20, జులై 2020, సోమవారం

భయ నివారణా క్షేత్రం

భారతదేశంలో  అనేక పుణ్యక్షేత్రాలు , 
ప్రాయశ్చిత్త స్ధలాలు
వున్నయి.  ఈ రకమైన  ఆలయాల దర్శనాలతో భక్తులు నిశ్చింతగా వుంటున్నారు.

కష్టాలు కలిగినప్పుడు  ప్రార్ధించుకుని  స్వాంతన పొంది, శక్తిని పెంపొందించుకునేందుకు ఏర్పడిన స్ధలాలు.     ఏదైనా ఒక పుణ్య క్షేత్ర
దర్శనం చేసుకుని వచ్చిన తరువాత, మన జీవితంలో పెద్ద మార్పులు, శుభాలు
జరగడం , మనసు కి ప్రశాంతత లభించడం వంటివి సంభవిస్తూంటాయి.
అటువంటి  భాగ్యాన్ని
అనుగ్రహించే ఆలయమే , 
తిరువారూరు జిల్లాలోని
పేరళం సమీపమున వున్న
తిరుక్కొడియలూరు. 
ఈ ఆలయంలోనే  శ్రీ ఆనందవల్లీ సమేత  అగస్త్యేశ్వ్వర స్వామి దర్శనం
అనుగ్రహిస్తున్నాడు.
ఈ పుణ్యస్థలిని యమధర్మరాజు, శనీశ్వరుడు
అవతరించిన స్ధలంగా చెప్తారు.  శని దోషం, యమభయం పీడించే కాలమే
ఒక వ్యక్తికి అత్యంత క్లిష్ట
సమయంగా చెప్పబడుతోంది.
అటువంటి కాల దోషాన్ని తొలగించి, భక్తులకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా యమునికి, శనీశ్వరునికి సొంతమైన ఈ  ప్రదేశంలో
అనుగ్రహిస్తున్నారు. 
అందువలననే  ఈ ప్రదేశంలో
అడుగు పెట్టగానే , చీకాకులు
తొలగి ప్రశాంతత కలుగుతుంది. 

సూర్యుదేవుని భార్యలైన ఉషాదేవి
ఛాయాదేవీ   సంతాన  భాగ్యం కోసం ఇక్కడి ఈశ్వరుని ప్రార్ధించారు. 
అందుకు  ఈశ్వరుడు
" మీరు మీభర్తతో   వెళ్ళి
తిరుమీయచ్చూర్ లో వున్న పుష్కరిణిలో స్నానం చేసి
నన్ను , లలితాంబిక ని పూజించి , ఇక్కడికి రండి మీకు పుత్ర భాగ్యం లభిస్తుంది." అని వరమిచ్చాడు ఈశ్వరుడు.

ఆవిధంగానే , సూర్యుడు ,  ఉషాదేవి, ఛాయాదేవి
తిరుమీయచ్చూర్  వచ్చి
సూర్య పుష్కరిణి లో స్నానం
చేసి,  పూజలు చేశారు. 
ఆ పూజల ఫలంగా ఉషాదేవికి యమధర్మరాజు , 
ఛాయా దేవికి శనీశ్వరుడు
జన్మించారు. 
తిరుమీయచ్చూర్ లో పూజించి, యీప్రదేశంలో
సూర్యుడు, ఉషాదేవి, ఛాయాదేవి కూడినందు వలన యీ ఊరి కి కూడియలూరు
అనే పేరు వచ్చింది. అదే కాలక్రమేణా 
"కొడియలూరు"గా పిలువబడుతున్నది.

హయగ్రీవ స్వామి ఆదేశంతో ప్రకారం తిరుమీయచ్చూర్ వచ్చిన అగస్త్య మహర్షి  లలితాంబికాదేవిని
పూజించాడు.  అక్కడ లలితాంబికను మనసార
వేడుకుని "లలితా నవరత్న
మాలికా  "స్తోత్రంతో లలితా దేవిని స్తుతించి  ఆ దేవి అనుగ్రహం పొందాడు.

ఆ తరువాత పరమేశ్వరుని సేవించుకోవాలని  కొడియలూరికి వచ్చాడు.  అక్కడ ఒక శివలింగాన్ని
ప్రతిష్టించి పూజించాడు.
అందువలననే ,ఇక్కడి ఈశ్వరుడికి అగస్త్యేశ్వ్వరుడు అనే పేరు వచ్చింది. 
ఈశ్వరుని పక్కనే లలితా దేవిని కూడా ప్రతిష్టించి  పూజించాడు. 

వేడుకున్న భక్తుల
జీవితాలలో ఆనందాన్ని
ప్రసాదిస్తున్న ఈ  అంబికను "ఆనందవల్లి తాయారు" అని పిలుస్తారు.

తిరుమీయచ్చూరు  ఆలయంలో  లలితాపరమేశ్వరి  తపో భంగిమలో మనోన్మణి
స్వరూపంగా, ఆశీనురాలై అనుగ్రహం ప్రసాదిస్తున్నది. 
కొడియలూరు లలితా పరమేశ్వరి ఆనందవల్లిగా
పరిపూర్ణత పొంది భక్తులను
అనుగ్రహిస్తున్నది. 

ఈ ఆలయ దక్షిణ దిశలో
యమధర్మరాజు, ఉత్తర దిశలో
శనీశ్వరుడు దర్శనమనుగ్రహించడం  
విశిష్టత కలిగిన విషయం.

ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే యమ భయం , 
శని దోషము తొలగిపోతాయని  భక్తుల ధృఢవిశ్వాసం.

ఈ తిరుమీయచ్చూర్ ఆలయంలోని యమధర్మ
రాజుని , శనీశ్వరుని అభిషేకించి , భక్తితో పూజిస్తే తాము పోగొట్టుకున్న విలువైన
వస్తువులు మరల దొరికి శుభాలు 
జరుగుతాయని భక్తుల
విశ్వాసం. 
ఏలిన నాటి శని దోషానికి , ఇతర
సమస్యలకు
యీ  ప్రదేశంలో  విముక్తి
కలుగుతుంది.

కామెంట్‌లు లేవు: