11, మే 2024, శనివారం

పంచ భూతాలు

 🙏🙏🙏

********

            **శుభోదయం**

                        ***

**శరీరం తయారు కావడానికి కావల్సిన పంచ భూతాలు, ఆ పంచ భూతములకు ఐదు గుణములు ఉన్నాయి. నీరుకు రుచిని తెలిపే గుణం, అగ్నికి రంగుని చూపే, మట్టికి వాసన గుర్తించే గుణం, గాలికి స్పర్శ తెలిపే గుణం, ఆకాశానికి శబ్దాన్ని వినిపించే గుణం ఉంది. ఈ ఐదింటిని గుర్తించడానికి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.*

*ఇన్నింటిని క్రమ బద్దం చేసే శక్తి మనస్సుకు ఉంది. మొత్తం పదహారు అంశాలు. అయితే వీటన్నింటిని వాడుకొనే యోగ్యత ఉంది. ఇవన్నీ వాడుకోవాల్సింది ఎవరి కోసం. అయితే వీటన్నింటిని మనం భగవంతుని కోసం వాడాలి.* *కానీ ఈ ప్రకృతిలో పడ్డాక అన్నింటిని మనకోసమే వాడుకుంటాం. ఏది చూసినా నాకే అని అనుకుంటాం.*

*చెడిన మనస్సు ఉంటే జీవితం నరకం అవుతుంది, అట్లాంటి ప్రవృత్తి కలవాడే నరకుడు. నరకాసురుడు ఉండే నగరం పేరు ప్రాగ్ జ్యోతిష పురం, (ప్రస్తుతం అస్సాంలో వున్న గౌహతి నగరం), జ్యోతిష అంటే ‘కాంతి కల’, ప్రాగ్ అంటే ‘పోయిన’, అంటే ఒకప్పుడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అని అర్థం వస్తుంది. మనకూ ఒకనాడు మంచి శరీరాలు ఉండేవి, కానీ ఈనాడు మనకు ఉన్న శరీరాలు మురికి స్రవించేవి. మనం ఏది కోరుకుంటే అది జరగాల్సిన స్థితి ఉండేదట. మనం ఈ ప్రకృతిని అంటించు కుంటున్నాం కనుక మనకు ఈ స్థితి. శరీరాని కంటే వేరే నేను ఒకడిని ఉన్నాను అనికూడా తెలియక పడి ఉన్నాం. ఏదో ఒక పరిస్థితిలో ఎవరో చెబితే కనీసం ఆలోచించేంత శక్తి మానవునికి ఉంది. కనీసం చివరి క్షణాల్లో అయినా గుర్తించే అవకాశం ఉంది.*

*మానవ జన్మలో మనం ఎన్నో సార్లు పతనం అయినా ప్రయత్నం చేస్తే బాగుపడే అవకాశం ఉంది. ఆసురీ ప్రవృత్తులని దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. శరీరం, అనుభవించే గుణాలు, జ్ఞానేంద్రియాలు మరియూ మన మనస్సుని అన్నింటిని శ్రీకృష్ణ మయం చేస్తే ఈ ప్రాగ్ జ్యోతిషపురం అనే మన శరీరం ఆనందమయం అవుతుంది. కొత్త కాంతి కలది అవుతుంది, నరక చతుర్థశి – దీపావళి మనకు అదే విషయాన్ని తెలుపుతుంది.**

                       ***

             **ఇదం న మమ*

        **శుభప్రదమైన రోజు**

                       ***

**యం.వి.శర్మ**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: