21, అక్టోబర్ 2020, బుధవారం

" శ్రీ వెంకటేశ్వర స్తోత్రం".

 " శ్రీ వెంకటేశ్వర స్తోత్రం".  సాక్షాత్తు  చతుర్ముఖ బ్రహ్మ   మరియు  ఆయన మానసపుత్రుడు "నారదుల" వారి యొక్క  ముఖము నుండి  ఆవిర్భవించిన నటువంటి మహామహిమాన్వితమైన  "స్తోత్ర రాజము. "  ఇది.   బ్రహ్మాండపురాణం వెంకటగిరి  మహత్యము  లో చెప్పబడినది.   అని తెలుసుకున్నాము.        సహజంగా మన దేశంలో కుటుంబాలలో ఇంటి ఇలవేల్పు,  దేవతలు సైతం తమ "కుల దైవం,".  "ఇష్టదైవము" గా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు, ప్రార్థనలు, చేస్తారు.    మనము కూడా ఈ నాటికి  కలియుగ దైవం అయిన "శ్రీ వెంకటేశ్వర స్వామి" (శ్రీనివాసుని) పూజించుట పరిపాటి.   శ్రీనివాసుని దర్శించని హిందూ కుటుంబము భారతదేశములో బహుశా కల్లా! (అరుదు).  ఈ శ్రీ వేంకటేశ్వరుని స్తోత్రము  అయితే కంఠస్థము గా అందరికీ వచ్చే ఉండును.   కానీ అర్థము ఎవరికీ తెలియదు. (  పండితులకు తప్ప) . తెలుగులో పుస్తకాలు అర్థము తాత్పర్యము ఉన్నది లభించుట లేదు.    అలా కేశవనామాలు 24 ఉంటాయి కదా!    ప్రతి పూజలో, వ్రతం నోము లలో, సంధ్యావందన కాలమునందు, మరియు దేవాలయం  ల యందు కేశవ నామాలు, చదవటం మనకు తెలుసు, ప్రతి ఒక్కరూ చెపుతారు.  అర్థం అనే  విషయానికొస్తే "తెలియదు" స్పష్టంగా చెప్పగలరు.  దమ్ తెలిసి చదివినా! పలికిన! ఆ ఆనందము, ఆ భక్తి శ్రద్ధలతో, రొమాన్ చితులై, పులకించి పోతూ జరుపుకుంటారు.    మరి శ్రీ వేంకటేశ్వర స్తోత్రం లో కేశవనామాలు వస్తాయి,  ఒక్కొక్క నామానికి ఒక పుస్తకము వ్రాయుటకు టైము చాలదు.  తగు పరిజ్ఞానము కూడా కావలసి ఉండును.  కనీసము "Basic Knowledge"  ఉండుట చాలా అవసరము ఉన్నది.   ఎందుకంటే నేటి తరం పిల్లలు పరిశీలించే తత్వము, తెలుసుకునే జిజ్ఞాస, కుతూహలము, మెండు, ఈ కంప్యూటర్ యుగంలో మనకే జ్ఞానము లేకపోతే. పిల్లలకు ఏమి చెప్పగలం?  పెద్దలు ఏమి చేసినా? చూచి, తెలుసుకుని, అడిగి, అర్థము చేసుకొని ఆచరించుట పరిపాటి అయినది (పిల్లలను కొట్టి నేర్పే కాలము కాదు).     అందుకే "ఆధ్యాత్మిక దృష్టి "కోణం లో  తాత్పర్యము ను సేకరించి ఇచ్చుట తెలపడమైనది.  తప్పులు ఉన్న తెలుగు టైపు సరిగా రాని, సరి అయిన మొబైల్ విజ్ఞానము లేని నాది, ఓనమాలు సరిగా రాని నాది, గా భావించి క్షమించగలరు.   నీకు అర్థమైన పదాలు , అన్ని విషయాలు శ్రీ హరి కృపా, మరియు జగద్గురువులు శ్రీ 1008, సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి ఆదేశానుసారము వారి ప్రేరణ పొంది రాసి నట్లు భావించవలెను.  నేను నిమిత్తమాత్రుడు ను, దయచేసి ఈ "శీ వెంకటేశ్వర స్తోత్రం "  PART 1 , 2,3,4,ల కింద విభజించి రాయబడినది.  "మజుందార్, 87925-86125, బెంగళూర్"

" శ్రీ వెంకటేశ్వర సోత్రం". (బ్రహ్మాండ పురాణాంతర్గతము). సేకరణ & సమర్పణమ:- "మజుందార్ ",87925-86125, "బెంగుళూర్.". నేడు "ఆధ్యాత్మిక దృష్టి కోణంలో " తాత్పర్య సహితము గా మీ కొరకు ప్రత్యేకముగా! అధిక మాసంలో" . శ్లోకం:1) వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నె మిత విక్రమః ! సంఘర్షణో నిరుద్ధ శ్చ శేషాద్రి పతి రే వచ!! 1)"వెంకటేశా":- పాపమును కాల్చి వేయును. మాధవుడ ను యొక యోగ్య బ్రాహ్మణుడు ప్రారబ్ధ వశము చేత తల్లితండ్రులను, భార్యను, తుదకు కు బ్రాహ్మణ్యం విడిచి చండాలుడై ,. చండాల స్త్రీ లోలుడై, తాను చేసిన సకల పాపములను తిరుపతి కొండ స్పృశించు మాత్రముననే పోగొట్టుకొనెను. అనగా తన స్పర్శ మాత్రము చేత మాధవుని పాపములు కాళీ భస్మమై పోవుట చేత ఈ పర్వతమునకు "వెంకట అను పేరు కలిగినది అని చెప్పబడెను. ఇటువంటి పర్వతమునకు వాడు అనగా పతి అయిన కారణముచేత శ్రీనివాస దేవునకు "వెంకటేశుడు" పేరు. ‌ 2)"వాసుదేవా":- జ్ఞాన స్వరూపిణి సకల లోకములను సృష్టించు వాడు, ఆ లోకములందు క్రీడించు వాడు. లోక సృష్టికర్తయగు శ్రీనివాసులకు సృష్టి లేదని నచో, నతనికి శరీరము లేదని చెప్పినట్లు అయినది. శరీరము లేనివాడు ఇతరులను ఎలా సృష్టించగలడు? ఒకవేళ అతనికి సృష్టి ఉన్నచో, సృష్టికర్తయగు శ్రీనివాసునకు మేమందరము అతని ఆదీనులై నట్లు అతడు తనను సృష్టించిన వానికి పరాధీనుడై ఉండవలెను. మన దీనులైన మనలను నుండి సృష్టి ఏర్పడనట్లు, అతని నుండి యు సృష్టి ఏర్పడుట అసాధ్యమను శంకను(అనుమానము ను) పరిహ రించుట కు గాను యని చెప్పబడెను. పరమాత్మకు దేహము కలదు. అది పాకృతము కాదు. జ్ఞానానం దా ది గుణాత్మకమైన ది. పా కృత దేహమునకు జన్మ ము లేదు. కనుక శ్రీనివాసునకు సృష్టి, పరాధీనత లేకుండుట చేత, దేహము ఉండుట చేత అతని వలన మన సృష్టి ఏర్పడుట లో ఏ బాధ కము(వి ప్రతిపత్తి) లేదు. ప్రతి యొక్క వ్యక్తి యు ప్రయోజనము లేకుండా ఏ పని చేయడు. శ్రీనివాసుడు ప్రపంచమును సృష్టించి నాడు అనగా అతనికి ఓ ప్రయోజనం ఉండి తీరుతుంది. అట్ల కూర్చో అతడు మన వల్లనే ప్రయోజనము కొరకు పనులను చేయుటవలన, ఫలముల నిచ్చు వాని యాదీనుడ అని చెప్పవలసి వచ్చును. అటువంటి శ్రీనివాసుని చేత సృష్టి ఏర్పడు టెట్లు? యను అనుమానము పరిహ చుటకు గాను "దేవ" అని చెప్పబడినది. ఆనందోదెకము చేత నర్తనాది లీలలు చేయుచుండిన తాగుబోతు వలనే పరమాత్ముడు తనతో నుండు పూర్ణానంద ము చే అన్ని పనులను చేయును. కనుక అతడు చేయు సృష్టి వలన అతనికి ఎప్పుడు ఫలము లేదు. అది అంతయు అతని లీల. ఇట్లు paramaatmudu చేయు ప్రపంచ సృష్టి అతనికి పరాధీనత లేకుండుటచే లోకపు సృష్టి చేయుటకు ఏ బాధ లేదు. ఈ అభిప్రాయమును వాసు, దేవ, యను 3 అవాంతర పదములు తెలుపుచున్నవి. సౌక రాయణ స్మృతి లో. ,2) శ్లోకం:- వానాతోస................"వాసుదేవ అను పదమునకు నాలుగు అర్ధములు కలవు. 2 వ అర్థము:-వాసు అనగా అన్ని లోకములందు నుండువాడు. " దేవ" అనగా క్రీడించు వాడు. సకల జీవులందు ను, సకల జడము లందును, లోన శీను వాసుడు సన్నిహితుడై ఉండి అందరిచే అన్ని కార్యములను చేయించుకున్నాడు. కనుక మన ప్రయత్నము లేక ఇతరుల సహాయము చేసి సుఖము కలిగినను ఆ సుఖము అన్ని వేళల ఎందుండి అన్ని కార్యములను చేయించు శ్రీనివాసుని చేతనే వచ్చినదని తెలిసి అతని యందు భక్తిని చేయవలెను. దుఃఖము కలిగినచో నది మన పాప రాశిని పరిహరింప జేసి, మమ్ములను నుద్ద ధరించుటకు గాను కరుణాపయోనిధీ యగు శ్రీనివాసుడి ంచిన్నదని తెలిసి అతని యందు భక్తిని చేయవలెను. ఆ దుఃఖము ఇతరుల నుండి వచ్చినదని వానిని ద్వేషించకు కూడదు. ఇక్కడ కూడా "దేవ" అను పదము యొక్క ప్రయోజనము వెనుక చెప్పినట్లు తెలియవలెను. . 3 వ అర్థము:- "వాసు అనగా అన్ని వస్తువులకు కప్పు కోను (ఆచ్ఛాదన ము) వస్త్రము వంటివాడు. "దేవ" అనగా క్రీడించు వాడు. మన శరీరము పైనున్న కప్పు వస్త్రము మమ్ములను చలిగాలుల నుండి కాపాడు ఉన్నట్లుగా శ్రీనివాసుడు మనకు బయట నుండి మనలను కాపాడుతున్నాడు. ఇక్కడ కూడా వెనుకటి వలనే అన్ని అంశముల తెలియవలెను. 4వ అర్థము:- "వ" అనగా బల పూర్ణుడు అని అర్థము. "అను" అనగా సర్వ చేష్ట కుడని యర్థము. "దే" అనగా అన్నియును ఇచ్చువాడు అని అర్థము. "వ" అనగా అన్ని చోట్ల యందుండు వాడు అని అర్థము. అందరి చేత, అన్ని విధముల పనులను శ్రీనివాసుడు చేయించును. దానికి కావలసిన బలము అతనియందు పూర్ణముగా గలదు. అన్ని చోట్ల యందుకు ఉండుటచే, అందరి చేత అన్ని కార్యములను చేయించుట అతనికి మాత్రమే సాధ్యము. ఇతరులకు సాధ్యము కాదు. ఇతరులచే సమస్త కార్యములను నిరపేక్ష కుడై చేయించి వాటికి తగిన ఫలములను ఇచ్చువాడు డగుచున్నాడు అను అర్థము క్రమముగా అను,వ,వ,దేవ యను యీ నాల్గుపాదములచే "వాసుదేవా "అను పదము తెలుపుచున్నది. అటులనే వసుదేవుని కుమారుడై అవతరించి నందులకు వాసుదేవుడు డను నామాంతరం కలిగినది. 3) "ప్రద్యుమ్న":- మూల రూపి యగు నారాయణుడు సృష్టి యొక్క ప్రారంభము నందు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుమను అను నాలుగు రూపములను స్వీకరించెను. అప్పుడతని పత్ని లక్ష్మీదేవి యు, మాయ, కృతి, జయ ,శాంతి అను 4 రూపములను స్వీకరించెను. మాయావతి అయినా వాసుదేవుడు సర్వులకు ముక్తిని, కృతి పతి యగు ప్రద్యుమ్నుడు సృష్టిని జయ పతి యగు సంఘర్షణనుడు సంహారము ను, శాంతి పతి అగు అనిరుద్ధుడు పాలన మును చేయుచున్నాడు. శ్రీనివాసుడు వాసు దేవుడని చెప్పబడి ఉండుట చేత అతని యందు మోక్షదాయక త్వ శక్తి కలదని చెప్పినట్లు లగును. ఇప్పుడు శ్రీనివాసుడే కృతిపతి అయినా ప్రద్యుమ్నుడు అని చెప్పొచ్చు, సృష్టికర్త తత్వము అతని ఎందు కలదని యీ పదము తెలుపుచున్నది. "ప్ర" అనగా సర్వోత్తమమైన, "దుమ్మ' అనగా బంగారము వలెనుండు అనంత కళ్యాణ గుణముల చేత పూర్ణుడగుటచేత అతనికి "ప్రద్యుమ్ను" మను నామము కలదు. 4) అమిత" అతిశయించిన "విక్రమః' పరాక్రమము గలవాడు. ఇచ్చా మాత్రము చేత జీవ జడ ఆత్మ కమైన సకల ప్రపంచమును లోగోని న యనంత బ్రహ్మాండములను సృష్టించి పాలించి సంహరించు శ్రీ హరి పరాక్రమము నకు మేరగలదా? కనుక శ్రీనివాసుడు అమిత విక్రముడు దగుచున్నాడు. 5) "సంకర్షణః :-- చక్కగా నాశనము చేయువాడు. మనం ఎవ్వరే గాని యే వస్తువునైనా నాశనము చేసినచో అది కొన్ని ముక్కలుగా ఖండింప బడి కింద పడవచ్చును. పరమాణు వలె సూక్ష్మముగా నాశనము చేయు శక్తి మనకు లేదు. సంకర్షణ రూపమైన శ్రీ హరి యు బ్రహ్మాండమును ఇచ్చ మాత్రము చేత పొడి చేసి ప్రకృతి రూపమైన అతి సూక్ష్మ అణువుల స్థితికి తీసుకొని రాగలడు. కనుక ఉత్తమ సంహారము చేయు శక్తి అతనికి మాత్రం వుండుట వలన లోక సంహారక మూర్తి అయిన శ్రీ హరి మూర్తికి సంకర్షణుడు అను నామము కలదు. ఇటువంటి సంకర్షణుడు శ్రీనివాసుడే అగుటవలన లోక సంహార కర కత్వ శక్తి యు అతనికి కలదు. 6)"అనిరుద్ధః చే :- ఎవరి చేతను నిరోధింప బడని వాడు. 1) శ్రీ హరి కల్పించిన కార్యమును నిరోధించు శక్తి ప్రపంచము నందు ఎవరికీ వెనుక కాలమందు లేదు. ఇప్పుడు లేదు. ముందు కాలమందే పడుట లేదు. కనుక యుద్ధమునందు శ్రీనివాసుని తలకు దెబ్బ తగిలే ను. ఉన్న గు కథలు ద్వైత మోహనా ర్థ కముగా వ్రాయబడినవి గాని వాణి ఎందు తత్వ వంశము లేవు. ఇంద్రజిత్తు ని నాగపాశము చే బంధింపబడి నట్లు నటించిన శ్రీ రాముడు, ఖరాసుర సంహర కాలమున రావణుని మూల బలమును చెండాడు కాలమున అసంఖ్యాకములగు రూపములను స్వీకరించెను. దీనివలన తన్ను ఆవ రోధించు శక్తి యెవరికి లేదు . అవరోధం దించినట్లు నటించినచో అది నటన మాత్రమే అని స్పష్టం చేసి ఉన్నాడు. 2) సర్వ శ్రేష్ట కు దైన వాయు దేవుడు అతని భక్తుడు. అతని చేత "రుద్ధ" వశము చేసుకున్నవాడు. శ్రీ హరి , పైన చెప్పినట్లు ఎవరికీ గాని వసుడు కాడు. వాలి భక్తుడై నప్పటికీ , హనుమంత దేవుని అనుగ్రహమునకు పాత్రుడు కాక ఉండి నందున, శ్రీరామ దేవుడు అతనిని ని గ్రహించెను. సుగ్రీవుడు వాలి కంటే అల్ప భక్తుడు అయినప్పటికీ హనుమంతుని అనుగ్రహమునకు పాత్రుడు అగుటచే అతనిని శ్రీరాముడు అనుగ్రహించెను. ఇడ్లీ శ్రీనివాసునకు అనుగ్రహమునకు పాత్రుడైన శ్రీ వ్యాస తీర్థుల వారు , గురు సార్వభౌములు మొదలగు వారికి వసూలు డై యుండుట వలన అతనికి " అనిరుద్ధ" అను పేరు కలిగినది. లోక పాలకుడైన అనిరుద్ధుడు అను పేరు కలిగినది. లోక పాలకుడైన అనిరుద్ధుడు ఇతడే ఐ ఉండుటవలన లోక పాలక తత్వ శక్తి ఇతనికి కలదు. 7) "శేషాద్రి పతిః ఏవచ: శేష దేవుని వలన చుట్టబడిన ఆనంద పర్వతమునకు ఎజమానుడా అయినవాడు, ఈ శేషాద్రి పటుత్వము శ్రీనివాసు ని ఎల్లప్పుడూ కలదు. వైకుంఠము నందు నారాయణుడు యోగనిద్ర యందున్న ప్పుడు శేషా దేవుని ద్వారము దగ్గర ఉండు నట్టు చేసెను. అప్పుడు వాయుదేవుడు పరమాత్ముని చూడవచ్చును. అప్పుడు శేషా దేవుడు అతనిని నిరోధించి ఆత్మస్తుతి గావించెను. అప్పుడు శ్రీహరి అచటికి వచ్చి"శేషుడు" తన దేహము చేత ఈ ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి ఉండే వాసుదేవ్ పర్వతమును కదిలించిన చో అతడు శ్రేష్టుడు. అట్లు కానిచో శేషుడు శ్రేష్ఠుడు డగు ని తీర్మానం చేసినట్లు తెలిపెనట, దాని ప్రకారము శేషుడు తన దేహము చేత పర్వతమును గట్టిగా చుట్టి విషము గ్రక్కె ఉండగా వాయుదేవుడు తన కాలి స్పర్శ మాత్రము చేత నా పర్వతమును శేషు ని తో సహా 51000 యోజనాలు ఎగురుతూ పడునట్లు చేసెను. శేషా దేవునకు మదము తగ్గింది. వాయు దేవుని స్తుతించెను. ఇటు శేషా దేవుని గర్వ పరిహారము లకు కారణం నందున ను, ఎల్లప్పుడు శేషు దేవుని దేహము చేత చుట్టబడిన ఈ పర్వతమును నాటినుండి "శేషాద్రి" యాను పేరు వచ్చినది. ఇటువంటి శేషాద్రికి యజమానుడు శ్రీనివాసుడు. ఈ "శేషాద్రి" పుట్టుట కు ముందు, నాశనము తరువాత శేషాద్రి ఏ లేఖ యుండుటచేత శ్రీనివాసుడా సందర్భమున శేషాద్రి పతి కాడని చెప్పినట్లు కాదా? యను అనుమానము "ఏవ" యను పదము ఉత్తర మించు చున్నది. ఈ శేషాచలము పుట్టుటకు పూర్వము , నాశన పొందిన తరువాత కూడా అనంత బ్రహ్మాండములు వానిలో నితిన్ శేషాద్రి ఉండి యే యున్నవి. వాటికి శ్రీనివాసుడే అధిపతి అగుట వలన అతని యందు గల శేషాద్రి పతిత్వము సర్వకాలము నందు ఉన్నది యని చెప్పబడెను. (ఇంకా ఉంది)

కామెంట్‌లు లేవు: