2, ఆగస్టు 2024, శుక్రవారం

నిత్యపద్య నైవేద్యం

 నిత్యపద్య నైవేద్యం-1566 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-201. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

అదత్తే త్యాగతా లజ్జా 

దత్తేతి వ్యథితం మనః l

ధర్మ స్నేహాంతరే న్యస్తా:

దుఃఖితాం ఖలు మాతర:ll


తేటగీతి:

ఆడపిల్లకు పెళ్లి కానంత వరకు 

తల్లి కెంతయో సిగ్గుండు నుల్లమందు 

పెళ్లి యయ్యాక కొమరితన్ విడిచియుండ 

తల్లి మనసెంతొ దిగులుగా తల్లడిల్లు.


భావం:

ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి కానంత వరకు తల్లికి సిగ్గుగా ఉంటుంది. పెళ్లైతే కూతురుని విడిచి ఉండటానికి తల్లి మనసు బాధ పడుతుంది. ఇలా ఒక వైపు కర్తవ్యమూ, మరొక వైపు మమత.. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న తల్లుల మనసు దుఃఖిస్తుంది.

కామెంట్‌లు లేవు: