21, అక్టోబర్ 2020, బుధవారం

సుభాషితం

 🙏🌹🌹*నేటి సుభాషితం* 🌹🌹🙏


*అతనికి వార్థి కుల్యయగు, నగ్ని జలంబగు, మేరుశైల మం*

*చిత శిల లీల నుండు, మద సింగము జింక తెఱంగు దాల్చు, గో*

*పిత ఫణి పూల దండయగు, భీష్మ రసంబు సుధా రసంబగున్*

*క్షితిజన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్!*


*శీల నిర్మాణం జరిగిన వ్యక్తి వికసన వల్ల ప్రకృతి గూడా ఆతని వికాసానికి సహకరిస్తుంది. సమాజం చేత ఒప్పుకోబడ్డ సుశీలం ఎవ్వరిలో నైతే కనిపిస్తుందో అతనికి సముద్రం చిన్న పిల్ల కాలువ లాగా మారుతుంది.. అగ్నితన తేజస్సును ఉపసంహరించుకొని నీటిలాగా మారుతుంది. మేరుపర్వతమైనా చిన్న గులక రాయిలాగా కనిపిస్తుంది. మదించి ఉద్రేకంతో వచ్చే సింహము కూడా జింకపిల్ల లాగా మారిపోతుంది. కోపంతో ఊగిపోయే కాలనాగు కూడా పూలహారం విధంగా ఒదిగిపోతుంది. కాలకూట విషం కూడా అమృతం లాగా మారిపోతుంది అంటాడు, ఏనుగు లక్ష్మణ కవి.*


🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏

కామెంట్‌లు లేవు: