8, అక్టోబర్ 2022, శనివారం

జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

 నవంబరు 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు


మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో నవంబరు 19, 20 తేదీలు శని, ఆదివారాలలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు కళాకారులు, కవులు, రచయితలు పాల్గొనవచ్చు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.

2022 నవంబరు 19 శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 20వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి.

రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సాహిత్యంలో వస్తున్న మార్పులు, నేటి సాహిత్యంలో వేళ్లూనుకుపోతున్న అవాంఛిత పరిణామాలపై చర్చలు, కొత్తతరం రచయితల కోసం లబ్దప్రతిష్టులైన రచయితలతో సాహిత్య శిక్షణా తరగతులు, ఆయా రంగాల్లో సేవ చేసిన కళాకారులకు, రచయితలకు సన్మానాలు, కవి సమ్మేళనాలు, కొత్త పుస్తకావిష్కరణలు, కళారూపాల ప్రదర్శనలు వుంటాయి. భోజనం, అల్పాహారం టీ ఏర్పాట్లు వుంటాయి. పాల్గొన్న ప్రతినిధులందరికీ సర్టిఫికెట్ వుంటుంది.

ఈ ఉత్సవాలకు ప్రతినిధులుగా హాజరు కావాలనుకున్న వారు 92464 15150, 83329 03156 నెంబర్లకు మీ పేరు, చిరునామా, మొబైల్ నెంబరు, పోస్టల్ పిన్ కోడ్ తో జనరల్ మెసేజ్ పంపి, అక్టోబర్ 30 వ తేదీలోగా నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 92464 15150 నెంబరులో సంప్రదించవచ్చు.  

- కలిమిశ్రీ, వ్యవస్థాపక అధ్యక్షుడు, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ, విజయవాడ



FROM 

KALIMISRI

9246415150

కామెంట్‌లు లేవు: