసిన బాధ్యత - కర్మభూమిలో పుట్టిన మనందరిదీ! 

      దానికై కృషిచేస్తూ,ఆదిశంకరుల చేత పునరుద్ధరింపబడి, మనవరకూ పెద్దలు అందించిన వైదిక జ్ఞానసంపద తరువాతి తరాలకి అందిద్దాం. అదే జగద్గురువులకు మనం అందించే గురుదక్షిణ. 


        జయజయ శంకర  హరహర శంకర 


                    =x=x=x= 


    — రామాయణం శర్మగా పిలవబడే 

    బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ 

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: