23, ఆగస్టు 2020, ఆదివారం

ఆత్మ దర్శనం* 💥

*మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం*
 *చెయ్యలెము.*

 *మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది.  అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం.*

 *మన మనసు మనకు ఆలోచననూ, విచక్షణనూ, కోరికలనూ, అవగాహననూ, విమర్శనాత్మక దృష్టినీ,*

 *న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ, ఎన్నింటినో ఇచ్చింది. దానివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం!*

 *భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం మనసు.*

 *ఆయన తన మనసును*

 *ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు. మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి* *ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది.*

 *ద్యానం, మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది. దాని నియంత్రణలో ఉంచుకోలేక పోతే అది మనలని వినాశనం వైపు నడిపిస్తుంది.*

 *ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు. ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు.*

 *మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం. జీవిత లక్ష్యాలను సాధించగలం. దాని మానాన దానిని వదిలేస్తే*
( *శిక్షణ లేని మనసు ) అది మన వినాశనానికి హేతువులైన దురాశ, పగ, ప్రతీకారం, కామం, క్రోధం, గర్వం,* *అహంభావం ,  ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది.*

 *మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి. అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి* . *మాయను అతిక్రమిస్తే ఆనందమనే భవనంలో హాయిగా విహారం చేయవచ్చును. ఇంత కధ నడిపించిన ఆ ఓక రూపాయి ఏమిటో కాదు, మనం చేసుకున్న పుణ్యం.*

 *జగన్నాటకం అనే సంత లోకి వచ్చిన ఈ జీవుడు ఆ దేవుడిని చేరుకునేలోపే మేల్కొంటే నిత్యానంద స్వరూపుడి దివ్య దర్శన భాగ్యం మనకు కలగతుంది.*
 *సర్వేజనా సుఖినోభవంతు.*💥

 *సే;వేముల*
*********************

కామెంట్‌లు లేవు: