23, ఆగస్టు 2020, ఆదివారం

గోమాత గొప్పదనం

ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.

అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు…
నీ సంస్కారం…
నీ విచక్షణ…
నీ విజ్ఞత…

గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా.....

ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని.. ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని....

ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు…ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.

ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.

మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?

గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.

ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.

విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.

వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.

ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.

కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.

గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని. అందుకే శుభకార్యాలలో, నూతన గృహప్రవేశ సమయంలో గోపంచకంగా పవిత్రం చేయడానికి వాడుతారు.

గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.

ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.

ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.

ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు (Oxygen )ఉత్పత్తి అవుతుంది.

గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.

గేదెపాలు టీ ,కాఫీ లకు ఓకే ...,మరి?... చిన్నపిల్లలకు త్రాగడానికి పట్టిస్తే ఎలా?... గేదె పాలకన్నా "ఆవుపాలు" శ్రేష్టమైనవి,  మరియు తేలిగ్గా అరిగే గుణం కలిగినవి.*

ఇక్కడ జంతువుల పైనా వివక్ష ఎవరికీ లేదు శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే హిందువులు గోమాతను సకలదేవతలు ఆవాసంగా భావిస్తారు.

చాలామంది హిందువులకే తెలియదు ఈ గోమాతల ఉద్భవం ఎలా జరిగిందని...

*ఒకసారి దేవతలూ రాక్షసులు కలిసి అమృతం కోసం పర్వతమధనం చేయగా అందునుండి పుట్టిన  కల్పవృక్షం,ఐరావతమూ,
కామధేనువులతో
పాటుగా విషము, అమృతము అదే విధంగా...
ఐదు గోమాతలు కూడా ఉద్భవించాయి... పుట్టిన అన్నింటినీ అందరినీ పంచుకోగా..*

ఈ  గోమాతలను 5  మహాముణులైన మహర్షుల ఆశ్రమాలకు ( జమదగ్ని,భారధ్వజుడు,వశిష్ఠుడు,గౌతమ మహర్షి మరియు కశ్యపుడు)లకు దేవతలు అప్పగించినవే ఈ పంచగోమాతలు.

ఆవు లో అతిముఖ్యమైన విశేషణం ఒకటుంది... రోజూ గ్రాసం/ దాణా వేసే వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ముందుగా ఆవు గ్రహించి... ఆరు బయట/ అడవికు వెళ్లి ఆ వ్యక్తుల వ్యాధికి సంబంధించిన ఔషధం(ఆకులు)తిని ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది. ఆ పాలనే కుటుంబ సభ్యులు పాలు,పెరుగు, మజ్జిగ రూపంలో స్వీకరించడం వల్ల అనారోగ్యం తగ్గిపోతుంది.

ఇంకో మంచిమాట!
*****
గోమాత గురించి చెప్పాలంటే ఒక మనిషియొక్క పూర్తి జీవితకాలం సరిపోదు.
సింపుల్ గా చెప్పాలంటే గోమాత శరీరం మీదవున్న రొమాలని ఆశ్రయించుకొని ముక్కోటి దేవతలూ ఆవాసం వుంటారు...

అందుకే గోమాతను సకలదేవతల నిలయంగా భావించి మ్రొక్కుతారు.

ఒక్క ఈ పవిత్ర భారతదేశంలో మాత్రమే పధ్దతిగా ,విలువలతో కూడి ఉంటారు.... ఎందుకంటే....ఇక్కడ  గోవు ని కూడా...మాత గా పూజిస్తారు...

అందువల్లనే కొందరు పుణ్యపురుషులు ఇలా అన్నారు.
*********
”గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు”.

”ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు”.

”ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే”.

”గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని. దాని మాంసము రోగకారకము”.

”గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును”.

భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?

మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం మన ధర్మం. స్వేచ్ఛంటే….”నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు” మనదేశం మెచ్చేటట్టు బ్రతకడం”

”వందేగోమాతరం”
***************

కామెంట్‌లు లేవు: