11, మే 2024, శనివారం

విజ్ఞత

 *విజ్ఞత గల్గిన నా దేశ ప్రజలారా*....


*రండి... కదలి రండి... అందరం కలసి, మెలసి అడుగులు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు బాసటగా నిలుద్ధాం*....

.

 ప్రపంచపటం లో అత్యధిక జనాభా గల్గిన అతి పెద్ద ప్రజాస్వామిక రాజ్యం మన భారతదేశం.


ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ *ఎన్నికలు*

ప్రజాస్వామ్యం లో ముఖ్యమైన పండగ *పోలింగ్*


145 కోట్ల ప్రజలు నివసించే భారతదేశం లో అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలు అయింది.


*కుల, మత, వర్గ,ప్రాంత భేదాలకు తావు లేకుండా అందరం కలసి కట్టుగా జరుపుకునే*

*మహా పండుగ*


పోలింగ్ బూత్ అంటే అతి పవిత్ర మైన దేవాలయం( గుడి,చర్చ్ ,మసీదు) .మనం వేసే ఓటు దేవునికి సమర్పించే నైవేద్యం.



ప్రతి ఒక్కరూ సమరశంఖం పూరించి,కదన రంగానికి సమాయత్తం కండి.


మన  ఆశలు,ఆశయాలు నెరవేర్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మన భాధ్యత,హక్కు.


నలుగురు,అయిదుగురు నివసించే కుటుంబాన్ని నడిపే కుటుంబ పెద్ద సరియైన నిర్ణయాలు తీసుకుంటేనే కుటుంబం చక్కగా,సాఫీగా సాగుతుంది.


అటువంటిది 145 కోట్ల ప్రజలను నడిపే వ్యక్తి ఎంత దక్షత,పటుత్వం,ప్రతిమ కలవాడు అయివుండాలో ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకోండి.


*ఓటు వేయడం మన కర్తవ్యం తో కూడుకున్న గౌరవం తో పొందే భాధ్యత గల్గిన సాంఘిక సమానత్వపు హక్కు*.


*భారతదేశపు పౌరునిగా, ఓటర్ గా ఉన్నందుకు గర్వించండి.*


మేరా భారత్ మహాన్... సారే జహసే అచ్చా.


*మూర్తి's కలం (✒️)నుండి*........🙏

కామెంట్‌లు లేవు: