9, ఆగస్టు 2020, ఆదివారం

జీవ/శాస్త్ర విజ్ఞానం🍁


👉🏼ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తను ఖాళీగా ఉన్నాడా లేడా అని కనుక్కుని ఆ వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం.
  👉🏼తల్లి: నాయనా పూజా పునస్కారాలు ఐనాయా?
కుమారుడు: ఇలా చెప్పారు.
అమ్మా, నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో .. మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. అలాంటి నేను పూజలు చేయడం ఏం బాగోదు అన్నాడు.
అందుకు అతల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా. కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా.....అన్నది.
కొడుకు వ్యంగ్యంగా అలాగాఅమ్మా, నాకు తెలీదే అని అన్నాడు.
అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. 
👉🏼నీకు శ్రీమహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.....
కొడుకు ఆసక్తిగా అవును తెలుసు,   దానికి ఈ  జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం?  అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ తల్లి...హా సంబంధం ఉంది. ఇంకా నువ్వు,  నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.
మొదటి అవతారం మత్స్య అవతారం.అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా.
  కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.
తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి.అంటే ఉభయచర జీవులు లాగా. తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.
మూడవది వరాహ అవతారం అంటే పంది.ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తు కు తెస్తుంది.
ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి, సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.
ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసు కదా మానవులు మొదట హోమో erectes మరియు  హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులుగా వికాసం చెందారు. కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.
ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు , గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.
ఇక ఏడో అవతారం రామావతారం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు పాటించాడు, ఆయనే సమస్త కుటుంబ  బంధుత్వ విలువలకూ అది పురుషుడు.
ఇక ఎనిమిదవది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు, ప్రజా పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ  నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. అదే సమాజములో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలను అన్నీ నేర్పినవాడు.
కొడుకు ఆశ్చర్యం , విస్మయంతో వింటున్నాడు.
ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ
 తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు.  అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం.
ఇక వచ్చేది కల్కి పురుషుడు. అతను నీవు  ఏ మానవునికై వేతుకుతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.
కొడుకు తన తల్లి  మాటలు  అవాక్కాయి  వింటున్నాడు
అప్పుడు ఆ కొడుకు ఆనంద భాష్పాలతో అమ్మా, సనాతన  ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మమని చాలా బాగా తెలిపావమ్మా అన్నాడు.
👉🏼ఆత్మీయులారా !!!
మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,
ఇత్యాదివన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృక్కోణం మారాలి.  మీరు ఎలా అనుకొంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు,  లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్త్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకోండి. ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని మర్మాన్నీ గ్రహించండి మరియు పాటించండి తద్వారా లభించే ఆనందాన్ని అనుభవించండి.
అందుకుగానూ, ముందు మనం మారుదాం తరువాత ఈ యుగమే  మారుతుంది...!!!
*********************

కామెంట్‌లు లేవు: