22, మార్చి 2026, ఆదివారం

అర్థం చేసుకుంది.”

 ఒక వ్యక్తి తన కోతులతో కలిసి పడవలో ప్రయాణిస్తున్నాడు.


ఆ పడవలోని ఇతర ప్రయాణికులలో ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు.


ఆ కోతి అంతకుముందెన్నడూ పడవలో ప్రయాణించలేదు, అందువల్ల అది అసౌకర్యంగా భావించింది. అది అరవడం, పైకి కిందకి గంతులు వేయడం మొదలుపెట్టింది, పడవలో ఉన్న ఎవరినీ ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు.


పడవ నడిపే వ్యక్తికి చిరాకు వచ్చింది, మరియు ఆ గందరగోళం వల్ల పడవ మునిగిపోతుందేమోనని ప్రయాణికులు ఆందోళన చెందారు.


ఆ కోతి శాంతించకపోతే, అది పడవ మునిగిపోయేలా చేయగలదు.


ఆ పరిస్థితి చూసి ఆ వ్యక్తి కలత చెందాడు కానీ కోతిని శాంతపరచడానికి ఏ మార్గాన్నీ కనుగొనలేకపోయాడు.


ఆ తత్వవేత్త అదంతా గమనించి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.


అతను, “మీరు నన్ను అనుమతిస్తే, నేను ఈ కోతిని ఇంటి పిల్లిలాగా శాంతపరచగలను,” అన్నాడు.


ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు.


ఇద్దరు ప్రయాణికుల సహాయంతో, ఆ తత్వవేత్త కోతిని పట్టుకుని నదిలోకి విసిరేశాడు.


నీటిపై తేలుతూ ఉండటానికి పోరాడుతూ, ఆ కోతి పిచ్చిగా ఈదడం ప్రారంభించింది.


అది దాదాపు చనిపోయే స్థితిలో ఉంది మరియు తన ప్రాణాల కోసం పోరాడుతోంది.


కొంత సమయం తరువాత, ఆ తత్వవేత్త కోతిని తిరిగి పడవలోకి లాగాడు.


ఇప్పుడు కోతి నిశ్శబ్దంగా ఉండి, ఒక మూలకు వెళ్లి కూర్చుంది.


కోతి ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ఆ వ్యక్తి మరియు ప్రయాణీకులందరూ ఆశ్చర్యపోయారు.


ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు, “ఇందాక అది అశాంతంగా అటూ ఇటూ గంతులు వేసింది. ఇప్పుడు పెంపుడు పిల్లిలా కూర్చుంది. ఎందుకని?”


ఆ తత్వవేత్త ఇలా జవాబిచ్చాడు, “నేను ఈ కోతిని నీటిలోకి విసిరినప్పుడు, అది నీటి శక్తిని, తన జీవితపు విలువను, మరియు పడవ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుంది.”


భారతదేశంలో నిరంతరం ప్రతిదాన్నీ విమర్శించే, వ్యాఖ్యానించే, వ్యతిరేకించే వారిని ఆరు నెలల పాటు ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా, ఇరాక్, పాలస్తీనా, పాకిస్తాన్, శ్రీలంక, లేదా చైనాకు పంపాలి. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, వారు వాటంతట అవే పెంపుడు పిల్లిలా ప్రశాంతంగా మారి, దేశం అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తాయి.


“భారతదేశం”ను దుర్వినియోగం చేసి, అపఖ్యాతి పాలు చేసే మిత్రులందరికీ అంకితం. 😌😉🇮🇳🚩

అన్నది ముఖ్యం*

 పాపమయ్యేలా 

సంపాదించకండి


అప్పు అయ్యేలా 

ఖర్చుచేయకండి


అజీర్తి అయ్యేలా

తినకండి


మనస్పర్ధలొచ్చేలా

మాట్లాడకండి


ఆలస్యమయ్యేలా

నడవకండి


చితికి చేరేలా 

చింతించకండి


ఆలస్యం చేస్తూ

కాలాన్ని నిందించకండి


అర్థం చేసుకోకుండా

అవమానపర్చకండి


నాదే లోకం అనుకోకుండా

ప్రపంచాన్ని చూడండి


ద్వేషాన్ని వదిలేసి

ప్రేమను ఆహ్వానించండి


ఇతరులు తక్కువ అనకుండా

మనమే తక్కువ చేసుకోండి


కోపంగా 10 మాటలు కాదు

ప్రేమగా ఒక్క మాట చాలు


జేబులో ఎంతున్నది కాదు

వెనక ఎంత ఖ్యాతి/ పుణ్యం ఉందో తెలియాలి👌 


ఎంత సీనియారిటి అన్నది కాదు

ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం


ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు


ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం


ఏమి సాదించామన్నది కాదు

ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం


ఎంతో మంది స్నేహితులన్నది కాదు

ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం👌 


కోట్లు సంపాదించి పిల్లలకి ఇచ్చే యంత్రము కంటే,


మీరు ఎదుటివారికి సహాయం చేసినప్పుడు వారి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత కు ... బానిస అవ్వండి 100% 💯 %👌 


అంతే తప్పా పొగరుగా మాట్లాడకండి 


*మనము వెనకట ఏమీ చేసాం అన్నది ముఖ్యం*


*అంతే కదా శివయ్య* ఓం 🙏 


*శివయ్య అన్నిటికీ మీరే సాక్షి*


శివయ్య నీవే దిక్కయ్యా !!!

రామాయణ

  శ్రీరామ (14)


               ( వాల్మీకి రామాయణం -7 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (21-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)



బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్య రచనకు ఉపక్రమించాడు.


ఆచమనం చేసి తూర్పు అగ్రములుగా గల దర్భల మీద ఆశీనుడయ్యాడు.

దోసిలి కట్టి ధ్యానమగ్నుడయ్యాడు.


శ్లో// తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః/

పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా//

(ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి అప్పుడు యోగ దృష్టితో ఇంతకు ముందు జరిగిన రామ చరిత్ర అంతా అరచేతిలోని ఉసిరికాయను చూచినట్లు చూడగలిగాడు).


రాముడు, లక్ష్మణుడు,సీత, దశరథుడు మొదలైన వారందరూ ఎప్పుడు, ఏమి చేసింది, 

ఏమేమి మాట్లాడింది,

వారి వారి మనస్సులలో ఏయే భావములు మెసలుతుండేవి,

మొదలైన అన్ని విషయములు వాల్మీకి కి గోచరించాయి.


శ్రీరామ జననం, తాటకి వధ,విశ్వామిత్ర యాగ సంరక్షణ,

శివ ధనుర్భంగం, సీతా కళ్యాణం,పరశురామ గర్వభంగం,

 రాముని రాజ్యాభిషేకమునకు విఘ్నం కలగడం,

సీతా రామ లక్ష్మణుల దండకారణ్య వాసం,

విరాధుని సంహరించడం,

మారీచ వధ, సీతాపహరణం, 

రాముడు కబంధుని సంహరించడం,

 పంపాసరస్సును,శబరిని, చూడటం,

హనుమంతుడు రాముని కలవడం,

సుగ్రీవ సమాగమం, వాలి వధ,

వానరులు సీతాన్వేషణకు బయలుదేరటం,

హనుమంతుడు లంకలో సీతాదేవిని చూడటం,

లంకా దహనం,

విభీషణ శరణాగతి,


వానర సైన్యంతో రాముడు సముద్రంపై నలుని చేత వారధి కట్టించి, సముద్రం దాటి లంకను ముట్టడించటం,


కుంభకర్ణ,మేఘనాధులతో సహా రావణుని సంహరించడం,

అగ్ని పునీత అయిన ‌సీతాదేవిని తిరిగి పొందడం,

ఆయోధ్యకు పునరాగమనం, 

శ్రీరామ పట్టాభిషేకం, 

మొదలైన సమస్త విషయములు ఆ మహాఋషికి గోచరించాయి.


ఆ విధంగా యోగబలంతో తాను దర్శించిన  

లోకాభిరాముడైన రాముడి చరిత్రను ఉన్నది ఉన్నట్లు వాల్మీకి మహర్షి " రామాయణం " అనే పేరుతో వ్రాయడానికి ఉద్యుక్తుడయ్యాడు.


శ్లో//ఉదార వృత్తార్థ పదై ర్మనోరమై/

స్తదాస్య రామస్య చకార కీర్తిమాన్/

సమాక్షరైః శ్లోక శతైర్యశస్వినో/

యశస్కరం కావ్య ముదారధీర్మునిః//


(యశశ్శాలి, బుద్ధిశాలి,ముని, అయిన వాల్మీకి, కీర్తిమంతుడైన రాముని కీర్తిని విశ్వవిఖ్యాతం చేస్తూ,మనోహరములైన పదములు,వాక్యములు,అర్థములతో కూడిన వందలకొలదీ శ్లోకములలో యశస్కరమైన రామాయణ మహా కావ్యమును రచించాడు).


శ్లో//కామార్థ గుణ సంయుక్తం,ధర్మార్థ గుణ విస్తరమ్/

సముద్ర మివ రత్నాఢ్యం సర్వ శ్రుతి మనోహరమ్//


(ఆ రామాయణం పురుషార్థములైన కామము,అర్థములను గురించి, విశేషంగాను,

 ఆ అర్థ కామములను ప్రసాదిస్తూ మోక్షమునకు దారి తీసే ముఖ్య పురుషార్థమైన ధర్మమును గురించి విస్తారంగాను తెలియజేస్తుంది,

 రత్నములను గర్భంలో ధరించిన సముద్రం లాగా, అనేక వేద రహస్యములను ఆ రామాయణం తన గర్భంలో ఇముడ్చుకున్నది,

అంతేకాదు ఆ రామాయణ మహా కావ్యం సర్వ శ్రుతి మనోహరమైనది).


ఈ రామాయణ మహాకావ్యమును వాల్మీకి మహర్షి 

శ్రీరామ పట్టాభిషేకం వరకు ఆరు కాండలలోను, తరువాత జరిగిన వృత్తాంతమును ఉత్తర కాండలోను, వివరిస్తూ, మొత్తం ఏడు కాండములలో, ఐదు వందల సర్గలలో,రచించారు.


ఇరువది నాలుగు అక్షరములతో కూడిన గాయత్రీ మహామంత్రమును పొందుబరుస్తూ,  

ఆ మహాముని ఇరువది నాలుగు వేల శ్లోకములలో ఈ రామాయణ మహా కావ్యమనే కల్పవృక్షమును సృష్టించాడు.


చరితవ్రతుడైన ఆ వాల్మీకి మహర్షి ఈ కావ్యమునకు "రామాయణము" అని, "మహత్తరమైన సీత చరిత్ర" అని,

 "పౌలస్త్య వధ" అని ,

 మూడు పేర్లు పెట్టాడు.



శ్లో// తదుపగత సమాస సన్ధి యోగం/

సమ మధురోపనతార్థ వాక్య బద్ధమ్/

రఘువర చరితం, ముని ప్రణీతం/

దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్//


(ఈ రామాయణ మహా కావ్యం దశగ్రీవుడైన రావణుని సంహరించిన శ్రీరాముని చరిత్ర.

ఇందులోని శబ్దములన్నీ శాస్త్ర సమ్మతమైన వేద శబ్దములు.

ఈ కావ్యములోని శ్లోకములన్నీ మృదు,మధురమైనవి.

 అతి దీర్ఘములు కాని చక్కని సమాసములతోను,

శ్రావ్యమైన సంధులతోను,

గంభీరమైన అర్థములతోను, కూడినవి.

బ్రహ్మ దేవుని ఆదేశానుసారం మహాఋషి వాల్మీకి రచించిన ఈ మహాకావ్యమును పఠించి, విని,తరిద్దాం).




                      శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

22-3-'26

ఉత్తమమైన ధర్మం ఏది ?

  శ్రీరామ (119)

శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఉత్తమమైన ధర్మం ఏది ?


క/ ఒరులేయవి యొనరించిన,

నరవర ! యప్రియము తన మనంబునకగు దా,

నొరులకు నవి సేయకునికి,

పరాయణము పరమధర్మ పథములకెల్లన్ //


(ఇతరులు ఏ పనులు చేస్తే మన మనస్సు బాధపడుతుందో,

అటువంటి పనులు మనం ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మముల కంటే శ్రేష్ఠమైన ధర్మము)

(తిక్కన సోమయాజి - మహాభారతం, విదురనీతి)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

22-3-'26.

సూర్య స్తుతి 🙏

 🌸సూర్య స్తుతి 🙏

కంద పద్యం


వెలుగులు నింపును సూర్యుడు 

బలమును చేకూర్చు పద్మ బంధువు మనకున్

పలుపంటలుపండించెడి 

ఖలునకు భక్తితో మనమున కైమోడ్చవలెన్


ఖలుడు__సూర్యుడు

సాహితీ శ్రీ జయలక్ష్మి

🌸శ్రీ రామ స్తుతి🙏

  🌸శ్రీ రామ స్తుతి🙏 


 సీ.ఘనమైన హారముల్ కాంచన చేలముల్

              ధరియించి కొలువైన ధర్మపాల !

     మహనీయ శ్రీరామ ! మధుర మధుర నామ !

              ధరణిపాలకరామ ! ధన్యచరిత !

     జానకీ ప్రాణేశ ! జగదభి రామయ్య !

               కాకుత్థ్సవంశజా ! ఘనచరిత్ర !        

     రఘువంశ చంద్రమా ! రాజిత గుణధామ             

              కమనీయరఘువరా ! కావు మమ్ము

తే.వల్కలమ్ముల ధరియించి వనము కేగి

    దనుజ దర్పమ్ము నణచిన ధర్మవీర !

    సవనమును గాచి బ్రోచిన శౌర్యరామ !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మతేజ !


        సాహితీ శ్రీ జయలక్ష్మి

సంక్షిప్త రామాయణ

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*ఇంటింటా సంక్షిప్త రామాయణ*    

      *పారాయ‌ణం*


 ********

     *4వ రోజు పారాయ‌ణం* 

     🌸 *కిష్కింధ కాండ*🌸


 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

              

   ***


శ్రీ‌ రామ లక్ష్మణులు శబరి ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపా సరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. సీతాదేవి అప‌హ‌ర‌ణం గురించి తెలుసుకుని విలపిస్తున్న రాముడికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు.

శ్రీ‌రామా , నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు.

ఉత్సాహం ఉంటే ఈ ప్ర‌పంచంలో సాధించ‌లేనిదంటూ ఏదీ లేదు. నీవు లోకైక వీరుడ‌వు. దుఃఖం, శోకం, భ‌యం,ఎవరి ప్ర‌తిభ‌ను అయినా బ‌య‌ట‌కు రాకుండా చేస్తాయి. ఈ అడ్డు తొల‌గించుకో, నీకు చెప్పేటంత‌టివాడ‌ను కాను. నిరుత్సాహానికి ఇది సమయం కాదు.

 అన్న‌య్యా... ఉత్సాహాన్ని పుంజుకో, ఈ బాధ విడిచిపెట్టి జ‌ర‌గ‌వ‌ల‌సిన దాని గురించి ఆలోచించు అని అన్నాడు లక్ష్మణుడు. త‌మ్ముడి మాట‌లు రాముడికి ఉత్సాహాన్నిచ్చాయి. 

 క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.


*శ్రీ‌రాముడి వద్దకు*

*హనుమ*..


వాలి, సుగ్రీవులు వానరులు. అన్నదమ్ములు.

తన అన్న అయిన వాలి కోపానికి గురై తరిమి వేయబడిన సుగ్రీవుడు , తనవారితో కలసి ఋష్యమూక పర్వతం పైననే తిరుగుతున్నాడు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భ‌య‌ప‌డ్డాడు. వాలి, వీరిని త‌న పైకి యుద్ధానికి పంపాడేమోన‌ని సుగ్రీవుడి భ‌యం. వారెవ‌రో తెలుసుకుని ర‌మ్మ‌ని హనుమంతుడిని వారి వద్దకి పంపాడు.

హనుమంతుడు స‌న్యాసి రూపంలో రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను సమీపించాడు– 

ఓ పుణ్యపురుషులారా! తమరు, వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి చూస్తే ,సర్వ శత్రు సంహరణా దక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల లాగా, సూర్యచంద్రులలాగా, అశ్వినీ దేవతల లాగా కనిపిస్తున్నారు. నేను సుగ్రీవుడు అనే వానరుని మంత్రిని. అతడు తన అన్న వాలి ఆగ్రహానికి గురై దీనుడై ఉన్నాడు. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కోరుకున్న రూపాన్ని ధరించగలను. గనుక బ్ర‌హ్మ‌చారి వేషంలో మిమ్ములను కలవడానికి వచ్చాను. నేను వాన‌రుడ‌ను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి .....అని మృదువైన మాటలతో హనుమ అన్నాడు.


హనుమంతుని మాటలకు, అతడి వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. 

ల‌క్ష్మ‌ణుడివైపు తిరిగి రాముడు,....

 చూశావా ల‌క్ష్మ‌ణా....

 ఇత‌ని మాటలలో ఎక్కడా అనవసర శబ్దం గాని, అపశబ్దం గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వానిని మంత్రిగా కలిగిన రాజు ఏద‌యినా సాధించగలడు అని చెప్పాడు.

రాముడి అనుమ‌తి తీసుకుని లక్ష్మణుడు తమ రాకకుగల కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు.


*శ్రీరామ, సుగ్రీవుల మైత్రి*:


హనుమంతుని ద్వారా రామ ల‌క్ష్మ‌ణుల గురించి తెలుసుకుని సుగ్రీవుడు వారికి స్వాగ‌తం ప‌లికి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడతాన‌న్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ ని రాక్ష‌సుడు అప‌హ‌రించుకు పోతుండ‌గా చూశాం. ఆమె జారవిడచిన నగలు మావ‌ద్ద ఉన్నాయి అని వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు, క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యాడు. క‌న్నీళ్ల‌తో రాముడి క‌ళ్లు మ‌స‌క‌బారాయి.

 ఈ ఆభ‌ర‌ణాలు మీ వ‌దిన సీత‌మ్మ‌వో కాదో చూడ‌మ‌ని,ల‌క్ష్మ‌ణుడికి చూపాడు రాముడు.


*నాహం జానామి కేయూరే* *నాహం జానామి కుండలే*

*నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్*

 అన్న‌య్యా.... ఈ కేయూరాలు, కుండలాలను నేను గుర్తించలేను. కాని నిత్యం వదినకు పాదాభివందనం చేయడం వలన ఈ నూపురాలు ఆమెవని మాత్రం చెప్పగలను అన్నాడు . ఆ ఆభ‌ర‌ణాల‌ను చూస్తూ

 రాముడు ఇంకా దుఃఖిస్తున్నాడు. రామా చింతించ‌కు సీత జాడ తెలుసుకుని తెచ్చి అప్ప‌గించే బాధ్య‌త నాది అని అనున‌య‌వాక్యాలు ప‌లికాడు సుగ్రీవుడు.

 రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి కుదుర్చుకున్నారు.

సుగ్రీవుడికి తన అన్న అయిన వాలితో వైరం ఎందుకు వ‌చ్చిందో రాముడు అడిగి తెలుసుకున్నాడు.

 కిష్కింధకు రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. ఒక సారి మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలం లోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే కాప‌లాగా ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒక నెల‌ గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని, రాక్ష‌సుడు బ‌య‌ట‌కు వ‌చ్చి చంపేస్తాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజును చేశారు.

కొంత‌కాలానికి వాలి బిలంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి , సుగ్రీవుడు రాజ్యం కాజేయ‌డానికే బిలానికి బండ‌రాయిని అడ్డంగా పెట్టి వ‌చ్చాడ‌ని భావించి అత‌డిని నిందించాడు. సుగ్రీవుడి భార్య రుమ‌ను చేప‌ట్టి

 సుగ్రీవుడిని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.

దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.


*వాలి- సుగ్రీవుల పోరు*

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీ కొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవ‌రో పోల్చుకోలేక రాముడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో త‌న‌ను కాపాడ‌నందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.


 వాలి , సుగ్రీవులు ఇద్ద‌రూ ఒకేరకంగా ఉండ‌డంవ‌ల్ల కాపాడ‌లేక‌ పోయానన్నాడు రాముడు. మరో సారి వాలితో యుద్ధానికి వెళ్ల మన్నాడు రాముడు. సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు. ఈ సారి ఒక పుష్ప‌మాల‌ను గుర్తుగా సుగ్రీవుని మెడలో వేసి పంపాడు . మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార అడ్డుకునింది. సుగ్రీవుడితో పోరు వ‌ద్ద‌ని వారించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు వెంట‌నే మళ్లీ యుద్ధానికి వ‌స్తున్నాడంటే,ఇందులో ఎదో రహస్యమ్ దాగి వున్నదని తార అనుమానించింది. రామ ల‌క్ష్మ‌ణుల‌ అండ చూసుకుని సుగ్రీవుడు వ‌స్తున్నాడ‌ని గ్ర‌హించ‌మ‌నింది. కాని ,వాలి త‌న భార్య తార మాట వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక తనకు వారు ఏ హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు చెట్టు చాటునుంచి కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని ,వాలి గుండెలపైకిసంధించాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ క‌నిపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--


*రాముని వాలి నిందించుట*:

రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చాటుగా వేసిన బాణం వ‌ల్ల‌ నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, నీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. ధ‌ర్మం త‌ప్పి వ్య‌వ‌హ‌రించావు అని రాముడిని నిందించాడు.

నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? – అని వాలి అన్నాడు.


*రాముని సమాధానం*

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.


నేను వేట మిష మీద నిన్ను చంపలేదు. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. కిష్కింధ మా రాజ్యంలోదే నని మరువకు.

నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు అధిపతివైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపానంటున్నావు... నీ మెడలోని కాంచన మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయం చేత నిన్ను కూల్చాను. పైగా నీది జంతు సంతతి .మాటు వేసి చంపడం సరయినదే.

అధ‌ర్మ వ‌ర్త‌నుడిని వధించడానికి యుద్ధ ధర్మాలు కూడా వర్తించవు. నీవు శిక్షార్హుడవు అన్నాడు. రాముడి స‌మాధానంతో వాలి తృప్తి చెందాడు. ధ‌ర్మ‌సూక్ష్మాల‌ను గ్ర‌హించాడు. 

 రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. అయితే గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో, సుగ్రీవుడు నా భార్య‌ తారను హింసించకుండా చూడు. నా అపరాధాలనూ మన్నించు అని వాలి వేడుకున్నాడు.


తరువాత వాలి సుగ్రీవుని పిలిచి ప్రాణాలు పోయే లోగా తన మెడలోని కాంచనమాలను తీసి అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. 

తార మాట విననందువల్లే తనకు ఈ దుర్గతి పట్టిందన్నాడు.. రాముడికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకోమ‌న్నాడు. అలక్ష్యం చేయవద్దన్నాడు.


పిన తండ్రిని కూడా తండ్రి లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని వాలి ప్రాణాలు వ‌దిలాడు.

 అనంతరం రాముడి ఆజ్ఞ‌పై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు , సుగ్రీవ ప‌ట్టాభిషేకానికి కిష్కింధకు వెళ్ళలేదు.

 అప్ప‌టికే వ‌ర్ష‌రుతువు వ‌చ్చేసింది. వర్షఋతువులో సీతా అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే. సీతాన్వేషణకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవుడికి చెప్పాడు.


*లక్ష్మణుని ఆగ్రహం*


వర్షా కాలం అయిపోయింది. ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధ విముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. రామకార్యం మరచిపోయాడు . ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని పొందడానికి కారణమైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. శ్రీరామ చంద్రునికి కోపం తెప్పించకు. వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని మంచి మాట‌లు చెప్పాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుడిని పిలిచి, అన్ని దిశలనుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.


రాముడు సీతా వియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి సుఖభోగాలలో మునిగి తేలుతున్నా సుగ్రీవుని ప్ర‌వ‌ర్త‌న రాముడికి మరీ బాధ కలిగించింది. అది చూసి లక్ష్మణునికి ఆగ్రహం పెల్లుబుకింది. ఆగ్ర‌హంతో కిష్కింధకు వెళ్ళాడు. కోపంతో వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేశారు. వినయంతో మెలిగి ల‌క్ష్మ‌ణుడిని ప్రసన్నం చేసుకోమని హనుమంతుడు హితవు చెప్పాడు. భ‌యంతో సుగ్రీవుడు ముందుగా తార‌ను పంపాడు.

 తార వచ్చి సుగ్రీవుని త‌ప్పుని మన్నించమనీ, అతడు తన మిత్ర ధర్మాన్ని తప్పక నెరవేరస్తాడనీ లక్ష్మణుని ప్రాధేయపడుతూ విన్నవించుకొని అతనిని శాంతింపజేసింది. దానితో సుగ్రీవుడు కాస్త ధైర్యం తెచ్చికొని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. సమస్త వానర గణాలనూ కిష్కింధకు రావాలని ఆజ్ఞాపించాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని వ‌ద్ద‌కు వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.


*సీతాన్వేషణ ఆరంభం*


సుగ్రీవుని ఆజ్ఞపై తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర దిక్కుల‌కు వాన‌ర సేన వెళ్లింది.. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయకాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియ‌ద‌ని విచార వ‌ద‌నంతో మనవి చేశారు.


*దక్షిణ దిశలో అన్వేషణ*


దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు

రామ లక్ష్మణుల జననం నుంచి సీతా అపహరణమ్ వరకు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు. అక్కడ కొండపైన ఉండే వృద్ద పక్షి సంపాతి ఇదంతా వింటున్నాడు. సంపాతి జటాయువు సోదరుడు. ముందు వానర మూకను తినవచ్చని అనుకున్నాడు. కానీ వారి మాటలలో వానరులు దశరధుడి కుమారుడయిన రాముడికి సహాయం చేస్తున్నారని గ్రహించాడు. దశరధుడి తో తనకు గల స్నేహం గుర్తు చేసుకున్నా డు. తమ్ముడు జటాయువు మరణ వార్త విని బాధపడ్డాడు. రావణాసురుడు సీతమ్మ ను అపహరించి ఆకాశ మార్గంలో లంకకు తీసుకుపోతుండగా సంపాతి చూసి వున్నాడు.

   రావణుడు సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలోసీతమ్మని దాచాడని వారికి చెప్పాడు.


*హనుమంతుని సంకల్పం*


 సంపాతి ద్వారా సీత జాడ తెలిసి వానరులు ముందు సంబరపడ్డారు. అయితే సముద్రం దాటడం ఎలా అన్న ప్రశ్నతో ఉత్సాహం నీరుగారిపోయింది. వానర సేనలోని గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు. అంద‌రిమాట‌లూ విన్న‌త‌ర్వాత‌....

జాంబవంతుడు హనుమంతునితో ఇలా అన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహు వర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు మాత్ర‌మే సాధ్యం. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరిచాడు.

ఆంజనేయుడు సముద్రంలా ఉప్పొంగిపోయాడు. 

దీర్ఘ దేహుడై విజృంభించాడు. జాంబవంతునికీ, వానర ప్రముఖులకూ వందనం చేశాడు.సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను.నాకు అనేక శుభశకునాలు క‌నిపిస్తున్నాయి. మీరు ఇక నిశ్చింతగా ఉండండి. అన్నాడు.


కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు,హనుమను ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలు పెట్టిన‌ చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి.

శత్రు నాశన సమర్ధుడు, వాయువేగంతో ప్ర‌యాణించ‌గ‌ల ధీరుడు అయిన హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంక వైపు తిరిగి నిలుచున్నాడు......

లంకకు బయలుదేరేందుకు సన్నద్దుడు అవుతున్నాడు...


శ్రీ‌రామ రామ రామేతి 

రమే రామేమ‌నోర‌మే

స‌హ‌స్ర‌నామ త‌త్తుల్యం 

రామ‌నామ వ‌రాన‌నే

              *****

*మనోజవం మారుత తుల్యవేగం*

*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం!*

*వాతాత్మజం వానరయూధ ముఖ్యం*

*శ్రీరామదూతం మనసా స్మరామి!!!*

         

*(కిష్కింధ కాండ స‌మాప్తం)*

*ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 58*


*పంచదశవర్ణరూపం కంచన కాంచీవిహారధౌరేయమ్।*

*పంచశరీయం శంభోర్వంచన వైదగ్ధ్యమూలమవలంబే॥*


*భావము :*


*జగన్మాత మంత్ర శరీరము కలది. పంచదశియే ఆ మంత్ర స్వరూపము. పంచ బాణములను చేత ధరించి, ఈశ్వరుని మైమరపింపజేసి తన వశము చేసుకుని, కాంచీపురమునందు విహరించే తల్లి నాకు ఆలంబన మగుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ ।

సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ।। 24 ।।



ప్రతిపదార్థ:



ఉత్సీదేయుః — నాశనమగును; ఇమే — ఇవన్నీ; లోకాః — లోకములు; న, కుర్యాం — నేను చేయకపోతే; కర్మ — కర్తవ్యమును; చేత్ — ఒకవేళ; అహం — నేను; సంకరస్య — అసాంస్కృతిక జనుల; చ — మరియు; కర్తా — బాధ్యుడను; స్యామ్ — అగుదును; ఉపహన్యామ్ — నాశనమగును; ఇమాః — ఇవన్నీ; ప్రజాః — ప్రాణులు.

  

 తాత్పర్యము : 


  నేను నా కర్తవ్యములను చేయకపోతే, ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను, మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.


 వివరణ:


శ్రీ కృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు, ఆయన రాజ వీరుల కుటుంబీకునిగా, సమాజంలో అన్నివిధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే, ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని, మిగతా జనులు, ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు. శ్రీ కృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే, ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు, కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి, శ్రీ కృష్ణుడు దానికి దోషుడు అనబడుతాడు. ఈ విధంగా, తను చేయవలసిన విధులను చేయకపోతే, సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమౌతాయి అని శ్రీ కృష్ణుడు, అర్జునుడుకి వివరిస్తున్నాడు.


అదే విధంగా, అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని ప్రపంచ ప్రఖ్యాతినొందాడు, అతను ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే తన ధర్మ బద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే, ఏంతో మంది ఉన్నతమైన ఇతర వీరులు, యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచి పెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతని నాశనం చేసి, ధర్మాత్ములు, అమాయకులు అయిన ప్రజల వినాశనానికి కారకమవుతుంది. అందుకే, సమస్త మానవ జాతి కళ్యాణం కోసం, తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చచెప్పుతున్నాడు

21, మార్చి 2026, శనివారం

22మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

 *🌹22మార్చి2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*                               

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : చవితి* రా 09.16 వరకు ఉపరి *పంచమి*         

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : భరణి* రా 10.42 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం : వైధృతి* మ 03.42 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం  : వణజి* ఉ 10.36 *భద్ర* రా 09.16 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.00*               

అమృత కాలం  : *సా 06.17 - 07.46*

అభిజిత్ కాలం  : *ప 11.50 - 12.39*

*వర్జ్యం    : ఉ 09.27 - 10.56*

*దుర్ముహూర్తం  :సా 04.41- 05.30*

*రాహు కాలం :సా04.48- 06.19*

గుళికకాళం     : *మ 03.16 - 04.48*

యమగండం    : *మ 12.14 - 01.45*

సూర్యరాశి : *మీనం*                    

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.19* 

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :  *ఉ 06.10 - 08.36*

సంగవ కాలం      :*08.36 - 11.02*

మధ్యాహ్న కాలం   :*11.02 - 01.27*

అపరాహ్న కాలం :*మ 01.27- 03.53*

*ఆబ్ధికం తిధి     : చైత్ర శుద్ధ చవితి*

సాయంకాలం   :*సా 03.53 - 06.19*

ప్రదోష కాలం    :*సా 06.19 - 08.41*

రాత్రి కాలం      :*రా 08.41 - 11.50*

నిశీధి కాలం      :*రా11.50 - 12.38*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.22*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞ద్వాదశ నామాలు🌞* 


*మిత్రాయ నమః*

*దక్షిణహస్తే మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 21 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

 `` *32వ భాగo*``


*మత్స్యావతారకథ(3) సోమకాసుర సంహారం - వేదాల రక్షణ*```


విష్ణువు సప్త ఋషుల నావను వేగంగా ప్రళయ జలథి జలరాశిని చీల్చుకుంటూ మందుకు వెళ్లసాగాడు. మత్స్య వేగానికి జలరాశులు ఉధృతంగా కదులుతూ నీటిలో అలజడి సృష్టించ సాగింది. ఆ అలజడికి నీరు అంతర్భాగంలో దాగి ఉన్న సోమకాసురుడి నవరంధ్రాలలో జొరబడి ఉక్కిరిబిక్కిరి చేశాయి.

సోమకాసురుడు ఊపిరి అందక, బాధ భరించలేక నీటిని చీల్చుకుంటూ పైకి వచ్చాడు. వేల యోజనాల పొడవు గల చేపను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ మత్స్యావతారంలో వచ్చింది శ్రీమహావిష్ణువు అని, తన నుంచి వేదాలను తీసుకు వెళ్లడానికి వచ్చాడు అని గ్రహించాడు.


“ఓ నారాయణా నన్ను సంహరించ డానికి వచ్చినట్టున్నావు. నాకు దేవ దానవ మానవ జాతుల వలన గాని, మృగ పశు పక్షి వృక్ష పర్వత సర్ప క్రిమికీటాదులవలన గాని మరణం లేకుండా నా తండ్రి విశ్వావసువు వరం ఇచ్చాడు. అంతేకాదు బ్రహ్మ వంశస్థుడి వరం పొందిన నన్ను సంహరిస్తే బ్రహ్మహత్యా మహాపాతకం నీకు చుట్టుకుంటుంది. వెనక్కి వెళ్లి పో” అని హెచ్చరించాడు.


శ్రీహరి ఆ మాటలకు ఆగ్రహించి “సోమకాసురా! నీ తండ్రి నీకు వరమిచ్చే సమయంలో నీటిలో సంచరించే జలచరాలను మరచి పోయాడు. అంతేకాదు పృధ్వి, వాయువు జలం అగ్ని ఆకాశం వలన నీకు మరణం లేకపోవచ్చు ను. కానీ వాటి సృష్టికర్త అయిన నా చేతిలో మరణం రాదని నీకు ఇచ్చిన వరములో లేదు.


కనుక మత్స్యావతారి యైన నేను నిన్ను సంహరించడం బ్రహ్మ ధిక్కారం, బ్రాహ్మణ వర ధిక్కారం కాదు. కనుక నాకు బ్రహ్మహత్య పాతకం రాదు!” అని నావను వదిలి సోమకాసురుని పై దూకి తన కొమ్ముతో అతడిని నిట్టనిలువుగాచీల్చి సంహరించాడు. ఆకాశంలో దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తుండగా వేదాలు వచ్చి మత్స్యావతార విష్ణువు హస్తాన్ని అలంకరించాయి.


బ్రహ్మకు రాత్రి ముగిసి మరో రోజు ఆరంభమైంది. ప్రళయాంధకారం తొలగిపోయింది. పగలు రాగానే నిద్రాదేవి బ్రహ్మను వదిలి వేయడంతో ఆవులిస్తూ నిద్ర లేచాడు. సూర్యుని కాంతులు నలుదిశల వ్యాపించ సాగాయి. సరస్వతీ దేవి మేల్కొని బ్రహ్మ పక్కన గల తన ఆసనము స్వీకరించింది. ప్రాతస్సంధ్య సమయంలో గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకుంటూ దేవర్షులు మహాగాయత్రి మంత్రానుష్ఠానం ఆరంభించారు.


సృష్టి కార్యం ఆరంభించాలి అను కున్న బ్రహ్మదేవుడు చుట్టూ జలరాశిని చూసి విస్తుబోయాడు. భూమి లేకుండా సృష్టి ఎలా చేయాలి అని ఆందోళన పడుతున్న బ్రహ్మ వద్దకు మత్స్యావతార విష్ణువు వచ్చాడు. శ్రీమన్నారాయణుని గుర్తించి

బ్రహ్మ నమస్కరించాడు.


బ్రహ్మకు వేదాలను అప్పగిస్తూ "బ్రహ్మదేవా!త్వరలో సూర్యకాంతి కి నీరు ఇంకిపోయి భూమి బయటకు వస్తుంది. అప్పుడు నీవు సృష్టి ఆరంభించ వచ్చును. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ మునిమనవడు సోమకాసురుడు నీవు నిద్రపోయే సమ యంలో వేదాలను నీ నుంచి అప హరించి నీటిలో దాక్కున్నాడు. అతనికి దేవదానవాదిజాతులవలన,

మృగ పశు వృక్షాదుల వలన మరణం లేకుండాసోమకాసురుని తండ్రియైన విశ్వావసువు వరం ఇచ్చాడు.దేవతల కోరిక పై.

వరంలో లేనిజలచరమైనమత్స్య రూపం దాల్చి సంహరించి తస్క రించిన వేదాలను కాపాడి నీకు అప్ప చెప్పాను.అందుకనిlహెచ్చ రిస్తు న్నాను. బ్రహ్మల మన్న అహం కారంతో నీవు గాని, నీ మానస పుత్రులు గాని, వారి వంశజులు గాని "అసుర జాతి" కి అలవికాని వరాలు ఇచ్చి ధర్మా నికి,లోకానికిఇక్కట్లు,ఇబ్బందులు కలిగించ వద్దు. అలా చేస్తే మీకు, మీ వంశ జులకు వంశక్షయము, పుత్ర శోకము తప్పదు. జాగ్రత్తగా ఉండండి!" అని హెచ్చరించి అదృశ్య మయ్యాడు.


మత్స్యావతారంలో విష్ణువు చేసిన హెచ్చరిక పులస్త్య బ్రహ్మ భార్య హవిర్భువుకి నచ్చలేదు. అసుర జాతి తన భర్త పులస్త్య బ్రహ్మ నుంచి ఉద్భవించింది. తమ వంశం వారికి వరాలు ఇవ్వడంలో హెచ్చరిస్తాడా శ్రీహరి అని కోపించి "నారాయణా!బ్రహ్మ వంశానికిఆదిపురుషుడివైన నీవే బ్రహ్మవంశనాశనం,వంశక్షయం చేస్తానంటవా! 

ఏ అసురజాతికివరాలుఇవ్వవద్ద న్నావో, ఆఅసురజాతివలననీవు వైకుంఠానికి దూరమైఇబ్బందులు పడతావుఒక్క అసురజాతిలో తప్ప ఇతర జాతులలో జన్మించి అసురుల వలన అనేక కష్టాలు అనుభ విస్తావు. ఇది నా శాపం" అని శపించింది.ఆమహాపతివ్రత శాపం శ్రీహరి అనేక అవతారాలు ధరించడానికి కారణంఅయ్యింది. శ్రీమహావిష్ణువు ధరించిన అనేక అవతారాలలోఇరవైఒక్కఅవతారా లు ముఖ్యమైనవి. ఇరవై ఒక్క అవతారాలలోప్రాముఖ్యత,ప్రాచుర్యంపొందినవిదశావతారాలు.

దశావతారాలలో మొదటిదైన మత్స్యావతార కథ మీకు విని పించాను" అని సూత మహర్షి ఆనాటి మహావిష్ణు పురాణ పారా యణం ముగించాడు.      

```

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారా వు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కుప్పింట చెట్టుతో వైద్యం -

 కుప్పింట చెట్టుతో వైద్యం -

 


ఇది వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలలో బాగా పెరిగే చెట్టు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక జాతి యొక్క ఆకులు గుండ్రముగా ఉంటాయి. రెండోవది ఆకులు చివర కోణం కలిగి ఉండును. ఇవి రెండూ సమాన గుణాలు కలిగి ఉండును. దీని ఉపయోగాలు మీకు వివరిస్తాను.

• దీని ఆకులు 9, మిరియాలు 9, కొంచం హారతికర్పూరం ( ముద్ద కర్పూరం ) కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం , సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉండిన కామెర్లు హరించును

• దీని ఆకు , వేరు కలిపి కషాయం లా చేసుకుని తాగినా లేక చూర్ణం లోల్లికి తీసుకున్న మొలలు నివారణ అగును.

• ఆకుల పసరు పూసిన చర్మరోగాలు నయం అగును.

• దీని ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి ఇచ్చిన మూర్ఛరోగం నివారణ అగును.

• దీని వేరుతో దంతధావనం చేసిన దంతరోగాలు నశించును.

• దీని ఆకు పసరు కండ్లలో లేక ముక్కులో పిండిన పిల్లలకు వచ్చు బాలపాపచిన్నెలు నివారణ అగును.

• అదే పసరు చెవిలో పిండిన చెవిపోటు నివారణ అగును.

• దీని ఆకుల రసం ఒక స్పూన్ లొపలికి ఇచ్చిన వాంతులు చేయను. లొపల పేరుకున్న శ్లేష్మం బయటకి పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ అగును.

• దీని ఆకు నూరి కట్టిన వ్రణాలు మానును .

• తేలు , జెర్రి , కందిరీగ , తేనెటీగ కుట్టిన వెంటనే ఈ ఆకు వేసి కట్టు కట్టిన బాధ నివారణ అగును.

• గోరుచుట్టు లేచినప్పుడు దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి కట్టిన అది పగిలి మానిపోవును .

• పుప్పిపంటికి దీని ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపొవును.

• పురుగులు పట్టిన వ్రణములకు మొక్కని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం చల్లిన పురుగులు నశించి పుండ్లు మానును .

• దీని చూర్ణం నస్యం వలే లొపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తం కరుగును.


మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.



పంచాంగం

  


రామాయణం - 6 )

  శ్రీరామ (13)


               ( వాల్మీకి రామాయణం - 6 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (21-3-'26 ' ఉదయం ' పోష్టు తరువాయి భాగము)


నారదమహర్షి చెప్పిన రామాయణమును విని ధర్మాత్ముడు,వాక్య విశారదుడు అయిన వాల్మీకి మహర్షి,శిష్యులతో కలిసి భక్తిపూర్వకంగా నారద మహర్షిని పూజించాడు.

( శ్లో// నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః/

పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః// )



ధర్మాన్ని అనుసరించి, వాల్మీకి మహర్షి శిష్యులతో సహా చేసిన పూజలను స్వీకరించి, సంతుష్టాంతరంగుడై, నారద మహర్షి ఆకాశమార్గాన దేవలోకం వెళ్లాడు.


ఆ తరువాత వాల్మీకి మహర్షి స్నానం చేయడానికి

 "తమసా నదీ" తీరం చేరుకుని "భరద్వాజుడు" అనబడే తన శిష్యునితో ఇలా అన్నాడు.


శ్లో// అకర్దమ మిదం తీర్థం భరద్వాజ నిశామయ/

రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనో యథా//


(ఓ భరద్వాజా! సత్పరుషుని మనస్సు లాగా నిర్మలంగాను,బురద లేకుండాను, మనోహరంగాను, ఉన్న ఈ రేవును చూడుము)


"నాయనా! ఈ రేవులో స్నానం చేద్దాం" అంటూ , 

అదే సమయంలో అక్కడ ఒక వృక్షం మీద మనోహరంగా కూయుచు, క్రీడిస్తున్న, ఒక క్రౌంచ పక్షుల జంటను చూసాడు.

అంతలోనే హఠాత్తుగా ఒక బోయవాడు అక్కడకు వచ్చి ఆ జంటలోని మగ పక్షిని బాణంవేసి నేల కూల్చాడు.

ధర్మాత్మడైన వాల్మీకి మహర్షి ఆ అనుకోని సంఘటనకు విభ్రాంతుడైనాడు. చలించిపోయాడు.

బ్రాహ్మణులకు జన్మతః జాలి ఎక్కువ.అందువల్ల "ద్విజుడైన" వాల్మీకి అని ఈ సందర్భంగా కావ్యంలో ప్రస్తావించారు.


నిద్రపోతున్నవారిని, రతిపారవశ్యంలో ఉన్నవారిని, శరణుకోరినవారిని, యుద్ధంలో వెన్నిచ్చి పారిపోతున్నవారిని, చంపటం అధర్మమని శాస్త్రం చెబుతోంది.


శ్లో//తతః కరుణ వేదిత్వా దధర్మో౽య మితి ద్విజః/

నిశామ్య రుదతీం క్రౌంచీ మిదం వచన మబ్రవీత్//


( ద్విజుడైన ఆ వాల్మీకి, రతి పరవశంలో ఉన్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఎవరిని చంపినా అధర్మమే అని భావిస్తూ,కరుణామయ హృదయుడై అప్రయత్నంగా ఇలా అన్నాడు)


శ్లో// మా నిషాద! ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః

యత్ క్రౌంచ మిధునా దేక మవధీః కామ మోహితమ్//


(ఓ బోయవాడా ! క్రౌంచ పక్షుల జంటనుండి మన్మథపరవశమైన ఒక పక్షిని అన్యాయంగా చంపావు.అందువల్ల నీవు ఎక్కువ కాలం జీవించవు).

అన్నాడు.

మరుక్షణంలోనే, అప్రయత్నంగా తన నోటినుండి సమాక్షరాలతో, సంగీతభరితంగా వెలువడిన ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు.

స్నానం చేసి, ఆ సంఘటనను,

ఛందోబద్ధంగా తన నోటినుండి వచ్చిన ఆ మాటలను, తలచుకుంటూ, ఆశ్రమంలో ప్రవేశించిన వాల్మీకి మహర్షికి ఆశ్చర్యం కలిగిస్తూ, ఎట్ట ఎదుట బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు.

చిరునవ్వు నవ్వుతూ ఆ బ్రహ్మదేవుడు వాల్మీకితో ఇలా అన్నాడు.


శ్లో//శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్యా విచారణా/

మచ్చన్దాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ/

రామస్య చరితం సర్వం కురుత్వమృషి సత్తమ//


( ఓ బ్రహ్మర్షీ ! ఇంతకు ముందు శోకముతో 

నీ నోటినుండి వెలువడిన

వాక్కు శుభప్రదమైన శ్లోకమే.

నా సంకల్పం వల్లనే వాగ్దేవియైన "సరస్వతిదేవి" 

నీ నోటినుండి అలా వెలువడినది.

నారదుడు నీకు ఉపదేశించిన ధర్మాత్ముడైన రాముని చరిత్ర అంతా, ఇటువంటి శ్లోకములతో కావ్యముగా రచింపుము ).


రామ,లక్ష్మణ,భరత, శత్రుఘ్నులు,

సీతాదేవి,

దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి,

 రావణాది రాక్షసులు,హనుమదాదులైన వానరులు,

మొదలైన వారందరి స్వరూప, స్వభావాలు,

వారి వారి ఆలోచనలు, సంభాషణలు, నడవడి,

అన్నీ నీకు కరతలామలకం అవుతాయి.

నీవు రచించే ఈ కావ్యంలో "అసత్యం" అనేదేదీ ఉండదు అని వరమిస్తున్నాను.


శ్లో// యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే/

తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి//


(ఈ భూమండలంలో పర్వతములు, నదులు, ఉన్నంతకాలం రామాయణ కథ మూడు లోకములలోను ప్రచారంలో ఉంటుంది).


నీ చేత రచింపబడిన రామాయణ కథ ఎంత కాలం ప్రచారంలో ఉంటుందో అంత కాలం నీవు నా లోకాలలో పరమానందంతో స్వేచ్ఛగా విహరిస్తావు".

అని చెప్పి బ్రహ్మ దేవుడు అంతర్హితుడయ్యాడు.



(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

21-3'-26.

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శుక్రవారం 20 మార్చి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                       1️⃣7️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*    

        

                    *170 వ రోజు*                    

*విరాట పర్వము ద్వితీయాశ్వాసము*


*సుధేష్ణ మాలినిని కీచకుని ఇంటికి పంపుట*```


సుధేష్ణ కీచకుని మంకుపట్టు గ్రహించి “తమ్ముడా కీచకా! ఎందుకు ఆరాట పడతావు. ఆమెను నీ వద్దకు పంపుట కష్టం కాదులే నీవు వెళ్ళు సైరంధ్రిని నీ వద్దకు పంపుతాను ఆ తరువాత నీ ఇష్టం!” అన్నది. 


అక్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళాడు. విందు భోజనం సిద్ధం చేసాడు, మధుర రసాలు ఏర్పాటు చేసాడు, పని వారందరిని పంపివేసాడు చేసాడు. తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకుని అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 


సుధేష్ణ సైరంధ్రిని పిలిచి “మాలినీ! నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముని కీచకుని ఇంట్లో రుచికరమైన మద్యం ఉంది తీసుకురా!” అన్నది.


ఈ మాటలు విన్న ద్రౌపది మనసు తల్లడిల్లింది. ఆమెకు శరీరం నిండా చెమట పట్టింది. ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలా అని భగవంతుని ప్రార్థించింది. ద్రౌపది “అమ్మా! నన్ను వదిలి పెట్టు. మధిరను తీసుకురావటానికి వేరొకరిని పంపు. నేను మీకు నీచపు పనులు చేయనని చెప్పాను. మీ గృహం అతి నిర్మలమయినదని నా భర్తలు దూరంగా ఉన్నా మిమ్ము నమ్మి మీ ఇంట ఉన్నాను. మిమ్ము నమ్మిన నా వంటి అనాధను ఇలాంటి నీచపు పనులకు పంపడం భావ్యమా?”అన్నది. 


సుధేష్ణ “మాలినీ! నేను మనసు పడి త్రాగాలని మద్యం తేవడానికి నిన్ను పంపుతున్నాను. ఇందుకు నీచజాతి వారిని పంపగలనా. మన స్నేహం ఇంతేనా అని తెలియకుంది” అని నిష్టూరంగా మాట్లాడింది. 


దేవుని మీద భారం వేసి ద్రౌపది కీచకుని ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమె సూర్యునికి నమస్కరించి “ఓ సూర్య భగవానుడా! నేను పాండు పుత్రులను తప్ప అన్యులను మనసునైనా తలపనేని నాకు ఈ కీచకుని వలన ఎటువంటి ఆపద కలగ కుండా కాపాడు” అని ప్రార్థించింది. 


సూర్యుడు కరుణించి ద్రౌపదికి రక్షణగా ఒక రాక్షసుని పంపాడు. అతడు అదృశ్య రూపంలో ద్రౌపదిని వెన్నంటి వస్తున్నాడు. 


ద్రౌపది తడబడే అడుగులతో కీచకుని ఇంట ప్రవేశించింది. కీచకుడు ఆమె రాకకోసమే ఎదురు చూస్తున్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శుక్రవారం 20 మార్చి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                       1️⃣7️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*    

        

                    *170 వ రోజు*                    

*విరాట పర్వము ద్వితీయాశ్వాసము*


*సుధేష్ణ మాలినిని కీచకుని ఇంటికి పంపుట*```


సుధేష్ణ కీచకుని మంకుపట్టు గ్రహించి “తమ్ముడా కీచకా! ఎందుకు ఆరాట పడతావు. ఆమెను నీ వద్దకు పంపుట కష్టం కాదులే నీవు వెళ్ళు సైరంధ్రిని నీ వద్దకు పంపుతాను ఆ తరువాత నీ ఇష్టం!” అన్నది. 


అక్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళాడు. విందు భోజనం సిద్ధం చేసాడు, మధుర రసాలు ఏర్పాటు చేసాడు, పని వారందరిని పంపివేసాడు చేసాడు. తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకుని అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 


సుధేష్ణ సైరంధ్రిని పిలిచి “మాలినీ! నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముని కీచకుని ఇంట్లో రుచికరమైన మద్యం ఉంది తీసుకురా!” అన్నది.


ఈ మాటలు విన్న ద్రౌపది మనసు తల్లడిల్లింది. ఆమెకు శరీరం నిండా చెమట పట్టింది. ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలా అని భగవంతుని ప్రార్థించింది. ద్రౌపది “అమ్మా! నన్ను వదిలి పెట్టు. మధిరను తీసుకురావటానికి వేరొకరిని పంపు. నేను మీకు నీచపు పనులు చేయనని చెప్పాను. మీ గృహం అతి నిర్మలమయినదని నా భర్తలు దూరంగా ఉన్నా మిమ్ము నమ్మి మీ ఇంట ఉన్నాను. మిమ్ము నమ్మిన నా వంటి అనాధను ఇలాంటి నీచపు పనులకు పంపడం భావ్యమా?”అన్నది. 


సుధేష్ణ “మాలినీ! నేను మనసు పడి త్రాగాలని మద్యం తేవడానికి నిన్ను పంపుతున్నాను. ఇందుకు నీచజాతి వారిని పంపగలనా. మన స్నేహం ఇంతేనా అని తెలియకుంది” అని నిష్టూరంగా మాట్లాడింది. 


దేవుని మీద భారం వేసి ద్రౌపది కీచకుని ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమె సూర్యునికి నమస్కరించి “ఓ సూర్య భగవానుడా! నేను పాండు పుత్రులను తప్ప అన్యులను మనసునైనా తలపనేని నాకు ఈ కీచకుని వలన ఎటువంటి ఆపద కలగ కుండా కాపాడు” అని ప్రార్థించింది. 


సూర్యుడు కరుణించి ద్రౌపదికి రక్షణగా ఒక రాక్షసుని పంపాడు. అతడు అదృశ్య రూపంలో ద్రౌపదిని వెన్నంటి వస్తున్నాడు. 


ద్రౌపది తడబడే అడుగులతో కీచకుని ఇంట ప్రవేశించింది. కీచకుడు ఆమె రాకకోసమే ఎదురు చూస్తున్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

21మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🍁శనివారం🍁*

*🌹21మార్చి2026🌹*     

 *దృగ్గణిత పంచాంగం*  

                                    

          *స్వస్తి శ్రీ పరాభవ* 

         *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : తదియ* రా 11.56 వరకు ఉపరి *చవితి*         

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : అశ్విని* రా 12.37 వరకు ఉపరి *భరణి*

*యోగం : ఐంద్ర* రా 07.01 వరకు ఉపరి *వైధృతి*

*కరణం  : తైతుల* మ 01.14 *గరజి* రా 11.56 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*               

అమృత కాలం  : *సా 05.58 - 07.27*

అభిజిత్ కాలం  : *ప 11.50 - 12.39*

*వర్జ్యం    : రా 08.56 - 10.24*

*దుర్ముహూర్తం :ఉ 06.11- 07.48*

*రాహు కాలం : ఉ 09.13 - 10.44*

గుళికకాళం      : *ఉ 06.11 - 07.42*

యమగండం    : *మ 01.46 - 03.17*

సూర్యరాశి : *మీనం*                      

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.20*  

సూర్యాస్తమయం :*సా 06.27*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :  *ఉ 06.11 - 08.36*

సంగవ కాలం      :*08.36 - 11.02*

మధ్యాహ్న కాలం    :*11.02 - 01.27*

అపరాహ్న కాలం  :*మ 01.27- 03.53*

*ఆబ్ధికం తిధి   : చైత్ర శుద్ధ తదియ*

సాయంకాలం    :*సా 03.53 - 06.18*

ప్రదోష కాలం     :*సా 06.18 - 08.41*

రాత్రి కాలం       :*రా 08.41 - 11.51*

నిశీధి కాలం       :*రా 11.51 - 12.38*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.23*

<><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం🌷*      

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం*🙏


*ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్* 

*వసుదేవసుతాన్న పరం కలయే*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*శిఖానిక్షిప్తవాలాగ్రం* 

*మేరుశైలాగ్రసంస్థితమ్*

*మూర్తిత్రయాత్మకం పీనం* 

*మహావీరం మహాహనుమ్!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శుక్రవారం 20 మార్చి 2026*


          *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *31వ భాగం*``


*మత్స్యావతార కథ*  


*జలప్రళయం -వేదాల అపహరణ సప్తఋషుల నావను సత్య వత్రుడు అధిరోహించుట:*```


సత్యవ్రతుడు మహావిష్ణువు చెప్పినట్లు ధాన్య ఫల ఆహార పదార్థాల విత్తనాలు ఒక పెద్ద భాండంలో సేకరించి, ఆ భాండంతో మహాసముద్ర తీరానికి చేరుకున్నాడు. దర్భలతో ఒక దర్భాశయనం చేసుకుని తూర్పు దిశగా తల ఉంచి కూర్చున్నాడు. విత్తనాల భాండం పక్కన పెట్టుకుని మనస్సులో అష్టాక్షరి మంత్రం జపం చేస్తూ జల ప్రళయం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు.


శ్రీహరి చెప్పినట్టు ఏడురోజులు భూకాలమానం ప్రకారం గడిచింది. బ్రహ్మకు పగటికాలం పూర్తి అయ్యి రాత్రి రాగానే నిద్రాదేవత బ్రహ్మదేవుని ఆవహించింది. సృష్టి కార్యం ఆపి పద్మం మీదనే చేయి తలగడగా చేసుకుని నిదురించసాగాడు. భూమి పై కుంభవృష్టిగా ఏడు రోజుల నుండి కురిసే వర్షం వలన సముద్రాలు పొంగిభూమిని ముంచేస్తూ జలప్రళయం ఏర్పడింది.


నిద్రిస్తున్న బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు బయటకు వచ్చాయి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న సోమకాసురుడు అనే రాక్షసుడు నీటి నుంచి బయటకు వచ్చి వేదాలు సంగ్రహించి నీటిలోకి వెళ్లి పోయాడు. 


దేవలోకాలు అన్ని కంపించాయి. బ్రహ్మ నిదురలోకి వెళ్లిన సమయంలో వేద ప్రక్రియల వలన దేవతలు సురక్షితంగా ఉంటారు.


దేవతలందరు విష్ణువుని రక్షించమని శరణు వేడతూ ప్రార్థించారు. భక్తవత్సలుడైన మహావిష్ణువు మహాజలథిలో వేల యోజనాలు పరిమాణం గల మత్స్యరూపంలో ప్రత్యక్ష మైనాడు. దేవతలు స్తుతించి వేదాలను సోమకాసురుని నుండి రక్షించమని ప్రార్ధించారు.


మత్స్యావతారుడు దేవతలకు అభయం ఇస్తూ “దేవతలారా! సోమకాసురుడు రాక్షసరాజైన పులస్త్య బ్రహ్మ మనవడు, విశ్రవసు కుమారుడు. విశ్రవసు సంధ్యాసమయంలో సోమరసం త్రాగి భార్యతో కలవడం వలన సోమకాసురుడు పుట్టాడు. పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టడం వలన అమేయ బలవంతుడై ముత్తాత అయిన బ్రహ్మదేవుని ముఖాల నుంచి వెలువడిన వేదాలు అపహరించాడు. నేను ఆ అసురుని సంహరించి వేదాలను కాపాడుతాను” అని జలర్ణావంలో ఈదుతూ ముందుకు వెళ్ళాడు.


భూమి అంతా నీటిలో మునిగి సత్యవత్రుడు కూర్చున్న దర్భాసనం తేలుతూ ప్రవాహముతో పాటు ముందుకు పయనించసాగింది. ఆకాశానికి చిల్లు పడినట్లు వాన పడుతోంది. మేఘాలు దట్టంగా కమ్మటం వలన జగత్తంతా అంధకార మయం అయ్యింది. భయానక వాతావరణంలో కూడా సత్యవత్రుడు నారాయణ మంత్రం జపిస్తున్నాడు. చీకటిలో దర్భాసనం నీటి పైన ఎటువైపు వెళుతోందో తెలియడం లేదు.


గాఢాంధకారంలో ఒక దివ్య కాంతి పుంజం దూరాన కనిపించింది. సత్యవ్రతుడు ఆ కాంతిపుంజం తనవైపు రావడం గమనించాడు. విష్ణువు చెప్పి నట్లు అది సప్త ఋషుల తేజస్సు యొక్క ప్రకాశము అని అర్థం చేసుకున్నాడు. కాంతిపుంజం కంటిచూపు దగ్గరకు రాగానే పెద్ద నావ ఆవెలుగులో కనిపించింది. నావలో కూర్చున్న సప్తఋషుల తేజస్సే కాంతిలాగా ప్రసరిస్తోంది అని గ్రహించాడు.


నావ దగ్గరకు వచ్చింది. దివ్య తేజస్సుతో వెలుగుతున్న సప్త ఋషులకి సత్యవ్రతుడు నమస్కరించాడు. నావని చుట్టుకుని ఒక మహాసర్పం కనిపించింది. ఆ మహాసర్పం భూమిని ప్రళయానంతరం తలమీద మోసే నారాయణాంశుడైన అనంతుడు (ఆదిశేషుడు) అని గ్రహించి నమస్కారం చేశాడు.


మీనావతారుడైన నారాయణుడు నీటి నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. సత్యవ్రతుడు నమస్కరించి శరణు కోరుతూ స్తుతించాడు. మీనావతారుడు సంతసించి “సత్యవ్రతా! పేరుకు తగ్గట్టు సత్యాన్నే జీవిత ధర్మము గా పాటిస్తూ,నా నామము జపిస్తూ ప్రియ భక్తుడవి అయ్యావు. అందుకే చేపపిల్లగా కనిపించి నీకు మార్గదర్శనం చేసాను. నిన్ను జల ప్రళయం నుండి రక్షించడానికి సంకల్పించాను.


నీ భక్తికి మెచ్చి వరము ఇస్తున్నాను. వచ్చే శ్వేతవరాహ కల్పములో నీవు సూర్యుడికి వైవస్వత నామముతో పుత్రుడిగా జన్మిస్తావు. సప్తమ మన్వంతరానికి మనువు అయ్యి ప్రసిద్దుడివి అవుతావు. నీ కీర్తి ప్రతిష్టలు వర్ధిల్లుతాయి” అని సత్యవ్రతునికి సాంఖ్యయోగ ప్రక్రియతో పురాణ సంహిత ఉపదేశించాడు.


అనంతరం సత్యవత్రుడు నారాయణుని ఆదేశం పాటించి బీజ విత్తన భాండాన్ని నావలోకి చేర్చి తాను నావను అధిరోహించాడు. మత్స్యావతారుడు తన చేప కొమ్ముని నావను చుట్టుకున్న సర్పరాజు శరీరానికి, నావకు మధ్యన చేర్చి తన యోజనాల శరీరం పై నావను అటుఇటూ పడకుండా చేసి ముందుకు ఈదుతూ వేగంగా వెళ్ళ సాగాడు.

        

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పాశుపతాస్త్రం

  🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మహాభారత కాలం నాటి పాశుపతాస్త్రం:*

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

 అతిశక్తివంతమైన ఒక అస్త్రం ఇది. తపస్సుతో శివుని మెప్పించి అర్జునుడు పొందాడు దీన్ని. అర్జునునికి శివుడు ఈ అస్త్రాన్ని ఇస్తూ "పాశుపతానికి అసాధ్యమైనది ఏదీలేదని, అయితే దాన్ని శక్తిహీనులపై ప్రయోగిస్తే లోకాన్ని తగలబెడుతుందనీ, అది అన్నివేళలా అందరిమీదా ప్రయోగించేది కాదనీ" చెప్పాడు. అస్త్రంగా ఇది మారణహోమాన్ని సృష్టించగలదు. అంతేకాదు, దేనినైనా నిర్ణీతస్థానానికి చేర్చే 'మిస్సైల్'గా కూడా పనికొస్తుంది. ఇది టు- ఇన్- వన్ లాంటి ఆయుధం అన్నమాట. మారణాస్త్రంగా దీన్ని ప్రయోగిస్తే, బ్రహ్మశిరాస్త్రం మాదిరిగానే ప్రకృతి ఉత్పాతాల్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ పాశుపతాన్ని కూడా ఎప్పుడుపడితే అప్పుడు వాడరాదని ఆనాటి పెద్దలు (ఋషులు) ఆంక్ష విధించారు. కాబట్టే అర్జునుడు మారణాస్త్రంగా తన పాశుపతాన్ని కురుక్షేత్ర యుద్ధంలో వాడలేదు. మారణాయుధంగా దాన్ని కనుక ఉపయోగించి ఉంటే, అర్జునుడు కేవలం ఒక్కక్షణంలోనే కౌరవుల్ని నశింపజేసేవాడు. పాశుపతాస్త్రాన్ని మిస్సైల్గా మాత్రం ఒకసారి వాడాడు అర్జునుడు. ఆ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కౌరవులకూ, పాండవులకూ బావమరిది 'సైంధవుడు'. సైంధవుడికి అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడు, ఒక వరం ప్రసాదించాడు. “ఎవరివల్ల తన తనయుని తల నేలపై పడుతుందో, వారియొక్క శిరస్సు ముక్కముక్కలై పేలిపోవాలని” తన తపశ్శక్తితో శాసించాడు. ఈ విషయం కృష్ణునికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బాణంతో సైంధవుడి తలను తెగనరుకుతాడు. ఆ 'తల' క్రిందపడిందంటే, అర్జునుని శిరస్సు ప్రేలిపోయి ఉండేదే! ప్రమాదాన్ని పసిగట్టాడు శ్రీకృష్ణుడు. సైంధవుని తలను నేలపై పడనివ్వవద్దని అర్జునుడితో చెప్పాడు. అర్జునుడు తన బాణాలను ఉపయోగిస్తూ, సైంధవుడి తలతో బంతి ఆట ఆడసాగాడు. "ఈ తలను ఏం చెయ్యమంటావు? అయినా ఎందుకూ ఇదంతా?" అంటూ కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు అసలు విషయం చెప్పాడు. “అయితే ఏం చేద్దాం మరి?" అన్నాడు అర్జునుడు. "సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్నాడు. అతని తొడపై ఈ తలకాయ పడేలా చెయ్యి. ఆ పని ఒక్క పాశుపతాస్త్రం వల్లనే సాధ్యం" అని చెప్పాడు శ్రీకృష్ణుడు. పాశుపతాన్ని తీసి మంత్రించి వదిలాడు అర్జునుడు. ఆ అస్త్రం సైంధవుని తలను ఎక్కడోఉన్న శమంత పంచకానికి తీసుకొనిపోయి, వృద్ధక్షతుని తొడపై పడేసింది. దాన్ని తన కుమారుని శిరస్సుగా గుర్తించలేకపోయాడు వృద్ధక్షతుడు. ఉలిక్కిపడి క్రిందకు నెట్టేశాడు. సైంధవుని తల ఆ విధంగా నేలపై పడింది. ఆ తలను నేలపై పడగొట్టినవాడు వృద్ధక్షత్రుడు కాబట్టి, అతని తల ముక్కముక్కలుగా ప్రేలిపోయింది. తాను ఇచ్చిన వరానికి తానే బలి అయ్యాడు వృద్ధక్షత్రుడు. ఈ సందర్భంలో పాశుపతాస్త్రం ఒక “క్షిపణి" గా పనిచేయడం మనం గమనించవచ్చు.


పాశుపతాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం ఈ రెండూ కూడా జగత్ సంహారం చెయ్యగలవు. మారణాయుధాలుగా వీటిని ఉపయోగిస్తే అనేక లక్షల శూలాలూ, గదలూ, సర్పాల్లాంటి బాణాలూ వాటినుండి పుడతాయి. వీటిని మనుషులపై ప్రయోగిస్తే ఎన్నో ఆపదలు వస్తాయి. ఎంత ప్రమాదం వచ్చినా, ఇతరితర ఉపాయాలవల్లనే తప్పించుకోవాలి గాని, ఈ అస్త్రాల్ని ప్రయోగించకూడదు. మారణాయుధములుగా వీటిని ప్రయోగించడాన్ని నిషేధించారు నాటి విజ్ఞులు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

ప్రపంచ కవితా దినోత్సవం

 🌸 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా


తేటగీతి పద్యము


వెలిగెనన్నయ్యపద్యముల్ వేంగిలోన 

తాటి యాకుల పై వ్రాసె నాటికవులు 

గద్యమున చిన్నయ రచన ఘనతగాంచె

నీతి చంద్రిక నిత్యమై నిలిచిపోయె

నేటి కవుల కవిత లుండె మేటిగాను

తెలుగురచనలువ్యాపించె దేశమంత


సాహితీ శ్రీ,,

 జయలక్ష్మి

21-03-2026 శనివారం రాశి ఫలితాలు21-03-2026 శనివారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

21-03-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం.

నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

---------------------------------------


కర్కాటకం


వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------


సింహం


నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


కన్య


ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి , ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


తుల


కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


మకరం


వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------


కుంభం


ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం


వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

---------------------------------------

శ్రీరామ స్తుతి🙏

  🌸శ్రీరామ స్తుతి🙏


సీ. జానకీ వల్లభా ! జగదభి రామయ్య !

               సజ్జన సేవితా ! సాధు పోష !

     సేతుబంధన రామ ! సేవిత కపిబృంద !

              పతితపావననామ ! పరమపురుష !

     నీలమేఘశ్యామ ! నిరుపమ గుణధామ !

               నిను నమ్మి యుంటిని నిచ్చ లందు  

     నీ శరధాటికి నిక్కమ్ము జలనిధి 

               భయమంది లంకకు బాట చూపె

తే.జప తపమ్ముల నొనరించ శక్తి లేదు 

    వేరు దైవంబె నెఱుగ నే విమల చరిత !

    నీవే దిక్కని నమ్మితి నీరజాక్ష !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !



       జయలక్ష్మి పిరాట్ల

స్వధర్మాన్ని

  శ్రీరామ (118)

శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ధర్మమే మనల్ని కాపాడుతుంది కాబట్టి, ఎవరి స్వధర్మాన్ని వారు ఆచరించాలి.

 అదే ధర్మాన్ని కాపాడటం అంటే.

ఆ ధర్మాచరణలోని భాగమే బంధుమిత్రులందరిని ఎల్లప్పుడు ఆదరించడము, మరియు కష్టాల్లో ఉన్న బంధుమిత్రులకు సహాయం చేయడము.

శ్రీరాముడు అలా చేసేవాడని వాల్మీకి మహర్షి చెబుతున్నారు.


శ్లో// రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా //


(రాముడు ఎల్లప్పుడు తనవంశాచారాలను కాపాడుకునే వాడు (రక్షితా స్వస్య ధర్మస్య).

 తన బంధు, మిత్రులందరినీ కాపాడుకునే వాడు (స్వజనస్య చ రక్షితా).

(అత్యాసన్నం పరిత్యజ్య మునేర్దత్తం తు 

నిష్ఫలమ్ = దగ్గర బంధువును,లేదా ఆశ్రితుని, కాదని మునీశ్వరునికి దానం చేసినను అది నిష్ఫలమే, అను ధర్మశాస్త్రము ననుసరించి శ్రీరాముడు ఆశ్రిత బాంధవులను విశేషించి రక్షించువాడు అని అర్థం)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

21-3-'26.

రామాయణ పారాయ‌ణం*

 ‌శ్రీ‌శ్రీ‌శ్రీ

*ఇంటింటా సంక్షిప్త* *రామాయణ పారాయ‌ణం*


****

*3 వ రోజు*


*అర‌ణ్య కాండ*


శ్రీ‌రాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం

సీతాప‌తిం, ర‌ఘుకులాన్వ‌య‌ర‌త్న‌దీపం

ఆజానుభాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం

రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి

                     ****


*శ్రీరామ రామ రామేతి* *రమేరామే మనోరమే*

*సహస్రనామ తత్తుల్యం* *రామనామ వరాననే*

                       ****

*దండ‌కార‌ణ్య ప్ర‌వేశం.....*


     అత్రి మ‌హ‌ర్షి ఆశ్ర‌మం నుంచి బ‌య‌లుదేరిన సీతారామ ల‌క్ష్మ‌ణులు దండ‌కార‌ణ్యంలోకి ప్ర‌వేశించారు. అక్క‌డ మ‌హ‌ర్షుల ఆశ్ర‌మాలు సంద‌ర్శిస్తూ ముందుకు క‌దులుతున్నారు.

 శ్రీ‌రామ‌చంద్రా , "ఈ దుర్గ‌మార‌ణ్యంలోనూ రాక్ష‌సుల బారి నుంచి మ‌మ్మ‌ల్ని ర‌క్షించాల్సింది నువ్వే" అంటూ మునులు శ్రీ రామ‌చంద్రుడిని కోరారు.వారి వద్ద‌ సెల‌వుతీసుకుని భీక‌రార‌ణ్యం మ‌ధ్య సీతారామ ల‌క్ష్మ‌ణులు సాగుతున్నారు. 

*విరాధ వధ*

సీతారామ లక్ష్మణులు అరణ్యం లో ముందుకు సాగుతుండగా...

 విరాధుడ‌నే రాక్ష‌సుడు ఒక్క ఉదుటున వారిమీద దాడి చేసి సీత‌మ్మ‌ను  పిడికిట బంధించాడు.వాడిపై ఎన్ని అస్త్రాలు ప్ర‌యోగించినా  వాడు చావ‌లేదు. ఆ ద‌శ‌లో వాడిని కాలికింద‌వేసి తొక్కి, గొయ్యి తీయించి అందులో పూడ్చిపెట్టడానికి రామ‌ల‌క్ష్మ‌ణులు  సిద్ధ‌మ‌య్యారు. 

అప్పుడు విరాధుడు,...."వ‌చ్చిన వాడు రామ‌చంద్ర‌మూర్తి అని, ఆయ‌న చేతిలోనే త‌న‌కు శాప‌విమోచ‌న‌మ‌ని" తెలుసుకున్నాడు .

 శాప‌విమోచ‌నం పొందిన విరాధుడు రామచంద్ర‌మూర్తికి న‌మ‌స్క‌రించి గంధ‌ర్వ‌లోకానికి వెళ్లాడు. సీత ఊ పిరి పీల్చుకున్న‌ది. అక్క‌డి నుంచి వారు శ‌ర‌భంగ మ‌హ‌ర్షి ఆశ్ర‌మానికి , అటు నుంచి సుతీక్ష‌ణుడి ఆశ్ర‌మానికి వెళ్లారు. వారి ద‌ర్శ‌నం చేసుకుని అటునుంచి అగ‌స్త్యుల‌వారి ఆశ్ర‌మానికి వెళ్లారు. అగ‌స్త్యుల‌వారి సూచ‌న మేర‌కు వారు గోదావ‌రి తీరంలోని పంచ‌వ‌టి వైపు అడుగులు వేస్తున్నారు. 

*జ‌టాయువు....*

ఇంత‌లో మ‌హాకాయుడైన జ‌టాయువు సీతారామ ల‌క్ష్మ‌ణుల‌కు తార‌స‌ప‌డ్డాడు. రాముడిని చూసి "నాయ‌నా, నేను మీ తండ్రి ద‌శ‌ర‌ధుడికి స్నేహితుడిని. మా అన్న సంపాతి. మీ నాన్న గారు పుత్రులు క‌ల‌గాల‌ని పుత్ర‌కామేష్ఠి యాగం చేసేట‌పుడు నేను వారిని చూశాను. ఇప్పుడు పుత్ర‌శోకంతో వారు మ‌ర‌ణించార‌ని తెలుసుకున్నాను", అంటూ ద‌శ‌ర‌థ మ‌హారాజు చేసిన అద్భుత పుత్ర‌కామేష్ఠి యాగం, ఆ యాగ‌ఫ‌లితంగా ద‌శ‌ర‌థ త‌న‌యుల జ‌న‌నం గురించి ఆ నాటి ఆయాగ విశేషాల గురించీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు సీతారామ ల‌క్ష్మ‌ణుల‌కు తెలియ‌జేశాడు. మిత్రుడైన ద‌శ‌ర‌థ మ‌హారాజు కుమారులు క‌నుక ఈ అర‌ణ్యంలోవారికి తాను ర‌క్ష‌ణ‌గా ఉంటానని అన్నాడు జ‌టాయువు.


*ప‌ర్ణ‌శాల‌...*


  గోదావ‌రి న‌దీతీరంలో పంచ‌వ‌టి అనే సుంద‌ర ప్ర‌దేశంలో అన్న‌గారి ఆదేశం మేర‌కు ల‌క్ష్మ‌ణుడు అంద‌మైన ప‌ర్ణ‌శాల‌ను నిర్మించాడు. కాలం గ‌డుస్తోంది. ఒక‌రోజు సీతారామ ల‌క్ష్మణులు మాట్లాడుకుంటుండ‌గా  రావ‌ణాసురుని సోద‌రి శూర్ప‌ణ‌ఖ అనే రాక్ష‌సి అక్క‌డ ఊడిప‌డింది. రాముడి అందానికి ముగ్థురాలైంది. "నిన్ను భ‌ర్త‌గా పొందాల‌ను కుంటున్నాను" అన్న‌ది. రాముడు కాద‌నేస‌రికి ల‌క్ష్మ‌ణుడి వెంట ప‌డింది. చివ‌ర‌కు శూర్ఫ‌ణ‌ఖ ముక్కూ చెవుల‌ను కోసి లక్ష్మ‌ణుడు దాని‌ని అక్క‌డి నుంచి పంపించివేశాడు. శూర్ప‌ణ‌ఖకు జ‌రిగిన‌ ప‌రాభ‌వంతో త‌మ‌పైకి వ‌చ్చిన శూర్ఫ‌ణ‌ఖ సోద‌రులు ఖ‌ర‌,దూష‌ణాదుల‌ను, అక్క‌డి రాక్ష‌స‌మూక‌ను రాముడు మ‌ట్టుపెట్టాడు. రావ‌ణాసురుడి కి విష‌యం తెలిసింది.అతిలోక సుంద‌రి సీత‌ను అపహరించి తెచ్చుకోమ‌ని శూర్ప‌ణ‌ఖ రావ‌ణుడికి నూరిపోసింది. 


*మారీచుడు.....*

 శూర్ప‌ణ‌ఖ మాట‌లు విన్న రావ‌ణాసురుడు సీతను అపహరించడానికి ప్ర‌ణాళిక ర‌చించాడు. అందుకు సాయం కోరి మారీచుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. . అయితే రాముడి దెబ్బ ఏమిటో విశ్వామిత్ర మ‌హ‌ర్షియాగ స‌మ‌యంలోనే రుచి చూసి ఉన్న మారీచుడు, రాముడితో యుద్ధం కొని తెచ్చుకుని, వంశ నాశ‌నానికి పాల్ప‌డ‌కు అని రావణుణ్ణి హెచ్చ‌రించాడు. సీతాప‌హ‌ర‌ణ అనే పాడు ఆలోచ‌న‌ను విర‌మించుకోమ‌న్నాడు. "రాముడు మాన‌వ మాత్రుడు,అతడెంత "అని రావణాసురుడు అన్నాడు. రావ‌ణా, "నువ్వు రాముడిని త‌క్కువ‌గా అంచనా వేస్తున్నావు. నీ వంశం స‌ర్వ‌నాశ‌నం కావ‌డానికే నీకు ఇలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తున్న‌ట్టున్నాయి. ఇక నిన్ను ఎవ‌రూ ర‌క్షించ‌లేరు "అని మారీచుడు అన్నాడు. 


 *రామో విగ్రహవాన్ ధర్మః* 

*సాధుః సత్యపరాక్రమః* 

 *రాజా సర్వస్యలోకస్య*

 *దేవానాం మఘవానివ ॥*


శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకంలో నే క‌ళ్ల‌కు క‌ట్టాడు మారీచుడు.

*మారీచుడి హిత వచనాలు*

 “శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రామ‌చంద్ర‌మూర్తి.

 సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమానికి తిరుగులేదు. దేవేంద్రుడు దేవతల‌కు ప్రభువైనట్టే, ఈ సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ శ్రీ‌రాముడు”

రాముడు మూర్తీభ‌వించిన ధ‌ర్మం. అతనితోపెట్టుకోకు అని హిత వ‌చ‌నాలు ప‌లికాడు మారీచుడు.

అయినా రావ‌ణుడు వినిపించుకోలేదు. నీ ద‌గ్గ‌ర హిత‌వ‌చ‌నాలు చెప్పించుకోవ‌డానికి రాలేద‌న్నాడు .

 అప్పుడు మారీచుడు ,లంకేశ్వ‌రా....


*సుల‌భాః పురుషా రాజ‌న్* *స‌త‌తం ప్రియ‌వాదినః*

*అప్రియ‌స్య చ ప‌థ్య‌స్య వ‌క్తా* *శ్రోతాచః దుర్ల‌భాః*


 ఈలోకం చాలా చిత్ర‌మైన‌ది, 

చుట్టూ చేరి , మ‌న మ‌న‌సుకు న‌చ్చే విధంగా తియ్య‌తియ్య‌గా ఉండే మాట‌లు మాట్లాడేవాళ్లు చాలామందే దొరుకుతారు. అవి మ‌న‌కు ఇష్టం గా ఉంటాయి. కానీ మ‌న‌సుకు క‌ష్ట‌మైనా మంచి చెప్పేవాడు ఒక్క‌డూ దొర‌క‌డు. దొరికినా మ‌నం వాటిని ప‌ట్టించుకోం. అవి మ‌న‌కు ఏనాడూ రుచించ‌వు. ఇక నేను చేసేది ఏమీ లేదు అన్నాడు.

 రావ‌ణుడి మాట విన‌కుంటే అత‌ని చేతిలో చావు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన మారీచుడు, రావ‌ణుడి చేతిలో చావ‌డం క‌న్న ,ఆ చావు ఏదో రామ‌చంద్ర మూర్తి చేతిలో చ‌నిపోయినా పుణ్యం వ‌స్తుంద‌నుకున్నాడు .


*మారీచుడు-మాయలేడీ*

రావణాసురుడు చెప్పినట్టుగా,

మారీచుడు మాయా బంగారు లేడి రూపంలో ప‌ర్ణ‌శాల వ‌ద్ద తిరిగి 'మాయం కావ‌డానికి అంగీక‌రించాడు. అలా  ‌ ప‌ర్ణ‌శాల వ‌ద్ద తిరుగుతున్న మాయా లేడిని సీత‌మ్మ‌వారు చూశారు. ఇంత అంద‌మైన లేడి చెంగు చెంగున గెంతులు వేస్తూ మ‌న ప‌ర్ణ శాల‌లో ఉంటే ఎంతో బాగుంటుంది క‌దా అని రామ‌ల‌క్ష్మ‌ణుల‌తో సీత‌మ్మ‌వారు అన్నారు. ల‌క్ష్మ‌ణుడు వెంటనే,"ఇది మారీచుడి మాయ‌. ఇలాంటి విద్య‌లు వాడికి బాగా తెలుసు మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి" అన్నాడు. అయినా సీత‌మ్మ‌వారు బంగారు లేడి గురించి చెబుతూనే ఉన్నారు. ఇంత‌గా ఆ లేడిపై సీత‌మ్మ‌వారు మ‌న‌సుపడ్డారు క‌నుక దానిని తీసుకురావాల‌ని రామ‌చంద్ర‌మూర్తి నిర్ణ‌యించుకున్నాడు. "రాక్ష‌సుడైతే వ‌ధిస్తాను, లేడి అయితే తెస్తానని అంటూ రాముడు బ‌య‌లుదేరాడు, అది చిక్కిన‌ట్టే చిక్కి పొద‌ల‌మాటున జారుకుంటున్న‌ది .అలా రాముడిని అడవిలో చాలా దూరం తీసుకువెళ్లింది. ఇక త‌ప్ప‌ద‌నుకుని రాముడు బాణం సంధించాడు. పెద్ద పెట్టున "హా ల‌క్ష్మ‌ణా.... హా సీతా "అని అరుస్తూ మాయా మారీచుడు నేల‌కూలాడు. మారీచుడు ఇలా త‌న గొంతుక‌తో హా ల‌క్ష్మ‌ణా...హా సీతా అని కూల‌బ‌డ‌డం వెనుక ఏదో జ‌ర‌గ‌రానిది జ‌ర‌గ‌బోతున్న‌ద‌ని రాముడు వెంట‌నే ప‌ర్ణ‌శాల‌కు వ‌స్తున్నాడు. ఇంత‌లో హా ల‌క్ష్మ‌ణా ...హా సీతా అన్న ఆర్త‌నాదం విన్న సీతమ్మ‌త‌ల్లి క‌ల‌వ‌ర ప‌డింది. భ‌ర్త‌కు ఏదో అపాయం జ‌రిగింద‌ని భావించి, ల‌క్ష్మ‌ణుణ్ణి ఉన్న‌ ఫళంగా బ‌య‌లుదేరి వెళ్ల‌మ‌నింది. ల‌క్ష్మ‌ణుడు ఇదంతా మాయా లేడి నాట‌కంలో భాగ‌మ‌ని, ఇది రాక్ష‌స మాయ అని, శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి ఈ భూ మండ‌లం లో తిరుగేలేద‌ని చెప్పాడు. అన్న ఆర్త‌నాదం వినిపించినా క‌ద‌ల‌కుండా కూర్చున్న "నీకంటె శ‌త్రువు మ‌రొక‌డు లేడని" సీత‌మ్మ వారు నిందించారు. ఈ సీత, రామ‌చంద్ర‌మూర్తి సొంతం. ప్రాణాలైనా విడుస్తాను కాని మ‌రొక‌రికి ద‌క్క‌ను అన్న మాట‌ల‌కు ల‌క్ష్మ‌ణుడు నిశ్చేష్ఠుడ‌య్యాడు. సీతామాత పాదాల‌కు న‌మ‌స్క‌రించి స‌మ‌స్త దేవ‌త‌ల‌కు న‌మ‌స్క‌రించి, వ‌న‌దేవ‌త‌లారా మీరే సీతామాత‌కు ర‌క్ష అన్నాడు. త‌గిన‌జాగ్ర‌త్త‌లు చెప్పి ప‌ర్ణ‌శాల వెలుప‌ల‌కు రావ‌ద్ద‌ని సూచించి ల‌క్ష్మ‌ణ రేఖ‌ను గీచి, అన్న‌య్య కోసం బ‌య‌లుదేరాడు. 

ఇదే అద‌నుగా రావ‌ణాసురుడు ప‌ర్ణ‌శాల ప్రాంగ‌ణంలో అడుగుపెట్టాడు. సాధువు రూపంలో వెళ్లి , సీత‌మ్మ‌ను ల‌క్ష్మ‌ణ రేఖ‌ దాటి వెలుప‌ల‌కు ర‌ప్పించి ఉన్న‌ఫ‌ళంగా అప‌హ‌రించి గ‌గ‌న‌మార్గాన బ‌య‌లుదేరాడు.

ఈ హ‌ఠాత్ప‌రిణామానికి మూర్ఛ‌పోయిన సీతామ‌హాసాధ్వి ఆ త‌ర్వాత తేరుకుని రావ‌ణా "నీ ప్రాణాలమీద ఆశ‌వ‌దులుకోనే ఈ ప‌నిచేశావా. రాముడు నిన్ను నీ వంశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తాడు. కోరి ప్రాణాల‌మీదికి తెచ్చుకుంటున్నావు" అని హెచ్చ‌రించింది. రావ‌ణుడు ఆ మాట‌ల‌ను తేలిక‌గా కొట్టిపారేశాడు . "ల‌క్ష్మ‌ణా నిన్ను ఎన్ని మాట‌లు అన్నాన‌య్యా అందుకే అనుభ‌విస్తున్నాను. రామా , ల‌క్ష్మ‌ణా ...ర‌క్షించండి" అని సీత వేడుకుంటూ ఉంది. వ‌న‌దేవ‌త‌లారా నా దీన స్థితిని రామ ల‌క్ష్మ‌ణుల‌కు తెలియ‌జేయండి అంటూ పెద్ద‌గా అరుస్తూ ఏడుస్తూ ఉంది. 


*జ‌టాయువు.....*


సీతాదేవి ఆర్త‌నాదాలు జ‌టాయువు చెవిలో ప‌డ్డాయి. జ‌ర‌గ‌రానిది జ‌రిగింద‌ని గ్ర‌హించిన జ‌టాయువు వాయువేగంతో గ‌గ‌న‌తలానికి వెళ్లి గ‌మ‌నించాడు. రావ‌ణాసురుడు సీత‌మ్మ‌వారిని అప‌హ‌రించుకు పోతున్నాడ‌ని గ్ర‌హించి రావ‌ణాసురుడితో భీక‌రంగా త‌ల‌ప‌డ్డాడు. రావ‌ణాసురుడు జ‌టాయువు రెక్క‌లు తెగ‌న‌రికి ముందుకు సాగాడు. జ‌టాయువు కుప్ప‌కూలాడు. 

రావ‌ణాసురుడు సీత‌మ్మ‌ను తీసుకుని గ‌గ‌న మార్గంలో సాగుతున్నాడు. కిందికి చూస్తే ఐదుగురు వాన‌రులు ఒక కొండ‌పై మాట్లాడుకుంటూ క‌నిపించారు. వారిని చూడ‌గానే సీత‌మ్మ‌వారు త‌న ఆభ‌ర‌ణాల‌ను మూట‌గ‌ట్టి వారి వ‌ద్ద వదిలింది. మ‌ళ్లీ ఎవ‌రో మ‌హిళ‌ను రావ‌ణాసురుడు అప‌హ‌రించుకుపొతున్నాడ‌ని వాన‌రులు గుర్తించారు. అలా పంపా మార్గాన సాగి సముద్రం దాటి త‌నతో తెచ్చుకున్న త‌న‌మృత్యుదేవ‌త‌ను అంతఃపురంలో దింపి ఆమె చుట్టూ కాప‌లాఉంచాడు రావ‌ణాసురుడు. ఆమె మ‌న‌సు మార్చ‌మ‌ని సేవ‌కులను పుర‌మాయించాడు. ఇవేవీ ప‌నిచేయ‌లేదు.సీత‌మ్మ‌వారిఇక‌ 12 మాసాలు గ‌డువు ఇచ్చాడు. త‌న‌నుస్వీక‌రించ‌డ‌మా లేక త‌న‌కు ఆహారంగా మార‌డ‌మా తేల్చుకోమ‌న్నాడు. 


*రామ విర‌హం....*

రాముడు మారీచుడిని సంహ‌రించి, ప‌ర్ణ‌శాల వైపు వ‌స్తున్నాడు. అప‌శ‌కునాలు కనిపించాయి. మారీచుడి అరుపు విని ల‌క్ష్మ‌ణుడు సీత‌ను విడిచి రావ‌డం లేదు క‌దా . రాక్ష‌సుల‌నుంచి సీత‌కు ఏ ఆప‌దా క‌ల‌గ‌కుండు గాక అని మ‌న‌సులో అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఎదురుగా ల‌క్ష్మ‌ణుడు క‌నిపించాడు. రాముడి గుండె గుభిల్లుమ‌నింది. ల‌క్ష్మణా ఈ అర‌ణ్యంలో సీత‌ను ఒంట‌రిగా విడిచి వ‌చ్చావా అన్నాడు. జ‌రిగిన విష‌యం అన్న‌కు చెప్పి ఇద్ద‌రూ వేగంగా ప‌ర్ణ‌శాల‌కు వ‌చ్చారు.ప‌ర్ణ‌శాల‌లో సీతమ్మ క‌నిపించ‌లేదు. చుట్టూ గాలించారు. అయినా క‌నిపించ‌లేదు. ల‌క్ష్మ‌ణా , సీత లేకుండా నేను బ‌త‌క‌లేను అన్నాడు రాముడు. అన్న‌య్యా నీవే ఇలా అయిపోతే ఎలా అంటూ ధైర్య‌వ‌చ‌నాలు చెప్పాడు. జంతువులు తినేశాయో, రాక్ష‌సులు అప‌హ‌రించారు ఏమీ తెలియని అయొమ‌య స్థితి. ఇద్ద‌రూ ధైర్యం తెచ్చుకుని సీత జాడ తెలుసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. ఇంత‌లో రెక్క‌లు తెగి కొన ఊపిరితో ఉన్న జ‌టాయువు వారికి క‌నిపించాడు. జ‌టాయువు జ‌రిగిన విష‌యం చెప్పాడు. రావ‌ణుడు సీత‌ను అప‌హ‌రించాడ‌ని చెప్పి క‌న్నుమూశాడు . జ‌టాయువుకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించి స్నేహ‌ధ‌ర్మం నిర్వ‌ర్తించాడు రాముడు. అక్క‌డ నుంచి మ‌తంగ ఆశ్ర‌మం దాటి ముందుకుసాగుతున్న వారిపైకి క‌బంధుడ‌నే రాక్ష‌సుడు రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను పిడికిట బంధించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. వాడి రెండు చేతుల‌నూ తెగ‌న‌రికేశారు. వాడొక గంధ‌ర్వుడు. శాప‌వ‌శంతో రాక్ష‌సుడ‌య్యాడు. కబంధుడికి శాప‌విమోచ‌నం క‌లిగింది. అప్పుడు ఆ గంధ‌ర్వుడు మీ క‌ష్టాలు త్వ‌ర‌లోనే తొల‌గి పోతాయి. మీకు ఒక మంచి స్నేహితుడు అవ‌స‌రం . ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లో రుష్య‌మూక ప‌ర్వ‌తంపై సుగ్రీవుడ‌నే వాన‌ర రాజు ఉన్నాడు . అతనితో మైత్రి మీకు శుభాన్ని చేకూరుస్తుంది అని చెప్పి మాయ‌మ‌య్యాడు. 

*శ‌బ‌రి.....*

క‌బంధుడు చెప్పిన దిక్కుగా రామ‌ల‌క్ష్మ‌ణులు న‌డుస్తున్నారు. మార్గ‌మ‌ధ్యంలో ఒక ఆశ్ర‌మం క‌నిపించింది. అది శ‌బ‌రి ఆశ్ర‌మం. రామ‌చంద్ర‌మూర్తి కోస‌మే వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్న‌ది. రామ‌చంద్రుడికి అతిథి స‌త్కారాలు చేసింది. నాయ‌నా రామ‌చంద్రా నీ ద‌ర్శనంతో నా త‌ప‌స్సు ఫ‌లించింది అనింది. అక్క‌డ కొంత సేపు విశ్ర‌మించి స‌ప్త సాగ‌ర తీర్థంలో స్నానం చేసి పితృదేవ‌త‌ల‌కు త‌ర్ప‌ణాలు విడిచారు.

మ‌న‌సు కుదుట‌ప‌డిన‌ట్టు అనిపించింది. చెడ్డ రోజులు దాటి అంతా శుభం జ‌ర‌గ‌బోతున్న‌ద‌న్న సూచ‌నుల క‌నిపిస్తున్నాయ‌ని రాముడు ల‌క్ష్మ‌ణుడుతో అన్నాడు.అలా మాట్లాడుకుంటూ వారు రుష్య‌మూక ప‌ర్వ‌తం వైపు ప్ర‌యాణం సాగిస్తున్నారు. అల్లంత దూరంలో రుష్య‌మూక ప‌ర్వ‌తం క‌నిపిస్తోంది.........


                          *******


ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.

                            

        ****

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

       *****

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

 శ్రీరామ రామ 

రఘునందన రామ రామ!

 శ్రీరామ రామ 

భరతాగ్రజ రామ రామ! 

శ్రీరామ రామ 

రణకర్కశ రామ రామ!

 శ్రీరామ రామ శరణం

 భవ రామ రామ!

 శ్రీరామ చంద్ర చరణౌ

 మనసా స్మరామి!

 శ్రీరామ చంద్ర చరణౌ

 వచసా గృహ్ణామి! 

శ్రీరామ చంద్ర చరణౌ

 శిరసా నమామి! 

శ్రీరామ చంద్ర చరణౌ 

శరణం ప్రపద్యే!.

                      

   


  **** (అర‌ణ్య‌కాండ స‌మాప్తం)****

పంచాంగం

 


గ్యాస్ సిలిండర్ ఉందా?

 రాత్రి సెలవుల హడావుడి జాగరణ లో ఉండగా.. 


ఎన్నో ఏళ్ల తర్వాత, నిన్న రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఆమె నుండి ఫోన్ వచ్చింది... ఇప్పటికీ ఆ గొంతులో అదే మాధుర్యం.......


"ఎలా ఉన్నావు?"


నేను బదులిచ్చాను, "నేను బాగున్నాను!"


ఆమె అంది, "ఇంకా నిద్రపోలేదా?"


నేను సమాధానమిచ్చాను, "లేదు, ఇంకా నిద్రపోలేదు!"


ఆమె అంది, "ఈ సాయంత్రం పార్టీలో నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు!"


నేను సంతోషంగా అన్నాను, "ధన్యవాదాలు!"


ఆమె మాటలు కొనసాగిస్తూ, "ఈ రోజు కూడా నువ్వు అదరగొట్టేస్తున్నావు!"


నేను చిరునవ్వుతో అన్నాను, "ఓ అవునా!"


ఆమె అంది, "ఈ రోజు ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నీతో మాట్లాడదామని అనుకున్నాను!"


నేను అడిగాను, "ఏంటి విశేషాలు? దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు?"


ఆమె గొంతులో కాస్త సిగ్గు వినిపించింది, "నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా? నువ్వు కాదనవు కదా?"


నేను వెంటనే అన్నాను, "కాదనే ప్రసక్తే లేదు, అసలు విషయం ఏంటి?"


అప్పుడు ఆమె అంది, "నా మీద ఒట్టు పెట్టు!"


నా సమాధానం, "నేను నీ మీద ఒట్టు పెడుతున్నాను... అసలు విషయం చెప్పు!"


ఆమె అంది, "నాకు కాస్త సిగ్గుగా అనిపిస్తోంది!"


నేను అన్నాను, "సిగ్గుపడాల్సిన పనేమీ లేదు... నిర్భయంగా చెప్పు!"


ఆమె తడబడుతూ అడిగింది, "నీ దగ్గర ఏమైనా అదనపు గ్యాస్ సిలిండర్ ఉందా?"


నేను ఫోన్ కట్ చేసేశాను!

పరాభవ ఉగాది*

 *పరాభవ ఉగాది*

✍🏼 గోగులపాటి కృష్ణమోహన్


పచ్చని తోరణం పలుకగా — పండుగ చేరింది

షడ్రుచుల రుచిలోనే — జీవితం నేర్పింది


తీపి విజయానందం — చేదు గుణపాఠం

ఉప్పు బంధాల రుచి — కారం ధైర్యపాఠం


పులుపు పరిణామం — వగరు విరక్తి

ఆరు రుచుల మధ్యే — జీవన సత్యం


ఆదాయ వ్యయాల మధ్య — ఆత్మగణితం

రాజపూజ్య అవమానం — కాలచరితం


జీతం నేలమీద — ధరలు నింగిమీద

మధ్యతరగతి మౌనం — నిశ్శబ్ద గానం


పిల్లల నవ్వుల్లోనే — రేపటి వెలుగు

యుద్ధాల నీడల్లోనూ — శాంతి తలపు


పంచాంగ పుటలలో — జాతక సంకేతం

మనసే తీర్చేది — జీవన గమ్యం


ఆకురాలిపోయినా — చిగురు నవ్వుతుంది

పరాభవమన్న పేరు — విజయం చెబుతుంది


ఉగాది ప్రతి సారి — మార్పు సంకేతం

మనసులో స్థైర్యమే — జీవిత నేత్రం


**లోకా సమస్తా సుఖినోభవంతు**


*తెలుగు నూతన సంవత్సరాది..*

*పరాభవ నామ సంవత్సర ఉగాది...*

*శుభాకాంక్షలతో...*


మీ

*గోగులపాటి కృష్ణమోహన్*

కవి, రచయిత, జర్నలిస్ట్ 

ఫౌండర్ : నా టీవి, నా ఫౌండేషన్ 

సురారం కాలనీ, హైదరాబాద్ 

మొబైల్: 9700007653

20, మార్చి 2026, శుక్రవారం

వాల్మీకి రామాయణం - 4 )

 శ్రీరామ (11)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


             ( వాల్మీకి రామాయణం - 4 )


         " 20-3-'26, ఉదయం పోష్టు తరువాయి భాగం "

                                ----------


శ్రీరామచంద్రుని శుభ గుణములను నారదమహర్షి, వాల్మీకి మహర్షికి ఇంకా ఇలా తెలియజేస్తున్నారు.


13. శ్లో// ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః /

రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా //


14. శ్లో// రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా /

వేదవేదాంగ తత్త్వజ్ఞో ధనుర్వేదేచ నిష్ఠితః //


15. శ్లో// సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ /

సర్వలోక ప్రియః సాధు రదీనాత్మా విచక్షణః //



33.ఆ రాముడు సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో సమానుడు (ప్రజాపతి సమః).


34.మరియు, సకల లోకములను మించిన ఐశ్వర్యము కలవాడు (శ్రీమాన్).


35. రాముడు సకల లోకములను పోషించే వాడు (ధాతా).


36.ధర్మవిరోధులను నశింపజేసేవాడు (రిపునిషూదనః)..


37. జీవులందరినీ రక్షించే వాడు (రక్షితా జీవలోకస్య).


38.ధర్మాన్ని బాగుగా రక్షించే వాడు (ధర్మస్య పరిరక్షితా)


39.రాముడు ఎల్లప్పుడు తనవంశాచారాలను కాపాడుకునే వాడు (రక్షితా స్వస్య ధర్మస్య).


40. తన బంధు, మిత్రులందరినీ కాపాడుకునే వాడు (స్వజనస్య చ రక్షితా).

(అత్యాసన్నం పరిత్యజ్య మునేర్దత్తం తు 

నిష్ఫలమ్ = దగ్గర బంధువును,లేదా ఆశ్రితుని, కాదని మునీశ్వరునికి దానం చేసినను అది నిష్ఫలమే, అను ధర్మశాస్త్రము ననుసరించి ఆశ్రిత బాంధవులను విశేషించి రక్షించువాడు అని అర్థం)



41. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, అనే ఆరు అంగములతో కూడిన వేదము సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు.

ఋక్,యజుస్,సామ,అథర్వము లనే నాలుగు వేదములు తెలిసిన వాడు. 

 వేద, వేదాంగముల అర్థమే గాకుండా, వాటి తత్త్వము కూడా తెలిసిన జ్ఞాని 

(వేద వేదాంగ తత్త్వజ్ఞః).


42. ధనుర్వేదమునందు విశేషమైన ప్రతిభ కలవాడు (ధనుర్వేదే చ నిష్ఠితః)


43. .సమస్త శాస్త్రములు తెలిసినవాడు.

ఆ శాస్త్రములయొక్క అర్థము, ఆ శాస్త్రములయొక్క ప్రయోజనము, ఏ ఉద్దేశముతో శాస్త్రము అలా చెబుతున్నది? అనే విషయములతో కూడిన శాస్త్రము యొక్క తత్త్వము బాగా తెలిసినవాడు.

(సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః).


44. తెలిసిన విషయములన్నీ ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకునే వాడు ( స్మృతిమాన్).


45. ఆ తెలిసిన విషయములను దేశ, కాలములకు అనుగుణంగా ఆచరణలో పెట్టే ప్రతిభ (యుక్తి) కలవాడు.

(ప్రతిభానవాన్).


46. తన ప్రవర్తన వల్ల సమస్తజీవులకు ఇష్టమైన వాడు.

( సర్వలోక ప్రియః).


47. తనకు, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే సాధు పురుషుడు (సాధుః).


48. ఎన్ని కష్టములు వచ్చినా,దీనత్వము పొందని, ఆత్మవిశ్వాసము కలవాడు (అదీనాత్మా - Abundant Self confidence)


49. దేశ కాల పరిస్థితులను అవగాహన చేసుకుని,ఎప్పుడు 

 ఏమి చేయవలెను, ఏమి చేయగూడదు, అనే విచక్షణా జ్ఞానం కలవాడు.

( విచక్షణః).




(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

20-3-'26

ప్రభావం ప్రారంభమైంది

 

 ప్రభావం ప్రారంభమైంది

ఈరోజు ఉదయం రోజాటి లాగానే మా ఇంటికి సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ కొనుక్కోవటానికి వెళితే అక్కడ టిఫిన్ సెంటర్ తలుపులు ముసి వేసి ఉన్నాయి ప్రతి రోజు ఆ టిఫిన్ సెంటరు ముందర ఎన్నో స్కూటర్లు మోటార్ సైకిళ్ళు ఆగి ఉండే ప్రాంగణం పూర్తిగా బోసిపోయి ఉంది ఎందుకు ఇవాళ టిఫిన్ సెంటర్ బంద్ పెట్టారు నాకు తెలిసి ఆ టిఫిన్ సెంటరు ఏ నాడు ముసి వుండగా నేను చూడలేదు. అందు కాని అనుమానం వేసి నేను  అక్కడి వాళ్ళని విచారిస్తే గ్యాస్ దొరకటం లేదు అందుకే ఈరోజు టిఫిన్ సెంటర్ తెరవలేదు అని అందులో పని చేసే ఒక వర్కర్ చెప్పాడు. ఆహా ఇక కష్టాలు మొదలు అని మనసులో అనుకొని మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని ఇంకొక టిఫిన్ సెంటర్ కి వెళ్లి అక్కడి నుంచి టిఫిన్ కొనుక్కొని వెళ్లాను ఆ సెంటర్ కూడా ఎన్నాళ్లు నడుస్తుందో చెప్పలేం, పరిస్థితి రోజురోజుకీ జటిలమైతున్నట్టుగా తోస్తున్నది.

 ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్

సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ॥

ఆకాశం నుంచి ఉద్భవించిన జలం ఏ విధంగా అయితే సాగరాన్ని చేరుతుందో అదే రకంగా మనం ఏ భగవంతుడిని పూజించిన అన్ని నమస్కారాలు అ కేశవుడికి మాత్రమే చందుతాయని దీని అర్థం. ఇది మనం నిత్యం చదువుకునే శ్లోకం  దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడు ఒక్కడే మనం ఏ రూపంలో ప్రార్ధించిన అని ఒక అర్థము ఎలాగంటే  ఎక్కడ పడ్డ వర్షపు నీరు అయినా కుడా సముద్రంకు చేరుకోవలసిందే అని మనకు తెలుస్తుంది.  అంటే సర్వం ఒకటే అనే అర్ధం మనం తీసుకోవచ్చు.

 ఈరోజు ప్రపంచం మొత్తం ఒక గ్రామంగా పరిగణించవచ్చు ఒక గ్రామంలో ఏ రకంగా అయితే ఒకచోట ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్య పూర్తి గ్రామాన్ని చుట్టుముడుతుందో అదే విధంగా ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య ప్రభావం ప్రపంచం మొత్తం లో ఉన్న జనాల మీద పడుతుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం. మన దేశానికి ఏ మాత్రం సంబంధం లేకుండా మన దేశానికి ఎంతో దూరంగా ఉన్న ఇరాన్ ఇస్రైయిల్ అమెరిక  దేశాలలో ఈరోజు జరుగుతున్న యుద్ధం నిజానికి మనదేశానికి కాని దేశప్రజలకు కానే ఏరకంగా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని సంబంధం లేదు.  కాని మనం అలా అనుకోవటానికి వీలు లేదు.కాని ఆ యుద్ద పరిణామాలు మనం కుడా  అనుభవించాల్సిన పరిస్థితి వస్తున్నది, అంటే దీనికి మించిన ఉదాహరణ ఇంకోటి లేదు.  ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరో అధికారులు ఎవరో రాజకీయ దురంధరులు వారి వారి రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధాలు చేస్తే మానవ నష్టం ఎలాగో జరుగుతుంది అంతేకాక  దానికి తోడుగా ప్రపంచ జనం మొత్తం కష్టపడాల్సిన పరిస్థితి వస్తున్నది అన్నది సత్యం.

 ఇంకొక విషయం మనం రోజు వార్తల్లో చూస్తున్నాము అనేక విమానాలు మన దేశం నుండి యుద్ధం జరిగే దేశాల వైపుగా వెళ్లి అక్కడికి వెళ్ళిన మన దేశ ప్రజలన్నీ రక్షించేందుకు ఎంతో కష్టపడుతున్నాయి. మార్చి 2026 నాటికి, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన వేలాది మంది పౌరులను స్వదేశానికి రప్పించడానికి, భారతదేశం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరియు ఇండిగో ద్వారా 58 ప్రత్యేక విమానాలను నడుపుతూ అత్యవసర స్వదేశీ తరలింపును నిర్వహిస్తోంది . అవసరమైతే వైమానిక దళం మద్దతుతో, దుబాయ్, దోహా, మస్కట్ మరియు జెడ్డా నుండి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మరియు కొచ్చిలకు విమానాలు నడుస్తున్నాయి. సహాయక చర్యలకు సంబంధించిన కీలక వివరాలు (మార్చి 2026): కీలక ప్రాంతాలు: యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా మరియు ఒమన్‌లపై ప్రధాన సహాయక చర్యలు కేంద్రీకరిస్తున్నాయి. ప్రభుత్వ చర్య: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు భారత రాయబార కార్యాలయాలు 24x7 హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి మరియు సురక్షితమైన వాయు మార్గాలను నిర్ధారించడానికి గగనతల మూసివేతలను పర్యవేక్షిస్తున్నాయి. 2026 మార్చి ప్రారంభంలో భారతీయ విమానయాన సంస్థలు 15,000 మందికి పైగా చిక్కుకుపోయిన ప్రయాణికులను తిరిగి తీసుకువచ్చాయి. పరిస్థితి వేగంగా మారుతోంది; భద్రతా అంచనాల ఆధారంగా వైమానిక కార్యకలాపాలు దశలవారీగా జరుగుతున్నాయి. తక్షణ సమాచారం కోసం, చిక్కుకుపోయిన ప్రయాణికులు సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి లేదా ఎయిర్ ఇండియా మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) నుండి వచ్చే అప్‌డేట్‌లను అనుసరించాలని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మనకు యేరకంగాను సంబందంలేని ఈ యుద్ధం వలన మనం ఏరకంగా బాధ పడవలసి వస్తున్నది అన్నది తెలుస్తున్నది.  ప్రభుత్వం ఒక విమానం నడపాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుందని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు వేల కొద్ది విమానాలను నడపాలంటే యెంత కర్చు అవుతుందో మనం వేరే చెప్పనవసరం లేదు. కోటాను కోట్ల రూపాయల కర్చు మన దేశ ఆర్దిక వెవాస్త మీద్ పడుత్న్నది. మనదేశం ఆ వేలతిని పురించుకోవటానికి తప్పని సరి పరిస్తితుల్లో ప్రజలమీద్ పన్నుల భారం వేయవలసి వస్తుంది కదా. అంటే మనకు ఏమాత్రం సంబంధం లేని ఎక్కడో దూరంగా వున్నా దేశాలలోని పోరు మనమీద్ ఎలాంటి ప్రభావం చుపెడుతున్నదో కదా.

 ఇంకొక విషయం పెట్రోలు, ప్రత్రోలియం  ప్రొడక్ట్స్ సమయానికి తగువిధంగా దొరకకపోతే అటు వ్యాపారంగము ఇటు సామాజిక రంగం పూర్తిగా అతలాకుతలం అవుతుంది అన్నది అక్షరసత్యం. ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే దాని ప్రభావం  కేవలం వాహనాల మట్టికే పరిమితం కాదు. మన నిత్యజీవితంలో కొనుక్కునే అగ్గిపెట్ట దగ్గర నుంచి బియ్యం బస్తా దాకా ప్రతి దాని రేటు ఊహించని విధంగా పెరుగుతుంది అంటే సామాన్యులు వారి సంపాదనకు మించిన ఖర్చులు భరించాల్సి వచ్చే  పరిస్థితి ఏర్పడుతుంది.

 కాబట్టి దేశ విదేశ నాయకులు అందరూ ఈ విషయాన్ని గుర్తించి సాధ్యమైనంత మటుకు అక్కడ జరిగే యుద్ధాన్ని నివారించి సామరస్య ధోరణితో వాళ్ళ మధ్య సంధి ఏర్పరచి  ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని ప్రతివారిని ఇందుమూలంగా కోరుచున్నాను ఈ మెసేజ్ ని సాధ్యమైనన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేసి ప్రపంచ శాంతికి అందరం దోహదం చేసే విధంగా తోడ్పడాలని కోరుతున్నాను