6, సెప్టెంబర్ 2020, ఆదివారం

కాశీ, గయల్లో పిండప్రదానం

కాశీ, గయల్లో పిండప్రదానం చేసినవారు కూడా పితృపక్షంలో , లేదా మహాలయ అమావాస్య నాడు పితృ కార్యక్రమం చెయ్యాలా అని కొందరు అడుగుతున్నారు. "చెయ్యాలి" జీవితాంతం చెయ్యాలి. అక్కడ చెయ్యడం మరింత పుణ్యప్రదం,/విశేషమే కానీ, ప్రత్యామ్నాయం/ సంపూర్ణం కాదు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళక పోయినా జన్మనిచ్చిన తల్లితండ్రులకి కృతజ్ఞత తెలపడమే ఈ కార్యక్రమం. కృత - అంటే చేసిన పనులు, జ్ఞ - అంటే తెలుసుకుని , గుర్తుంచుకుని , త - తెలియచేయడం/ఆచరించడమే కృతజ్ఞత - ధన్యవాదాలు ! ఈ కరోనా కాలంలో మంత్రపూర్వకంగా కుదరకపోయినా వారిని తలుచుకుని కనీసం స్వయంపాకం ఇవ్వడం కనీస విధి .ధన్యవాదాలు

కామెంట్‌లు లేవు: