శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము
మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ:
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః (68)
న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః
భవితా న చ మే తస్మాత్, అన్యః ప్రియతరో భువి (69)
పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నామీద పరమభక్తితో నన్ను చేరుతాడనడంలో సందేహం లేదు. అలాంటివాడికంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుషులలో మరొకడు లేడు. అతనికంటే నాకు ఎక్కువ మక్కువ కలిగినవాడు ఈ లోకంలో ఇక ఉండబోడు.
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి