29, ఆగస్టు 2020, శనివారం

వరాహమిహిరుని గురించి

వరాహమిహిరుడు తన భార్య ప్రసవ సమయము నందు ప్రసూతి గృహమునందు ఉన్నప్పుడు మంత్రసానికి నిమ్మపండునిచ్చి
BLN మూర్తి కధలో చెప్పనట్లుగా సూచనలను చేసారు. మిగిలిన కధ అంతా వారు చెప్పి నట్లుగా జరిగినది. అప్పుడు జన్మించిన ఆడశిశువు జాతకం పరిశీలించి ఆమే వివాహం జరిగిన రాత్రే వైధవ్యం కలుగనని గ్రహించి ఆయన తన కుమార్తె కువివాహము జరిగిన రాత్రి మనఃశ్శాంతి కరువై పిచ్ఛివానివలే ఆ ఊరు వదిలి దేశసంచారము గావించేను.
ఆ తరువాత కొంత కాలమునకు తన గ్రామమునకు సంచారిగా వచ్చినపుడు తన కుమార్తె సుమంగళిగా ను సంతాన ముతో తన భర్తతో జీవించడము విని చూసి తను వ్రాసిన జ్యోతిష్య గ్రంధములన్నీ తప్పులుగా ఎంచి తన రచనల వలన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నానని భావించి ఆ గ్రంథములన్నింటిని కాల్చి వేయాలని భావించి వాటిని ఒక బండి పై ఊరి బయటికి తరలించుచుండగా ఆ బండి చక్రముక్రింద ఒక ముదుసలి స్త్రీ పడినది. ఆమె నుపరిశీలించగా ఆమెనే తన భార్య ప్రసవసమయమునందు పనిచేసిన మంత్రసానిగా గుర్తించి ఆమె ద్వారా అసలు విషయము తెలుసుకొనినాడు.
సరస్వతీ దేవి యే మంత్రసాని రూపం లో వచ్చి ఈయన రచనలను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడినట్లు తెలియజేసారు.

🙏వరాహమిహిరుడి గురించి🙏

ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

శాస్త్రాలే గాక, పత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం జేసినట్లు అక్కడకు వెళ్ళీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో గణిత శాస్త్రజ్ఞుడైనా అనేక శాస్త్ర విషయాలను వివరించారు.

(మిహిరుడు వరాహ మిహిరునిగాసవరించుకోండి)

అనతి కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రము, అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రము అనే అంశాలలో ప్రసిద్ధులైన ఎందరో పండితులు సుదూరాల నుంచి వచ్చేవారు. పరస్పర భావ వినిమయం వుండేది. అచ్చటి శాస్త్ర చర్చలలో మిగిరుని శాస్త్ర పటిమ తెలియ వచ్చిన రెండవ విక్రమాదిత్య చంద్ర గుప్తుడు తన ఆస్థాన మండలి నవరత్నములలో నొకనిగా ఆయనకు గౌరవించాడు. దీనికి సంబంధించిన ఒక సంఘటన చెప్తారు. విక్రమాదిత్యుని కుమారుడు వరాహము కారణంగా మరణిస్తాడని మిహిరుడు జ్యోతిషము చెప్పగా రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో కట్టుదిట్టము చేసినా శాస్త్ర ప్రకారము చెప్పిన సమయానికి, చెప్పిన కారణముగానే రాకుమారుడు మరణిస్తే విక్రమాదిత్యుడు తన కుమారుని గతికి విలపించినా మిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నము వరహముద్రాంకితముతో సత్కరించాడు. నాటి నుంచి ఆ జ్యోతిః శాస్త్ర వేత్త వరాహమిహిరుడుగా పిలువబడ్డాడు. వేదాలన్నీ చదివి ఎంతో పండితుడైనా మానవాతీత శక్తులను గ్రుడ్డిగా నమ్మేవాడు కాడు. అతనొక అద్భుత శాస్త్రవేత్త!
🙏🙏🙏**************

కామెంట్‌లు లేవు: