20, జులై 2020, సోమవారం

హిందువులకు దేముళ్ళు ఎందరు;


ఈ మధ్య నేను ఒక క్రెస్తవ పాస్టర్ వీడియో చూసా అందులో ఆయన ఒక మాట అన్నాడు. బహు దేముళ్ళను కొలిచే వారికి నరకం వస్తుంది అని. అంతేకాదు హిందువులు బహు దేముళ్ళని సేవిస్తున్నారు కావట్టి వాళ్లు నరకం పొందుతారని వారి బైబులు చెపుతున్నదని హిందువులని వాళ్ళ మతంలోకి మార్చుకొనే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రసంగం. ఇటువంటి విమర్శలను మన హిందువులు అందరు ఎదుర్కొనే స్థాయికి మన జ్ఞానం పెంపొందించువాలి. అప్పుడే అటువంటి వాటినుండి మనలను, మన ధర్మాన్ని కాపాడుకోగలం. 
ఈ శ్లోకం గమనించండి

ఆకాశాత్ పతితం తోయం యధా గాస్చేతి సాగర 
సర్వ దేవా నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి. 

భావం ఆకాశం నుండి వచ్చిన నీరు ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరుతుందో అదే విధంగా అన్ని దేవతలకు చేసిన నమస్కారం కేశవునికే చెందుతుంది అని అర్ధం. 
దీనిని బట్టి మనకు రెండు విషయాలు తెలుస్తాయి అవి. 1) ఎంతమంది దేముళ్ళకు నమస్కరించిన అందరు ఒక్కరే ఆ ఒక్కరు కేశవుడు మాత్రమే. కాబట్టి మనం ఏదేముడిని ఏ పేరుతొ కొలిచిన మన నమస్కారం మాత్రం ఆ దేవా దేవుడైన కేశవుడిని మాత్రమే చేరుతాయి అని అర్ధం. ఇప్పుడు చెప్పండి హిందువులకు దేముళ్ళు ఎందరు. ఉన్నది ఒక్కడే ఆ దేముడిని మనం వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజిస్తున్నాం. 

మీకు ఇంకా సరళంగా అర్ధం కావటానికి ఒక సాధారణ ఉపమానంతో చెప్పే ప్రయత్నం చేస్తాను. 

మీకు తహసీల్దారు ఆఫీసు నుండి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి మీరు ఏమి చేస్తారు మీరు మీ అర్జీని అక్కడి ఇన్వార్డ్ క్లర్కుకి ఇస్తారు, ఆ క్లర్కు మీ అర్జీని తీసుకుంటాడు. నిజానికి మీ అర్జి తహసీల్దారుగారి పేరుమీదనే వుంది. ఆ క్లార్క్ రెండు మూడు రోజుల్లో కార్యాల ఇతర సిబ్బంది, వీ ఆర్ ఓ , ఆర్, ఓ. ల ఎండోస్మెంట్ తో తహసీల్దారు గారివద్దకు పంపుతారు. అవన్నీ మీకు తెలియకుండానే జరుగుతాయి. తరువాత మీరు వచ్చి ఔట్వేర్డ్ క్లర్కునుండి తహసీల్దారు గారి సంతకంతో మీకు మీ సర్టిఫికెట్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీకు తహసీల్దారుగారు మాత్రమే మీ పని చేయ సమర్ధుడు. కానీ మీరు అతనిని కనీసం కలవను కుడా కాలవ లేదు. కానీ ఆయన ద్వారా మాత్రమే మీకు సర్టిఫికెట్ వచ్చింది. 
మీరు ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడి ఇన్వార్డ్ కాలేర్క్ కు నమస్కరించారు కానీ తహసీల్దారిని చూడను కూడా చూడలేదు. మరల మీ సర్టిఫికెట్ పొందినప్పుడు కూడా మీకు అది ఇచ్చిన క్లర్కుకే నమస్కరించారు. అదే విధంగా మన హిందూ సాంప్రదాయంలో భగవంతుని కంట్రోల్లో వున్న అనేక శాఖలు వివిధ ఉద్యోగస్తులకు అంటే వివిధ దేవతలకు ఆయన అప్పచెప్పారు ఉదాహరణకు ధనము కావాలంటే లక్షి దేవికి, విద్య కావాలంటే సరస్వతికి, ధైర్యం కావాలంటే పార్వతి దేవికి తన శక్తిని ఇచ్చారు, ఇంకా ఉప శాఖలు కూడా ఉదాహరణకు ధనానికి ధన లక్ష్మి, ధాన్యానికి ధన్య లక్ష్మి, సౌభాగ్యానికి సౌభాగ్య లక్ష్మి అదే విధంగా మిగిలిన దేవతలకు కూడా. 
ప్రతి పని చేయటానికి కార్యాలయంలో ఒక్కొక్క ఉద్యోగస్తుడు వున్నా అన్నీ కూడా ఆ ఆఫీసరు పేరుమీదే జరుగుతాయి. అదేవిధంగా మనం ఏ దేముడిని కొలిచిన అన్ని ఆ పరమాత్మా పేరుమీదే.  అది తెలుసుకోలేని, తెలవని ఇతర మతస్తులు మన ధర్మాన్ని విమర్శిస్తున్నారు. మన వాళ్ళు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు
మిత్రులారా ఇప్పుడు కాదు ఎప్పటికి మన హిందూ ధర్మాన్ని విమర్శించే స్థాయికి ఇతర మతస్తులు ఎవ్వరు ఎదగ లేదు, ఎదగ లేరు ఎందుకంటె మన ధర్మం, మన జ్ఞానం అపారమైనది. మన దేశంలో దైవ సాక్షాత్కారం పొందిన మహానుభావులు ఎందరో వున్నారు. ఇప్పటిలో కొన్ని వందల  సమత్సరాల్నుండి తప్పస్సు చేస్తున్న మహర్షులు ఎందరో మన హిమాలయాలలో వున్నారు ఇది సత్యం. 
ఓ హిందూ మేలుకో నీ ధర్మాన్ని తెలుసుకో 
సర్వ్ జన సుఖినోభవంతు 
ఓం శాంతి శాంతి శాంతిః 
****************&&&&****************

కామెంట్‌లు లేవు: