29, డిసెంబర్ 2020, మంగళవారం

ఆహార నియమాలు - 1

 ఆహార  నియమాలు  - 1  


 *  ఆమము , విదగ్ధము , విష్టంభము , రసశేషము అను భేదములచే అజీర్ణము నాలుగు విధములుగా ఉండును. వీటన్నిన్నిటికి మజ్జిగ ఔషధముగా పనిచేయును . 


 *  భోజనాంతరము చేతిని కడుగుకొనిన తరువాత అరచేతితో నేత్రములను తుడుచుకొనిన గాని , అరచేతితో నీటిబొట్టును నేత్రములలో వేసుకొనినగాని నేత్రరోగములు మానును . 


 *  భోజనము చేసి పనిలేకుండా కూర్చుండువాడు లంబోదరుడు అగును  . భుజించిన తరువాత శయనించువారికి సుఖము కలుగును. భోజనము చేసి కొంత సమయము తరువాత శ్రమించువానికి ఆయుర్వృద్ది కలిగి మరణము దూరము అగును. 


 * ఆకలిగా ఉన్నప్పుడు భుజించుతూ , ఎడమవైపు తిరిగి పడుకొనినవానికి వైద్యునితో పని ఉండదు. 


 *  ఆకలితో ఉన్నవాడు సమయానికి భుజించని యెడల కట్టెలు లేని ఆగ్నిహోత్రము వలే జఠరాగ్ని నశించి శరీరము కృశించును . 


 *  భోజనం చేసిన పిమ్మట ఎడమప్రక్కకు తిరిగి పడుకుండిన యెడల పిత్తాశయము నుండి ఆహారం జీర్ణం అగుటకు కావలసిన పైత్యరసము సరిగా ప్రసరించి జఠరాగ్ని వృద్ది అగును. కావున భోజనానంతరం ఎడమప్రక్కకు తిరిగి పడుకొనవలెను . 


 *  నిద్రపోవు కాలము నందు ఎడమప్రక్కన పరుండినప్పుడు 32 సార్లు , కుడివైపు పరుండినప్పుడు 25 సార్లు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసములు వెడలును. ఇతర విధముల పరుండప్పుడు పదిసార్లు కలుగును. 


 *  అనవసరముగా ఔషధసేవన చేయుట , కుడివైపు ఎక్కువుగా పడుకోవడం , భోజనమునకు బదులు ఇతరవస్తువులు భుజించటం వలన మనుష్యునకు తృప్తి కలగవచ్చును కాని అనారోగ్యం తప్పక కలుగును . 


 *  జఠరాగ్ని ఆహారమును వచింప ( జీర్ణం ) చేయును . ఆహారం లేనివారికి ఈ జఠరాగ్ని శరీరమునే దహింపచేయును . దానివల్ల సర్వధాతువులు క్షీణించి ప్రాణములు కూడా పోవును . 


 *  భోజనం చేసిన పిమ్మట భుక్తాయాసం తగ్గువరకు కొంచంసేపు విశ్రాంతి తీసికొనవలెను . తరువాత 100 అడుగులు అటుఇటు తిరగవలెను. కుర్చొని లేచుచూ ఉండవలెను . 


 *  భుజించిన ఆహారం మరునాటికి రసధాతువుగాను , మూడొవ రోజుకి రక్తముగాను , నాలుగొవ రోజుకి మాంసముగాను , అయిదోవ రోజుకి మేధస్సుగాను , ఆరోవరోజుకి అస్థిధాతువుగాను , ఏడోవ రోజుకి మజ్జి ధాతువుగాను , ఎనిమిదొవ నాటికి ఉత్క్రుష్టమైన శుక్రధాతువుగా మారును . 


    తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందిస్తాను . 


 

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: