శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం
కర్మయోగం: శ్రీ భగవానువాచ
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి
ప్రకృతం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి (33)
ఇంద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ (34)
పండితుడు కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది. ఇంద్రియాలన్నిటికీ తమతమ విషయాలపట్ల అనురాగం, ద్వేషం వున్నాయి. ఎవరూ వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్ధశత్రువులు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి