20, జులై 2020, సోమవారం

తప్పకుండా బాబు


మనవాళ్ళు ఇప్పుడు యుక్తవయస్సులో కూడా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఎంత అవహేళనకు గురవుతున్న వైదిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ మన ధర్మాలకు ప్రధాన్యత నిస్తున్నవారు చాలమంది వున్నారు.
వీరికి వివాహాలు కావటం పెద్ద సమస్య ఐపోతోంది.
నిజానికి ఒక ఉద్యోగికంటే ఎన్నోరెట్లు అర్ధింకగా ఎదుగుతున్నారు సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించి పూజింప బడుతున్నారు.
కానీ వీరిలో ఒకలోపం వుంది
ఏదైనా ఒకమంత్రం జపిస్తే దాని అర్ధాన్నికూడా గ్రహించాలి.
అందులో వీరు నిష్నాతులు కాలేకపోతున్నారు.ఒకవేళ అలాగే వీరు కృషిచేస్తే ఎవరైనా  దీనికి అవహేళన చేసినప్పుడు వేద ధర్మం ఇదీ అని చెప్పుతీసికొట్టినట్టు సమాధానం చెప్పగలిగేవారు.వారు చేయిస్తున్న ధర్మ కార్యానికి విలువ కల్పించేవారు.
అకాల మృత్యుహారణం సర్వవ్యాధి నివారరణం అనేది మంత్రమా అందులో భారతీయ సనాతన వైద్యమర్మం వుందికదా....
అందులో ఏలా లవంగాలు పఛ్చ కర్పూరాలు కలిపిన ఆకాశగంగాజలంతో శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తారు.
సాలగ్రామ శిలావారి పాపహారి అంటే మంత్రమా....
భూమి అట్టడుగుపొరల్లో బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు అణువులు సమ్మేళనం తో ఒక కఠిన శిలా ఏర్పడి ఆ శిల తో దేవతా మూర్తులు తయారైతే అమూర్తికి చేసేఅభిషేక జలం.తీర్థంగా పుచ్చు కుంటే    ఆరోగ్యం
 కాదా.....
నిజానికి సంస్కృతపరిజ్ఞానం తగ్గిపోయింది కనుకే బ్రాహ్మణులు అవహేళనకు గురవుతున్నారు రేపటి తరానికి
మంచి విద్వత్ గల గురువు  వీరికి లభించాలని ఆకాంక్ష.
శివాసీస్సులు

కామెంట్‌లు లేవు: