29, డిసెంబర్ 2020, మంగళవారం

వేంకటేశ్వర సుప్రభాతం

 వేంకటేశ్వర సుప్రభాతం. సుషుమా హవ మూర్తయే. సుషుమ్న, జాగృతః స్వప్న సుషుప్తి అని మూడు అవస్థలు ప్రతీ జీవికి కలవు. సుషుమ్న తెలియునా? నిద్ర మరియు మెలకువ కు మధ్యలో కల అవస్థ. మెలకువ 24 గంటలు నిద్ర కూడా 24 గంటలూ కూడా కష్టమే, ఏజీవికైనా.మరి సుషుప్తి అవసరం లేదా. యిదే మనో నేత్రములు మౌనం యెూగం తద్వారా ఙ్ఞానం. నిద్రలో ఙ్ఞానం తెలియదు. జాగృతావస్థ మేలుకొని వుంటేనే ధాతుపరమైనది పదార్ధరూపమైన లక్షణము గల మాయామయమైన జగత్తు గురించి తెలియుట. అస్థిరమైనది పదార్ధము స్థిరమైన ఆత్మ తత్వమును సుషుమ్న లోనే తెలియవలెనని. వీని గురించి సవివరముగా తెలియుట ఙ్ఞానమని అదియే ఆత్మ ఙ్ఞాన మని అది దేహధారణం వలననే తెలియును. వేరు మార్గం లేదు. అందుకే అటువంటి సుషుమ్నా అవస్థ కలిగిన వేంకట ప్రభువుకు మంగళము కలుగుగాక. ప్రభువులకు, మంగళమైన వారికి మూలమైన జగత్తు, జగత్తు రూపంలో వున్న జీవులకు అవే మంగళ ప్రదమైన ప్రకృతికి కారణమైన హవనరూపమైన హవిస్సులు మూలం. వాటికి అధిపతి వేంకటరమణ తత్వం. జీవులకు శుభాశుభ మిశ్రమమైన దేహధారణ తత్వము సుషుమా హవము.

కామెంట్‌లు లేవు: