23, ఆగస్టు 2020, ఆదివారం

బిల్వార్చన ప్రాధాన్యం

కార్తీక మాసం లో బిల్వార్చన ప్రాధాన్యం ఏమిటి? కార్తీక మాసం లో బిల్వదళాలతో శివుణ్ణి, తులసీ దళాళతో విష్ణువు ని సేవించాలి. అసలు ఆ పరమేశ్వరుడు ని చూసిన వెంటనే ఒక బిల్వదళం సమర్పించాలి. ముందుగా బిల్వదళం సమర్పించ కుండా శివునికి అభిషేకం చేయకూడదు. కేవలం జలంతోనే అభిషేకించే సందర్భంలో కూడా తప్పనిసరిగా లింగంపై బిల్వదళం వేయడం తప్పనిసరి అని భక్తులు భావిస్తారు. బిల్వ వ్రుక్చం ను మారేడు అని పిలుస్తారు. మూడేసి ఆకులు పరమేశ్వరుని త్రిశూలాన్ని, త్రినేత్ర లను గుర్తు తెచ్చేలా ఉంటుంది. బిల్వదళం త్రిమూర్తులు కు ప్రతీకగా కూడా చెబుతుంటారు. వివిధ రకాల పువ్వులు తో పూజించడం కన్నా ఒక్క బిల్వదళం సమర్పిస్తే శివుడు ఎక్కువ సంతోషపడతాడని చెబుతారు. అందుకే పరమేశ్వరుని అనుగ్రహం కోరే భక్తులు అత్యధిక సంఖ్యలో బిల్వ దళాళతో పూజిస్తారు. కార్తీకమాసంలో ఎక్కువగా లక్ష పత్రి పూజలు జరుగుతూ ఉంటాయి. బిల్వదళానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దానిని ఎన్ని సార్లు అయినా సమర్పించవచ్చు. ఒకరోజు సమర్పించిన బిల్వదళాన్ని మరుసటి రోజు కూడా సమర్పించవచ్చు. క్రింద పడినా బిల్వదళానికి ఉండే పవిత్రత చెడిపోదు. సేకరణ
*******************

కామెంట్‌లు లేవు: