15, డిసెంబర్ 2025, సోమవారం

నీతి కధ

  ఒక నీతి కధ. ఓపిక తో చదవండి


‘‘ఏమండీ, రాత్రి మామయ్యగారు ఫోన్‌ చేశారు- మీరెప్పుడొస్తారని.


మీరేమో నా సెల్‌ నంబరు ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వచ్చు కదా’’


హాల్లో కూర్చుని పేపర్‌ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని.


ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్‌లో తల దూర్చిన భర్తతో ‘‘ఏంటండీ, ఏం మాట్లాడరు... ఏమాలోచించారు,


వాళ్ళ విషయం గురించి. ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్‌ చేస్తూనే ఉంటారు.


వూరికే నాన్చక ఏదో ఒకటి తేల్చండి’’ అంది.


ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయి ఉంది తను.


పేపర్‌లో నుంచి తల పైకెత్తి ‘‘ఇందులో తేల్చేదేముందోయ్‌, అమ్మా నాన్నా ‘ఇక ఆ పల్లెటూళ్ళొ ఒంటరిగా ఉండలేం, ఇక్కడకు వచ్చేస్తా’మంటున్నారు,


అంతేకదా! పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి.


వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటీ’’ అన్నాడు.


అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు ‘


‘ఏంటీ, తాతయ్య, నానమ్మ ఇక్కడకే వచ్చేస్తున్నారా, భలేభలే!


తాతయ్య కథలు చాలా బాగా చెపుతాడు.


నానమ్మయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది.


ఇంక రోజూ మేం తాతయ్యా నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ’’ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు.


పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. ‘‘చాల్లే నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం’’ అని భర్త వైపు తిరిగి,


‘‘ఏంటండీ రానిచ్చేది, ఇక్కడ మనమెలా ఉంటున్నాం, మీ అమ్మా నాన్నా ఎలా ఉంటారు?


ఆ పల్లెటూరి మాటలూ, చేతలూ ఎలా ఉంటాయో మీకు తెలుసుగా! మనింటికి పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తారు.


వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు. పోయినసారి మనింట్లో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజరుగారి భార్య ఏమందో తెలుసా... ‘


ఈవిడ మీ అత్తగారా! నేను మీ వంటమనిషనుకున్నాను’ అంది.


నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళొనే ఉండమనండి.


కావాల్సినంతమంది పనివాళ్ళని పెడదాం. లేదూ ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్‌హోమ్‌లోనైనా చేర్పించండి.


డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకానీ, ఇక్కడకు మాత్రం తీసుకొస్తానని అనకండి’’ అంది.


ఆమె మాటలు పూర్తి అయ్యీ కాకముందే ‘‘ఇక ఆపుతావా నీ గోల.


ఏంటీ, మాట్లాడితే మా అమ్మానాన్నలను పల్లెటూరివాళ్ళంటావు. అలాగైతే నేనూ పల్లెటూరివాణ్ణేగా,


నువ్వు మాత్రం పల్లెటూరిదానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వూ మీ అన్నా అక్కడ చదువు వెలగబెట్టారు.


మీ అమ్మానాన్నా పల్లెటూరివాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళుమాత్రం ఎలా ఉన్నారు?


మీ అన్నయ్యకు ఉద్యోగమొచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్ళటంతో కొంచెం సిటీలైఫ్‌ వాళ్ళకి అలవాటైంది.


నేనే ఇన్ని రోజులూ అశ్రద్ధ చేశాను. మావాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది. మా అమ్మేదో మొహమాటానికి ‘ఇప్పుడే మీ దగ్గరకెందుకులేరా! రేపు చేసుకోగలిగే ఓపిక లేనిరోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా’ అన్నదని, ‘


ఔను అత్తయ్యగారూ, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు- తొందరేముందీ! పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు, ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్ళలో ఉండలేరు.


మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా! మన సొంతిల్లయితే ఏ సమస్యా ఉండదు’ అంటూ వాళ్ళని రానీకుండా అడ్డుపుల్ల వేశావు.


ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు.


ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా!


అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వేదో వాళ్ళకి బండచాకిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు.


పైగా ఓల్డేజ్‌హోమ్‌లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్నకొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా.


రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందువుగానీలే ఓల్డేజ్‌హోమ్‌లో’’ అంటూ లేచి వెళ్ళి షర్ట్‌ వేసుకుని బయటికెళ్ళిపోయాడు కోపంగా.


భర్త తన మాట కాదనటంతో ఏం చేయాలో అర్థంకాలేదామెకి.


ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చటం కుదరదని తేలిపోయింది.


పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్‌ చేయటంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు.


అత్తగారూ, మామగారూ మంచివాళ్ళే కానీ, కలిసుంటే తప్పక తేడాలొస్తాయనీ తగవులౌతాయనీ భయం.


తన క్లోజ్‌ఫ్రెండ్‌ సుభద్ర అలా జరిగే, గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయమింకా బలపడింది.


చివరికి పల్లెటూరివాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు.


పైగా భర్తకి కూడా అమ్మానాన్నలంటే ఒకింత ప్రేమ ఎక్కువే.


కొడుకు ఇల్లు కట్టేటప్పుడూ ఇతరత్రా అవసరాలపుడూ అతను అడగకుండానే డబ్బులూ బంగారం అంతా ఇచ్చేశారు.


అప్పుడప్పుడూ వచ్చి నాల్రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.


ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.


తెల్లారిపొద్దున లేచి తయారవుతున్న భర్తను ‘ఎక్కడికి’ అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ‘ఆయనే చెపుతార్లే’ అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది.


కాఫీ అందుకుని ‘‘రజనీ, నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు, ఇంటి గురించీ మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మానాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను’’ అంటూ, ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరకెళ్ళిపోయాడు.


ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది.


కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలనిపించింది.


వెంటనే సెల్‌ తీసుకుని అన్నకు ఫోన్‌ చేసింది. ఆమె అన్న వినోద్‌ నాలుగైదు సిటీలలో జాబ్‌ చేసి, చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు.


వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్‌ చేశాడు కానీ వెళ్ళటానికి కుదరలేదు.


అమ్మానాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్‌లో వెళ్ళాలని అనుకుంటోంది. ఫోన్‌ రింగ్‌ మొత్తం అయిపోయింది- వినోద్‌ ఫోన్‌ తీయలేదు.


అమ్మావాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్‌ లేదు. అన్నయ్య ఫోన్‌లోనుండే మాట్లాడతారు. ‘ఒక ఫోన్‌ తీసుకోవచ్చు కదమ్మా’ అంటే, ‘అదంతా మాకు తెలియదమ్మా. ఇక్కడ అంతా హిందీ కదా... అన్నయ్య ఉన్నాడుగా అంటుంది.’


ఇంతలో ఫోన్‌ మోగింది. చూస్తే అన్నయ్యే! ఫోనెత్తగానే ‘‘రజనీ, నేను వేరేచోట మీటింగ్‌లో ఉన్నారా.


సాయంత్రం నేనే ఫోన్‌ చేస్తాను. ఉంటాను’’ అంటూ హడావుడిగా పెట్టేశాడు.


'అయ్యో, అన్నయ్యతో మాట్లాడటానికి కూడా కుదరలేదే’ అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకి తయారుచేయటానికి లేచింది.


సాయంత్రమయింది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక, వాళ్ళకి స్నాక్స్‌ పెట్టి, పాలు ఇచ్చి, టీవీ దగ్గర కూర్చుంది.


రాత్రి ఎనిమిది గంటలైంది. మాధవవాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకుని ‘‘బాగున్నారా అత్తయ్యగారూ, ఆరోగ్యం బాగుందా మామయ్యగారూ’’ అంది రజని- తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా.


పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘తాతయ్యా, నానమ్మా’’ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు.


అమ్మా నాన్నా వచ్చినపుడు భార్య ‘ఏ మూడ్‌లో, ఎలా ఉంటుందో’ అని భయపడుతున్న మాధవ తేలికగా వూపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు.


అత్తమామలకు వాళ్ళ రూమ్‌ చూపించి బాత్‌రూమ్‌లో గీజర్‌ ఆన్‌ చేసింది. ‘‘అత్తయ్యగారూ, మీరూ మామయ్యగారూ స్నానం చేసి రండి. ఈలోపు నేను భోజనాలు రెడీ చెస్తాను’’ అంది.


‘‘అలాగేనమ్మా. మేము వస్తాములే, నువ్వెళ్ళి పనిచూసుకో’’ అంది మాధవ తల్లి సీతమ్మ.


అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి, పడుకునేసరికి పదకొండయింది.


తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్‌బెల్‌ అదే పనిగా మోగుతోంది.


‘ఈ టైములో ఎవరై ఉంటారబ్బా’ అనుకుంటూ నిద్రకళ్ళతో వచ్చి తలుపు తీసింది.


ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే, ఆమె నిద్రమత్తంతా ఎగిరిపోయింది.


ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా ‘‘బాగున్నారా మామయ్యగారూ, అత్తయ్యగారూ’’ అంటూ వారిని పలకరించి, ‘‘ముందు లోపలికి రండి, చలిగా ఉంది’’ అని, ‘‘ఏంటలాగే నిలబడిపోయావు రజనీ, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకీ నాన్నగారికీ కాఫీ కలిపి తీసుకురా త్వరగా’’ అన్నాడు.


‘‘రా అమ్మా, రండి నాన్నా’’ అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కనపెట్టి, తలుపులు మూసి కిచెన్‌లోకి వెళ్ళింది.


పెoదలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్‌బెల్‌ మోతకి లేచి హాల్లోకి వచ్చారు.


అందరి పలకరింపులయ్యేసరికి రజని అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది.


‘వీళ్ళేంటి ఇంత సడెన్‌గా వచ్చారు. మా అమ్మా నాన్నా విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్‌చేసి పిలిపించి ఉంటుందా?’-


అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ.


కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది.


మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. కొంచెం తేడాగా కనిపించారతనికి.


ఇదివరకున్న సంతోషం, కళా, కాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించటంలేదు. అతనికన్నా ముందుగానే, తల్లిదండ్రులను చూసిన మరునిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోని తేడాని గమనించేసింది రజని.


ఎంతైనా కూతురు గదా!


‘‘వదినగారూ, అంత దూరంనుండి మీ ఇద్దరే వచ్చారా!’’ అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.


‘‘లేదొదినగారూ, మాతో వినోద్‌ వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట. వెళ్తున్నానన్నాడు.


‘మేమూ వస్తాంరా, అమ్మాయి దగ్గరికి’ అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి, వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాడు’’ అంది.


‘‘అన్నయ్య వచ్చాడా... అయితే ఇక్కడకి రాడటనా?’’ కోపంగా అంది రజని.


‘‘లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆరోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురమూ’’ అంది రజని తల్లి సావిత్రమ్మ.


‘‘అదేంటమ్మా, అంత దూరం నుండి వచ్చి ఒక్క పదిరోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు, అన్నయ్యను రానీ, నేనడుగుతాను’’ అంది.


‘‘వద్దమ్మా, అడగొద్దు. అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళమూ మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా... అందుకని వెళతాంలే’’ అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి, ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి.


మాధవ, పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది.


అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి, కాసేపు మాట్లాడి వచ్చేసింది.


ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడూ తరవాత కూడా వాళ్ళ నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకూ కుదరలేదు.


రాత్రి భోజనాలయిన తరవాత మాధవ, పిల్లలు- అత్తమామల గదిలోకెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకెళ్ళింది.


తల్లి ఒక్కతే ఉంది. ‘‘నాన్న ఏరమ్మా?’’ అంది.


‘‘మీ అత్తయ్యగారి గదిలోకెళ్ళారమ్మా. అబ్బాయీ పిల్లలూ కూడా అక్కడే ఉన్నారుగా- మాట్లాడుతున్నారు.’’


సరే, నాన్న లేకపోయినా ఫరవాలేదులే అనుకుని ‘‘అమ్మా, నువ్వూ నాన్నా అలా ఉన్నారేంటి?


ఉదయం నుండీ ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా’’ అంది.


కూతురలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళవెంట నీళ్ళొచ్చేశాయి.


కొంతసేపటికి ‘‘ఏం చెప్పను తల్లీ, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక.


ఇప్పుడు, ఇన్నాళ్ళకి- మీ వదినకి మేమూ మా మాటలూ చేతలూ నచ్చటం లేదు.


ఇంటికి పెద్దపెద్ద ఆఫీసర్లూ కలెక్టర్లూ వస్తారట. పార్టీలు జరుగుతాయట.


వాళ్ళల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో, ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది.


ఆరునెలలక్రితం మమ్మల్ని ఓల్డేజ్‌హోమ్‌లో చేర్పించారు.


అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటే,


ఇప్పుడు వాడు పనిమీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటపుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోమ్‌లో వదిలేసి,


వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా, దేవుడు మా నుదుటన ఇలా రాశాడు.


చూడమ్మా రజనీ, ఎంతో ఆశతో బిడ్డల్ని కనీ,


మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచీ పెద్దచేసి, చదివించి,


వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు.


పెళ్ళిచేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ,


కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులయినా.


కానీ, కొడుక్కి పెళ్ళిచేసి, కొడుకుని కోడలి చేతికప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి,


తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధా వేదనా ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది.


వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు.


‘మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు’ అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులయినా ఎలా తట్టుకోగలరు’’


అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.


‘‘మీ అన్నలాగా డబ్బున్నవాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసి పోతున్నారు.


డబ్బులేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ ఖర్మానికి రోడ్లమీద వదిలేసి పోతున్నారు.


పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పనిచేసుకుని బతుకీడుస్తున్నారు.


పని చేయగలిగే శక్తి లేనివాళ్ళు పనిచేయలేక,


తిండిలేక,


అడుక్కోవటానికి ముఖం చెల్లక, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.


ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లీ!


కొంతమంది, కొంతమందేంటి... చాలామంది కోడళ్ళు ‘అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటివారే కదా’ అని అనుకోకపోవటమే.


అందుకే, ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది.


అక్కడ మేం బతికున్నాం అంటే, ఉన్నాం అంతే!


మా మనసులెంత కుమిలిపోతున్నాయో నీ అన్నావదినలకు అక్కరలేదు.


మాకు ఈ శిక్ష ఎందుకుపడిందో తెలీదు కానీ,


మేమనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా’’ అంటూ,


మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది ఆ తల్లి.


తల్లి మాటలకు రజనీకి చెంపమీద ఛెళ్ళున చరిచినట్లనిపించింది అంత బాధలోనూ.


‘‘వూరుకోమ్మా, వూరుకో... అన్నయ్యిలా చేయడమేమిటి? వాడొచ్చాక నేను మాట్లాడతాను’’ అంది ఏడుస్తూ.


తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది.


దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ, ‘‘మీ అత్తయ్యగారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది.


వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోగానీ, నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది.


నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు’’ అంది.


తల్లి మాటలకు గిల్టీగా ఫీలయింది రజని.


ఇంకానయం, తను అన్నతోగానీ, తల్లితోగానీ మాట్లాడకపోవటమే మంచిదయిందనుకుంది.


అంతలో మాధవ పిలవటంతో, ‘‘సరే, పడుకోండమ్మా, పొద్దుపోయింది’’ అంటూ వెళ్ళిపోయింది.


మూడోరోజు ఉదయం వినోద్‌ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గటం గమనించింది.


అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకూ అలాగే జరిగిపోయింది.


సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక, వినోద్‌- తల్లితో ‘‘అమ్మా, ఇక బయలుదేరుదాం. ఎనిమిది గంటలకు ట్రైన్‌ ఉంది’’ అన్నాడు.


అందరూ ఉన్నా అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది.


అంతలో మాధవ గొంతు సవరించుకుని ‘‘చూడు వినోద్‌, ఇకనుండి


అత్తయ్యగారూ మామయ్యగారూ మా ఇంట్లో, మా దగ్గరే ఉంటారు’’ అన్నాడు.


అతని మాటకు వినోద్‌, రజనీ, అత్తమామలూ విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి వూహించని పరిణామం.


‘‘అదికాదు బావా!’’ అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్‌.


‘‘ఇంకేం చెప్పకు, నీవక్కడకు తీసుకెళ్ళినా, హోమ్‌లోనే కదా వాళ్ళుండేది.


ఇక్కడుంటే కూతురి దగ్గరున్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి.


ఇంటికి పెద్దదిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్‌.


అమ్మానాన్నలంటే మనమెప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం.


పెద్దవారితో కలిసి ఉండాలి,


వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి.


అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి.


ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి.


ఇప్పుడు నువ్వు మీ అమ్మానాన్నలని చేసినట్లే, రేపు నీ కొడుకులు నిన్ను చేయరా!


దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థంకాదులే.


నేనేమీ కోపంగా చెప్పటం లేదు వినోద్‌. వాళ్ళిక్కడుంటే వాళ్ళకీ మనశ్శాంతిగా ఉంటుంది.


మాకూ ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది.


మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక నువ్వేం ఆలోచించక బయల్దేరు’’ అన్నాడు.


వినోద్‌ తల దించుకుని వెళ్ళిపోయాడు.


మాధవ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి.


అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.


గదిలోకి వెళ్ళటంతోనే మాధవ పాదాలమీద వాలిపోయింది రజని.


‘‘ఏయ్‌ ఏంటిదీ, లే, లే...’’ అంటున్న అతనితో-


‘‘ఇన్నాళ్ళూ మీతో కలిసి కాపురంచేసి కూడా మీ మనసు అర్థంచేసుకోలేకపోయానండీ.


అత్తయ్యా వాళ్ళవిషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను.


నన్ను క్షమించండి.


మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయం ఇచ్చారు.


మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను’’ అంది ఏడుస్తూ.


‘‘పిచ్చి రజనీ, నాకు మా అమ్మానాన్నా, మీ అమ్మానాన్నా వేరుకాదు.


ఆరోజు మీ అమ్మ నీతో చెప్పినపుడే మీ నాన్నగారు మాకు చెప్పారు.


అప్పుడే అమ్మానాన్నా నేనూ ఇలా నిర్ణయించుకున్నాం.


నిన్ను సర్‌ప్రైజ్‌ చేద్దామని నీకు చెప్పలేదు.


ఏదో చిరాకులో మాట్లాడతావుగానీ నీ మనసెలాంటిదో నాకు తెలీదా’’ అన్నాడు.


అతనికి తనపైగల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీలైంది.


హాల్లోకొచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు.


వెళ్ళి వాళ్ళ పాదాలకి దణ్ణం పెట్టుకుంది. తరవాత తల్లికీ తండ్రికీ కూడా.


‘‘ఇదేంటమ్మా, ఇప్పుడెందుకూ...’’ అని అడిగిన వాళ్ళకు,


ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ‘ఈటీవీ శుభమస్తు’లో చెప్పారండీ’’ అంది.


‘మా కోడలెంత బంగారం’ అని అత్తమామలూ, ‘కూతురెంత పద్ధతికలదో’ అని తల్లిదండ్రులూ మురిసిపోతుంటే,


గదిలోనుండి అది చూసిన మాధవ- రజని తెలివికి నవ్వుకున్నాడు..


ఇప్పుడు మనం ఏదయితే చేస్తామో అదే చివరకి మనకి జరుగుతోంది..


దయచేసి అర్థం చేసుకోగలరు.


మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకుందాం..


మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తునిదాం..

దాన గుణం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹

   ప్రతి మనిషి లోను ‌‌.. అతడు సామాన్యుడైనా, సంపన్నుడైనా అతడిలో దాన గుణం తప్పనిసరిగా ఉండాలి. దాన గుణం లేనివాడు దానవుడవుతాడు. దానగుణం లేకపోయిన శ్వేత మహారాజుకు ఏం జరిగిందో.. అగస్త్యుడు శ్రీరాముడికి చెప్పిన ఈ కథలో వినండి. మన పురాణ కథలు శీర్షిక కింద ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అందిస్తున్న 8 వి కథ. అన్నీ క్రమం తప్పకుండా పూర్తిగా వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి. శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🌞ఆదివారం 14 డిసెంబర్ 2025🌞*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            7️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*        

                    *74 వ రోజు*

                    

*వన పర్వము ప్రథమాశ్వాసము*


*అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట*```


వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు మొదలు ఆరంభించాడు. పరమ శివుడు అర్జునుని పరీక్షించదలిచాడు. ఒక కిరాతుడి వేషంలో అర్జుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. రెందు బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది. 


అర్జునుడు కిరాతునితో “నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా?” అన్నాడు. 


ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా? చేవ ఉంటే నాతో యుద్ధానికి రా” అన్నాడు శివుడు.

అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చలించ లేదు. అర్జునునకు ఆశ్చర్యం వేసింది “ఇతను సామాన్యుడు కాదు”దేవేంద్రుడైనా పరమ శివుడైనా అయి ఉండాలి" అనుకున్నాడు. కాని ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి" అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు వేసే బాణములనన్నీ శివుడు పర్వతం శిలావర్షాన్ని స్వీకరించి నట్లు స్వీకరించాడు. అక్షయ తూణీరాలలోని బాణాలు అన్నీ అయిపోయాయి. గాండీవం తీసుకుని కొట్టగా అతని చేతిలోని గాండీవం అదృశ్యం అయింది. ఖడ్గం తీసుకొని శివుని శిరస్సుపై బలమంతా ప్రయోగించి కొట్టగా ఖడ్గం ముక్కలై పోయింది. చెట్లతోనూ శిలలతోను యుద్ధం చేశాడు. అన్నిటిని శివుడు తనలోనికి తీసుకున్నాడు. ఇక పిడికిళ్ళతో శంకరుడిని కొట్టనారంభించాడు. కిరాతార్జునులిరువురు భయంకరంగా ద్వంద యుద్ధం చేయసాగారు. కొంతసేపటికి అర్జునుడు శివుని దెబ్బలకు తాళలేని మూర్చబోయాడు. కాసేపటికి తేరుకుని రక్తసిక్తమైన తన శరీరమును చూసుకొని మట్టితో శివలింగమును చేసి పుష్పములు, మాలలతో పూజించాడు. అప్పుడు పార్ధివ లింగంపై తను పూజించిన మాల కిరాతుని శిరస్సుపై కనిపించింది. ఆశ్చర్యపోయిన అర్జునుడు కిరాతకుడే శివుడని గ్రహించి కైమోడ్చి శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. "పరమశివా! నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేసాను. నా తప్పు మన్నించు" అన్నాడు. 


అంత నిజ రూపంలో ప్రత్యక్షమైన శివుడు “అర్జునా! నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి. ఇదిగో నీ గాండీవం. ఇంకా ఏదైనా వరం కోరుకో" అన్నాడు. 


అర్జునుడు “త్రయంబకా! నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహాస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు" అన్నాడు. 


ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి మంత్ర,ధ్యాన,జప,హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం, సంధానం, మోక్షణము

సంహారం సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు. 

శివుడు అర్జునుడితో  “అర్జునా! ఈ పాశుపతాన్ని ప్రయోగిస్తే  జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నీవు అఖిల లోకాలను జయిస్తావు" అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. 


పరమశివుని చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునిని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తోంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినీ దేవతలతో కలసి అర్జునిని వద్దకు వచ్చాడు. "అర్జునా నీ పరాక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము” అన్నాడు ఇంద్రుడు. 


యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేసారు. 


అర్జునుడు వారిని దర్శించినందుకు, వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు.```


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

15డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     🕉️ *సోమవారం*🕉️   

 *🌹15డిసెంబర్2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                          

         *ఈనాటి పర్వం*

  *సర్వేషాం సఫలైకాదశి*

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం -  కృష్ణపక్షం*


*తిథి       : ఏకాదశి* ‌రా 09.19 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : చిత్త* ఉ 11.08 వరకు ఉపరి *స్వాతి*

*యోగం  : శోభన* మ 12.30 వరకు ఉపరి *అతిగండ*

*కరణం   : బవ* ఉ 08.03 *బాలువ* రా 09.19 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 07.30  & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 04.15 - 06.03 తె వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.25*


*వర్జ్యం             : సా 05.27 - 07.15*

*దుర్ముహూర్తం  : మ 12.25 - 01.10 & 02.39 - 03.23*

*రాహు కాలం   :  ఉ 07.52 - 09.15*

గుళికకాళం      : *మ 01.26 - 02.50*

యమగండం    :  *ఉ 10.39 - 12.03*

సూర్యరాశి : *వృశ్చికం*                    

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.38* 

సూర్యాస్తమయం :*సా 05.44*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.28 - 08.42*

సంగవ కాలం         :     *08.42 - 10.56*

మధ్యాహ్న కాలం    :    *10.56 - 01.10*

అపరాహ్న కాలం    : *మ 01.10 - 03.23*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ ఏకాదశి*

సాయంకాలం        :  *సా 03.23 - 05.37*

ప్రదోష కాలం         :  *సా 05.37 - 08.12*

రాత్రి కాలం           :*రా 08.12 - 11.37*

నిశీధి కాలం          :*రా 11.37 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.46 - 05.37*

<><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*క్షంతవ్యో మేఽపరాధః శివ* 

*శివ శివ భో శ్రీమహాదేవ శంభో*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

పంచాంగం

  కాశీ విశ్వేశ్వరుడు



పంచాంగం 15.12.2025 Monday,

 ఈ రోజు పంచాంగం 15.12.2025 Monday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష ఏకాదశి తిథి ఇందు వాసర చిత్ర నకత్రం శోభన యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: ఏకాదశి

 


నమస్కారః , శుభోదయం

చండీశ్వరుడికి

  *పార్వతీ పరమేశ్వరులు,కుటుంబంలో చండీశ్వరుడికి అయిదవ స్థానం ఇచ్చిన శంకరుడు అరుణాచలం లో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, తో పాటు చండీశ్వరుడు ని ఊరేగింపుగా తీసుకువెళతారు,* ఈ రోజు చండీశ్వరుడికి గురించి తెలుసుకుందాము.


✨💗ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటిని విడిచిపెట్టి కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచెలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.


ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారుచేసి సైకతప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. ఆటను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతని అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయిందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి. క్రిందపడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకతలింగంలోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మాకుటుంబంలో అయిదవవాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇకనుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతీ నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడి లాగే ఆయన కూడా. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు. మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. 


ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి. మనదేశం అంతటి భాగ్యవంతమయిన దేశం. *ఓం నమో చండీశ్వరాయ నమః*🙏🪷🙇‍♂️

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - ఏకాదశి - చిత్ర -‌‌ ఇందు వాసరే* (15.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

14, డిసెంబర్ 2025, ఆదివారం

WILL DEED

  WILL DEED is one of the important document in one's life. Because this is the only document through which one can transfer all his/her estates. Many people does not recognize the importance of Will Deed, due to which after the demise of the head of family the children ( Successors) will face many problems. It is always better to execute a WILL DEED when a person attains the age of 65 or more. 


WHO SHOULD WRITE WILL DEED: any person  who is a major, having movable, immovable properties, cash, ornaments or any type of assets. Can  write a WILL DEED so as to transfer the same to his family members/Legal Representative.


HOW TO WRITE A WILL: WILL DEED is a simple deed it can be written on any paper, but it should be attested by two major witnesses.


IS IT COMPULSARY TO REGISTER A WILL DEED: 

NO it is not compulsory to register a will deed even a WILL DEED can be executed on a white paper. But I sincerely advise the parties to register a WILL DEED to avoid future complications.


WHY REGISTRATION: Because WILL DEED should be presented in many Government and Municipal offices to get mutate the names of Legal Representatives. In the Government offices to avoid un necessary litigation and to have perfection and to avoid risk, usually prefer a Registered WILL DEED. So it is always safe to register a WILL DEED.

if you have any doubts with regard to drafting, execution of WILL DEED you can contact here by way of comment. 

మహాభారతము

  ```

ప్రతిరోజూ…

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో...!

1412e7;➖75.

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀7️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు```


     *సంపూర్ణ మహాభారతము*        

                    *75 వ రోజు*

                    ➖➖➖✍️


*వన పర్వము ప్రథమాశ్వాసము*


    *ఇంద్రలోకంలో అర్జునుడు*

              ➖➖➖✍️

```

దానిపై అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్య చంద్రులు లేకనే స్వయంప్రకాశంతో వెలిగి పోతున్న అమరావతి నగరాన్ని చూసాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించాడు. అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి 

“అమ్మా! నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా?” అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరించాడు. “అర్జునా! నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం. నేను దేవ వేశ్యని. మాకు వావివరసలు ఉండవు. నీకు నేను ఏవిధంగా తల్లిని అయ్యాను?” అన్నది. 


“మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కనుక నీవు నాకు మాతృ సమానురాలివి. స్వేచ్ఛా శృంగారం దోషం, పాపం” అన్నాడు. 


ఊర్వశి కోపించి “కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ళ మధ్య సంచరించు!” అని శపించి వెళ్ళి పోయింది. 


ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడుతో “అర్జునా! నీ వంటి ధైర్యవంతుని నేను ఇదివరకు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. బాధపడకు ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. కాని అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉంవడచ్చు. నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగి పోతుంది" అని ఊరడించాడు. 


తరువాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రోమశుడు అనే మహర్షి దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధ సింహాసానంపై కూర్చున్న అర్జునుని చూసి “ఎవరీతుడు?" అని ఇంద్రుని అడిగాడు. 


దానికి దేవేంద్రుడు “మహర్షీ! ఇతడు పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతీ గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు. నేను కూడా ఇతనికి దివ్యాస్త్రాలెన్నో ఇచ్చాను. ఇతను నివాత కవచులను రాక్షసులను సంహరించగలడు. కాని తమరు భూలోకమునకు పోయి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధర్మరాజుకు చెప్పండి. ధర్మజుని తీర్ధయాత్రలు చేయమని నా తరఫున చెప్పండి. తీర్ధయాత్రల వలన అతడు పాప రహితుడు కాగలడు" అని రోమశునితో చెప్పాడు.✍️```(సశేషం)

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

పరిస్థితులను మారుస్తావా

 ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,

" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.

నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ

వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.


తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు.

చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.


గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.

వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు),

మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.


తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి,

ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా -

అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.


అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి,

వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.


నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,


" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది.

కాఫీ డికాషన్ వచ్చింది........

అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.


అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,


" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.


కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?

మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.

చితికిపోయే గుడ్డు గట్టిపడింది.

గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి,

నీటిరంగునే మార్చింది.. అవునా..!!


ఇప్పుడు చెప్పు..


వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?


మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )


గట్టిపడిపోతావా..?


పరిస్థితులను మారుస్తావా...?


ఇక్కడ నీదే ఎంపిక,

దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.


ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.


దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపింది..


" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది.

*సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 13 డిసెంబర్ 2025🍁*


            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                           7️⃣3️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


       *సంపూర్ణ మహాభారతము*           

                    *73 వ రోజు*

                   

*వన పర్వము ప్రథమాశ్వాసము*


*అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించుట*```


ధర్మరాజు వ్యాసుని సాదరంగా ఆహ్వానించి అర్చించాడు." ధర్మరాజా! నీ మనస్సులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నీవు అర్జునునకు ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి " అని చెప్పాడు . వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామ్యక వనానికి వెళ్ళారు. ధర్మరాజు ఒకరోజు అర్జునినితో " అర్జునా ! భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని గెలవాలంటే మనకూ దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేసాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నీవు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమతమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమ శివుని ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు " అని చెప్పి అర్జునునకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అవే విద్యను ఉపదేశం చేసాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయడానికి గంధ మాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునిని చూసి " వీరుడా నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ శాంతస్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని ? నీ ఆయుధములు విడిచి పెట్టు " అన్నాడు. ఆ మాటలకు చలించకుండా స్థిరంగా ఉన్న అర్జునిని సాహసానికి మెచ్చి బ్రాహ్మణుని రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమైయ్యాడు. " అర్జునా నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో " అని అన్నాడు. అర్జునుడు " నాకు దివ్యాస్త్రాలు కావాలి " అన్నాడు. ఇంద్రుడు " ఎలాగూ అవి లభిస్తాయి. అమరత్వం కావాలా? " అని అడిగాడు. అర్జునుడు " ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి. అవి నాకు ప్రసాదించండి " అన్నాడు. ఇంద్రుడు " అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి " అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఆదివారం*🌞 *🌹14డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

 *🌹14డిసెంబర్2025🌹*     

    *దృగ్గణిత పంచాంగం*                   

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - బహుళపక్షం*


*తిథి  : దశమి* ‌సా 06.49 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : హస్త* ఉ 08.18 వరకు ఉపరి *చిత్త*

*యోగం : సౌభాగ్య* ప 11.45 వరకు ఉపరి *శోభన(

*కరణం  : భద్ర* సా 06.49 ఉపరి *బవ* రాత్రంతా పూర్తిగా


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 08.00 - 10.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *రా 03.59 - 05.46 తె వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.24*

*వర్జ్యం    : సా 05.15 - 07.02*

*దుర్ముహూర్తం  : సా 04.08 - 04.52*

*రాహు కాలం   : సా 04.13 - 05.37*

గుళికకాళం      : *మ 02.50 - 04.13*

యమగండం    : *మ 12.02 - 01.26*

సూర్యరాశి : *వృశ్చికం*                                     

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 06.38*

సూర్యాస్తమయం :*సా 05.34*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.27 - 08.41*

సంగవ కాలం         :     *08.41 - 10.55*

మధ్యాహ్న కాలం    :    *10.55 - 01.09*

అపరాహ్న కాలం    : *మ 01.09 - 03.23*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ దశమి*

సాయంకాలం        :  *సా 03.23 - 05.37*

ప్రదోష కాలం         :  *సా 05.37 - 08.11*

రాత్రి కాలం           :*రా 08.11 - 11.37*

నిశీధి కాలం          :*రా 11.37 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.45 - 05.37*

<><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


*అసితాంగభైరవాయ నమః* 

*రురుభైరవాయ నమః*

*చండభైరవాయ నమః* 

*క్రోధభైరవాయ నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

స్వామి వివేకానంద స్ఫూర్తి.

 స్వామి వివేకానంద స్ఫూర్తి....
రోజుకో సూక్తి....


ప్రతికార్యం - అవహేళన, ప్రతిఘటన, తరువాత అంగీకారం. ఈ మూడు దశలను దాటవలసి ఉంటుంది. తానున్న కాలానికంటే ముందుగా ఆలోచించే ప్రతి వ్యక్తిని లోకం అపార్థం చేసుకోవడం సహజం. కాబట్టి ప్రతిఘటన, హింస అనివార్యాలు. మీరు స్ధైర్యంగా, పవిత్రంగా ఉంటూ 

భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఇవన్నీ అదృశ్యమవుతాయి.


శుభ రవి వారం 🌞Happy Sunday. 


Swami Vivekananda’s Wisdom for

Daily Inspiration. 


Each work has to pass through these stages — ridicule , opposition , and then acceptance . Each man who thinks ahead of his time is sure to be misunderstood. So opposition and persecution are welcome , only i have to e steady and pure and must have immense faith in god , and all these will vanish . . . .

ఆన్లైన్లో సంగీతం క్లాసులు

  ఆన్లైన్లో సంగీతం క్లాసులు


 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము. మీరు పెట్టిన కామెంట్లు ఈ బ్లాగులో ఎవరికి కనబడవు. 


మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 


ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు.

అంతా_అన్నంలోనే_ఉంది

  *#అంతా_అన్నంలోనే_ఉంది*


అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఫక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో ‘అమ్మా! ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకీ తెలియాలి.. కాస్త చెప్పమ్మా’ అన్నాడు.


ద్రౌపది బదులిస్తూ ‘భీష్మాచార్యా! ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు, బాగుంది. కానీ నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మపరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు’ అంది.


ఆయన తల పంకించి ‘నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా! నువ్వు గనుక నవ్వకపోయుంటే నాకూ నీకూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది. నీ సందేహానికి నా సమాధానం విను!


అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి.. ఆ ప్రభావం నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు.


మిత్రులారా! అన్నం మహిమ అంతటిది. మనం తినే ఆహారం కష్టార్జితంతో కూడుకొన్నదై ఉండాలి. పీడన సొమ్ముతో లభించింది తింటే.. అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది. అందుకని ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది. ధర్మమార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దైవసాధనలో మనసు నిగ్రహం కోల్పోదు .

దత్తపది

 

🌹🦜🙏🏽🦜🌹

    12.12.2025

     శుక్రవారము 

     

దత్తపది  అంశం :  భారతార్ధంలో

ఛందము ..  ఏదేని వృత్తము

***************************


  " *హరి  - గిరి - సరి - ఝరి "* 


**************************** 


 *ఉత్పలమాల..* 


శ్రీహరి నడ్డగింపనట సిగ్గును

వీడుచు నల్లకొల్వులో 


ద్రోహులు కౌరవాధములు దూరుచు

మ్రగ్గిరి సంగరమ్మునన్ ! 


దా హతుడాయె రాజు 'సరి తమ్ముని'

ధాటికి నొక్కపెట్టునన్ ! 


గోహళి వ్రయ్యలాయె, కురు క్రౌర్యపు

నిర్ఝరి క్రుంకెఁ జూడుమా !!

......................................................

సరి తమ్ముడు  ... భీముడు ( సరియగు, సరిజోడు )

గోహళి  .. కిరీటము ( రాజ్యము, రాచఠీవి )

నిర్ఝరి ... సెలయేటి ప్రవాహము 

      (రాచరికము అనే భావములో వాడాను ) 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

“ *అవధానంబులఁ బెక్కు సేసినను*

  🌹🦜🙏🏽🦜🌹

   12.12.2025

     శుక్రవారం 


“ *అవధానంబులఁ బెక్కు సేసినను* 

 *దా నల్పుండె విద్వత్సభన్”* 

   ................................................ 


 *మత్తేభమ్...* 


శ్రవణానందపు మేటి గాత్రమది,

విస్పష్టంబులౌ పల్కులున్, 


గవితా ధారయు, ధారణా పటిమ,

వాక్చాతుర్యుడౌ శాస్త్రి  తాఁ 


గవనం బందున మేలుబంతి యయి,

సద్గ్రాహ్యంబు లోపంబునై 


యవధానంబులఁ బెక్కు సేసినను 

దా నల్పుండె విద్వత్సభన్”

...................................................... 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

శ్రీనివాస తిరుమలేశ

  🌸శ్రీనివాస స్తుతి🙏

తేటగీతి పద్యం


శ్రీనివాస తిరుమలేశ శ్రీహరి నిను

 నిరతము గొలుతు భక్తితో నీరజాక్ష 

సకల సంపదలొసగుము సన్నుతాంగ

 సప్తగిరులపై వెలసిన సాధుపురుష

జయము జయమయ్య గోవింద శరణు శరణు


సాహితీ శ్రీ జయలక్ష్మి

విష్ణు స్తు తి

  🌸విష్ణు స్తు తి


శంఖచక్రములును సకిరీట మునుగల

వైకుంఠవాసుడావందనాలు

మా మొరలు వినవా మాధవ శ్రీహరి

కరుణతో మమ్ముల కావుమయ్య 

దుష్టుల శిక్షించి దురితములను బాపు

 దామోదరా నీకు దండ మయ్య 

నీల మేఘశ్యామ నిరుపమ గుణధామ

నిన్ను నమ్మియుంటినినిచ్చలందు

తే, ధర్మ పాలన జేసెడి ధర్మవీర

సకల దేవతా పూజిత శరణు శరణు

 విన్నపాలువినుము దేవ విష్ణుమూర్తి

 మానవుల పైన దయ చూపు మమత తోడ 


సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

  .... జాతీయ తెలుగు సాహితీ పీఠము .....  

 తేనియల్ చిందు నా భాష తెలుగుభాష  

.... డా. నలవోలు నరసింహా రెడ్డి .... 

 

. ...... పొడుపు పద్యము ...... 

ఆ. నరుని చెంత నుండు తరువులు లేనట్టి 

చిక్కనైన యడవి చిత్రముగను 

చక్కనయిన దారి చిక్కని యడవిలో 

దీని భావమేమి ధీ వరేణ్య..? 251

జవాబు .. ?

నిన్నటి జవాబు ... (గురిగింజ)

పెండ్లికల పరతత్త్వనిర్ణయము

 పెండ్లికల

పరతత్త్వనిర్ణయము


ఉ॥ 

వేదములున్ తదంతములు విశ్రుతధర్మపరేతిహాసశా 

స్త్రాదులు గూఢతత్వవిషయ

మ్ములనున్ కలలోన దెల్పిసం 

వాదము నందు పండి‌తసభన్ 

పరతత్త్వము తానటంచునా 

మోదము జేయ నంపె హరి ముచ్చటదీరగ,విష్ణుచిత్తునిన్  

69


తే.గీ|| 

అంత ప్రణమిల్లి భాగవతార్యుడపుడు 

పండితసభకు జనె పరివారజనము 

వెంటరా, నెదురేగి యా విభుడు నమ్ర 

శీర్షుడై తద్విజోత్తము జేర్చె పీఠి 70


తే.గీ॥

అచట సభ నొక్క ప్రజ్ఞాని యాదిశక్తి 

యే పరమతత్త్వమనుచు వాదించి మెరిసె 

మరొక డనలాంబకపరత్వ

మహిమ దెలెపె 

వేరొకండట నలువయే వేల్పుడనియె 71


సీ|| 

విష్ణుచిత్తుడపుడు విష్ణుపరత్త్వమున్    

         భాష్యాలు ఘటియించి వ్యక్త పరచె 

ఉపనిషత్తుల లోని యుపపత్తులను జూపి    

         బోధాయనోక్తుల పోహణించె

ఇతిహాసకథలతో ప్రతివాదమును సల్పె  

         సారమ్ము ననువున జక్క జూపి 

మోహులై కనువారు ముగ్ధులై రనినచో 

         నదియె వైష్ణవమాయ యనగ నొనరె


తే.గీ॥

వివిధగాధామయ పురాణవేత్తయగుచు గూఢపరమార్థముల నెల్ల కూర్చి నుడువె 

వాదమున కెవ్వడును ప్రతివాది లేక 

ఒక్కొక విషయమ్ము నిటుల నుగ్గడించి 72


కంజర్ల రామాచార్య

ఉత్పలమాల

  🌹🦜🙏🏽🦜🌹

    13.12.2025

       శనివారం 


*అంశం .. చిత్రముపై కవి హృదయం* 

.................................................. 


 *ఉత్పలమాల..* 


దూకుచునుండె గంగ, శివ! త్రుళ్లుచుఁ

జంపును మమ్మునీ భువిన్! 


నీకిది భావ్యమా? జపము నేటికిఁ

జాలును, మేలుకొమ్మయా! 


చీకులు తీరు రైతులకుఁ జెర్వుల

నింపిననట్టి నీటితోఁ ! 


జేకొని మెట్టభూమియును శ్రీల

నొసంగును మానవాళికిన్ !!

................................................ 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

దాశరథి కాడు రాముడు దనుజ సుతుడు

  సమస్య:- దాశరథి కాడు రాముడు దనుజ సుతుడు.

(క్రమాలంకార పూరణ)

ఆ.వె

తండ్రి యాజ్ఞ తొ వనముల దరలె నెవరు

లంక గాల్చిన వీరుడు రాముడేన?

నారసింహుని గొలిచిన ధీరుడెవడు?

దాశరథి, కాడు రాముడు, దనుజ సుతుడు.

       పల్లావఝల వెంకట శైలజ, విజయవాడ.

*అంశం ..వర్క్ ఫ్రమ్ హోమ్

  🌹🦜🙏🏽🦜🌹

   


 *అంశం  ..వర్క్ ఫ్రమ్ హోమ్* 

  ............................................ 


 *తేటగీతి..( పంచపాది )* 

సమయ పాలన లేనట్టి సాఫ్టువేరు

నింటనుండుచుఁ బనిచేయ నేమి ఫలము?

నోట్ల యంత్రమై తనయింటఁ బాట్లుపడుచు

ప్రేగు బంధమ్ముతోనైన సాగలేక

బ్రతుకు నీడేర్చు చుండిరి వెతలు పడుచు!!

......................................................

పి.ఎల్.నాగేశ్వరరావు

అగపడదొక్క వేణువు స్వరామృత* *పానముఁ జేసిరెల్లరున్ "*

 


" *అగపడదొక్క వేణువు స్వరామృత* 

  *పానముఁ జేసిరెల్లరున్ "* 

  ..............................................


 *చంపకమాల..* 


మిగుల విశిష్ట శ్రీకరుని మిక్కిలి

భక్తిని జూడనేగి  నే 


సుగమగు స్వామి దర్శనపు శోభను

గాంచ ప్రభాతవేళలో 


నగణిత వాద్యకారులట హ్లాదము

గూర్చుచుఁ బాడఁ గొండపై


యగపడదొక్క వేణువు స్వరామృత

పానముఁ జేసిరెల్లరున్!!

...................................................

శ్రీకరుడు  .. వెంకన్న అనే భావం.

కొండ .. తిరుమల కొండ 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

ఇంగువ

 .

*మన ఆరోగ్యం…!


                 *ఇంగువ.....* 

                 ➖➖➖✍️

```

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, 

గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది మరియు యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. 


అయితే, అతిగా వాడితే వికారం, కడుపులో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు.


గర్భిణీ స్త్రీలు దీనిని వాడకపోవడం మంచిది. ```



*ఇంగువ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.....*```


*జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, గ్యాస్ మరియు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 


*రక్తపోటును నియంత్రిస్తుంది:

ఇంగువ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. 


*శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం:

శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.


*యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్

ఇంగువలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇవి జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి.


*క్యాన్సర్ కణాల నివారణ:

ఇంగువ క్యాన్సర్ కణాల నివారణకు కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 


*వికారం మరియు కడుపు నొప్పిని తగ్గిస్తుంది:

దీనిలోని సమ్మేళనాలు కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 


*గమనించాల్సిన విషయాలు;

మరియు దుష్ప్రభావాలు;

అలెర్జీ ప్రతిచర్యలు:


కొంతమంది వ్యక్తులలో ఇంగువ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా వాపు వంటి అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. 


*అధిక వినియోగం:

ఎక్కువ మోతాదులో ఇంగువ సేవించడం వల్ల వికారం, విరేచనాలు, లేదా కడుపులో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు. 


*గర్భిణీ స్త్రీలు:

గర్భిణీ స్త్రీలు ఇంగువ సేవించడాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచానికి దారితీయవచ్చు.


ప్రసవమైన తరువాత బాలింతలకు 

బాగా వుపయోగపడుతుందంటారు✍️ -సేకరణ.```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పద్దెనిమిది మెట్లు విశిష్ఠత*

  

      *పద్దెనిమిది మెట్లు విశిష్ఠత*

                ➖➖➖✍️

```

మన హిందూ ధర్మసంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో.. 

శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. 


అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు.


మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము. 

కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లను తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభమును తాకి స్వామివారిని దర్శించుకుంటాము, అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప 

ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలువనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.


ఇక సంఖ్యా శాస్త్రము ప్రకారము ‘18’ సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గూర్చి చాలా చక్కగా చెప్పిరి. 1+8=9 అనునది పరిపూర్ణమైన సంఖ్య, అంతే కాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది, కావున భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూ యున్నారు. 


అందుకే మనము మన స్వామి పూజలలో కూడ పడిపూజ అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి పడిపూజ అంటున్నాము. 


మరి ఆ 18 సంఖ్య గూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం...


అమ్మవారి శక్తిపీఠములు - 18. 

1. శాంకరీ దేవి, 2. కామాక్షీ దేవి, 3. శృంఖలాదేవి, 4. చాముండేశ్వరీ, 5. జోగులాంబ, 6. భ్రమరాంబ, 

7. మహాలక్ష్మీ, 8. ఏకవీరిక, 

9. గిరిజాదేవి, 10. మాణిక్యాంబ, 11. కామరూపిణి, 12. మాధవేశ్వరి, 13. మహాకాళి, 14. పురుహుతిక, 15. వైష్ణవీదేవి, 16. మాంగళ్యగౌరీ, 17. విశాలాక్షీ, 18. సరస్వతి.


వ్యాసమహాముని వ్రాసిన పురాణాలు:18


1. మత్స్యపురాణము, 

2. మార్కండేయ పురాణము, 

3. దేవీభాగవత పురాణము, 

4. భవిష్యత్పురాణము, 5.బ్రహ్మాండపురాణము, 

6. బ్రహ్మవైవక్త పురాణము, 

7. వరాహపురాణము, 

8. వామనపురాణము, 

9. విష్ణు పురాణము, 

10. వాయు పురాణము, 

11. అగ్నిపురాణము, 

12. నారదపురాణము, 

13. పద్మపురాణము, 

14. లింగపురాణము, 

15. గరుడపురాణము, 

16. కూర్మపురాణము, 

17. స్కాంద పురాణము, 

18. బ్రహ్మపురాణము.


మహాభారతములోని పర్వములు-18.


1. ఆదిపర్వము, 2. సభాపర్వము, 3. అరణ్యపర్వము,4.విరాటపర్వము, 5. ఉద్యోగపర్వము(వీటిని ఆది పంచాకాలని), 6. భీష్మపర్వము, 

7. ద్రోణపర్వము, 8. కర్ణపర్వము, 9. శల్యపర్వము, 10. సౌప్తిక పర్వము, 11. శ్రీ పర్వము (వీటిని యుద్ధషష్ఠకములని, 12. శాంతి పర్వము, 13. అనుశాసన పర్వము, 14. ఆశ్రమవాస పర్వము, 

15. అశ్వమేధపర్వము, 

16. మౌసులపర్వము, 

17. మహాప్రస్థాన పర్వము, 

18. స్వర్గారోహణము (వీటిని శాంతి సప్తకములని).


భగవద్గీతలోని అధ్యాయములు-18.


1. అర్జున విషాదయోగము, 2. సంఖ్యాయోగము, 3. కర్మయోగము, 4. జ్ఞాన కర్మసన్యాస యోగము, 

5. కర్మసన్యాస యోగము, 

6. ఆత్మ సంయమయోగము, 

7. జ్ఞానవిజ్ఞాన యోగము, 

8. అక్షర పరబ్రహ్మయోగము, 

9. రాజవిద్యరాజ గుహ్యయోగము, 10. విభూతి యోగము, 

11. విశ్వరూప సందర్శన యోగము, 12. భక్తి యోగము, 13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, 14. గుణత్రయ విభాగ యోగము, 15. పురుషోత్తమ ప్రాప్తియోగము, 16. దైవాసుర సంపద్విభాగ యోగము, 

17. శ్రద్దాత్రయ యోగము, 

18. మోక్ష సన్యాస యోగము.


ఉప పురాణముల సంఖ్య - 18.


1. సనత్కుమారము, 2. నృసింహ పురాణము, 3. స్కందపురాణము, 4. శివధర్మ పురాణము, 

5. నందికేశ్వరపురాణము, 

6. దుర్వాసపురాణము, 

7. నారదీయ పురాణము, 

8. కపిల పురాణము, 

9. మానవ ఔజానన పురాణము, 10. మహేశ్వర పురాణము, 

11. వారుణ పురాణము, 

12. కాళీ పురాణము, 

13. సాంబ పురాణము, 

14. సౌర పురాణము, 

15. పరశర పురాణము, 

16. మారీచ పురాణము, 

17. భార్గవ పురాణము, 

18. బ్రహ్మాండ పురాణము.


స్మృతులు - 18.


1.మనుస్మృతి, 2. బ్రహ్మస్మృతి, 

3. దక్షస్మృతి, 4. గౌతమస్మృతి, 

5. యమస్మృతి, 6. అంగీరసస్మృతి, 7. యోగీశ్వరస్మృతి, 8. ప్రచేసస్మృతి, 9. శాతతాప స్మృతి, 

10. పరాశరస్మృతి, 

11. సంవర్తనస్మృతి, 

12. ఉశనస్మృతి, 13. శంఖస్మృతి, 14. లిఖితస్మృతి,15. ఆత్రేయస్మృతి, 16. విష్ణుస్మృతి, 

17. అపస్తంబస్మృతి,

18. హరీతస్మృతి.


సిద్ధులు - 18.


1.అణిమ, 2.లహిమ, 3.మహిమ, 4.ఈశాక్త్వా, 5.వసిత్వ, 6.ప్రాకామ్యా, 7. బుద్ధి, 8. ఇచ్చా, 9. ప్రాప్తి, 10. సర్వకామ, 11.సర్వాసంపత్ప్రద, 12. సర్వప్రియంకర,

13. సర్వమంగళాకారణ, 

14. సర్వదుఃఖవిమోచన, 

15, సర్వమృత్యుప్రవాచ, 

16. సర్వవిఘ్ననివారణ, 

17. సర్వాంగసుందర, 

18. సర్వాసౌభాగ్యదాయక. 



విద్యలు - 18.


1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 

4. అధర్వణవేదము, 5. శిక్షా, 

6. వ్యాకరణము, 7. చందస్సు, 

8. నిరుక్త, 9. జ్యోతిష్యము, 

10. కల్పము, 11. మీమాంస, 

12. న్యాయశాస్త్రము, 13.పురాణాలు, 14. ధర్మశాస్త్రాలు, 15.ఆయుర్వేదము, 

16. ధనుర్వేదము, 

17. నీతిశాస్త్రము, 

18. అర్ధశాస్త్రము.


మానవ శరీరములో ఉన్న ముఖ్యమైన స్థానము - 18.

1. మూలాధారం, 2. స్వాధిష్ఠానము, 3. మణిపూర్వకము,4.అనాహతము, 5.లంబిక, 6.విశుద్ధి, 7.అంగత, 8.బిందు,9.అర్ధచక్రము, 10.రోధిని, 11. నాధం, 12. సాంధారము, 13. శక్తి, 14.వ్యాపిక, 15.సమన, 16. ఉన్మన, 17. మహాబిందు, 18. సహస్రావరము.


శబరిమలై_ప్రాంతములో_స్వామివారి_

పవిత్రగిరులు_(కొండలు) - 18.


1.శబరిమలై, 2.కాంతమలై(పొన్నంబలమేడు, 

3. నాగమలై, 

4. సుందరమలై(సౌందర్యమలై), 

5. చిత్రంబలమేడు, 6. కల్కిమలై, 7. మదంగమలై(మాతాంగమలై), 

8. శ్రీపాదమలై, 9. గ్రౌండర్మలై (అప్పాచిమేడు), 10. దేవమలై, 11. నైలడంకుండ్రు, 12. తహైప్పార్ మలై, 13. నిలక్కల్ మలై, 

14. పుడుచ్చేరిమలై, 15. కాళైకట్టి, 16. ఇంజిప్పారై, 17. కరిమలై, 

18. నీలిమలై.


అష్టరాగ_పంచేంద్రియ_తిగుణ_జ్ఞానాజ్ఞనములు - 18.


1. కామము, 2. క్రోధము, 

3. లోభము, 4. మోహము, 

5. మాత్సర్యము, 6. దర్పము, 

7. అహంకారము, 8. కన్ను, 

9. ముక్కు, 10. చెవి, 11. నోరు (నాలుక), 12.చర్మము, 13.సత్వ గుణము, 14. తమోగుణము, 

15. రజోగుణము, 16. అవిద్య, 17. విద్య, 18.ఆశ.


పద్దెనిమిది_సార్లు_మాల_ధరించి_వెళ్లి_వచ్చిన_స్వామి_వార్ల_పేర్లు - 18.

1. కన్నెస్వామి, 2. కత్తిస్వామి, 

3. గంటస్వామి, 4. గధాస్వామి, 

5. పెరియస్వామి, 6. జ్యోతిస్వామి (గురుస్వామి), 7. సూర్యస్వామి, 

8. చంద్రస్వామి, 9. త్రిశూలస్వామి, 10. విష్ణుచక్రస్వామి, 11. శంఖదార స్వామి, 12. నాగభరణస్వామి, 

13. శ్రీహరి స్వామి, 14.పద్మస్వామి, 15. శ్రీస్వామి, 16. శ్రీశబరిగీశ్వరస్వామి (రాతిస్వామి), 17. ఓంకారస్వామి, 18. నారికేళస్వామి.


పద్దెనిమిదిసార్లు_శబరిమలై_వెళ్ళిన_స్వాములు_ప్రతీ_ఏట_శరంగుత్తిలో_వదిలి పెట్టే వస్తువులు - 18.

1. శరము (బాణం), 2. కత్తి, 

3. గంట, 4. గధ, 5. విల్లు (ధనస్సు), 6. జ్యోతి (దీపము), 7. సూర్యుడు, 8. చంద్రుడు, 

9. త్రిశూలము, 10. విష్ణు చక్రము, 11. శంఖం, 12. నాగాభరణం, 13. వేలాయుధం, 14. పద్మము (కమలము), 15. శ్రీ, 16. రాయి, 17. ఓం, 18. కొబ్బరిచెట్టు.


కాళికాదేవి_యొక్క_కరములు - 18.

అమ్మవారి యొక్క కాళికారూపములో ఆమె చేతులు మొత్తము పద్దెనిమిది.


భారతయుద్ధము_జరిగిన_దినములు - 18.

కురుక్షేత్ర సంగ్రామములో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధము చేసినది పద్దెనిమిది రోజులు.


కురుపితామహుడు_అంపశయ్యమీద వున్న_దిననములు - 18.


పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైన ఉన్నది 18 దినములు.


భారత_యుద్ధములో_పాల్గొన్న_అక్షౌహిణులు-18, సుప్రసిద్ధమైన భాషలు కూడా పద్దెనిమిది.


అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల పదునెట్టాంబడిని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజలలోను ఇంత విలువ కలిగియున్నది.✍️```

పద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప🙏

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*

*590 వ రోజు*


*మధు కైటబులు*


ప్రణవధ్వని వచ్చిన దిక్కుకు పరుగెత్తిన మధుకైటభులకు అక్కడ ఎవరూ కనపడక వేదములు పెట్టిన చోటుకు వెళ్ళి చూసి అక్కడ వేదములు కనిపించక పోవడంతో వారికి భయంకరమైన కోపము వచ్చింది. నానారభస చేస్తూ అటూఇటూ తిరుగుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి వారికి కనిపించాడు. వారు విష్ణువును యుద్ధముకు ఆహ్వానించగా విష్ణువు యుద్ధోన్మాదులైన మధుకైటబులను సంహరించాడు. అలాసృష్టి జరగడానికి సాయం చేసాడు. బ్రహ్మదేవుడు సృష్టిచేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి హయగ్రీవుడు అన్ని అవతారముల కంటే మహిమాన్వితుడయ్యాడు. వేదములను రక్షించిన హయగ్రీవుడిని వేదములు సదా ఆశ్రయించి ఉంటాయి. జనమేజయమహారాజా ! హరి త్రిగుణములలో హెచ్చుతగ్గులను కలిగిస్తుంటాడు కనుక మానవులలో కూడా త్రిగుణములు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అందుకే మానవులలో ఒకరు గుణవంతులు మరొకరు గుణరహితులు ఔతారు. మానవులలో త్రిగుణాలకు కారణం అయిన శ్రీహరి త్రిగుణాలను నాశనంచేసే శక్తి ఆయనకే ఉంది. వేదములు, యజ్ఞములు, పుణ్యకార్యములు, పంచభూతములు శ్రీహరి రూపాలే " అని వైశంపాయనుడు చెప్పాడు.


*ఏకాగ్రత*


జనమేజయుడు " మహాత్మా ! ఏకాగ్రచిత్తులు గొప్ప వారు అన్నావు కదా ! అసలు ఏకాగ్రత అంటే ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పూర్వము శ్రీకృష్ణుడు మీ తాతగారైన అర్జునుడికి భారతయుద్ధ ఆరంభంలో సాంఖ్యము, యోగముల సారము బోధించారు. దానినే భగవద్గీత అంటారు. అది నేను ఎప్పుడో విన్నాను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా విను. ఏకాగ్రత ధర్మమును పూర్వము నారాయణుడికి ఉపదేశించాడు. దానిని బ్రహ్మ దక్షుడికి ఉపదేశించాడు. దక్షప్రజాపతి తన మనుమడైన సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. ఇక్ష్వాకుడి నుండి ఆ ఏకాంతిక ధర్మము యోగ్యులైన వారికి పరంపరగా అందజేయబడింది. ఈ ఏకాంతిక ధర్మమును మహావిష్ణువు నుండి ఉపదేశం పొందిన నారదుడు తన శిష్యులకు ఉపదేశించాడు. వారి నుండి వారి శిస్యులకు అలా పరంపరగా సకల జనులకు చేరింది. ఏగాగ్రత ధర్మము దుర్మార్గులకు మాత్రము అవగతము కాదు. ఈ ఏకాగ్రత ధర్మము అహింసకు మూలము. ఈ అహింసా వ్రతముతో శ్రీహరి ప్రీతి చెందుతాడు. హరి అన్నా క్షేత్ర్తజ్ఞుడు అన్నా ఒకటే. శ్రీహరి తన భక్తులకు వాసుదేవాది నాలగు రూపములలో దర్శనం ఇస్తాడు. ఈ నలుగురిలో వాసుదేవుడు ప్రధముడు, రెండవ వాడు సంకర్షుణుడు, మూడవ రూపము ప్రద్యుమ్నుడు, నాల్గవ రూపము అనిరుద్ధుడు. ఎన్ని రూపములలో దర్శనం ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా ఉండే రూపము ఒక్కటే. ఆ దైవస్వరూపము మన ఇంద్రియములకు గోచరం కాదు. అనన్య భక్తి, తపస్సు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలవారికి మాత్రమే ఆ దైవస్వరూపము గోచరమౌతుంది. ఏకాంతధర్మము శాంత మనస్కుడికి కరతలామలకం. ఈ ఏకాగ్ర ధర్మము మనలోని అన్ని చింతలను తుడిచి వేయు ఆయుధము " అని వైశంపాయనుడు చెప్పాడు.


*నోములు వ్రతాలు*


జనమేజయుడు" మహాత్మా ! ప్రజలు అత్యున్నతమైన ఏకాగ్రతావ్రతం ఆచరించక ఏవోవో పూజలు నోములు వ్రతాలు ఏ ప్రయోజనాన్ని ఆచరిస్తున్నారు ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! మనస్సు త్రిగుణముల వలన ప్రభావితమౌతుంది. అందులో ఉత్తమమైన సాత్వికగుణము కలవారి యోగక్షేమములు శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు. వారే ఏకాగ్రచిత్తం కలిగిన ఏకాంతికులు. వారికి దైవచింత తప్ప వేరే వ్యాపకం లేదు. రాజసము తామసము అవలంబించిన వారు ప్రాపంచిక విషయాలలో మునిగి భోగలాలసలో నిమజ్ఞులై ఉంటారు. అలాంటి వారు శ్రీహరికృపకు పాత్రులు కాలేరు. ఏకాంతికులు ఏకాంతచిత్తంతో సేవించే వారు విష్ణుమూర్తి మనసులో చోటుచేసుకుంటారు. ఈ విషయాన్ని వేదాలు కూడా ఉద్ఘాటిస్తున్నాయి. మా గురువుగారు దయతో నాకు ఉపదేశించిన ఈ ఉపదేశము విని నేను పవిత్రుడనైనాను. జనమేజయా ! నీవు కూడా ఆచరించగలిగిన ఏకాగ్రవ్రతము ఆచరించి ఏకాగ్రతతో శ్రీహరిని ధ్యానించి తరించి శాశ్వతత్వాన్ని పొందు " అని వైశంపాయనుడు. జనమేజయుడు" ఓ మహర్షీ ! లోకములో యోగము, సాంఖ్యము, వేదములు, పాశుపతము, పంచరాత్రము, ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి కదా! అన్నిటికీ నిష్టలు ఒకే విధంగా ఉంటాయా ! లేక వేరువేరుగా ఉంటాయా ! అసలు వీటిని ఎవరు ఉపదేశించారు ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వేదములకు, సాంఖ్యముకు, యోగముకు, ఇతర శాస్త్రాలకు మూలకర్త శ్రీహరే ! అన్నీ ఆయనను చేరడానికి ఉన్న మార్గాలే ! వేదములను నారాయణ పుత్రుడు అయిన వ్యాసుడి చేత ఉపదేశించబడింది. సాంఖ్యమును కపిలుడు ఉపదేశించాడు, యోగమును హిరణ్యగర్భుడు ఉపదేశించాడు, పాశుపతమును శివుడు ఉపదేశించాడు, వైష్ణవము అను పంచరాత్రమును సాక్షాత్తు విష్ణుమూర్తి చేత ఉపదేశింపబడింది " అని వైశంపాయనుడు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1325


⚜  తమిళనాడు : పల్లికొండ - వెల్లూరు


⚜  శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం




💠 ఉతర రంగనాథర్ ఆలయం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని పల్లికొండ గ్రామంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. 


💠 ఈ ఆలయం పాలార్ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ స్వామివారిని   రంగనాధ స్వామి అని, అమ్మవారిని రంగనాయకి తాయర్ అని పిలుస్తారు. 


💠 బ్రహ్మదేవుని యజ్ఞానికి భంగం కలిగించడానికి ఉద్దేశించిన వరదను అడ్డుకోవడానికి నారాయణుడు తనను తాను శయన కోలంలో ప్రదర్శించిన మూడు ఆలయాలలో ఇది మొదటిది.


💠 ప్రభువు పాల సముద్రంలో (క్షీర సాగర లేదా పాల కడల్) వలె శయన రూపంలో ఉన్నందున, ఈ నదికి పాలార్ అని పేరు పెట్టారు, అంటే 

పాలార్ అనగ క్షీర నది. 

పల్లికొండ అనగా శయనించిన స్వామి అని అర్ధం. 


💠 బ్రహ్మాండ పురాణము ప్రకారము ఈ క్షేత్రములో ఒక దినము గడిపి స్వామిని పూజించిన మోక్షము లభించునని భక్తుల నమ్మకము. మూడు దినములు కాంచిపురములో గడిపి వరదరాజ స్వామిని పూజించిన మోక్షము కలుగునని నమ్మకము. 



🔆 స్థల పురాణం


💠 శ్రీ మహాలక్ష్మి మరియు సరస్వతిల మధ్య ఒకరిపై మరొకరి ఆధిపత్యం గురించి ఒకసారి చర్చ జరిగి వారివురు బ్రహ్మదేవుని వద్దకు తీర్పుకై వచ్చారు. బ్రహ్మ శ్రీ మహాలక్ష్మి సరస్వతిదేవి కంటే ఉన్నతమైనదని తెలిపెను. 

దాంతో సరస్వతీ దేవి కోపించి బ్రహ్మదేవుడిని విడిచిపెట్టి, నంది దుర్గ కొండలకు వచ్చి ఆధిపత్యం కోసం తపస్సు చేయడం ప్రారంభించింది. 

ఈ సమయంలో, బ్రహ్మ దేవుడు శ్రీమన్నారాయుణుడుకు అంకితం చేయుటకు యజ్ఞాన్ని నిర్వహించాడు. నియమం ప్రకారం, ఈ ఆచారాలను అతని భార్యతో నిర్వహించాలి. 

బ్రహ్మ సరస్వతీ దేవిని తనతో కలిసి యజ్ఞానికి ఆహ్వానించాడు, కానీ ఆమె నిరాకరించింది.


💠 బ్రహ్మ మహా సరస్వతి గుణాలతో సావిత్రిని సృష్టించి, ఆమెను వివాహం చేసుకొని, సరస్వతి దేవికి మరింత కోపం తెప్పించిన యజ్ఞాన్ని ప్రారంభించాడు. 

యజ్ఞాన్ని నాశనం చేయడానికి సరస్వతి దేవి, షీరా నది లేదా పాలార్ నదిగా అవతరించి ఉగ్రంగా ప్రవహించడం ప్రారంభించింది. 

వరదను ఆపమని యజ్ఞాన్ని రక్షించమని బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు.


💠 బ్రహ్మ కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు జలప్రళయానికి ముందు మూడు పుణ్యక్షేత్రాలలోని ఆదిశేషునిపై దీర్ఘరూపం ధరించి వరదను ఆపి యజ్ఞం విజయవంతంగా ముగించుటకు సహాయపడ్డారు.


💠 మహావిష్ణువు శయన రూపాన్ని పొందిన మొదటి ప్రదేశం ఈ పల్లికొండ క్షేత్రం, దీనిని వడ ఆరంగం అని కూడా పిలుస్తారు, రెండవది కావేరిపక్కం సమీపంలోని తిరుపార్కడల్, మూడవది కాంచీపురంలోని తిరువెక్కా ఆలయం లేదా యథోక్తకారి పెరుమాళ్ (సొణ్ణ వణ్ణం సెయిద పెరుమాళ్).


💠 విదేశీ దండయాత్రల సమయంలో, అసలు ఉత్సవ రంగనాథస్వామి విగ్రహాన్ని దాచిపెట్టి, దాని స్థానంలో కస్తూరి రంగనాథర్ లేదా చొట్ట రంగనాథర్ అని పిలువబడే శ్రీ రంగనాథర్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. 

ధండయాత్రలు ముగిసినప్పటికి నేటికినీ ఈ చొట్ట రంగనాథ స్వామికి పూజలు జరుపుతారు. 


💠 సంపతి ఋషి కోరిక మేరకు ఈ క్షేత్రములో స్వామి శెంబగవల్లి తాయారును ఉత్తర పాల్ఘుణి దినమున వివాహము చేసుకొన్నందున ఈ ఆలయములో వివాహములు జరుపుదురు. 

ఇచట వివాహము జరిగిన దంపతుల దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో సాగునని భక్తుల నమ్మకము. 


💠 స్థలపురాణము ప్రకారము బ్రహ్మ విష్ణూమూర్తికి అంకితము చేసిన యజ్ఞమును విజయవంతముగా పూర్తి చేసిన తరువాత యజ్ఞ కుండము నుండి కాంచిపురములోని శ్రీ వరదరాజ స్వామి ఉద్భవించారు. ఇప్పటికిని స్వామి తిరుముగముపై కాలిన మచ్చలు కనిపించును. 


💠 ఇచట రంగనాధ స్వామికి బ్రహ్మ పది దినముల ఉత్సవము జరిపెను. ఈ ఉత్సవమును మొదటి బ్రహ్మోత్సవముగా పరిగణించబడినది. ఈ కాలములో అనేక విష్ణు ఆలయములలో బ్రహ్మోత్సవములు జరుపుచున్నారు గాని ఇచట జరిగిన ఉత్సవము బ్రహ్మ జరిపిన మొదటి బ్రహ్మోత్సవమని పరిగణించబడినది. 


💠 ప్రధాన మూలవర్ ఉతర రంగనాధస్వామి భూదేవి, శ్రీదేవి సమేతముగా బ్రహ్మ నాభి స్థానములో శయన కోలములో కలరు. 

స్వామి వారి విగ్రహము శాలగ్రామ శిలతో చేయబడినది. 


💠 ఉత్సవ మూర్తి రంగనాధ స్వామి శ్రీదేవి భూదేవి సమేతముగా వేంచేసియున్నారు. 

వేరొక ఉత్సవ మూర్తి కస్తూరి రంగనాధ స్వామి కూడ ఇచట కలదు. 

ఈ ఉత్సవ మూర్తికి కూడ ప్రతి దినము ఆరాధన జరుగును. అమ్మవారు రంగనాయకి ప్రత్యేక సన్నిధి  భక్తులకు దర్శనము.


💠 ఈ ఆలయములో శ్రీ రాములవారు, నవనీత కృష్ణుడు, ఆండాళ్, ఆంజనేయుడు, రామానుజలవారు, మనవాల మామునిగళ్, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, గరుడాళ్వార్ సన్నిధులు ఆలయ ప్రాంగణములో కలవు. ఆలయ తీర్ధము వ్యాస తీర్ధము. 


💠 ఏప్రిల్-మే నెలల్లో బ్రహ్మోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి ఈ ఆలయంలో చాలా కోలాహలంగా జరుపుకుంటారు. 


💠 ఈ ఆలయం వెల్లూరు నుండి 24 కిలోమీటర్లు, చెన్నై నుండి 159 కిలోమీటర్లు దూరంలో ఉంది. 

ఈ ఆలయం వెల్లూరు నుండి కృష్ణగిరి మార్గంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

ఆదివారం,డిసెంబరు.14,2025.

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం,డిసెంబరు.14,2025.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:దశమి రా8.34 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:హస్త ఉ10.59 వరకు

యోగం:సౌభాగ్యం మ2.50 వరకు

కరణం:వణిజ ఉ8.01 వరకు తదుపరి భద్ర రా8.34 వరకు

వర్జ్యం:రా7.37 - 9.21

దుర్ముహూర్తము:సా3.56 - 4.40

అమృతకాలం:తె5.59 నుండి

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 -1.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం: 6.25 సూర్యాస్తమయం:5.24  

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*,

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - దశమి  - హస్త / చిత్ర -‌‌ భాను వాసరే* (14.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం

 


13, డిసెంబర్ 2025, శనివారం

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹


క్రియతే అనేన ఇతి కర్మ - చేయబడేది ఏదైనా కర్మయే. కర్మ అనేది సంస్కృత పదం. అది 'కృ' అనే ధాతువు నుంచి వచ్చింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరికంగా కాని చేసినది. పూర్తయిన పనిని కర్మ అని, జరుగుతున్న పనిని క్రియ అని అంటారు.

అలాగే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన విషయంలో మూడు విభాగాలు ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే చేయువాడు, క్రియ అంటే చేయబడుతున్న కార్యం, కర్మ అంటే చేయబడిన కర్మ యొక్క ఫలం. కర్త, క్రియ లేకపోతే కర్మ ఉండదు. నేను చేస్తున్నాను అనే భావనతో, ఆథ్యాత్మ నిష్ఠగా ఇంద్రియాల చేత, అంటే శబ్ద (వినడం), స్పర్శ (తాకడం), రూప (చూడటం), రస (రుచి చూడతం), గంధాలతో (వాసన చూడటం) చేసే వ్యాపరమే కర్మ. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక మనస్సుతో చేసేది కూడా కర్మయే అవుతుంది.

అలాగే కర్మలను మూడు రకాలు చేస్తుంటాము. కాయిక (శరీరంతో చేసేవి), వాచిక (మాటల ద్వారా), మానసిక (మనస్సుతో) చేసే కర్మలు. ఈ మనస్సు, వాక్కు, కాయాలనే త్రికరణములు అంటారు. 

త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం కూడా మెచ్చుతుంది.

కర్మకు కులమతాలు, ప్రాంత, లింగ భేదాలు లేవు. ఈ లోకంలో అందరు కర్మలు చేస్తారు, ఫలం అనుభవిస్తారు. ఇది మన కళ్లకు కనిపిస్తూనే ఉంది.

అలాగే కర్మలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి చేయడం. ఇది బాహ్య స్వరూపం లేదా దృశ్య స్వరూపం. రెండు దాచడం. ఇది అంతర్గత స్వరూపం లేదా అదృశ్య స్వరూపం. మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. ఇది కర్మ ఫలానుభవం అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభ వించటం

ఈ ప్రపంచంలోని ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకు లోబడి కర్మలను చేయాల్సి ఉంటుంది అంటారు కృష్ణ పరమాత్మ.

కర్మ అంటే పని లేదా కార్యము లేదా క్రియ అని చెప్పేది సులభమైన అర్ధం. కానీ కార్యకారణ నియతితో నడిచే ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదం అన్వయమవుతుంది. కార్యం అంటే ఫలము/ ప్రయోజనము (Effect). కారణమంటే ఆ ఫలానికి గల హేతువు/ కారణము (Cause). విశ్వచైతన్యం ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడిపిస్తుంది.


పాపకార్యమైనా, పుణ్యకార్యమైనా దాన్ని కర్మ అనే అంటారు. సత్ఫలితాన్నిచ్చే కర్మను సత్కర్మ అని, దుష్ఫలితాన్ని (చెడు ఫలాన్ని) ఇచ్చే కర్మను దుష్కర్మ అని అంటారు.


అవశ్యమను భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభమ్ ......

చేసిన పని మంచిదైనా, చెడ్డదైనా, దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరాలని శాస్త్రవాక్కు. చేసిన కర్మకు ఫలితం అనుభవించకుండా తప్పించుకోనుట అసాధ్యం. అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అయితే ఒక కర్మ (పని) చేసినప్పుడు, అవి ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు. అవి 1) ఆగామి కర్మలు, 2) సంచిత కర్మలు, 3)ప్రారబ్ధ కర్మలు 


అంటే ఒక విత్తనం వేసినప్పుడు, అది మొక్కయై, చెట్టు గా మారి, మొగ్గ వేసి, పువ్వు పూసి, పిందే గా మారి, కాయ (పచ్చి) గా రూపాంతరం చెంది, అనుభవించేందుకు సిద్ధం అవుతుంది, అంటే పక్వానికి వస్తుంది, పండుతుంది. అలా మనం చేసిన కర్మ పక్వానికి (కర్మ పండడానికి) పట్టే సమయం బట్టి వాటిని పై మూడింటిగా విభాగం చేశారు.


1- ఆగామి కర్మ - మనం చేసే కొన్ని పనులకు వెంటనే, ఇప్పటికిప్పుడే ఫలం లభిస్తుంది. వాటిని ఆగామి కర్మలు అంటాము. ఉదాహరణకు దాహం వేస్తే, నీరు త్రాగుతాం. నీరు త్రాగడం కర్మ అయితే, దాహం తీరడం ఆ కర్మ యొక్క ఫలం. అలాగే ఆకలి తీరుచుకోవడానికి భోజనం చేస్తాము. భోజనం అనే కర్మ, ఆకలిని తీర్చి, అనగా తగిన ఫలాన్ని వెంటనే ఇచ్చి, అక్కడితో శాంతిస్తోంది. ఇది ఆగామి కర్మ.

ఆవేశాలు అదుపు తప్పినప్పుడు, ఒకరిపై చేయి చేసుకుంటాము, నాలుగు తిడతాము. అవతలి వాడు సమర్ధుడైతే తిరిగి నాలుగు తంతాడు, బాగా వాయించి వదిలిపెడతాడు. అది అగామి కర్మ.

ఆగమి కర్మలు అంటే ఈ జన్మలో చేసిన కర్మకు ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడమన్నమాట.

2- సంచిత కర్మ - కొన్ని కర్మలు (పనులు) వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చేస్తే, ఇంకెప్పుడో ఫలం అనుభవిస్తాము. అంటే ఫలం అనుభవించే వరకు అవి మనలని వెంటాడుతూనే ఉంటాయి. అంటే అవి కూడబెట్టబడి (సంచితం) చేయబడి ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే సమయం వచ్చే వరకు అవి సంచీలో భద్రంగా ఉంటాయన్నమాట.

ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే, మనం ఒకరిపై చేయి చేసుకున్నా, లేక నాలుగు తిట్టినా, అవతలి వ్యక్తి వెంటనే ప్రతిచర్యకు దిగకపోవచ్చు. కానీ అది మనస్సులోనే పెట్టుకునే, తగిన సమయం కోసం వేచి చూస్తాడు. సమయం వచ్చినప్పుడు, ఇంతకంటే గట్టి దెబ్బ కొడతాడు. అది ఎప్పుడనేది తెలియదు. అది సంచిత కర్మ. 

ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, మనం ఈ రోజు ఒక విత్తనం వేసి, నీరు పోస్తే, అది ఒకనాటిగా చెట్టు అయ్యి, పండ్లు కాసి, మనకు అందిస్తుంది. అక్కడ విత్తనం వేయగానే పండు (ఫలం) రావట్లేదు. దానికి కొంత సమయం పడుతున్నది. అది సంచిత కర్మ.

ఈ సంచిత కర్మలకు ఫలాలన్నీ ఈ జన్మలోనే లభిస్తాయని లేదు. అది కాలచక్రంలో ఏ జన్మ లోనో లభించవచ్చు. 

అంటే ఇంతకముందు లేదా ఈ జన్మలో చేసి- తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మలలో నుండి, ఆ జనంలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించిన కర్మలు పోను, మిగిలిన కూడబెట్టబడిన కర్మలను, అదే విధంగా, ఇంతకముందు అనేక జన్మలలో జీవుడు చేసిన కర్మల నుండి ఖర్చైనవి మినహా, ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటారే, అలా నిజంగా అవి వెనకేసుకుంటామో లేదో గానీ, కర్మ అనే సంచీలో అనేక జన్మల కర్మలను పోగు చేసుకుని, జీవుడు జన్మల పరంపరను పొందుతుంటాడు. వాటిని సంచిత కర్మలు అంటారు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా, ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి వెళ్ళకుండా అతడితోనే ప్రయాణిస్తుంటాయి. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి.

  వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి. 

నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు.  కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా  లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం. 

కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు. 

అదే విధంగా అనేక షాపులు కిరాణా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 

ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు , కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంతే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. 

పూజా సామానులు.  

అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉదుబత్తులు , ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతల పేర్లు  కాకుండా దేవుళ్ళ బొమ్మలు  ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్న అట్ట డబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు నచ్చిన  వస్తువో  జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు. 

మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడటం లో మీ వంతు  కృషి  చేయగలరు. 

కాశి ఆలయ చరిత్ర*

  *కాశి ఆలయ చరిత్ర*


👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 


👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*


👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*


👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*


👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*


👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు*


👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*


👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*


👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*


👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*


👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*


👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*


👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*


👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*


👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*


👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*


👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*


👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*


👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*


👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 


👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*


👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*


👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*


👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*


👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*


👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*


👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*


👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*


🙏 *ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా ఫార్వర్డ్ చేయగలరు.*🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ।। 21 ।।


ప్రతిపదార్థ: 


వేద — తెలుసుకున్న; అవినాశినం — నాశము కానిది; నిత్యం — నిత్యమైనది; యః — ఎవరైతే; ఏనమ్ — ఇది; అజమ్ — జన్మ లేనిది; అవ్యయమ్ — మార్పుచెందనిది; కథం — ఎట్లా; సః — అది; పురుషః — వ్యక్తి; పార్థః — పార్థా; కం — ఎవరిని; ఘాతయతి — చంపే కారణం; హంతి — చంపును; కమ్ — ఎవరిని.


తాత్పర్యము :


ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?


 వివరణ:


ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ, మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచి వేస్తుంది. ఆ స్థితిలో, మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు, అన్నీ పనులు చేస్తూనే వున్నా, వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్తగా భావించుకొని, అహంకార రహితముగా, బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.

తిరుమల ఆలయంలో

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *శుభ ధనుర్మాసం….*


*తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై.*🙏


శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1. ఆండాళ్ అని ఎవరికి పేరు?    

     = గోదాదేవి.


2. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


3. ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= ‘భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే’ మంచిరోజు.


4. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

   = శ్రీ విష్ణు చిత్తులు.(పెరియాళ్వార్)


5. ఆళ్వారులు ఎంతమంది?

      = 12మంది.


6. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

     = భూదేవి.


7. గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

   = తమిళ భాష.


8. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

  = నాలాయిర్ దివ్యప్రబంధము.


9. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

      = 108.


10. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

    = శ్రీవిల్లిపుత్తూరు.


11. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

   = దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


12. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

    = 196 అడుగులు.


13. ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


14. శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


15. శ్రీవిష్ణుచిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


16. పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


17. తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.


18. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


19. శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


20. తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


21. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


22. కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


23. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


24. ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


25. తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


26. ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


27. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.


28. మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


29. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


30. ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


31. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


32. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


33. పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


34. విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


35. విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


36. తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


37. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


38. తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


39. గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


*40. తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41. కీచుకీచుమని అరిచే ‘ఏ’ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


*42. తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*43. మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?

= పక్షులు.


*44. ఎనిమిదవ పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

= నమ్మళ్వారు.


*45. పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

= శిరువీడు.


*46. భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*47. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

= కుంభకోణం.


*48. పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= ప్రీతి వ్రతం.


*49. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వార్.


*50. పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

= శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51. పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

= బకాసుర వధ.

 

*52. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

= త్యాగం.


*53. శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుప్పాణి.


*54. తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

= భగవద్రామానుజులు.


*55. తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

= నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు!’


*56. శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

= అహంకారమును హతమార్చుట.


*57. పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

= దాస్య వ్రతము.


*58. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

= నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59. కోయిల్ అనగా ఏమి?

= కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60. నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

= దాన గుణము.


*61. గోపికలు ‘ఎంబెరుమాన్’(మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

= నందుడు.


*62. భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమంగై యాళ్వారు. 


*63. గోపికలు తమ వంశమునకు .!మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

= యశోద.


*64. ‘శెంపొర్కజలడి’ -ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

= బలరాముడు. 


*65. నీళాదేవి ఎవరు?

= కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66. యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67. భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

= పేయాళ్వారు.


*68. ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

= ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

= 18 వ పాశురం.


*70. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

= 18వ పాశురం.


*71. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

= కువలయాపీడము.


*72. అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73. గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

= అద్దము, విసనకఱ్ఱ.


*74. తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

= కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75. ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

= మృగరాజగు సింహము.


*76. ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

= అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77. పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

= సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

= సింహ గర్జన.


*79. కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

= మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80. కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

= వెలగ చెట్టు.


*81. ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= భోగవ్రతము.


*82. ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

= శ్రీవిల్లిపుత్తూరు.


*83. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

= పాంచజన్యము.


*84. ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన ‘కూడార్’ ఎవరు?

= సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85. ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

= కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86. భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

= గోవింద.


*87. భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.


*88. కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

= సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

= ఆవుల వెనుక.


*90. ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

= 27 వ పాశురం.


*91. పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

= శ్రీకృష్ణునివి.


*92. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

= దాసుని లక్షణములు.


*93. ‘అజాయమానః’ (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

= ‘బహుధా విజాయతే’(అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము(విష్ణువనే ఓడ)


*95. పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


*96. ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97. ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


*98. వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


*99. ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


*100. ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= ‘తిజ్గళ్ తిరుముగత్తు’- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101. గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

‘అణి పుదువై’ ఈ జగత్తుకే మణివంటిది.


*103. శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104. గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105. తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎ🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *శుభ ధనుర్మాసం….*


*తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై.*🙏


శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1. ఆండాళ్ అని ఎవరికి పేరు?    

     = గోదాదేవి.


2. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


3. ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= ‘భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే’ మంచిరోజు.


4. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

   = శ్రీ విష్ణు చిత్తులు.(పెరియాళ్వార్)


5. ఆళ్వారులు ఎంతమంది?

      = 12మంది.


6. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

     = భూదేవి.


7. గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

   = తమిళ భాష.


8. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

  = నాలాయిర్ దివ్యప్రబంధము.


9. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

      = 108.


10. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

    = శ్రీవిల్లిపుత్తూరు.


11. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

   = దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


12. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

    = 196 అడుగులు.


13. ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


14. శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


15. శ్రీవిష్ణుచిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


16. పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


17. తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.


18. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


19. శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


20. తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


21. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


22. కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


23. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


24. ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


25. తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


26. ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


27. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.


28. మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


29. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


30. ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


31. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


32. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


33. పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


34. విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


35. విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


36. తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


37. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


38. తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


39. గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


*40. తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41. కీచుకీచుమని అరిచే ‘ఏ’ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


*42. తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*43. మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?

= పక్షులు.


*44. ఎనిమిదవ పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

= నమ్మళ్వారు.


*45. పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

= శిరువీడు.


*46. భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*47. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

= కుంభకోణం.


*48. పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= ప్రీతి వ్రతం.


*49. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వార్.


*50. పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

= శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51. పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

= బకాసుర వధ.

 

*52. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

= త్యాగం.


*53. శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుప్పాణి.


*54. తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

= భగవద్రామానుజులు.


*55. తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

= నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు!’


*56. శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

= అహంకారమును హతమార్చుట.


*57. పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

= దాస్య వ్రతము.


*58. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

= నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59. కోయిల్ అనగా ఏమి?

= కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60. నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

= దాన గుణము.


*61. గోపికలు ‘ఎంబెరుమాన్’(మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

= నందుడు.


*62. భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమంగై యాళ్వారు. 


*63. గోపికలు తమ వంశమునకు .!మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

= యశోద.


*64. ‘శెంపొర్కజలడి’ -ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

= బలరాముడు. 


*65. నీళాదేవి ఎవరు?

= కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66. యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67. భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

= పేయాళ్వారు.


*68. ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

= ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

= 18 వ పాశురం.


*70. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

= 18వ పాశురం.


*71. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

= కువలయాపీడము.


*72. అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73. గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

= అద్దము, విసనకఱ్ఱ.


*74. తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

= కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75. ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

= మృగరాజగు సింహము.


*76. ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

= అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77. పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

= సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

= సింహ గర్జన.


*79. కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

= మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80. కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

= వెలగ చెట్టు.


*81. ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= భోగవ్రతము.


*82. ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

= శ్రీవిల్లిపుత్తూరు.


*83. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

= పాంచజన్యము.


*84. ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన ‘కూడార్’ ఎవరు?

= సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85. ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

= కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86. భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

= గోవింద.


*87. భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.


*88. కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

= సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

= ఆవుల వెనుక.


*90. ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

= 27 వ పాశురం.


*91. పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

= శ్రీకృష్ణునివి.


*92. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

= దాసుని లక్షణములు.


*93. ‘అజాయమానః’ (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

= ‘బహుధా విజాయతే’(అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము(విష్ణువనే ఓడ)


*95. పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


*96. ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97. ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


*98. వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


*99. ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


*100. ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= ‘తిజ్గళ్ తిరుముగత్తు’- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101. గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

‘అణి పుదువై’ ఈ జగత్తుకే మణివంటిది.


*103. శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104. గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105. తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్.


ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్🙏


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!వరి పేరు?

= గోదాదేవి.


*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్.


ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్🙏


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!