9, ఆగస్టు 2020, ఆదివారం

ఒక్కసారి ఆలోచించండి


Dr VS Reddy హన్మకొండ గారి
హోమియో వైద్యం వల్ల ఎవరైనా ఇబ్బందిపడి కంప్లైంట్ ఇచ్చుంటే తప్పక చర్య తీసుకొనివుండొచ్చు.
కానీ
అలా ఎటువంటి పిర్యాదు లేకుండా ఏకపక్షంగా
ఒక హోమియో వైద్యుని ఆసుపత్రిని హనుమకొండ, తెలంగాణాలో సీజ్ చేయడం దారుణం.

హోమియోపతి వైద్యవిధానం జబ్బుల పేరుతో కాదు, రోగి లక్షణాలపై జరుగుతుంది.

గతంలో
అల్లోపతి వైద్య విధానంలో చికత్సలేనేలేదు అని చెప్పే ఎయిడ్స్ కి
రామంతాపూర్ లోని ప్రభుత్వ హోమియో కాలేజీలో వైద్యం ఉంది అని, తమ హోమియో వైద్యంతో చాలామంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో మంచి గుణం కనబడిందని టీవీల్లో, పేపర్లలో వార్తలు చూసాం.
మరి అప్పుడెందుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ స్పందించలేదు ?

అల్లోపతి వైద్యవిధానంలో ఏ వైరస్ జబ్బుకు వైద్యం లేదు.
కేవలం ముందు జాగ్రత్తగా కొన్నింటికి వాక్సిన్ తప్ప.
అది ఆ వైద్యవిధానం పరిమితి.

హోమియోపతిలో అలాంటి పరిమితి వీటికి లేదు.
ఎందుకంటే
ఒక వ్యక్తిలో కనబడే శారీరక, మానసిక అనారోగ్య లక్షణాల మీద ఆధారపడి హోమియో వైద్యం ఉంటుంది కాబట్టి.
కానీ
ఆ అనారోగ్య లక్షణాన్ని ఒక సూక్ష్మక్రిమి కారకంగా  చూసి వైద్యం చేసేదే అల్లోపతి/ఇంగ్లీష్ వైద్యం.

ఉదాహరణకు,
ప్రస్తుత 🅒🅞🅥🅘🅓19 పాండెమిక్ పరిస్థితుల్లో చేతులెత్తేస్తున్న అల్లోపతిని ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలి ?
మా వైద్య విధానంలో కొరోనా కే కాదు,
ఏ వైరస్ జబ్బుకు స్పష్టమైన మందులు లేవు, ఉపశమనం తప్ప,
తీవ్రమైన కండీషన్లోని వారికి మేం వైద్యం చేయలేము,
అని స్పష్టంగా అలోపతి వైద్యులు చెబుతున్నపుడు
హోమియోపతి,
ఆయుర్వేదిక్ వైద్యవిధానాల్లో మేలు జరుగుతున్నపుడు
ఎందుకు
హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నారు ?

మా దగ్గర కొరోనాకు మందులు లేవు,
వైద్యం లేదు అంటూనే,
లేని మందులతో కొరోనాకు చికిత్స చేస్తూ అదృష్టం కొద్దీ బాగవుతున్న కొరోనా భాదితుల నుండే కాక, చనిపోయిన వారికి కూడా లక్షల్లో బిల్లులు వేస్తూ జనాల్ని బెంబేలేత్తిస్తున్న వారిని వదిలేసి,
కేవలం వందల రూపాయల ఖర్చుతోనే శక్తివంచన లేకుండా వైద్యం చేయడానికి ముందుకొస్తున్న
హోమియోపతి
ఆయుర్వేద వైద్యులపై
రాష్ట్రాల వైద్యఆరోగ్య శాఖల దాడులు, చర్యలు దేనికి సంకేతం ?

హోమియోపతి,
ఆయుర్వేదిక్ వైద్యశాస్త్రాలు కూడా
అల్లోపతి వైద్యశాస్త్రంలా ఐదున్నర సంవత్సరాల వైద్య చదువు కాదా ?
దేశంలో ప్రతీ యూనివర్సిటీలో అర్హత కలిగిన వైద్యశాస్త్రాలు కావా ?

హోమియోపతి,
ఆయుర్వేద వైద్యవిధానాల్లో వైద్యం అల్లోపతితో పోలిస్తే ఖరీదు చాలాచాలా తక్కువ.

గత 5నెలలుగా కొరోనాతో ప్రజల కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణమైన ఏకపక్ష నిర్ణయాలు మంచిది కాదు.

చర్యలు తీసుకోవాల్సింది
ప్రార్ధనలు, మంత్రాలూ, తాయెత్తులతో కొరోనానే కాదు చనిపోయిన మనిషిని సైతం బతికిస్తాం అంటూ జనాల్ని మోసం చేస్తున్నవారి మీద.
వాట్సాపులో వచ్చిన పోస్టు

I SUPPORT Dr V.S REDDY
*******************

కామెంట్‌లు లేవు: