31, డిసెంబర్ 2025, బుధవారం

అపూర్వ శాస్త్రాలు:*

 3112e6;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


          *అపూర్వ శాస్త్రాలు:*

               ➖➖➖✍️

 

*నేడు అమలులో లేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:*

 

*🌼 1.అక్షరలక్ష:*```

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము. రచయిత వాల్మీకి

మహర్షి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణం లను కొలిచే పద్ధతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

 ```


*🌼 2.శబ్దశాస్త్రం:*```

రచయిత ఖండిక ఋషి. 

సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.```

 


*🌼 3.శిల్పశాస్త్రం:*```

రచయిత కశ్యపముని. 

ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. 307 రకాల శిల్పాల గురించి,101రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పినవిషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.```

 


*🌼 4.సూపశాస్త్రం:*```

రచయిత సుకేశుడు. 

ఇది పాకశాస్త్రం. ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.```


 

*🌼 5. మాలినీ శాస్త్రం:*```

రచయిత ఋష్యశృంగ ముని. పూలమాలలను తయారుచేయడం, పూలగుత్తులు, పూలతో రకరకాల

శిరోఅలంకరణలు, రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.```

 


*🌼 6.ధాతుశాస్త్రం:*```

రచయిత అశ్వినీకుమార. 

సహజ, కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.

మిశ్రమలోహాలు, లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.```

 


*🌼 7.విషశాస్త్రం:*```

రచయిత అశ్వినీకుమార.

32 రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.```

 

*🌼8.చిత్రకర్మశాస్త్రం (చిత్రలేఖనశాస్త్రం):*```

రచయిత భీముడు. 

ఇందులో 12 అధ్యాయాలు

ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని, గోటిని కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.```

 


*🌼 9.మల్లశాస్త్రం:*```

రచయిత మల్లుడు. 

వ్యాయామాలు, ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు

చెప్పబడ్డాయి.```

 


*🌼 10.రత్నపరీక్ష:*```

రచయిత వాత్సాయన ఋషి. 

రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి. వీటిశుద్ధతను

పరీక్షించడానికి 32 పద్ధతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా

విభజించి తర్కించారు.```

 


*🌼 11.మహేంద్రజాల శాస్త్రం:*```

సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. 

నీటిపై నడవడం, గాలిలో

తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది. ```

 

*🌼 12.అర్థశాస్త్రం:*```

రచయిత వ్యాసుడు.

ఇందులో భాగాలు 3. 82 రకాల ధర్మబద్ధమైన ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు. ```

 

*🌼 13.శక్తితంత్రం:*```

రచయిత అగస్త్యముని. 

ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.```

 


*🌼 14.సౌధామినీకళ:*```

రచయిత మతంగ ఋషి.

నీడల ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది. భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.```

 


*🌼 15.మేఘశాస్త్రం:*```

రచయిత అత్రిముని. 

12 రకాల మేఘాలు, 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు, 33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.```

 


*🌼 16. స్థాపత్యవిద్య:*```

అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కట్టడాలు, నగర ప్రణాలిక మొదలైన సమస్థ నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

 

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి,


ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

 

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

 

వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి

  



*మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు:*

                 ➖➖➖✍️```


1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో!


2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో? శాంతం వహించాలో గమనించుకో!


3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను 

తగ్గించగలదని గుర్తించుకో!


4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ, నీరూ తగినంతగా ఉండేలా చూసుకో! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో!


5. కక్ష కన్నా క్షమ గొప్పది! 

క్షమ కన్నా ‘జీవుల పట్ల కరుణ’ గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !


6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో!


7. నవ్వును, దగ్గరకు తీసుకో, ఇతరులతో నీ భావాలు పంచుకో!


8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కొట్టడం నేర్చుకో!


9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో! ఎదుటి వారిని అంచనాలు వేయడం మానుకో!


10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !


11. మద్యానికి, మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు. అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో. ‘శాకాహారిగా’ ఉండడం ‘ధ్యానం’ చేయడం నేర్చుకో!


12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు. నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!


13. నాకు ఒద్దు, నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో!


14. బయటకు వెళ్ళు. మిత్రులతో, బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో! 


15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో!


16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో!


17. బంధాలను పెంచుకో, కాపాడుకో, ఎక్కువ విను, తక్కువ మాట్లాడటం నేర్చుకో!


18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీ బానిస కాకూడదు అని తెలుసుకో!


19. వారానికి ఒక్కసారి ఉపవాసం; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో!


20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో!


21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!


22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ, మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తించుకో!


23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో!


24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో!


25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.


ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు.


నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ 

శబ్దాదీన్ విషయాన్, త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ (51)


వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః 

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః (52)


అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ 

విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే (53)


పరిశుద్ధమైన బుద్ధికలిగి, ధైర్యంతో మనసును వశపరచుకుని, శబ్దాది విషయాలనూ రాగద్వేషాలనూ విడిచిపెట్టి, ఏకాంతవాసం చేస్తూ, మితంగా తింటూ, మాటలు, శరీరం, మనసులను అదుపులో పెట్టుకుని, నిరంతరం ధ్యానయోగంలో వుంటూ, వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం, వస్తుసేకరణలను వదలిపెట్టి, మమకారం లేకుండా శాంతస్వభావం కలిగినవాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

సూక్తి

  *నేటి సూక్తి*


*సంవత్సరం ముగుస్తోంది… కానీ ఆశలు ముగియవు, అవకాశాలు ఆగవు,లక్ష్యాలు మారవు! గతాన్ని పాఠంగా మార్చి, భవిష్యత్తును లక్ష్యంగా చేసుకోండి.* 


 *క్రాంతి కిరణాలు* 


*కం.ముగిసిన సంవత్సరమున*

*ముగింపు లేని యవకాశములు ముందుండెన్*

*ముగియని యాశల రాశులు* 

*సెగ కక్కి భవితను నిల్వ చిందులు వేయున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

శాస్త్ర జ్ఞానములేక

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *ఆశత్రుశ్చ సమున్నద్ధో* 

           *దరిద్రశ్చ మహామనాః* 

           *అర్థాం చ కర్మణా ప్ప్రేప్సుః* 

           *మూఢ ఇత్యుచ్యతే బుధైః*


తా𝕝𝕝 *శాస్త్ర జ్ఞానములేక మీడిసిపడువానిని, దరిద్రుడై గాలిమేడలు కట్టుచుండు వానిని నీచపు పనులతో సొమ్ములను పొందగోరు వానిని బుధులు అవివేకి అంటారు.....!*

         

✍️🌸💐🌹🙏

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *ఆశత్రుశ్చ సమున్నద్ధో* 

           *దరిద్రశ్చ మహామనాః* 

           *అర్థాం చ కర్మణా ప్ప్రేప్సుః* 

           *మూఢ ఇత్యుచ్యతే బుధైః*


తా𝕝𝕝 *శాస్త్ర జ్ఞానములేక మీడిసిపడువానిని, దరిద్రుడై గాలిమేడలు కట్టుచుండు వానిని నీచపు పనులతో సొమ్ములను పొందగోరు వానిని బుధులు అవివేకి అంటారు.....!*

         

✍️🌸💐🌹🙏

శ్రీ కాశీ రహస్యము

  శ్రీ కాశీ రహస్యము 

 

మొదటి అధ్యాయము





ముని సూత సంవాద వర్ణనము:


దీనిలో సూత శౌనకాది మునుల సంవాదరూపంలో సృష్టిక్రమ వర్ణనం, బ్రహ్మ సత్యయుగాల సంవాదం కృత - త్రేతా - ద్వాపర - కలియుగాల స్వరూప వర్ణనం, కలిదోష పరిహారానికి ఆవలంబించదగిన ఉపాయ వర్ణనం ఉన్నాయి. తరువాత గురు మహిమ శాస్త్ర మహిమ ఉగ్గడింపబడ్డాయి. గురుతత్త్వ నిరూపణ జరిగింది. వేదధర్ముడు అనే ఋషికీ అతని శిష్యుడు దీవకుడికీ మధ్య జరిగిన సంవాదం వర్ణింపబడింది దీపకుని గురుభక్తికి మెచ్చుకొని కాశీవతి విశ్వేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరాలు ప్రసాదించడం ప్రశంసింపబడింది. గురుభక్తుడైన దీపకుడి విషయంలో శివ విష్ణుపుల మధ్య జరిగిన సంవాదం - తర్వాత విష్ణు దీపకుల మధ్య జరిగిన సంవాద వర్ణన - వీటితో ఈ ఆధ్యాయం ముగిసింది. దీనిలో ముఖ్యంగా గురుభక్తివల్ల సాధించలేనిది ఏమీ లేదు అనే ఆంశం సమర్థించబడింది.


1 ఒకప్పుడు నై మిళారణ్యంలోని ఋషులు నూత మహర్షిని కలి యుగ స్వరూపాన్ని వర్ణించవలసిందని అడుగుట 


ఋషులు : 'సనాతనం అయిన యుగాలూ యుగమానమూ - ధర్మాలూ - యుగాలలోని ప్రజల చరిత్రలూ ఇంతకు పూర్వము నువ్వు వర్ణించగా మేము విన్నాం ఇంక కలియుగ స్వరూపాన్ని వర్ణింన కోరుతున్నాము. కలిపురుషుడు సజ్జన వంచకుడూ అధర్మ మిత్రుడున్నూ.


2. ఋషులు అడిగిన దానికి సమాధానంగా సూతుల వారు మొదట సృష్టిక్రమాన్ని వర్ణించుట :


అద్వయుడూ, అవ్యయుడూ అయిన హరి సమస్త సృష్టిని తనలో లీనం చేసుకొని జలశయనుడు అయ్యాడు. హరి తన యోగనిద్రనుండి మేల్కొన గానే బుధజనసేవ్యుడు అయిన బ్రహ్మ అతని నాభికమలం నుండి ఉద్భవించాడు. అలా ఉద్భవించిన బ్రహ్మ తాను ఎవరో, తన జన్మకు కారణభూతుడూ, మహానుభావుడూ అయిన హరి ఎవరో తెలిసికోలేని అజ్ఞానస్థితిలో ఉన్నాడు. అప్పుడు అతనికి ఓ సత్తముడు అయిన బ్రహ్మా! నువ్వు నన్ను భజించు' అన్న హరి వాక్యాలు వినవచ్చాయి.


హరి వాక్యాల్ని విన్న వెంటనే బ్రహ్మ హరికి సాష్టాంగదండ ప్రణామం చేసి ఇలా అన్నాడు: "దేవా! జగన్నాథా! నీకు జయమగుగాక! తత్త్వతః నువ్వు ఎవరో నేను తెలుసుకోలేను. ఓ వరదా! ప్రసన్నుడవు కమ్ము. నేను ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు."


హరి - 'ఓ బ్రహ్మా! నువ్వు చింతించవద్దు. నువ్వు సృష్టిని ప్రారంభించు. మహ త్వయుతమూ శుభప్రదమూ స్థావర జంగమరూపమూ, అండజమూ స్వేదజమూ- జరాయుజమూ-ఉద్భిజ్జమూ అయిన చతుర్విధ సృష్టినీ కావించుము.'


బ్రహ్మ : ఓ సర్వేశ్వరా! ఆల్పజ్ఞుణ్ణి అయిన నాకు సృష్టిని కావించే శక్తి ఎక్కడిది? ప్రవర్ధమానం అయిన సృష్టిని కావించడానికి కావలసిన గొప్ప సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు.'


విష్ణువు : “ఓ బ్రహ్మదేవుడా! సుదుర్లభములు అయిన వేదాల్ని శక్తితో సహా నా వద్ద నుండి స్వీకరించు. వేదాల్ని తెలుసుకొని నువ్వు సృష్టిస్తే, నీకు ఎప్పుడూ పరాభవం అనేది ఉండదు."


సూతుడు బ్రహ్మ విష్ణుభగవానుడి దగ్గరనుండి వేద ప్రాప్తిని పొంది స్థావర జంగమాల్నీ, అండజమూ స్వేదజమూ జరాయుజమూ ఉద్భిజమూ అయిన చతుర్విధ సృష్టినీ, వివిధ ప్రజల్నీ సృష్టించాడు. భగవానుడు ప్రసాదించిన శక్తి వలనా వేద సహాయత వలననూ స్మరణమాత్రం చేతనే బ్రహ్మ అనాయాసంగా మూడు లోకాల్నీ ఆవిర్భవింప చేశాడు.


ఓ ఋషులారా...బ్రహ్మ ఎలా సృష్టించాడో, ఆ సృష్టి క్రమాన్ని నేను విన్న విధంగానూ, అర్థం చేసుకొన్న విధంగానూ మీకు వినిపిస్తాను వినండి. ఈ సృష్టి క్రమాన్ని సాక్షాత్తు వ్యాసభగపానుల వారి వద్ద నుండి నేనూ, జైమినీ, వైశం పాయనుడూ,పైలాది ఋషులూ విడివిడిగా విన్నాము. బ్రహ్మదేవుడు బ్రహ్మనిష్ఠు లైన సనకాదులనూ, కర్మనిష్ఠులైన మరీచ్యాది ఋషులనూ సృష్టించి, వారి ద్వారా దేవదైత్యుల్ని సృష్టించాడు. బ్రహ్మ సత్య, త్రేతా, ద్వావర యుగాల్నీ, ఆ యుగాల ఆదిలోనూ, మధ్యలోనూ ఉండే ధర్మాల్నీ, ప్రత్యేకించి కలియుగాన్నీ - ఆ యుగధర్మాల్నీ సృష్టించాడు.


3. బ్రహ్మ - సత్య యుగాల సంవాదము :


ఆ విధంగా యుగాల్నీ, యుగ ధర్మాల్నీ విభజన చేసిన తరువాత లోకాను గ్రహ కామి అయిన బ్రహ్మ సత్యయుగ పురుషుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: "నువ్వు ఏ పని లేకుండా నిర్వ్యాపారివిగా ఎందుకు ఉన్నావో శీఘ్రంగా చెప్పు. చెప్పడానికి నీకు సమయం ఉంది.'


సత్యయుగ పురుషుడు : 'నా యుగంలో ప్రజలందరూ విషయ సుఖముల పట్ల విముఖులు, అందరూ నివృత్తి ధర్మపరాయణులే. అందరూ శాంత చిత్తులే.. అందరూ హరిభక్తి పరాయణులే. అందరూ శుద్దమనస్కులే. అందరూ దేహ, ప్రాణ, ఇంద్రియ పరాజ్ముఖులే. ప్రజలందరూ వారి వారి ధర్మాల్ని తుచ తప్ప కుండా ఆచరిస్తున్నప్పుడు వారిని నియంత్రణ చేయడానికి, శాసించడానికి ఆవశ్యకత లేనేలేదు కదా! అస్మదాదులం దాదులం నీ ఆజ్ఞ పాటించే వారమే కాని స్వంతంత్రించి వ్యవహరించే వారము కాము ప్రజలు కాంతులూ నివృత్తి ధర్మపరాయణులూ -భగవత్పరాయణులున్నూ. ప్రజలు కర్మ కాలము గుణాల్నీ వ్యతిరేకించేవారు కారు ఆశాస్తులూ - ఆర్తులూ భగవత్ పరాజ్మాఖ్ములూ నిందింపదగిన వారు."


బ్రహ్మ : "నువ్వు శీఘ్రంగా మృత్యులోకానికి వెళ్ళి నీ యుగధర్మాల్ని అక్కడ వ్యాపింపచెయ్యి. ఎప్పుడూ కాలమే మెల్ల మెల్లగా ధర్మాన్ని ప్రవర్తింపచేస్తుంది. అన్ని యుగాల్లోనూ సర్వదా పుణ్యాత్ములూ, పాపాత్ములూ ఉంటూనే ఉంటారు.


4. సూతుడు ఋషులకు యుగాల స్వరూపాన్ని వివరించుట


సూతుడు. ఓ ద్విజులారా! నాలుగు యుగపురుషుల యొక్క స్వరూపమూ - ఆకృతీ - కర్మాది గుణాల్ని వినిపిస్తాను వినండి.'


సత్య యుగ స్వరూపము ' సత్య యుగంలో వైరాగ్యం అధికంగా ఉంటుంది. సత్య యుగపురుషుడు సంపూర్ణ జ్ఞాన విగ్రహుడుగా ఉంటాడు. అతడు యజ్ఞోపవీత ధారి, చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. అతడు బ్రాహ్మణ ప్రియుడు. ఇటువంటి స్వరూప లక్షణాలు కలిగిన సత్య యుగ పురుషుణ్ణి బ్రహ్మ సృష్టించాడు. ఈ ప్రకారమే త్రేతాయుగమూ - ద్వాపర యుగమూ - కలియుగమూ ప్రత్యేక లక్షణాల్ని కలిగి ఉంటాయి.


త్రేతాయుగ స్వరూపము : త్రేతాయుగ పురుషుడు స్వధర్మ పరాయణుడు. యజ్ఞయాగాది వైదిక క్రతువులను చేయడానికి చిహ్నంగా త్రేతాయుగ పురుషుడు చేతిలో స్రువాన్ని ధరించి ఉంటాడు. అతడు ధర్మ ప్రియుడుగా ఉండి ప్రజలలో ధర్మ వ్యాప్తిని చేసేవాడుగా ఉంటాడు.


ద్వాపర యుగపురుషుడు : ద్వాపర యుగపురుషుడు ఖడ్గమూ - ఖట్వాంగమూ - ధనుర్బాణాల్నీ చేతిలో ధరించి ఉంటాడు. అతడు ఆశాంతుడు. పుణ్య పౌవశీలి. కటువుగా ఉంటాడు.


కలియుగ స్వరూపము : ఓ విప్రులారా! కలియుగ స్వరూపాన్ని వినిపిస్తాను వినండి. వివేకవంతులకు కలిలో శీఘ్రంగా ఫలం లక్షిస్తుంది. కలిలోని ప్రజలు పరమార్థ విచారహీనులు. ఈ యుగంలోని ప్రజలకు దుష్టవిచారమే తప్ప శిష్టవిచారం ఉండదు. కలిపురుషుడు పిశాచ వదనంతో చూడడానికి అసహ్యంగానూ, భయంకరంగానూ ఉంటాడు. అతడు క్రూరుడు. కలహప్రియుడు. అతడు ఎడమ చేతితో శిశ్నాన్నీ, కుడిచేతితో జిహ్వని పట్టుకొని నాట్యం చేస్తున్నాడు. ఆ కలిపురుషుడు బ్రహ్మదేవుణ్ణి చూసి నవ్వుతూ, దుఃఖిస్తూ, రోదనం చేస్తూ ఉంటాడు. ఇటువంటి స్వరూపమూ, లక్షణాలూ కలిగిన కలిపురుషుణ్ణి బ్రహ్మ నవ్వు మొగముతో ఇలా అంటాడు.


'ఓ కలీ! అంగాన్నీ, జిహ్వనీ గట్టిగా పట్టుకొని మాటి మాటికీ ఎందుకు నృత్యం చేస్తున్నావు? ఆకతాయి వలె కనిపిస్తున్న నీవు వెళ్ళి స్వకార్య నిర్వహణ తత్పరుడవు కావలసింది.


కలి : ఓ సర్వేశా! నేను సర్వాన్నీ నాశనం చేసేవాణ్ణి, నిరంకుకుణ్ణి. ఆనంద రహితుణ్ణి. నిద్రాకలహాలు మక్కువగా కలవాణ్ణి. పర స్త్రీని, పరద్రవ్యాన్ని కోరే వాణ్ణి, పరులకు ద్రోహం తలపెట్టేవాణ్ణి వంచకుణ్ణి, దంభమూ - మాత్సర్యమూ-భేదమూ అంటే ఇష్టపడే జనుల్ని చూస్తే నాకు ఇష్టం. అటువంటి నన్ను భూలోకానికి పంపించవద్దు. ఏకాంతమూ - యోగ సాధనా-సన్యాసమూ అనే వేషాలతో ఉదరపూరణ చేసికొనే వాళ్ళు తమర్నీ, ఇతర్లనీ నా సంపర్కం వల్ల మోసగిస్తూ ఉంటారు.'


బ్రహ్మ : 'నీ ప్రభావం సోకిన వాళ్ళు పాపాత్ములు కాగా, నీ ప్రభావానికి లోబడని వాళ్ళు పుణ్యాత్ములుగా ఉంటారు. నువ్వు శీఘ్రఫలకారిని కావడం చేత పాపాత్ములు పెరిగినట్లే - పుణ్యఫలం శీఘ్రంగా లభిస్తుందన్న ఆశతో కొంతమందై నా పుణ్యాత్ములు ఉద్యమశీలురు అవుతారు. తమ పుణ్య ప్రభావం చేత కలి ప్రభావాన్ని తట్టుకొని అల్పాయుర్దాయం కలవాళ్ళం అని తెలుసుకొని తమ మంచి కోసం ప్రయత్నిస్తారు అలాంటి వాళ్ళకి నా ఆజ్ఞగా భావించి శీఘ్రఫలం కలిగేటట్లు సహాయం చెయ్యి' అని కలిని శాసించాడు.


కలి ! 'భరత ఖండంలో నా ఉనికి కష్టతరం చేసిన శత్రువులు ఉన్నారు. ఆ వర్గానికి నేను భయపడుతూ ఉంటాను అలాంటి చోటికి నేను ఎలా వెళ్ళగలను?'


బ్రహ్మ : "నీకు శత్రువులు ఎవరు? వారితో నీకు శత్రుత్వం ఎందుకు వచ్చింది? నువ్వు కాలస్వరూపుడవు ఇతరులకు లొంగని వాడపు ఇతరులకు తెలిరాని వాడవు, పండితుడవు.'


5. కలిదోష పరిహారోపాయ వర్ణనము


కలి : ఓ దేవదేవా! నా శత్రువర్గాన్ని గురించి చెబుతాను విను. నిర్దయులు అయినవారి వల్ల నాకు సుఖం లేకుండా పోతోంది. శివ నామ జపం-హరినామ సంకీర్తనం గంగానది - వారణాసి సత్సంగం దానధర్మాలు తీర్థాది 'సేవనం విష్ణుమూర్తి యొక్క పుణ్యకథలు- శివలీలలు ఇంకా ఇతరత్రా ఉన్న పుణ్యకార్యాలు నాకు క్షోథని కలిగిస్తాయి. నీ సన్నిధిలో వాటన్నిటిని గురించి ఏమని చెప్పమంటావు? ఒక క్షణకాలం ఎవడైనా శాంతచిత్తుడుగా ఉన్నా వికారం లేకుండా స్థిరంగాఉన్నా - ఎవడైనా అలా ఉన్నట్లు నటించినా నాకు చాలా భయం వేస్తుంది వ్యాకుల చిత్తులూ - వికార స్వభావం కలవాళ్ళూ, భార్యాబిడ్డలతో సతమతం అవుతున్న వాళ్ళూ, వేద ధర్మాల్ని ద్వేషించే వాళ్ళూ-ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు సంతోషం కలుగుతుంది.


జితేంద్రియులూ, శివభక్తి పరాయణులూ, రాగద్వేష రహితులూ-ధీరులూ, సత్పురుషుల ధైర్యాన్ని పెంపొందించేవాళ్ళూ ఉంటే వారితో కలిసి నేను ఉండలేను. ఎందుచేతనంటే, వాళ్ళు నన్ను నామరూపాలు లేకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అంటే నాకు ఎప్పుడూ భయమే.


బ్రహ్మ : ఓ కలీ! నీ ప్రభావం వల్ల అటువంటి వారి ప్రచారం సాగదు.


అందుచేత సందేహించక భూలోకానికి వెళ్ళు'


కలి : "నా స్వభావం వారి స్వభావానికి విరుద్ధం, దానికి కారణం నాకు తెలియదు. నన్ను వారూ వారిని నేనూ నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటాము.


బ్రహ్మ: "నిన్ను కాలమలం అంటారు. మలినానికి శుద్దికి పొంతనం ఉండదు. నీ శత్రువులు నిర్మలంగా ఉంటారు కాబట్టి మీ ఇద్దరికీ విరోధం తప్పదు. ఎవడు బలవంతుడో వాడు విజయం పొందుతూ ఉంటాడు. వారి ప్రచారం బలహీన మైనది అవడంచేత నీవు బలశాలివి అవుతావు.


నీవు వివేకవంతుల్లో మిక్కిలి ప్రచారం కలిగినవాడవు శీఘ్రఫలదాయకం అవడంచేత భగవద్భక్తులు కలియుగంలో జన్మించాలని కోరుకొంటారు.”


కలి : ఏ గుణం చేత నేను తగినవాణ్ణి అని నీవు చెప్పావో, దాన్ని నీవు విశదంచేస్తే నీ ఆజ్ఞ ప్రకారం నేను భూలోకానికి వెళ్ళుతాను.'


6. గురుశాస్త్ర మహిమా వర్ణనము


బ్రహ్మ : 'దైర్యాన్ని అవలంబించి, ఏ జనులు ఆత్మశుద్ధిని పొందుతారో వారికీ - కాశీలో నివసించే వారికీ లోభాది గుణజనితమైన కలి దోషం అంటదు. ఇంకా మహాత్ముడైన శివుణ్ణి జనార్ధనుణ్ణి సేవించే వారికి నెమ్మది నెమ్మదిగా సర్వ సాధనలూ సమకూరి శీఘ్రఫలితాన్ని కలిగిస్తాయి.'


'నా (కలి) ప్రభావం వల్ల గురుసేవ లభించదు' అని నీవు అనవచ్చు. కాని వారి వారి సుకృత విశేషం చేత గురు సేవాదికం లభించి ఆత్మోద్ధరణ కలుగుతుంది. గురుసేవ వల్ల సారాసార వివేకమూ తత్త్వచింతనమూ, తెలిసో తెలియకో కాశీని సేవించడం వల్లనూ శాస్త్రజన్య జ్ఞానం లభించి వారికి క్రమముక్తి లభిస్తుంది అలాంటి సుకృతం లేని వారికి కలియుగంలో ఏలాంటి సుఖమూ లభించదు. కనుక కలియుగంలో అప్రమత్తుడై సుకృత సంపాదనానికి ప్రయత్నించాలి."


కలి : గురు శబ్దం యొక్క తాత్సర్యాన్నీ గురుపు ఎటువంటివాడో- అతని స్వరూపం ఎటువంటిదో తెలియచెప్పుము.


7. గురు తత్త్వనిరూపణము


బ్రహ్మ : 'గ' కారం సిద్ధిప్రదం అన 'రే'ఫం పాపదాహకం అని చెబు తారు. 'ఉ' కారం అవ్యక్తం అయిన విష్ణుస్వరూపం. గురువు పరమైన త్రిమూర్తి స్వరూపం అవుతున్నాడు.'గ'కార అధిదేవత అగు గణపతి ఆగు అగ్నితోను, విష్ణుస్వరూపం అయిన 'ఉ' కారంతోను కలిసి చాతుర్వర్గ ఫలదాయకం అయిన మంత్రం అవుతోంది. గురువే తండ్రి. గురువే తల్లి. గురువే పరమ శివుడు. శివుడు కోపిస్తే గురువు రక్షించకలడు కాని గురువు కోపిస్తే రక్షకుడు ఎవడూ ఉండడు. గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు.అట్టి గురువే పరతత్త్వము. కాబట్టి గురువునే ఆశ్రయించాలి.


విష్ణుమూర్తి ప్రసన్నుడై సాక్షాత్కరిస్తే వైష్ణవ జనులు అవ్యయమైన గురు భక్తినే వరంగా కోరుకుంటారు. గురువు సంతోషపెట్టబడితే సర్వసిద్ధుల్ని ప్రసాదించగల లోకనాయకుడు అయిన జనార్ధనుడు సంతోషిస్తాడు.


గురువును సేవిస్తే శాస్త్ర మార్గం అవగతం అవుతుంది. తీర్థమూ-వ్రతమూ-యోగమూ తపస్సూ మొదలైన ధర్మ విషయాలు అవగతం అవుతాయి. ఆచారమూ - ఆయా వర్ణాలకు యోగ్యమైన ధర్మాలూ వివేకమూ భక్తి వైరాగ్యాలతో కూడిన గొప్పదైన జ్ఞానమూ కూడా గురుభక్తి వల్ల లభిస్తాయి."


కలి : 'దేవాదిదేవా! గురువు సర్వ ధర్మమయుడు అనడం చాలా చిత్రంగా ఉంది. గురువే సకల ధర్మాలకు అధీశ్వరుడు ఎలా అవుతాడు?'


బ్రహ్మ : గురువు లేకుండా ఎవడికీ ఎక్కడా శ్రవణం లభించదు. శాస్త్ర శ్రవణం వల్ల నీ యొక్క (కలికృతమైన) భయాన్నుంచి తప్పించుకోవచ్చు. ఇది నీకు తెలియడానికి సర్వార్థదాయకం అయిన కధ చెబుతాను. అది వింటే నీవు కూడా గురుభక్తి - ధర్మాసురక్తీ కలవాడవు అవుతావు.


8. వేదధర్మ - దీపక సంవాద వర్ణనం


'గోదావరీ తీరంలో ఆంగిరస మహర్షి ఆశ్రమం ఉంది. అది మిక్కిలి ప్రసిద్ధమైంది. ఆ ఆశ్రమంలో చక్కని వృక్ష సంతతీ, జంతుజాలం ఉన్నాయి. అక్కడ చాలామంది బ్రహ్మర్షులూ రాజర్షులూ తపస్సు చేసుకొంటూ ఉంటారు.వారిలో పైలముని కుమారుడు అయిన వేదధర్ముడు అను ఋషి మిక్కిలి ప్రసిద్ధి చెందాడు.


అతనివద్ద ఎందరో శిష్యులు శుక్రూషచేస్తూ, వేద వేదాంగ పారంగతులు అవుతూ ఉండేవారు. వాళ్ళలో సందీపకుడు అనే శిష్యుడు మిక్కిలి గురుభక్తి కలవాడు. అతడు నైష్ఠిక బ్రహ్మచారిగా ఉంటూ, గురువువద్ద శాస్త్రపురాణాలూ, వేదవేదాంగాలూ నేర్చుకొని కూడా గురువును సేవించుటయందు మిక్కిలి ఆసక్తి కలిగి అతని దగ్గరే ఉండిపోయాడు. ఒకనాడు అతడు గురువు పిలువగా వెంటనే పరుగెత్తి అతణ్ణి సమీపించాడు. గురువు సందీపకుణ్ణి చిరంజీవి అగుము అని అశీర్వదించాడు.


'వేదధర్ముడు : 'నాయనా! నా శిష్యుల్లో నీవు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడవు. అందుచేత నేను అడిగేది సావధానంగా ఆలోచించి సమాధానం చెప్పు. ఆచరించ గలిగితేనే అంగీకరించు.


అనేక వేల పూర్వజన్మల్లో నేను తెలిసో తెలియకో చేసిన పాపాలు నా తపోబలంచేత క్షాళితాలు అయ్యాయి. మోక్షానికి విఘ్న హేతువులు అయినవీ వాక్కాయమానస సంజనితాలూ అయిన కొన్ని పాపాలు మాత్రం అనుభవించడం వల్లనే పోగొట్టుకోదగినవి శేషించి ఉన్నాయి అని అనుభవిస్తేనే కాని క్షయం కావని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఆ పాప ప్రాయశ్చిత్తం పాపహారిణి అయిన వారణాసిలో జరుపుకోదలచాను. ఎందుచేతనంటే, కాశీలో ఏ కర్మ అయినా శీఘ్ర ఫలకారిణి అవుతుంది ముఖ్యంగా రెండు పాప ఫలితాల్ని ఒకేసారి ఈ శరీరంతో అనుభవించ తలవాను అది పూర్తి అయ్యే వరకు నీవు సేవిస్తూ ఉండాలి. అలా ఉండలేకపోతే నిస్సంకోచంగా చెప్పు. నా సేవకోసం మరో శిష్యుణ్ణి అడుగుతాము."


దీవకుడు : "మహాత్మా! ఎలాంటి పాపాలు అయినా నిన్ను తలంచినంతనే దహించబడతాయి. అలాంటి మీరు సహింపవలసిన దుఃఖాలు ఎలా ఉంటాయి?


వేదధర్ముడు : “నాయనా! మానపుడు జీవించి ఉండగానే ప్రాయశ్చిత్తం చేసికొనకపోతే మరుజన్మలో నాకు ఇలాంటి శక్తి కలుగకపోవచ్చును అప్పుడు ఈ పాపాలు మనస్సును వక్రమార్గానికి మళ్ళించి ఇంకా బాధిస్తాయి కనుక వాటిని ఇప్పుడే నశింప చేసికోవాలి. దేవతలు అయినా, ఋషులు అయినా, మనుష్యులు అయినా చేసిన శుభాశుభ ఫలితాల్ని తప్పించుకోలేరు. కాబట్టి జ్ఞాని అయినవాడు యథాశీఘ్రం పాపక్షయం అయ్యేలాగున ప్రయత్నించాలి. '


దీపకుడు : 'ఓ గురుదేవా! విధివిధానంతో యధాశక్తి నీ సేవ చేస్తాను. నిస్సంకోచంగా ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి'.'


'వేదధర్ముడు : ఓ సుప్రజా! నేను ఆంధుణ్ణి - కుష్ఠువ్యాధి పీడికుణ్ణి అవుతాను. ఆ సమయంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నా శరీరాన్ని నువ్వు రక్షించాలి." 


దీపకుడు : ఓ మహాత్మా! నా వంటి శిష్యుడు ఉండగా మీకు ఎటువంటి కష్టమూ, ఇబ్బందీ ఉండనేరదు. నీ పాపఫలితంగా వచ్చే కుష్ఠువ్యాధిని నాకు సంక్రమింపచెయ్యి- ఆ వ్యాధిని నేను అనుభవిస్తాను: నువ్వు సుఖంగా ఉండవచ్చు..


వేదధర్ముడు ; "నాయనా! పుత్రుడికి కాని, శిష్యుడికికాని ఎవ్వడూ తన పాపాన్ని సంక్రమింపచెయ్యరాదు. పాపభోగం కర్తకే చెందుతుంది కాని దాన్ని ఇతర్లు ఎవరూ సంక్రమింపచేసికొని అనుభవించడానికి వీలులేదు. అందుచేత దాన్ని నేనే అనుభవిస్తాను. నువ్వు మాత్రం నన్ను సేవిస్తూ ఉండు నిజానికి ఒకరి పాపాన్ని ఇంకొకరు సంక్రమింపచేసికొని, అనుభవించడంకంటే స్వయంకృత పాపఫలాన్ని అనుభవించేవారిని సేవించడమే మరీ కష్టతరం కాబట్టి నన్ను నువ్వు సాక్షాత్తు ఈశ్వరునికి ప్రియవాసమూ, పరిశుద్దమూ అయిన కాశీనగరానికి తీసికొని వెళ్ళు. ప్రారబ్ధాన్నంతటినీ అక్కడ అనుభవించి లయం చేసికొని అంతలో మోక్షాన్ని పొందుతాను.'


దీవకుడు : "అలాగే స్వామీ! తప్పకుండా మనం కాశీ క్షేత్రానికి వెడదాం మీ పాదపద్మాల సేవలో నేను నిమగ్నుడై ఉంటాను.

 

9. కాశీకి వచ్చిన గురుశిష్యుల వృత్తాంతాన్ని బ్రహ్మ కలికి చెప్పుట:


 బ్రహ్మ : ఓ కలీ! ఆ తరువాత గురుశిష్యులు ఇద్దరూ కాశీ చేరుకొని మణికర్ణికా ఘట్టానికి ఉత్తరాన ఉన్న కంబలేశ్వరుని సన్నిధికి చేరుకొన్నారు. వేద ధర్ముడు గంగాస్నానం చేసి, ఉమాసహితుడు అయిన విశ్వేశ్వరుణ్ణి సేవించి హేయ మైన ఆ ప్రారబ్దాన్ని అనుభవించడానికి ఆయత్తం అయ్యారు. ఇతరుల దుఃఖాన్ని తన తపశ్శక్తిచే పోగొట్టగలిగిన ఆ వేదధర్ముడు కుష్టురోగాన్నీ - అంధత్వాన్నీ పొంది దుఃఖార్తుడు అయ్యాడు.


అలాంటి గురువు యొక్క మలమూత్రాదులూ, చీమునెత్తుర్లూ తీసివేసి శుభ్రం చేస్తూ, శిష్యుడు అయిన ఆ దీపకుడు మిక్కిలి శ్రద్దతో గురువుని సేవింపసాగాడు. కాశీపురిలో భిక్షాటనం చేసి అలా తెచ్చిన అన్నాన్ని గురువుకి నివేదించి పోషించ సాగాడు.


వేదధర్మ నిష్టుడూ జితేంద్రియుడు అయిన ఆ గురువు రోగవశం చేత మొదటి సాధుత్వాన్ని కోల్పోయి క్రూరుడుగా మారాడు. ఒక్కొక్కప్పుడు దీపకుడు తెచ్చిన భిక్షాన్నాన్నంతటినీ తానేతినేసేవాడు. ఒక్కొక్కప్పుడు నువ్వు తెచ్చిన అన్నం రుచిగా లేదంటూ కొంచెం మాత్రమే తినేవాడు ఒక్కొక్కప్పుడు దయతో నాయనా! అంటూ శిష్యుణ్ణి లాలించేవారు. మరొకప్పుడు అనుచితమైన కరోరవాక్కుల్ని పలికేవాడు. మహారోగగ్రస్తుడైన పాపాత్ముల వాక్కులు కఠినంగా ఉండడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అలాంటి వారు దైన్యమూ, మాత్సర్యమూ కలిగి శుభాశుభ ఆలోచనావిరహితమూ, దుఃఖ దాయకమూ అయిన మాటలు అంటారు. నీలో (కలిలో) కనిపించే ఇతర దోషాలు ఆవాక్పారుష్యంలో పదహారవ వంతుకుకూడా చాలవు. ఈ విధంగా ధర్మ పరాయణుడు అయిన ఆ శిష్యుణ్ణి నిరంతరమూ వేధిస్తూ ఆ వేదధర్ముడు దైన్య గ్రస్తుడై మాటిమాటికీ నాకు ఆకలి, తినడానికి ఏదైనా పెట్టు అంటూ బాధించ సాగాడు.అయినా శ్రద్ధాళువు అయిన ఆ శిష్యుడు గురువును ఈశ్వరుణ్ణిగా భావించి అతడు పెట్టే బాధలన్నిటినీ సహిస్తూ గురువును సేవించేవాడు. గురువుగారి మనసు మృష్టాన్నాల మీదికి పోయినప్పుడెల్లా ఆ శిష్యుడు వెంటవెంటనే కాశీపురిలోనికి పరుగెత్తి భిక్షమెత్తి తీసికొని వచ్చి గురువుకు పెట్టేవాడు.తీర్థయాత్రల మీద కాని, దేవపూజనం మీద కాని, లౌకిక విషయాల మీద కాని, చివరకు తన దేహపోషణమీద కాని దీపకునకు శ్రద్ధ లేదు అహర్నిశలూ గురుపనే దైవంగా భావించి అన్య చింత లేకుండా ఆ గరువునే సేవిస్తూ ఉండే వాడు సుకృతి అయిన ఆ దీవకుడు తన గురువును సర్వ వ్యాపకుడు అయిన జనార్ధనుణ్ణిగా భావించేవాడు, వేదవేద్యుడు అయిన పార్వతీపతిని కూడా సాక్షాత్తు తన గురువునందే చూచేవాడు. భిక్షమెత్తి తెచ్చిన అన్నంలో అధిక భాగాన్ని గురువునకు సమర్పించి అతికొద్ది భాగంతో తన దేహయాత్ర జరుపుకొనేవాడు కంటికి నిద్ర లేకపోయినా సావధాన హృదయంతో గురువు ఏది కోరినా ఆయా వస్తువులను తీసికొనివచ్చి సమర్పించేవాడు, దీపకుడు ఏకాగ్రబద్ధితో, మిక్కిలి ఆదరంతో, భక్తిభావంతో గురు "సేవలో కాలం గడుపుతున్నాడు. ఒకప్పుడు కూడా దయారహితుడు కాకుండా, అసూయ చెందకుండా తాను కష్టపడుతున్నప్పటికీ, పరుషంగా మాట్లాడకుండా గురువు విషయంలో రెండో ఆలోచన లేకుండా, విరక్తిచెందకుండా తత్పరతతో గురు సేవలోనే దీపకుడు ప్రవృత్తుడై ఉన్నాడు.


ఏకాగ్ర చిత్తంతో ఆ దీవకుడు గురు సేవా పరుడై విసనకర్రతో విసురుతూ ఉండగా, ఒకనాడు హఠాత్తుగా విశ్వేశ్వరుడు తన ఎదుట సాక్షాత్కరించడం గమనించాడు. 


10. విశ్వేశ్వరుడు దీపకునకు వరప్రదానం చేయుట :


విశ్వేశ్వరుడు : ఓ గురుభక్తా! మహాప్రాజ్ఞుడా! నీ గురుభక్తికి నేను మిక్కిలి ఆనందించాను. నీకు ఇష్టమైన వరం కోరుకోవలసింది.'


దీపకుడు: ఓ మృత్యుంజయా! మహాదేవా, పరమేశ్వరా! నా యెడల నీవు ప్రసన్నుడవు అయ్యావు నేను ఏమీ ఎరుగని వాణ్ణి మా గురువుగారిని అడిగి ఏమి కోరుకోవాలో చెబుతాను."


అని చెప్పి దీపకుడు గురువును ఇలా అడిగాడు 'ఓ గురువరా! అవి ముక్తేశ్వరుడు అయిన ఈశ్వరుడు ఉత్తమమైన వరాన్ని ఇస్తాను కోరుకోమన్నాడు. నీ ఆజ్ఞ తీసుకొని వరం కోరుకొంటాను అన్నాడు. మీ ఆజ్ఞతో మీ వ్యాధి సమూలంగా నాశనం అయ్యేటట్లు వరం కోరమంటారా? లేక మీకు ఏది ఇష్టమో చెబితే దాన్ని సమకూర్చేటట్లు ఈశ్వరుణ్ణి వరం కోరుతాను."


వేద ధర్ముడు అనఘా! దేవదేవుడు అయిన ఈశ్వరుణ్ణి రోగనాశనం చెయ్యమని వరంగా ఆడగరాదు. నేను స్వయంగా చేసిన పాపాన్ని స్వయంగా అనుభవించి శుద్ధుణ్ణి అవ్వాలి ఇతరత్రా మార్గం లేదు. భవరోగ నాశనమే కోరు కోవాలి కాని దేహరోగ నివృత్తిని కోరకూడదు.


అని గురువు చెప్పగా దీపకుడు ఈశ్వరని సన్నిదిని చేరి నమస్కరించి ఇలా అన్నాడు.


“దేవ దేవా. నేను ఏ వరమూ కోరను. నాకు ఏ వరము అక్కరలేదు" అన్నాడు దీపకుడు.


మాటిమాటికీ నీకు ఇష్టమైన వరం ఏదో ఒకటి కోరుకోమని శివుడు ఆన తిచ్చినా దీపకుడు ఒప్పుకోలేదు. అంతట శంకరుడు తన గణాలతోపాటు అదృశ్యం అయ్యాడు. అటు పిమ్మట నిర్వాణమండపంలో పార్వతీ సహితుడై ఆశీనుడై ఉన్నప్పుడు దేవతలందరూ వింటూ ఉండగా విష్ణుమూర్తితో ఇలా అన్నాడు:


'నారాయణా! అరవిందాక్షా! సదానందదాయకా! సంతోష కారణం అయిన విచిత్రమైన గురుభక్తిని నేను గమనించాను. '


11. గురుభక్తుడైన దీపకుని గూర్చిన శివవిష్ణు సంవాదము:


 అని శివుడు అనగా విష్ణువు ఇలా ప్రశ్నించాడు:


"ఆ గురువు ఎవరు? ఆ శిష్యుడు ఎవరు? ఓ వృషభధ్వజా! అతని గురు భక్తి ఎట్టిదో సవిశేషంగా నాకు వివరించు' అని విష్ణువు అడగ్గా విశ్వనాధుడు ఇలా సమాధానం చెప్పాడు:


ఓ జనార్దనా! శ్రద్ధగా వినుము బాలుడైన దీపకుని గురుభక్తి చేత నేను ఆకర్షింపబడ్డాను. గోదావరీ తీర వాసీ మహాతపస్సంపన్నురూ కాశీ మాహాత్మ్యామును విశేషంగా తెలిసికొన్నవాడూ సర్వవస్తువులయందు విరక్తిభావం కలిగిన వాడూ శాంతుడూ అయిన వేదధర్ముడు అనే గురువు ఉన్నాడు.


అతనికి జితేంద్రియుడు అయిన దీపకుడు అనే శిష్యుడు ఉన్నాడు అటు వంటి గురుభక్తుణ్ణి ఇదివరకు నేను కనలేదు వినలేదు. అతనికి వరాలు ఇద్దామని నేను వెళ్ళాను ఎన్నివిధాల ప్రలోభ పెట్టినా చతుర్విధ పురుషార్థాలకు సంబంధించిన వరాలు ఏమి ఇస్తానన్నా అతడు ప్రలోభపడలేదు. గురువునందే నిశ్చలహృదయం కలవాడై గురుసేవకు తన దేహాన్ని అర్పించివేశాడు సకలశాస్త్ర సమ్మతమైన ఈ సేవను చూచి నీవూ నేనూ దేవతలూ పితృదేవతలూ సకల భూసురులూ అందరూ సంతోషింపవలసిందే. సర్వాత్మకుడు అయిన ఆ దీపకుడు గురువునందే సమస్తాన్నీ చూస్తూ సర్వదర్శకుడై ఉన్నాడు. నేను ఎంతని చెప్పను? నీవు ఆ దీపకుణ్ణి చూడడం యోగ్యంగా ఉంటుంది గురువే సర్వస్వం అని నమ్మే ఆ బాలుడు సంసార తమస్సును పోగొట్ట కలిగిన దీపం వంటివాడు. ధర్మ, జ్ఞానాది సకలవిషయాల్ని అతడు గురుమయంగా భావిస్తున్నాడు. గురుపాదాన్జాల్ని ధృఢంగా నమ్మి, అతడు వివిధ రూపాల్లో తన గురుభక్తిని ప్రదర్శిస్తూ ఆదర్శ మూర్తిగా ఉన్నాడు.


అని విశ్వేశ్వర ముఖం నుండి వెలువడిన దీపకుని ప్రశస్తిని సకల ధర్మ విదుడు అయిన విష్ణుమూర్తి విని గురుభక్తియందు ఏకాగ్రచిత్తం కలిగి ఉన్న ఆ దీసకుని వద్దకు వెళ్ళి సాక్షాత్కరించాడు. అప్పుడు విష్ణువు దీవకుని విషయంలో ఈశ్వరుడు చెప్పిన దానికంటే అధికంగానే గురుభక్తిని దర్శించి ముగ్ధుడు అయ్యాడు. దీపకుని పిలిచి 'నేను నీపట్ల ప్రసన్నుణ్ణి ఆయ్యాను. నీకు ఇష్టమైన వరాన్ని నిస్సంకోచంగా కోరుకో అని పలుకగా మూర్తీభవించిన గురుభక్తి అగు దీపకుడు విష్ణుమూర్తితో ఇలా అన్నాడు'


12. దీపక విష్ణు సంవాదము


'ఓ వాసుదేవా! శంఖచక్ర గదాధరా! నీకు సామస్కారము బాలుణ్ణి అయిన నాకు నువ్వు ఏ భక్తి విశేషం చేత ప్రసన్నుడవై సాక్షాత్కరించావో చెప్పు. మానవులు అనేక సాధన విశేషాలతో ఆత్మ స్వరూపుడవూ - జగదీశ్వరుడవూ అయిన నిన్ను భజిస్తూ ఉంటారు. ఓ హరీ! నిన్ను చూడలేకపోయినప్పటికీ సర్వవ్యాపివీ - అధోక్షజుడవూ - పరాత్పరుడవూ అయిన నిన్ను ఆత్మ రూపి నిగా భావిస్తాను, నేను బాలుణ్ణి, మూర్ఖుణీ,పుట్టినప్పటి నుంచీ ఎప్పుడూ కూడా నేను నీ నామస్మరణ కూడా చేసి ఎరుగను అయినప్పటికీ వరప్రదుడవు అయిన నీవు నాకు శ్రేష్ఠమైన వరాల్ని ఇవ్వడానికి దర్శనం ఇచ్చావు. ఇది నాకు చాలా విచిత్రంగా కనిపిస్తోంది."


విష్ణువు: 'ఓ దీపకా! నీకుగల శ్రద్ధ- ఇంద్రియనిగ్రహము, ముఖ్యంగా గురు భక్తి వలన నేను ప్రసన్నుణ్ణి అయ్యాను. గురుభక్తియుక్తులు అయిన వారు నాకు మిక్కిలి పూజ్యులు, వారిని నేను ప్రయత్నపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను.”

మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం

  *🙏హరిహర స్వరూపం🙏*




*🕉️శంకరనారాయణ స్వరూపమూ అర్థనారీశ్వర స్వరూపమూ రెండూ ఒకటేనని* *చెప్పడానికి శాస్త్రాలలో ఆధారాలు ఉన్నాయి*. 

*మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం;* *ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగ మని చెప్పడానికి పురాణాల మూర్తులు, క్షేత్రాలు ఆధారాలు.*

 *దక్షిణాన తిరునెల్వేలి జిల్లాలో శంకర్ నయనార్ కోయల్ అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకరనారాయణ స్వరూపంగా భగవానుడు ఉండటం నేటికీ మనం చూడవచ్చు.* 

*ఇలాగే మైసూరు, మహారాష్ట్రల ముధ్య 'హరిహర' క్షేత్రంలో హరి, హరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు.*


*🙏కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి 🙏*

హరిహర స్వరూపం

 *🙏హరిహర స్వరూపం🙏*




*🕉️శంకరనారాయణ స్వరూపమూ అర్థనారీశ్వర స్వరూపమూ రెండూ ఒకటేనని* *చెప్పడానికి శాస్త్రాలలో ఆధారాలు ఉన్నాయి*. 

*మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం;* *ఈశ్వరుడు కూడా మహావిష్ణువులో ఒక భాగ మని చెప్పడానికి పురాణాల మూర్తులు, క్షేత్రాలు ఆధారాలు.*

 *దక్షిణాన తిరునెల్వేలి జిల్లాలో శంకర్ నయనార్ కోయల్ అనే ఊళ్ళో ఒకే మూర్తిలో శంకరనారాయణ స్వరూపంగా భగవానుడు ఉండటం నేటికీ మనం చూడవచ్చు.* 

*ఇలాగే మైసూరు, మహారాష్ట్రల ముధ్య 'హరిహర' క్షేత్రంలో హరి, హరుడు ఏకస్వరూపంగా ఇమిడి ఉన్నారు.*


*🙏కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి 🙏*

తెల్ల బట్ట

 తెల్ల బట్ట ( Leucorrhea) సమస్య - సంపూర్ణ వివరణ - 


తెల్లబట్ట అనేది మహిళల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది యోని నుంచి వచ్చే ఒకరకమైన తెల్లటి ద్రవం. ఇది సాధారణంగా తెలుపు రంగు లేదా పాల రంగులో ఉంటుంది. ఇది సాధారణంగా ఋతుచక్రం లో వివిధ దశల్లో హార్మోన్ల మార్పు వలన సంభవిస్తుంది. దీని స్థాయిలో హెచ్చు మరియు అసాధారణ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడటం ముఖ్యం.  


తెల్లబట్ట రావడానికి ప్రధాన కారణాలు - 


* గర్భనిరోధక మాత్రలు వాడటం మరియు హార్మోనల్ ఇన్ బాలన్స్ వలన కూడా ఇది వస్తుంది.  


* ఇన్ఫెక్షన్ సమస్య వలన ముఖ్యంగా యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్, బాక్టీరియల్ వాగినోసిస్ లేదా ఇతర ఇన్ఫెక్షన్స్ వలన కూడా తెల్లటి జిగురు వంటి ద్రవం బయటకు వస్తుంది. ఈ ద్రవం దుర్వాసన తో కూడుకొని అసాధారణ స్థితిలో ఉంటుంది.  


* పరిశుభ్రత లోపం, ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యపు ఆహరపు అలవాట్లు, దీర్ఘకాలపు మధుమేహం, రోగనిరోధక శక్తి తక్కువుగా ఉండటం కూడా కారణం అవుతాయి. 


తెల్లబట్ట లక్షణాలు - 


* తరచుగా జ్వరం వచ్చి ఉష్ణోగ్రత గణనీయంగా పెరగడం 


*. కడుపులో అప్పుడప్పుడు భరించలేని నొప్పి, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. 


* అకస్మాతుగా బరువు తగ్గడం, యే పని చేయకున్నా త్వరగా అలసిపోవడం. 


* యోని ఎల్లప్పుడూ తడిగా ఉండటం మరియు దూరదగా అనిపించడం సంభోగ సమయంలో నొప్పి, మంట గా ఉండటం, యోని నుండి దుర్వసన రావడం. 


  ఇలా యోని నుంచి తెలుపు మాత్రమే కాదు పసుపు పచ్చ, ఆకుపచ్చ, ఎరుపు రంగులో కూడా స్రావాలు బయటకు వచ్చును. ఇది లోపల ఇన్ఫెక్షన్ మరియు బ్యాక్టీరియా తీవ్రతను బట్టి ఉంటుంది. ఇది తీవ్ర దుర్వాసన తో ఉంటుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడువారు సమస్య ముదిరే కొద్ది బలహీనత ఎక్కువ అయ్యి ఇబ్బంది పడతారు. స్రావం ఎరుపురంగులో ఉంటే దానిని "ఎర్రబట్ట " అని ఆయుర్వేదంలో పిలుస్తారు. 


 పైన చెప్పిన సమస్యకు ఆయుర్వేదంలో చాలా చక్కని పరిష్కారం ఉంది. ఎంతటి దీర్ఘాకాలంగా ఉన్న "తెల్లబట్ట " మరియు "ఎర్రబట్ట " సమస్య అయినా సంపూర్ణంగా పరిష్కారం చూపించబడును. 


  ఈ సమస్యతో ఇబ్బంది పడువారు నన్ను సంప్రదించగలరు. సంప్రదించవలసిన నెంబర్


               9885030034. 


 

         కాళహస్తి వేంకటేశ్వరరావు 


     అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


                 9885030034

ఉబ్బసం నివారణా యోగాలు

 ఉబ్బసం నివారణా యోగాలు -


 * ఉబ్బసం ఉధృతంగా ఉండి శ్వాస ఆడనప్పుడు వాము గింజలను వేడిచేసి గుడ్డలో కట్టి ఛాతిపైన , గొంతుకకు కాపడం పెడితే నొప్పి శ్వాస సులువుగా ఆడుతుంది.


 * వస కొమ్ము చూర్ణం ఉబ్బసం ఎక్కువుగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకి ఒకసారి ఉసిరిగింజంత నీటిలో కలిపి తాగాలి.ఇలా రెండు లేక మూడు మోతాదులలో తేలిక అగును.


 * మారేడు ఆకుల రసం అరచెంచా , తేనె అరచెంచా కలిపి ఉదయం , సాయంత్రం రెండుపూటలా తీసుకోవాలి . 40 రోజులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. తగ్గకుంటే మరొక్క 40 రోజులు వాడండి. తప్పక తగ్గును.


 * పూటకొక యాలుక్కాయ తినినచో ఉబ్బసం తగ్గును.


 * ఎండు జిల్లేడు ఆకుల పొగని తరుచూ పీల్చుచుండిన ఉబ్బస రోగం నివారణ అగును.


 * ప్రతినిత్యం ఒక పచ్చి కాకరకాయని తింటున్న పోతుంది. రోజురోజుకు మార్పు కనిపించును. తగ్గేంత వరకు వాడవలెను.


 * ప్రతి నిత్యం ఉదయం , సాయంత్రం కప్పు పాలలో నాలుగు వెల్లుల్లి రేకలు చితగ్గొట్టి వేసి పొయ్యి పైన మరిగించి ఆ పాలను తాగుచున్న ఉబ్బసం హరించును .


 * ఉబ్బసం ఎక్కువుగా ఉండి కఫం పట్టేసి ఉన్నచో కుప్పింటాకు రసాన్ని మూడు చెంచాలు లొపలికి తీసుకొనుచున్న కఫం కరిగి బయటకి వచ్చును.


 * అల్లం రసం , తేనె సమభాగాలుగా కలిపి మూడు గంటలకి ఒకసారి చెంచా చొప్పున తీసుకొనుచున్న ఉబ్బస ఉధృతి తగ్గును.


 * ఉత్తరేణి చెట్టుకు సమూలంగా తీసుకుని నీడన ఎండించి భస్మం చేయవలెను . ఆ భస్మమును మూడు పూటలా కందిగింజ అంత తేనెతో కలిపి లోపలికి తీసుకొనిన ఉబ్బసం తగ్గును . ఇది తిరుగులేని యోగం . 


శరీరంపైన లేచే వ్రణాలను హరించు యోగాలు -


   శరీరంలోని కొన్ని భాగాలలో ఎత్తుగా , గట్టిగా గడ్డలు ఏర్పడును . ఈ గడ్డల వలన పోటు , విపరీతమైన నొప్పి ఉండును. కొన్ని మెత్తగా ఉండి పోటు , సలుపు కలిగి ఉండును. వ్రణాలు లొపల చీము మరియు నెత్తురుతో కూడుకుని ఉండును. పక్వానికి వచ్చి పగిలిన తరువాత లొపల ఉన్న చెడు బయటకి వెళ్లడం వలన నొప్పి మరియు పోటు ఉపశమించును.


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

సదాచారము

  సదాచారము వైజ్ఞానిక విలువలు 27


డా॥ అన్నదానం చిదంబర శాస్త్రి గారు


పసుపు యాంటీబయాటిక్ అన్న విషయం అందరూ ఎరిగినదే. 'ముత్తెమంతా పసుపు ముఖమంత చాయ' అని సినీ రచయిత వ్రాసినట్లుగా ముఖానికి పసుపు మంచి కాంతినిస్తుంది. సుమంగళులు నదీస్నానం చేసేటప్పుడు తమవంటి పుణ్యస్త్రీ అయిన నదీమతల్లికి పసుపు, కుంకుమ సమర్పిస్తారు. అలా జల కాలుష్యం తొలగించినవా రవుతారు. అనంతరం ముఖానికి పసుపు రాసుకుని, శిరోజాలు విప్పి ముందుగా దోసిలితో నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. తల తుడుచుకున్నాక జుట్టు ఆరబెట్టుకోడానికి కొసలు ముడి వేసి, ఆరబెట్టుకోవాలి తప్ప జుట్టు విరబోసుకుని ఆరబెట్టుకోరాదు. స్త్రీలు జుట్టు విరబోసుకోవడం చాలా దోషంగా చెప్పబడింది. జుట్టు విరబోసుకోవడం సమాజానికే అనర్థదాయకం. ఆ అనర్థమే నేడు నాగరికతగా పరిణమించడం ఒక దురదృష్టం..


స్త్రీలు నదీస్నానానికి వెళ్తూ ఇంటివద్దే జడలు విప్పి బయలుదేరాలి. నది వద్ద విప్పరాదు. కాన దూముడితో వెళ్ళాలి. విరబోసుకొని వెళ్ళరాదు. చేతిలో పాత్ర ఉండాలి. పసుపు కుంకుమలు తీసికొని వెళ్లాలి. నదీమాతకు సమర్పించటానికి, తనకు, అవసరమయితే ప్రక్కవారికి వినియోగించాలి. పాత్ర, పై బట్ట లేకుండుట అశుభము. ముత్తయిదువులు మునిగి స్నానం చేయరాదు. పోసుకోవాలి. జలం పై భాగాన బ్రహ్మహత్య ఉంటుంది. కాబట్టి ప్రవాహంపై నీటిని ప్రక్కను నెట్టి స్నానం చేయాలి. చాకి బండ వద్ద స్నానం చేయరాదు. నగ్నంగా స్నానం చేయరాదు. దేహం రాక్షసగ్రస్త మవుతుందంటారు. స్త్రీలు బొట్టు పెట్టుకొనేటప్పుడు


"కాశ్మీరం దధా మ్యరుణం - శోభాయమాన మాననే ! విష్ణుప్రియే ! సదా దేవి ! దేహి సౌభాగ్యతాం చ మే ||


కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం | ధారణే నాస్య శుభదం - శాంతి రస్తు సదా మమ ||"


అనేవి చదువుకొనాలి. బొట్టువల్ల లౌకిక, అలౌకిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. బాహ్యాభ్యంతర సౌందర్యా లున్నాయి. బొట్టు లక్ష్మీకరం. చూస్తే లక్ష్మీకళ ఉట్టిపడాలనీ, బొట్టుపెట్టుకో అనీ సూచిస్తారు. దైవకార్యాలకు బొట్టు తప్పక ఉండాలి కాబట్టే దేవాలయాలలో బొట్టుని అందరికీ అందుబాటులో ఉంచుతారు. బొట్టు పరాక్రమ చిహ్నం. బొట్టు విజయచిహ్నం కూడా. చరిత్రను పరిశీలిస్తే రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో స్త్రీలు వారికి వీరతిలకం దిద్దడాన్ని చూస్తాము.


పూజా కార్యక్రమములందు దీపారాధన స్త్రీలు చేయటమే విధి. విధానమును గ్రహించి దీపారాధన స్త్రీలు చేయాలి. పూజకు కూర్చొనేటపుడు స్త్రీలు లక్ష్మీదేవిలా ఉండాలని పెద్ద లంటారు. చినిగినవి కాని మాసినవికాని కట్టుకొనరాదు. పట్టుచీరెలు ధరించి తలలో పూలు పెట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజకు ఉపక్రమించాలి. ఆచమనము భర్తచే వేయించుకొనుట, చివరకు పరమేశ్వరార్పణలో భర్త చేతిలో నీరు తాను వేయుట స్త్రీ కర్తవ్యం. ఆచమనం కూడా భర్తకు స్త్రీయే వేయాలి అను నియమంలో కొందరు అలా చేసేవారు ఉంటారు. పురుషులు స్వయంగా ఆపోశనం, ఆసనం, శయనం వేసికొన కూడదు, కాబట్టి స్త్రీలు భర్తకు ఆసనం శయనం వేయాలి. అమ్మవారి పూజ, నోములకు సంబంధించిన పూజలు స్త్రీలే నిర్వహించుకొనాలి. అలాగే నిత్యమూ తులసీ పూజ నిర్వహించటం స్త్రీ కర్తవ్యం. అందులో ఎంతో విశేషం ఉంది. ఏ పూజకయినా ముందు దీపారాధన చేయాలి. తులసికోట ఆరుబయట ఉంటుంది. కాబట్టి గాలికి నిలపటం కష్టం. అందుకై ఇంట్లోనే దీపారాధన చేయాలి. భర్త పూజచేసే సమయములో కూడా దీపారాధన చేసే బాధ్యత స్త్రీదే. అలా దీపారాధన చేసి,


"దీపదేవి! మహాదేవి! శుభం భవతు మే సదా యావత్ పూజా సమాప్తి స్స్యాత్ తావత్ ప్రజ్ఞ్వల సుస్థిరా”


అని ప్రార్ధించాలి. సాయం సంధ్యాసమయములో దీపారాధన చేసి "దీపంజ్యోతిః పరంబ్రహ్మ, దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప! నమోస్తుతే" అని దీపానికి నమస్కరించాలి. అనంతరం తులసి పూజ చేయటం, అందులో భాగంగా ప్రదక్షిణాలు చేయటం, తులసి మూలంలో నీళ్ళుపోసి నెత్తిన చల్లుకొనటం వంటి వన్నీ చేస్తారు. “ఇయం సాక్షాస్మహాలక్ష్మీః" అని లక్ష్మిగా చెప్పినందున ఈ లక్ష్మీపూజ సంపత్ప్రదమే కాకుండా విశేషంగా ఆరోగ్యప్రదం. తులసి గాలివల్ల, స్పర్శవల్ల దీర్ఘకాలం జీవించవచ్చని పరిశోధకులు తెల్పారు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు తులసి విశేష చికిత్స. కావుననే తులసీపూజను స్త్రీలకు విధించారు. అనేకవ్యాధులను పోగొట్టగల తులసి కాన్సరును కూడా నిరోధిస్తుందని తెల్పారు. చలిజ్వరము, జీర్ణాశయము, కాలేయ వ్యాధులకును తులసిచికిత్స ఉంది. క్రిమిసంహారకమయిన తులసిని యింటింటా నాటే వ్యవస్థను మహర్షులు ఏర్పరచటం జరిగింది. అమెరికన్ శాస్త్రజ్ఞులు తులసి బాక్టీరియా వ్యాప్తిని త్వరగా అరికడుతుందని గుర్తించారు. తులసికి పరిసరాల వాయువునంతను పవిత్రం చేసే శక్తి ఉంది. తులసి విషయంలో కొన్ని నియమాలున్నాయి. వాటిని తప్పక పాటించాలి. తులసిని కోసేటప్పుడు


"తుల స్యమృతజన్మాసి - సదా త్వం కేశవప్రియే! కేశవార్థం లునామి త్వాం వరదా భవ శోభనే॥


అని చదువుతూ కోయాలి. దాని అర్థం "ఓ తులసీ! నీవు అమృతమందు పుట్టావు. విష్ణుమూర్తి భార్యవు. నిన్ను నీ పతిఅయిన విష్ణుమూర్తి సన్నిధికి చేర్చటానికే కోస్తున్నాను. నన్ను అనుగ్రహించు" అని. లక్ష్మీ స్వరూపిణి అయిన ఆమెను తుంచటం తప్పే. ఆమె పతిని చేర్చటంకోసమే కాబట్టి ఆమె సంతోషించి అనుగ్రహిస్తుంది. అలా అనిన మనం భగవంతునకు పూజ చేసి అనంతరమే మందుకొర కయినా వినియోగించాలి. కోసి నేరుగా వాడుకొనరాదు. అలాగే పూజ చేసే తులసిచెట్టునుండి దళాలు కోయకూడదు.


వేరే చెట్టువే కోయాలి. తులసికి నీరు పోసి ఆనీటిని నెత్తిన చల్లుకొంటూ, అలాగే నమస్కరిస్తూ


“యన్మూలే సర్వతీర్థాని - యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వ వేదాశ్చ - తులసి! త్వాం నమా మ్యహమ్.”


అని చదువుకోవాలి. లౌకికంగా ఆరోగ్య పరంగాను, అలౌకికంగా లక్ష్మీరూపిణిగాను అనుగ్రహించే తులసిని తప్పక ఇంటింటా నాటుకొని స్త్రీలు నిత్యం పూజించాలి. తులసితో నిత్యసంబంధం కల్గిఉండాలి. పూజ అయ్యాక ప్రదక్షిణం చేసిన అనంతరం స్త్రీలు సాష్టాంగ నమస్కారం కాక పంచాంగ నమస్కారం చేయాలి. ఆ విధానం ఇలా చెప్పబడింది.


“పాదాంగుళిభ్యాం జానుభ్యాం శిరసా చాపనీం స్పృశన్; బద్ధాంజలి ర్నమస్కుర్యాత్ స పంచాంగ ఉదీరితః |


సాష్టాంగ నమస్కారానికి బదులు స్త్రీలు ఇలా రెండు కాళ్లవేళ్లు, రెండు మోకాళ్లు, శిరస్సు ఈ ఐదు అవయవాలు భూమికి తాకేటట్లు చేసేది పంచాంగ నమస్కారం. స్త్రీలు ఇలా ఎందుకు నమస్కారం చేయా అనేటందుకు కారణాన్ని శాస్త్రం చెప్పింది.


'నత్తం గుదం చ విప్రాణాం నారీణాం స్తనమండలం – పవిత్ర గ్రంధి దర్భాంశ్చ – సోధుం న క్షమతే క్షమా!'


అంటే శంఖంయొక్క పృష్ఠము అనగా క్రింది భాగము, బ్రాహ్మణుని పృష్ఠ భాగము, స్త్రీల స్తనములు, దర్భలతో ముడివేసిన పవిత్రము, దర్భలను కూడా భూదేవి భరించలేదు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేస్తే వారి స్తనములు భూమికి తగులుతాయి. కాబట్టి వారు పంచాంగ నమస్కారమే చేయాలి తప్ప సాష్టాంగం చేయరాదు. పంచాంగ నమస్కారంలో మార్జాలాసనం ఇమిడి ఉంది. దానివలన జననేంద్రీయోత్తేజం కలుగుతుంది. అది స్త్రీలకు ఆరోగ్యప్రదం కూడా.


పురుషులకంటె స్త్రీల భిన్నత ప్రథమ రజస్వల, బహిష్టు, ప్రసవము అనే వానియెడ ఉంటుంది. వాటివిషయాలో సదాచారం పాటించటం స్త్రీ విషయంలో ముఖ్యమైనది. ఆడపిల్లగా శారీరకమయిన మార్పులు పొందే ముఖ్యమయిన సమయం రజస్వల అవటం. మానసికంగా కూడ అప్పటినుండి పరిణతి ఉంటుంది. తల్లి తన కుమార్తెకు ముందుగానే దానినిగూర్చి అవగాహన ఇవ్వాలి. పరాయిచోట ప్రథమరజస్వల అవటంవల్ల జీవితంలో కొన్ని చెడులకు అవకాశం ఉటుందని చెప్తారు. అనుభవములో కూడా అది యథార్థమనటానికి నిదర్శనా లున్నాయి. కాన ఆకాలంలో వీలయినంతవరకు తల్లిదండ్రులకడ స్వగృహంలో ఉండేటట్లు చూడాలి. పిల్లకు అవగాహన కల్గించటంపల్ల వెంటనే తల్లికి చెప్పటం, తగు జాగ్రత్తలు తీసికొనటం జరుగుతుంది. అలాగే సరియైన సమయాన్ని గ్రహించి సమయ దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకొనే అవకాశం ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, లగ్న, వర్జ్య, దుర్ముహూర్త దోషములు ఉంటే వాటికి తగిన పరిహారం చేసికొనాలి.


రాత్రిపూట అయినప్పుడు రాత్రి ప్రొద్దు మూడుభాగాలు చేసి మొదటి రెండు భాగములు క్రిందటిరోజుగాను, మూడవభాగంలో జరిగితే మరుసటి రోజుగాను పరిగణించాలి. ఆసమయంలో చినిగిన వస్త్రాలు, అశుభ్రవస్త్రాలతో ఉండటం మంచిది కాదు. కాబట్టి ఆకాలంలో మంచి వస్త్రాలు ధరింపజేస్తూ ఉండాలి. అందునా తెల్లటి వస్త్రాలు శుభప్రదం. ఆరోజులలో పథ్యము చాలా ముఖ్యము. అప్పటి అజాగ్రత్త జీవితాంతము ప్రభావం చూపుతుంది. కాబట్టి విధి నిషేధాలు తెలిసికొని ఆహారం ఇవ్వాలి. పులగము, బెల్లము, బెల్లముతో చేసిన పిండివంటలు ఆరోజులలో పెడతారు. అది ఆచారము కాదు. ఆరోగ్యము, ఆరోజులలో వాతం చేయకూడదు. కాబట్టి వేడిచేసే పదార్థాలు అలా వాడతారు. పాలు వాడవచ్చు కాని మజ్జిగ వాడకూడదు. ఆ నాల్గు రోజులు పరగడుపున మంచి పసుపుతో చిన్న ఉండలు చేసి తినిపించాలి. పుసుపు గుణం చాలా గొప్పది. అందులో శుచి, ఆరోగ్యం రెండూ ఉన్నాయి. అందుకే స్నానం రోజున పసుపు రాసుకొని స్నానం చేయటం, కథ చెప్పిన పసుపునీళ్ళు ఆమె వాడిన వస్తువులన్నిటిపై చల్లటం చేయించాలి. నాల్గవరోజు అట్లబంతి పెట్టటం, ఆరోజు తప్పక కంద బచ్చలి కూర చేయటం జరుగుతుంది. అదికూడా ప్రథమ రజస్వల అయిన అమ్మాయి ఆరోగ్యమును దృష్టియం దుంచుకొని ఏర్పరచిన నియమమే. ఆ నాల్గవనాడు పసుపు, నువ్వులు నేతితో కల్పి మూడు ఉండలు తింటే నాభి శీతలం పోతుంది. ఆ దశలో శీతవాత దోషములు తగిలే అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదకారి అవుతుంది. అటువంటి సమస్యలేవీ రాకుండా ఆ నియమా లేర్పరచారు.


హిందూ ఆచారవ్యవహారాలు స్త్రీని దూరం పెట్టాయి అని విమర్శిస్తూ ఉంటారు. నిజానికి ముట్టు దోషం ఇతర మతాలు కూడా అంగీకరించాయి. పూజాపురస్కారాలు, జపతపాలు వంటి ఆధ్యాత్మిక, దైవ కార్యక్రమాలన్నిటి విషయంలో ముట్టువారిని తాకటం, దగ్గరకు రానివ్వటం దోషంగా మన శాస్త్రాలు చెప్పాయి. ఆధ్యాత్మిక గ్రంథాలేకాదు చాణక్యుడు తన అర్థశాస్త్రంలోకూడా ఋతుకాలాన్ని దాచిన స్త్రీకి, ఋతుమతి అయిన భార్యను కూడిన పురుషునకు దండన విధించాడు. ధర్మశాస్త్రాలయితే అట్టి స్త్రీలు పుణ్యకార్యక్రమాలలో పాల్గొనటం, వారిని తాకినవారు పాల్గొనటం చాలా పాపంగా చెప్పాయి. హిందూ శోత్రియ కుటుంబాలలో తప్ప ఆ నియమాన్ని ఇప్పుడు ఎవ్వరూ పాటించటం లేదు. కాని దోషమే అని గ్రహించాలి. దుర్గంధపూరితమైన ఋతుస్రావం ఆ మూడురోజులు స్త్రీలనుండి వెలువడుతుంది. అది సక్రమంగా వెడలకుండుటయే స్త్రీల అనారోగ్యా లన్నిటికీ కారణం. అది ఆగినరోజులలోనే స్త్రీలకు మెనోపాజ్ అని అనారోగ్యముల అవస్థ లుంటాయి. కాబట్టి అది చెడురక్తమనటం స్పష్టం. దానిని పౌరాణిక గాథలు బ్రహ్మహత్యాపాతకంగా చెప్తున్నాయి. విశ్వరూపుని సంహరించినందువల్ల ఇంద్రుని కేర్పడిన బ్రహ్మహత్యాపాతకాన్నిస్త్రీలుకూడా పంచుకున్నారు. ఆ బ్రహ్మహత్య స్త్రీల ఋతు రక్తమునందు ఉంటుంది.


స్త్రీల రజస్వలా కాలాన్ని "బహిష్టు" అంటారు. అంటే బహిః అంటే బయట స్థ అంటే ఉండటం. ముట్టు అంటే తాకుట అది తగదని ఆ పదాలే చెప్తున్నాయి. ఆ నాల్గురోజులు స్త్రీకి పూర్తి విశ్రాంతి నీయటం ఆమె ఆరోగ్యానికి అవసరం. ఆమె అన్నిటినీ ముట్టుకొనకుండటం మిగిలినవారి ఆరోగ్యాని కవసరం. అన్నీ దృష్టియందు ఉంచుకొని ఆరోజులలో దూరంగా ఉండే విధానమును మన పెద్దలు ఏర్పరచారు. ముట్టువారు మంచివారిని తాకటమే కాదు, మరో ముట్టు స్త్రీనికూడా తాకరాదంటే అందలి దోషం గ్రహించవలసి ఉంది. చంటిబిడ్డలను కన్నతల్లి తప్ప మరో ముట్టు స్త్రీ తాకరాదు. ఇటువంటి విషయాలపై చాల పరిశోధనలు కూడా జరిగాయి. ఒక ప్రకృతి శాస్త్ర పరిశోధకుడీవిషయంలో గుర్తించినరీతి గమనింపదగినది.


విదేశీ ప్రకృతిశాస్త్ర పరిశోధకుడు మేడమీద ఉండి క్రింద పూలతోటలో రమ్యంగా ఉన్న ఒక పూవుని చూచి పనిపిల్లతో దానిని కోసుకురమ్మని చెప్పాడు. ఆ అమ్మాయి అలాగే తెచ్చింది. కాని తాను చూచిన రమ్యత అందులో కానరాలేదు. ఏదో పొరపాటు జరిగిందని మరో పూవు మంచిది చూపి తెమ్మన్నాడు. అదీ అలాగే అయింది. ఎందుకలా అవుతోందా అని విచారిస్తే ఆ అమ్మాయి చెప్పింది. ఇలా తన చేత ఎన్నిసార్లు తెప్పించినా ఆ పూలు రమ్యత కోల్పోతాయని. తాను బహిష్టు అయి ఉన్నానని, ఆరోజులలో ఏపూవు తాకినా అలాగే అవుతుందని చెప్పింది. ఇది నీ విషయంలోనేనా స్త్రీలు అందరివిషయంలో ఇలా జరుగుతుందా? అని ఆ పరిశోధకుడు ప్రశ్నించగా “అందరికీ ఇంతే" అని ఆమె బదులిచ్చింది. అంతట ఆ పరిశోధకుడు అనేక బహిష్టు స్త్రీల రక్తం తెప్పించి మామూలు స్త్రీల రక్తంతో పోల్చి తన పరిశోధనలద్వారా స్త్రీల బహిష్టు రక్తంలో ఒకవిధమయిన విషం ఉంటుందని గుర్తించి తెల్పాడు. ఆకాలంలో వారితోడి సంసర్గంవల్ల ఆ


విషప్రభావం మగవారిపైకూడా పడుతుందని తెల్పాడు. కాబట్టి బహిష్ఠ స్త్రీలను సాధ్యమయినంత దూరం ఉంచటం అవసరమని చెప్పాడు. రజస్వల (ముట్టు) అయిన స్త్రీ తాకటంవల్ల పదార్థం విషపూరిత మౌతుందని జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 1949 అక్టోబరులో వచ్చింది. ఈవిషయం చిరకాలం పరిశోధించిన జర్మను, అమెరికా పరిశోధకులు అంగీకరించారు. ఈ విషయాలన్నీ తెలిసియే మన మహర్షులు వారియెడ నియమాలు చెప్పారు. అవి సమాజ శ్రేయస్సుకోసం ఏర్పరచినవే అని గ్రహించాలి. అత్యంతము ప్రేమించే తన భార్య, కుమార్తెల విషయంలో వారు ఆ నియమాలు పాటిస్తున్నారంటే అది ఏ ద్వేషంతోనూ కాదని, అందరి శ్రేయః కాంక్షతోనే అని గ్రహించాలి. స్త్రీలు బహిష్టు నాలుగు రోజులు ఎట్టి వ్యాయామం చేయరాదు. అలాగే గర్భవతులు 4వ నెల తర్వాత, పురుడు వచ్చిన అనంతరం నాలుగు నెలలు గడిచేదాకా క్రమంగా తగ్గిస్తూ ఆపాలి.


ఈ విషయంలో పరాశర స్మృతి 'పతితునకు ఒక బారెడు దూరంలోను, బహిష్ఠయైన స్త్రీకి రెండు బారల దూరంలోను, ప్రసవమయిన స్త్రీకి మూడు బారల దూరంలోనూ ఉండాలని తెల్పింది. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు బహిష్ఠ స్త్రీల విషయమై ధర్మరాజుతో చెప్పిన వృత్తాంతంచే బహిష్ఠ స్త్రీలు ఇంట్లో అన్ని వస్తువులను తాకి యింటిని దోషగ్రస్తం చేయుటవల్ల వారు అనంతరం ఎటువంటి దుస్థితులు పొందుతారో తెలుస్తుంది, కాబట్టి బహిష్ఠ స్త్రీలగూర్చి మహర్షులు చెప్పిన సదాచారం పూర్తి విజ్ఞానశాస్త్ర సమ్మతం.


ఇందుకు కొన్ని పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు కూడా వారే చెప్పారు. విషయంలో తెలియక జరిగిన పొరపాట్లకు ఋషిపంచమి వ్రతం, లక్షవర్తి వ్రతం చెప్పబడ్డాయి. స్త్రీల ఋతుదోష పాపం సేతుస్నానంవల్ల కూడా పోతుంది. పెద్దవారయాక రామేశ్వరం వెళ్ళిన అక్కడ ఋతు సంబంధమయిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిపిస్తారు. ముట్టు స్నానము, బాలెంత స్నానము వంటివి సూర్యోదయం అయిన పిదపనే చేయాలి. అప్పుడే దోష పరిహారము. ధర్మ కార్యాలు, దైవకార్యాలు బహిష్ఠ అయిన స్త్రీలు చేయకుండా ఉండటమేకాక చేసేవారిని తాకటంకూడా చేయరాదు. కాబట్టి తగినంత దూరములో ఉండాలి. ఐదవ రోజు స్నానం చేసిన తరువాతే వారు అన్ని పుణ్యకార్యాలు చేయటానికి అర్హత పొందుతారు. గంగ కూడా తీసికొంటే పూర్తి పవిత్రతయే


గర్భవతిగా ఉన్న కాలంలో కూడా స్త్రీకి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. గర్భధారణ తరువాత ఐదవమాసం వచ్చేదాకా వేడిచేసే పదార్ధాలు తినకూడదు. నువ్వులతో చేసిన పదార్ధాలు, బొప్పాయికాయ వంటివి తినరాదు. అందువలన గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీలు నదీస్నానాలు, సముద్రస్నానాలు, కొండలు ఎక్కటాలు చేయకూడదు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణములలో జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహణ తేజస్సు ప్రభావం అపరిపక్వ దశలో ఉన్న శిశువుపై పడితే ఆయా అవయవభాగాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీస్త్రీలను బయటకు రానీక పరుండబెడతారు. గ్రహణసమయంలో వ్యాపించే ఒక విధమయిన బాక్టీరియా, గర్భస్థంగా ఊరే రసాలుకూడా గర్భస్థ శిశువుకు ఇబ్బంది చేస్తాయి కాన ఆ జాగ్రత్తలు అవసరం. గర్భిణులు కొబ్బరికాయలు కొట్టటం, ముత్తయిదువులకు పండ్లు తమ చేతులమీదుగా ఈయటం, శంకుస్థాపన చేయటం, చెట్లు, మొక్కలు పీకివేయటం చేయరాదు. ఉపనయనంలోని కొన్ని మంత్రాలు, స్నాతకమందలి మంత్రాలు వినకూడదు. కాబట్టి అవి వినబడని దూరంలో ఉండటం మంచిది. గృహప్రవేశ సమయంలో చేసే కూష్మాండబలి అం గుమ్మడికాయ పగులగొట్టటము చూడకూడదు. వివాహసమయంల బలిమంత్రాలు, సూర్యనమస్కారాల అరుణంలోనివి కొన్ని మంత్రాల ప్రభావం గర్భస్థ శిశువుపై పడి వారికి కీడు కల్గిస్తుంది. కాబట్టి అట్టివానికి గర్భిణీస్త్రీలు దూరంగా ఉండాలి.


'నాతిచరామి' అని భర్త చెప్పాడు కాబట్టి అది పాటించాల్సినది ఆయనే అనుకోకూడదు. 'నాతిచరే త్రికరణయా భర్తారం' అని గౌతమ మహర్షి చెప్పారు. కాబట్టి స్త్రీ కూడా మనసా, వాచా, కర్మణా భర్తను అతిక్రమించకూడదు. 1840లో ఫక్కి లక్ష్మీనరసింహకవి రచించిన కుమారీశతకం అంతా స్త్రీల సదాచారాన్ని తెల్పేది. ఒకప్పుడు ప్రతి బాలికచేతా దానిని చదివించేవారు. పెనిమిటి వలదని చెప్పిన పనియెన్నడు చేయరాదు' అని మొదలుగా అందు తెల్పిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. అందరిచే కొనియాడబడేటట్లు అత్తమామలకు, భర్తకు సేవ చేయాలి. బిగ్గరగా మాట్లాడటం, నిందావాక్యాలు పల్కటం తగదు. పెద్దలు వచ్చినపుడు ఆసనంనుండి దిగాలి. చెడుమార్గాన పోయే భర్త మనస్సు మంచిగా మార్చగల్గాలి. పుట్టినింటికి, మెట్టినింటికి వన్నె తేవాలి. భర్త దీనుడైనా, రాజ్యహీనుడైనా నాకు నా భర్తయే గొప్పవాడని సీత అన్నట్లు ఉండాలి. మృతియైనా బ్రతుకైనా పతితోనే సతికి చెల్లు పతిబాసిన ఆ బ్రతుకొక బ్రతుకా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు బంగారంతో తులతూగుతున్నా వారి యింట స్త్రీ కలకాలం ఉండటం మర్యాద కాదు. భర్త ఏమీ అనటంలేదుకదా! అని చెడుపనులు చేయకూడదు. నీ కిష్టమయిన పనులు చేస్తున్నారని పనివాళ్ళకు ఎక్కువ చనువు ఈయవద్దు. సంధ్యాసమయంలో నిద్రపోవద్దు. దానిచే దరిద్రం ప్రాప్తిస్తుంది. వేకువజామున లేచి పాచిపనులు చేసుకో. వీధి గుమ్మంవద్ద నిలబడి ఉండక. కులదేవతలను పూజించు. అతిగా నవ్వకు. వేళాకోళం, గయ్యాళితనం, చాడీలుచెప్పడం, తగాదాలు పనికిరావు. ఎన్ని నగలున్నా పసుపు కుంకుమలు వానికి మించినవే. వడ్డనలో భేదభావాలు చూపక. ఇల్లు, ఒళ్ళు, బట్టలు, తల అపరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకొన అసత్య మాడకు. కష్టములకు చలింపకు. అతిథులను కాదనకు.


వస్త్రాభరణములను ఎరువు తెచ్చుకోకు. తగువులాడుకొనే యింటికి లక్ష్మి రాదని గ్రహించు. నీ భర్తకు మంత్రివలె సలహాలిస్తూ, రంభవలె సుఖాన్నిస్తూ, దాసివలె సేవ చేస్తూ, తల్లివలె తృప్తిగా భోజనం పెడుతూ, భూదేవివలె ఓర్పుతో జీవించు. దీపపు నీడలో, మనిషినీడలో, మంచపు నీడలో, తాడిచెట్టు నీడలో ఎప్పుడూ నిలబడకు. తలవెంట్రుకల నుండి నీరు జారి ఇంట్లో పడనీక అని ఇలా సకలశ్రేయస్సులు, యశస్సులు పొందటానికి కావలసిన సదాచార మంతా చెప్పబడింది.


 సశేషం......

చారు'కి చారని పేరెందుకంటే

 *'చారు'కి చారని పేరెందుకంటే నవ్వుతారేంటో నవ్వకండి, ఇది చిత్తగించండి.🙂*


*చింతపండు, ఇంగువ, పోపు దినుసులు, ఉప్పు. ఈ నాలుగు (చార్) కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారౌతుందని దానిని చారన్నారో. మరేమో చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారౌతుంది.*


*పప్పేస్తే పప్పు చారు. టమాటాలతో టమాటా చారు. మునగేస్తే మునగచారు. మిరియం వేస్తే మిరియాల చారూ.*


*ఏక్ దో తీన్ చార్ అని నాలుగు నిమిషాలలో. ఇలా పాపం దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది.*


*పళ్ళు రాని పాపడి నుంచి పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ.*


*అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే. మారాం చేసే బుజ్జిగాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే. మీకు ఉప్మా నచ్చదా. ఐతే ఓ రెండు చెంచాల చారు కలుపుకొండి. అమృతమే. జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే.*


*ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే (వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే. అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా. నిజం ఒప్పుకోండి. ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే.*


*ప్రియే చారు శీలే అన్నారు గుర్తుందండీ జయదేవులవారు. చారు అంటే అందమైనది అద్భుతమైనది అని, అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా చెప్పండి. మరి చారు తాగే జయదేవులు అష్టపదులు చెప్పుంటారు లెండి, మరి ఒడిషా మరి తెలుగుదేశానికి దగ్గరే కదా.*


*వేడి వేడి చారు పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే. మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి. అద్భుతః, అమోఘః. మరి చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది. గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు.ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు.*


*ఇలా చెప్పుకుంటూ పోతే. అహో ఏమి చెప్పను చారు. వేడి వేడిగా గొంతులో జారు. చెవులనుండి వచ్చు హోరు. జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు.*

*ఇంకే ద్రవమేనా చారు ముందు బేజారు. చార్ మినిట్ మే బనే చారు, ఆ ఘాటుకు మాత్రం నా జోహారు.*


*మాతృహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం వృథా, వృథా!*


*తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు, ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.🙏*

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁మంగళవారం 30 డిసెంబర్ 2025🍁*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                          9️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``                

                    *90 వ రోజు*                   

*వన పర్వము* *తృతీయాశ్వాసము*

               

        *భాగీరధుని తపస్సు*```


అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని తరువాత అతడి కుమారుడు భగీరధుడు రాజ్యపాలనకు వచ్చాడు. కొంతకాలం భగీరధుడు జనరంజకంగా రాజ్యం చేసాడు. సగరుని వృత్తాంతం తెలుసుకున్న భగీరధుడు సాగరాన్ని జలంతో నింపాలనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి గంగను గురించి ఘోరతపస్సు చేసి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నాడు. భగీరధుడు గంగాదేవిని “అమ్మా! నీవు దేవమార్గాన్ని వదిలి భూమికి రావాలి. సాగరాన్ని జలంతో నింపాలి. సగర పుత్రులకు మోక్షం కలిగించాలి” అని కోరాడు. 


గంగాదేవి “అలాగే, వస్తాను కానీ నా ఉద్ధృతిని భరించే శక్తి ఒక్క పరమ శివునికే ఉంది. కనుక నువ్వు శివుడిని ప్రసన్నుని చేసుకో” అని చెప్పింది. 


తరువాత భగీరధుడు కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్ధించాడు. 


శివుడు భగీరధుని కోరిక మన్నించి “నీవు గంగను తీసుకురా నేను భరిస్తాను” అన్నాడు. 


మరల భగీరధుడు గంగను ప్రార్ధించాడు. గంగ భగీరధుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు తన జటాజూటంలో ఉధృతంగా దుముకుతున్న గంగను ధరించాడు. తరువాత గంగ భూమి మీదకు వచ్చి సాగరాన్ని నింపింది. అప్పటి నుండి గంగానదికి భాగీరధి అనే నామం వచ్చింది” రోమశుడు గంగావతరణం గురించి ధర్మరాజుకు వివరించాడు. 


తరువాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద, నదులలో స్నానం చేసాడు. తరువాత వారు హేమకూట పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాళ్ళ నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్నికి మేఘాలు ఆకర్షితమౌతున్నాయి. ఆ తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరారు. అక్కడికి సమీపంలో ఉన్న ఋష్యశృంగుని సరోవరం చూసారు.```


          *ఋష్యశృంగుడు*```


రోమశుడు ధర్మరాజుకు ఋష్యశృంగుని గురించి చెప్పసాగాడు. “ధర్మరాజా! కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు సరసులో స్నానం చేస్తున్నాడు. అతనికి ఆ సమయంలో దేవ వేశ్య ఊర్వశి కనిపించింది. అతడు ఆమె పట్ల వ్యామోహ పీడితుడైన కారణంగా రేతఃపతనం జరిగి సరస్సులో పడింది. అతని రేతస్సుతో కూడిన నీటిని త్రాగిన దుప్పి గర్భందాల్చి ఋష్యశృంగుని ప్రసవించింది. విభాండకుడు కుమారుని గుర్తించి పెంచుకోసాగాడు. ఋష్యశృంగునికి తండ్రి తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతను తన పురోహితునకు చేసిన అపరాధం కారణంగా రాజ్యంలో క్షామం ఏర్పడింది. రోమపాదుడు తన తప్పు గ్రహించి బ్రాహ్మణులను తిరిగి రప్పించాడు. వారిని వానలు కురవడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. వారు "రాజా! ఋష్యశృంగుని నీ రాజ్యానికి రప్పిస్తే వానలు కురుస్తాయి” అన్నారు. 


రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యానికి రప్పించటానికి కొంత మంది వేశ్యలను పంపాడు. ఒకరోజు విభాంకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుని వదిలి పండ్లు, సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు. 


ఆ సమయంలో రోమపాదుడు పంపిన వేశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమె తనలాగే ఋషి కుమారుడు అనుకుని ఆమెకు అతిధి సత్కారం చేసాడు. 


ఆమె ఋష్యశృంగుని తనతో స్నేహం చెయ్యమని కోరింది. ఆపై ఆటపాటలతో అలరించి తిరిగి వెళుతూ ఇంటికి రమ్మని ఋష్యశృంగుని ఆహ్వానించింది. ఋష్యశృంగుడు ఆమె ధ్యాసలో పడి ఆహారపానీయాల కూడా ధ్యాస మరిచాడు. విభాంకుడు కొడుకు పరధ్యానం గ్రహించి కారణం అడిగాడు. 


ఋష్యశృంగుడు జరిగినది చెప్పాడు. విభాంకుడు “నాయనా! ఋషుల తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయవేషాలలో తిరుగుతుంటారు. జాగ్రత్తగా ఉండు” అన్నాడు. 


మరునాడు కూడా వేశ్య విభాండకుడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు. ఋష్యశృంగుని రాకతో అంగ రాజ్యంలో వానలు కురిసాయి. 


రోమపాదుడు సంతోషపడి తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసాడు. 


విభాండకుడు ఆశ్రమంలో కుమారుని జాడ లేక పోవడంతో వెతుక్కుంటూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ కొడుకు కోడలిని చూసి సంతోషించి వారిని తన ఆశ్రమానికి తీసుకు వచ్చాడు” అని చెప్పాడు.``` 


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

31డిసెంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌷 *బుధవారం*🌷 

 *🪷31డిసెంబర్2025🪷*  

    *దృగ్గణిత పంచాంగం* 

                 

         *స్వస్తి శ్రీ విశ్వావసు* 

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - శుక్లపక్షం*


*తిథి  : ద్వాదశి* ‌రా 01.47 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : కృత్తిక* రా 01.29 వరకు ఉపరి *రోహిణి*

*యోగం : సాధ్య* రా 09.13 వరకు ఉపరి *శుభ*

*కరణం  : బవ* మ 03.26 *బాలువ* రా 01.47 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:* 

           *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *రా 11.20 - 12.46*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : మ 02.44 - 04.10*

*దుర్ముహూర్తం  : ప 11.48 - 12.32*

*రాహు కాలం   : ప 12.11 - 01.34*

గుళికకాళం      : *ఉ 10.47 - 12.11*

యమగండం    : *ఉ 07.59 - 09.23*

సూర్యరాశి : *ధనస్సు*                           

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 06.46*

సూర్యాస్తమయం :*సా 05.53*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.36 - 08.50*

సంగవ కాలం         :     *08.50 - 11.04*

మధ్యాహ్న కాలం    :    *11.04 - 01.18*

అపరాహ్న కాలం    : *మ 01.18 - 03.31*

*ఆబ్ధికం తిధి         : పుష్య శుద్ధ ‌ద్వాదశి*

సాయంకాలం        :  *సా 03.31 - 05.45*

ప్రదోష కాలం         :  *సా 05.45 - 08.20*

రాత్రి కాలం           :*రా 08.20 - 11.45*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.53 - 05.45*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ శ్లోకం🌷*


*సరస్వతి నమస్తుభ్యం*

*వరదే కామరూపిణి*

*విద్యారంభం కరిష్యామి*  

*సిద్ధిర్భవతు మే సదా*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

తిరుప్పావై –16వ పాశురము*

 🌹🌷🪔🪔🛕🪔🪔🌷🌹

*బుధవారం 31 డిసెంబర్ 2025*

       *వేకువఝామున* 

       *పాడు కొనుటకు*


*శ్రీమతే రామానుజాయ నమః*

*తిరుప్పావై –16వ పాశురము*

*శ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో*


             *పాశురము*


*నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ*

*కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ*

*వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్*

*ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై*

*మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్*

*తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్*

*వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ*

*నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.*


            *తాత్పర్యము*


అందరకును నాయకుడై యున్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపుల గడియను తెరవుము. గోపబాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడును అగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచేయు పఱ యను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట యిచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చినవారము కాము. పరిశుద్ధభావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయ వచ్చితిమి. స్వామీ! ముందుగనే నీవు కాదనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదాని నొకటి చేరి బిగువుతో నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయవలెను అని గోపికలు భవనపాలకుని, ద్వారపాలకుని అర్థించిరి.

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*శ్రీమతే రామానుజాయ నమ*

*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఆరంభింపరు

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్

ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

తిరుప్పావై - తిరువెంబావై*

 



      *తిరుప్పావై - తిరువెంబావై*

                 ➖➖➖✍️

```

సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం.

హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు. ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్తి భావనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు. ‘తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది. అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది.


ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగా శివభక్తిని రసప్రవాహంగా తిరువెంబావైని మాణిక్యవాచకులు అనుగ్రహించారు.

గోదాదేవికి ఆండాళ్ అనే పేరు ఉంది. శ్రీవిల్లిపుత్తూర్ క్షేత్రంలో విష్ణుచిత్తులకు (పెరియాళ్ళార్) తులసివనంలో దొరికిన భూదేవి ప్రతిరూపం. అల్లారుముద్దుగా పెరిగింది. పిన్ననాటనే విష్ణ్భుక్తిని పెంపొందించుకుంది. యుక్తవయస్సురాగానే భర్తగా పెరుమాళ్ళనే పొందాలనుకుంది.

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి గోపికలు చేపట్టిన కాత్యాయిని వ్రత విధానాన్ని తండ్రి ద్వారా తెలుసుకుని గోదాదేవి మార్గళి (శ్రీవ్రతాన్ని) ఆచరించడానికి సంకల్పించింది. శ్రీ విల్లిపుత్తూరును వ్రేపల్లెగా, వటపత్రశాయిని (శ్రీకృష్ణునిగా) భావించి కట్టుబొట్టులతో గొల్లపడతిగా తనను రూపుదిద్దుకుని, నెచ్చెలులను గోపికలుగా, నందకిశోరుని మేల్కొల్పడానికి ఉద్యుక్తురాలైంది. నందుని ఇంటికి చేరడానికి వీలుగా, రోజుకొక పాశురం ఆలపిస్తూ నందకిశోరుని కీర్తిని గానం చేసింది. ఈ పాశురాలలో భక్తితోపాటు హాస్యము లాస్యము చోటుచేసుకున్నాయి. పాశురాలన్నీ దివ్యప్రబోధాలు. బ్రహ్మానంద తరంగాలు. మోక్షసౌధాన్ని చేరే సోపానాలు. ‘నాలాయిరం’ అనే విష్ణ్భుక్తియుతమైన దివ్యప్రబంధానికి హృదయంగా తిరుప్పావై సుస్థిరస్థానం సంపాదించుకుంది.

తిరువెంబావై మాణిక్యవాచకుల శివభక్తికి స్పందన. మధురైకి సమీపంలోని తిరువాదపూర్ వీరి జన్మస్థలం. మాణిక్యవాచకులు పాండ్యరాజుల కొలువులో ఉండేవారు. వీరి జీవితం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. తెలుగు నాట రామదాసువలె, రాజాజ్ఞను ధిక్కరించడం చేత కఠిన కారాగారవాసం చేశారు. రాజు తన తప్పు తెలుసుని వాచకులకు విముక్తి కలిగించడమే కాక తాను కూడా పరమ శివభక్తుడయ్యాడు.

ధనుర్మాసంలో శివాలయాల్లో మేలుకొల్పుగా పాడే తిరువెంబావై ముప్ఫది పాశురాల సంపుటి. రెండు భాగాలుగా ఉంటుంది. తిరువణ్ణామలైలో ఇరువది పాశురాలను, తిరుప్పెతుందరై క్షేత్రంలో పది పాశురాలను గానం చేశారు తిరువాచకులు. వీటిని తిరువెంబావై, తిరుప్పళి పొళుచ్చి అని వరుసగా పిలుస్తారు. నాలాయిరంలో తిరుప్పావై వలె ఇవి తిరువాచకం అను శివభక్తి రసప్రధానమైన తమిళ కావ్యంలో సుస్థిర స్థానంపొందాయి.

శివభక్తులు (అర్చకులు) ధనుర్మాసంలో తిరువెంబావై సుప్రభాత వేళ గానం చేస్తారు. తిరుప్పావై వైష్ణవ ఆలయాల్లో సుప్రభావం బదులు పాడతారు. రెండూ ఒకే విధమైన భక్తిని ప్రకటిస్తాయి. తిరుప్పావైలో ప్రకృతి సౌందర్యం, శృంగార భక్తిని ప్రకటిస్తే, తిరువెంబావైలో ధ్వని చిత్రాలు హృదయాలను రంజిల్లి చేస్తాయి. అందువల్ల ఈ వ్రతాలను ఆచరించేవారి చేష్టలలో చాలా పోలికలున్నాయి. తిరుప్పావైలో అమలిన శృంగారం మనస్సులను దోచుకుంటే, తిరువెంబావైలో తత్త్వవివేచన హృదయాలను హత్తుకుంటుంది.

ఈ రెండూ మేలుకొలుపు పాటలే అనడానికి తార్కాణంగా రెండు సంపుటులలో ఎనిమిది పాదాల పాశురాలలో చివరి పాదంలో ‘ఏలోరెంబావై’ అను పదంతో ముగియడం. అంటే మేలుకో అని అర్థం.

తిరుప్పావైలోని ప్రేమ, భక్త్భివాలను, తిరువెంబావైలోని తాత్త్విక చింతనను, అవి వర్ణించిన చిత్ర విచిత్ర దృశ్యమాలికలను, కవితా మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభతిని పొందాలంటే ఈ రెండు అమూల్య గ్రంథాలను పఠించి జన్మలను సార్థకం చేసుకోవడం అభిలషణీయం., తిరుప్పళి పొళుచ్చి అని వరుసగా పిలుస్తారు. నాలాయిరంలో తిరుప్పావై వలె ఇవి తిరువాచకం అను శివభక్తి రసప్రధానమైన తమిళ కావ్యంలో సుస్థిర స్థానంపొందాయి.

శివభక్తులు (అర్చకులు) ధనుర్మాసంలో తిరువెంబావై సుప్రభాత వేళ గానం చేస్తారు. తిరుప్పావై వైష్ణవ ఆలయాల్లో సుప్రభావం బదులు పాడతారు. రెండూ ఒకే విధమైన భక్తిని ప్రకటిస్తాయి. తిరుప్పావైలో ప్రకృతి సౌందర్యం, శృంగార భక్తిని ప్రకటిస్తే, తిరువెంబావైలో ధ్వని చిత్రాలు హృదయాలను రంజిల్లి చేస్తాయి. అందువల్ల ఈ వ్రతాలను ఆచరించేవారి చేష్టలలో చాలా పోలికలున్నాయి. తిరుప్పావైలో అమలిన శృంగారం మనస్సులను దోచుకుంటే, తిరువెంబావైలో తత్త్వవివేచన హృదయాలను హత్తుకుంటుంది.

ఈ రెండూ మేలుకొలుపు పాటలే అనడానికి తార్కాణంగా రెండు సంపుటులలో ఎనిమిది పాదాల పాశురాలలో చివరి పాదంలో ‘ఏలోరెంబావై’ అను పదంతో ముగియడం. అంటే మేలుకో అని అర్థం.

తిరుప్పావైలోని ప్రేమ, భక్త్భివాలను, తిరువెంబావైలోని తాత్త్విక చింతనను, అవి వర్ణించిన చిత్ర విచిత్ర దృశ్యమాలికలను, కవితా మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభతిని పొందాలంటే ఈ రెండు అమూల్య గ్రంథాలను పఠించి జన్మలను సార్థకం చేసుకోవడం అభిలషణీయం.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

వంటగదిలోనే

  

*మన ఆరోగ్యం…!


*వంటగదిలోనే…*

        *సుగర్ తగ్గించే…*

                     *దినుసులు..!*

                 ➖➖➖✍️


```

మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అనేక మార్గాలున్నాయి. కొన్ని మన వంటగదిలోనే ఉంటాయి. జీలకర్ర, చియా, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. 


వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. 


ఈ కారణాలతో వీటిని వాడితే.. ఇవి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి. 


ఈ విత్తనాలన్నింటిలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగనివ్వదు. 


చక్కెర శోషణను, జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. 


ఈ విత్తనాలు ప్రతి ఒక్కరి ఇంటి వంటగదిలో ఉంటాయి. 


ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.    

 

#జీలకర్ర : రక్తంలో యూరియా స్థాయిని తగ్గించడంతోపాటు మధుమేహం లక్షణాలను నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గించాలనుకునేవారు తమ ఆహారంలో జీలకర్రను చేర్చుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్.. రెండూ మన శరీరంలో పెరుగుతాయి.          



#మెంతులు : ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కలుపుకుని ఖాళీ కడుపుతో తాగాలి. దీనివల్ల షుగరు అదుపులో ఉంటుంది. మెంతికూర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సహజంగానే తగ్గిస్తుంది.



#గుమ్మడి గింజలు: వీటిల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది ఎంతో ప్రయోజనకారి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇవి తోడ్పడతాయి.



#పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా తగ్గిస్తుంది. ఈ గింజల్లో ఫైటోస్టెరాల్, గ్లైకోసైడ్స్, కెఫిన్, కునిక్ యాసిడ్ ఉంటాయి.✍️```

        -సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఆచమనం లోని ఆంతర్యం*

  1312d6.

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



      *ఆచమనం లోని ఆంతర్యం*

                ➖➖➖✍️


```

ఎసోఫెగస్ (Esophagus ) అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న యాసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. యాసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. 


భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్ సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే “ఆచమనం” అనే పద్దతిని అందరూ పాటించాలి. 


పరిశీలిస్తే ఈ ‘ఆచమనం’ అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. 


కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. 


అంతేనా? అలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. 


ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు. అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెస్ ని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 


గొంతులో ‘ఎసోఫెగస్’ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్టపద్ధతిలో వ్యాయామం(వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. 


ఎందుకంటే, ‘కేశవ’ నామం గొంతులోనుంచీ వస్తుంది. ‘నారాయణ’ నామం నాలిక సహాయంతో వస్తుంది. ‘మాధవ’ నామం పెదాల సహకారంతో వస్తుంది. అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజ్ అన్న మాట.


మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా!


మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. 


ఇది ఒక దృక్పదం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.


ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు, వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి.✍️```


*PS: ఒక శాస్త్రీయ విధానాన్ని సింపుల్ గా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి వుండదేమో.✍️*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*604 వ రోజు*

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము

కులము విద్య

ధర్మరాజు " పితామహా ! తక్కువ కులములో పుట్టినా కూడా గొప్పగుణములు, మంచిప్రవర్తన ఉన్న వాడికి మంత్రతంత్ర విద్యలు నేర్పడం దోషమా ధర్మవిరుద్ధమా ! " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. పూర్వము హిమాలయాలలో అనేక మంది బ్రాహ్మణులు తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు ధర్మనిష్టా గరిష్ఠుడు, మంచి గుణగణములు కలవాడు, గొప్ప ప్రవర్తన కలవాడు అయిన శూద్రుడు వచ్చి అయ్యా ! మీరందరూ తపస్సు చేసుకుంటున్నారు కదా ! నాకు కూడా తపస్సు ఎలా చెయ్యాలో ఉపదేశించండి " అని అడిగాడు. అందుకు బ్రాహ్మణులు " ఓ ధర్మాత్మా ! నీవు శూద్రుడవు కనుక నీకు వైదిక విద్య ఉపదేశించడం తగదు. నీవు మాకు శుశ్రూషలు చేయుటకు తగినవాడవు " అన్నారు. ఆ శూద్రుడు కూడా అలాగే అని అక్కడే చిన్న పర్ణశాల వేసుకుని ఆ విప్రులకు సేవ చేస్తున్నాడు. కాని విప్రులు చేస్తున్న కార్యములు చూస్తూ తాను కూడా అతిథిపూజలు, దేవ, పితృ పూజలు చేస్తున్నాడు. ఒక రోజు అక్కడ తపస్సు చేసుకుంటున్న విప్రులకు గురువు గారు అతడి ఆశ్రమముకు వెళ్ళి అక్కడ శూద్రుడు చేస్తున్న అతిథి, దేవ, పితృ పూజలు చూసి సంతోషించాడు. అతడు చేస్తున్న పూజలలో లోపాలను ఎత్తి చూపి పూజలు సరిగా పద్ధతులు ఉపదేశించి వెళ్ళాడు. ఆ శూద్రుడు కూడా గురువుగారి ఉపదేశమును అనుసరించి ఆచరించాడు. కాల క్రమమున గురువుగారు శూద్రుడు మరణించారు. మరు జన్మలో శూద్రుడు రాజకుమారుడుగా, గురువుగారు సకల వేద శాస్త్రములకు నిలయమైన బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించి పెరిగి పెద్ద వాడై గుణసంపన్నుడయ్యాడు. కాలక్రమమున ఆ రాజకుమారుడు ఆ బ్రాహ్మణకుమారుని పురోహితుడిని చేసుకుని సకల సంపదలు సమకూర్చాడు. కాని ఆ రాజకుమారుడు బ్రాహ్మణ కుమారుడిని చూసి సన్నగా నవ్వాడు. ఆ బ్రాహ్మణ కుమారుడికి మాత్రము రాజకుమారుడు తనను చూసి ఎందుకు నవ్వుతున్నాడో అర్ధము కాలేదు. బ్రాహ్మణకుమారుడు " రాజకుమారా ! మీరు నన్ను చూసినప్పుడల్లా సన్నగా నవ్వుకుంటున్నారు. నా వలన ఏదైనా అపరాధము జరిగిందా ! దయ చేసి తెలియజెయ్యండి " అని అడిగాడు. రాజకుమారుడు " విప్రోత్తమా ! నాకు పూర్వజన్మజ్ఞానం ఉంది. కిందటి జన్మలో నేను శూద్రుడను. మీరు గురువు గారు. మీరు నాకు వైదికవిద్యలోని మెళుకువలు, తపస్సు ఎలా చెయ్యాలో, దేవ, పితృకార్యములు ఎలా చెయ్యాలో బోధించారు. తత్ఫలితంగా ఇప్పుడు మీరు ఒక రాజకుమారుడికి సేవ చేస్తున్నారు. అది గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాను. అంతే కాని మీ వలన ఏదోషము లేదు. ధర్మపరుడివి అయిన నీలో లోపం ఎందుకు ఉంటుంది " అని చెప్పాడు. కనుక ధర్మనందనా ! వైదికవిద్యను, మంత్రతంత్రములను బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులలో అర్హత కలిగిన వారికి మాత్రమే ఉపదేశించాలి " అని చెప్పాడు.

లక్ష్మీ నివాసము

ధర్మరాజు " లోకంలో ఉన్న అనేక జనులలో లక్ష్మీదేవి ఎవరింట నివసిస్తుంది " అని అడిగాడు.భీష్ముడు " ధర్మనందనా ! ఒక సారి రుక్మిణీ దేవి లక్ష్మీదేవిని ఈ ప్రశ్న వేసింది. అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీ దేవికి చెప్పిన విషయములు నేను నీకు చెప్తాను. నిత్యము సత్యము పలికే వారు, శుచిగా శుభ్రంగా ఉండే వారు, గురువుల ఎడ భక్తి కలవారు, ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవారు, సదా దక్షతతో దీక్షితులుగా ఉండేవారు, మంచి పనులు చేసే వారు, మలినము లేని వారు, ఎప్పుడూ మంచి పనులు చేసే వారు, వుజ్ఞావంతులు, తపస్సు చేసే వారు, తనకు ఉన్నంతలో దానము చేసే వారు, బ్రహ్మచర్యము పాటించే వారు, ఇంద్రియ నిగ్రహము కల వారు నాకు ప్రేమ పాత్రులు నేను వారి వెంట ఎప్పుడూ ఉంటాను. ఇక క్రూరాత్ములు, నాస్థికులు, కృతఘ్నులు, దుర్మార్గుల వద్ద అసలు ఉండను. ఇక స్త్రీల వాద ఎవరి ఎంగిలి తినని వారు, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకునే వారు వారి అందు నివసిస్తాను. ఇక భర్తకు ఎదురు చెప్పే వారు, ఇతరులను నిందించు వారు, భర్తకు తెలవకుండా పర పురుషుల ఇళ్ళకు వెళ్ళే వారు, ఎప్పుడూ నిద్రించె వారు వారి వద్ద నేను ఉండను. , నేను తామర పువ్వులందు, పూల తోటలందు, ఫలవృక్షముల అందు నేను నివసిస్తాను " అని లక్ష్మీ దేవి రుక్మిణీ దేవికి చెప్పింది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఆది అన్నామలై ఆలయం

  🕉 మన గుడి : నెం 1341


⚜  తమిళనాడు : తిరువన్నామలై


⚜  శ్రీ ఆది అన్నామలై ఆలయం



💠 అరుణాచలలో గిరివలం అంటే తిరువణ్ణామలైలోని పవిత్రమైన అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణ . ఈ ప్రాంతంలోని 3 పురాతన ఆలయాలలో ఒకటైన ఆది అన్నామలై ఆలయం...మిగిలిన రెండు ప్రసిద్ధ అరుణాచలేశ్వర అగ్ని ఆలయం మరియు దానికి సమీపంలో ఉన్న అరుణగిరినాథర్.


💠 ఆది అన్నామలై  అరుణాచల కొండ చల్లబడిన అగ్నిపర్వతం అని అంటారు. 


💠 తిరువణ్ణామలై చుట్టుపక్కల ప్రాంతాలలో ఆది అన్నామలై ఆలయం అత్యంత పురాతనమైనది. అరుణాచలేశ్వర ఆలయ నిర్మాణం ప్రారంభం కావడానికి కనీసం ఒక శతాబ్దం ముందే ఈ ఆలయం నిర్మించబడింది. 

అందువల్ల, ఇది దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనదని భావిస్తున్నారు.


💠 స్థల పురాణం ప్రకారం, బ్రహ్మ, విష్ణువుతో అగ్ని స్తంభం గురించి వివాదం తర్వాత, ఒక లింగాన్ని తయారు చేసి, శివుడిని పూజించడానికి కొండకు అవతలి వైపుకు వెళ్ళాడు. 

అందువల్ల, ఈ లింగం అన్నామలై యొక్క మొదటి, పురాతన మరియు అసలు లింగం అని భావించబడుతుంది మరియు అందుకే దీనికి ఆది అన్నామలై అని పేరు పెట్టారు.


💠 మొదటి ఆది అన్నామలై లింగాన్ని ఎవరు ప్రతిష్టించారని పురాణాలలో రెండు కథలు ఉన్నాయి,

శివుడు అపరిమితమైన కాంతి స్తంభంగా వ్యక్తమయ్యాడు. 

బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ ఈ స్తంభం చివరను కనుగొనడానికి ఎత్తు మరియు దిగువకు ప్రయాణించారు. బ్రహ్మ, క్షణికమైన తీర్పు లోపంతో, తిరిగి వచ్చి ఈ స్తంభం చివరను చేరుకున్నానని అబద్ధం చెప్పాడు. శివుడు కోపోద్రిక్తుడై అతన్ని శపించాడు. 

ఆ విధంగా, ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ కొండకు పశ్చిమ వైపున ఈ లింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేశాడు.


💠 మరొక కథ లో బ్రహ్మ క్షణికంగా విచక్షణ కోల్పోయాడు మరియు దివ్యమైన తిలోత్తమని ఆశించాడు. తిలోత్తమ బ్రహ్మ నుండి పారిపోవలసి వచ్చింది మరియు ఆమె అరుంచల వద్దకు వెళ్ళింది. 

అటువంటి పవిత్ర స్థలంలో, బ్రహ్మ తన స్పృహను తిరిగి పొందాడు మరియు ప్రాయశ్చిత్తంగా ఈ ఆది అన్నామలై లింగాన్ని ప్రతిష్టించాడు.


💠 ఆసక్తికరంగా, రెండు కథలు బ్రహ్మను అనుచితంగా ప్రవర్తించేలా చేశాయని చెబుతాయి. 

ఆపై ఆయన ఈ ఆది అన్నామలై లింగాన్ని ప్రతిష్టించడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు.


💠 ప్రారంభంలో ఈ ఆలయం వివిధ దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలను కలిగి ఉన్న చెక్కతో చేసిన సాధారణ నిర్మాణం అని నమ్ముతారు. తరువాత మాత్రమే గోపురాలను జోడించి, ఇటుకలు మరియు రాతితో ఆలయాన్ని నిర్మించడానికి చెక్క నిర్మాణాన్ని తగ్గించారు. 

ఆలయం యొక్క ప్రస్తుత రూపం 1200 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని తెలిసింది.


💠 స్థానిక భాషలో 'ఆది' అంటే మొదటిది మరియు అందువల్ల ఆలయానికి ఇది సముచితమైన పేరు. ఈ ఆలయం అరుణాచలేశ్వర ఆలయానికి చాలా ముందు నిర్మించబడింది కానీ దానితో పోలిస్తే చిన్నది. 

ఈ ఆలయం కేవలం ½ ఎకరాల విస్తీర్ణంలో ఉంది.  

ఆలయంలో పూజించే లింగాన్ని బ్రహ్మ స్వయంగా నిర్మించాడని నమ్ముతారు. 


💠 పాండ్య రాజు వజ్రంగదుడు ఈ లింగానికి ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. 

పాండ్య రాజవంశం యొక్క కాలక్రమాన్ని పరిశీలిస్తే, ఇది 4వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఉంటుంది. 

అయితే, సమందర్ యొక్క తేవరం ఈ ఆలయాన్ని ప్రస్తావిస్తుంది కాబట్టి, ఇది కనీసం 6వ శతాబ్దం నాటిదని మనకు ఒక క్లూ లభిస్తుంది. 

9వ శతాబ్దంలో, మాణిక్య వాసాగర్ ఈ ఆలయానికి సమీపంలో తన ప్రసిద్ధ తిరువెంపావైని రచించాడు.


💠 ఆ తరువాత ఆలయం నెమ్మదిగా శిథిలావస్థకు చేరుకుంది మరియు 1918 లో చెట్టియార్ల బృందం ఆర్థిక సహాయంతో 15 సంవత్సరాలకు పైగా పునరుద్ధరించబడింది. 


💠 ఈ మందిరం గిరివలం మార్గంలో ఏడవ కిలోమీటరు వద్ద ఉంది. 


💠 బ్రహ్మచే ప్రతిష్టించబడిన మూలవనం ఈ ఆలయంలో ఉండటం విశేషం. మాణిక్కవాసకుడు తిరువెంబా పాడిన మందిరం కూడా ఇదే. ఇది అన్నామలై యొక్క మొదటి మందిరం. అంటే ఆది తిరుతలం కాబట్టి దీనిని ఆది అన్నామలైయర్ ఆలయంగా పూజిస్తారు.


💠 ఆది అన్నామలైలో  రమణ మహర్షి ఈ ఆలయం గురించి కొన్నిసార్లు ప్రస్తావించారు. 

ఆయన గిరివలం సమయంలో ఈ ఆలయంలో రాత్రి బస చేశారని చెబుతారు. 

తెల్లవారుజామున, గర్భగృహంలో ఎవరూ లేకున్నా సామవేదం జపించడం ఆయన విన్నాడు. 

అది దివ్య జీవులకు ఆపాదించబడింది.


💠 "ఇది మంచి ప్రదేశం. 

నేను అప్పుడప్పుడు అక్కడే ఉండేవాడిని. ఒకసారి గిరిప్రదక్షిణలో మేము వర్షంలో చిక్కుకున్నాము మరియు మేము రాత్రంతా అక్కడి ఆలయంలో గడిపాము. అప్పుడే నేను సామవేద మంత్రోచ్ఛారణ విన్నాను " - రమణ మహర్షి "డే బై డే విత్ భగవాన్" పుస్తకం పేజీ 103 లో ఉటంకించబడింది.



రచన

©️ Santosh Kumar

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:అర్జున ఉవాచ


యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ 

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః (46)


శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ 

స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్  

(47)   


సమస్తప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించివున్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు. బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మంకంటే గుణం లేనిదిగా కనుపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు..🙏


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

మన వంశం మనుగడ కోసం

  *2319*

*కం*

మన వంశపు మనుగడకై

తనయను దానమ్ముజేయు ధార్మిక మతులన్

కనుగానని మత్సరమున(యున్మదమున)

ననయము దూషించుటెల్ల నఘమగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మన వంశం మనుగడ కోసం తమ కూతురిని దానం చేసిన ధార్మిక మనస్కులను కనుగానని ఉన్మాదంతో ఎల్లప్పుడూ దూషించడం పాపము.

*సందేశం*:-- కొందరు తమ వంశాభివృధ్ధి కోసం కన్యాదానం చేసి న గొప్ప దాతలను నిరంతరమూ తిడుతూ ఉంటారు, లేదా లోకువగా చూస్తూ ఉంటారు, అది మహాపాపం. అటువంటి పాపము ల వలన వంశవృధ్ధి క్షీణించును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝   *క్రోధో హి ధర్మం హరతి*

           *యతీనాం దుఃఖసఞ్చితమ్|*

           *తతో ధర్మవిహీనానాం* 

           *గతిరిష్టా న విద్యతే||*


తా𝕝𝕝 *"క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది. అది యతీశ్వరులకు కూడా దుఃఖం కలిగించును. అందుచేత ధర్మరహితులకు అభీష్టం నెరవేరదు.*

         

✍️🌹🌸💐🙏

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*605 వ రోజు*

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము


స్త్రీలు పురుషులు దాంపత్యము

ధర్మరాజు " పితామహా ! దాంపత్య జీవితంలో అధికమైన ఆనందించేది స్త్రీయా ! పురుషుడా ! అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము భంగాస్వనుడు అనే రాజుకు సంతానము కలుగ లేదు. సాధారణంగా యజ్ఞము ఇంద్రుడి అనుమతి తీసుకుని చేయాలి. కాని భంగాస్వనుడు ఇంద్రుడి అనుమతి లేకుండా యజ్ఞము చేసి నూరుగురు కుమారులను పొందాడు. ఆ రాజు సంతోషంగా ఉన్నాడు కాని ఇంద్రుడు తన అనుమతి లేకుండా యజ్ఞము చేసినందుకు అతడి మీద కక్షకట్టాడు. ఒకరోజు భగాస్వనుడు వేటకు పోయాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారితప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసి గుర్రము దిగి సమీపంలోని కొలనులో దిగి ఆనీటిని సేవించాడు. వెంటనే ఆ రాజు ఆశ్చర్యపోయేలా అతడికి స్త్రీత్వము ప్రాప్తించింది. అయాచితంగా ప్రాప్తించిన స్త్రీత్వానికి ఆ రాజు చాలా చింతించి " ఈ వేషముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లకు, పురజునులకు ఎలా ముఖము చూపగలను " అని విచారించి " అయినా ఇలా అడవిలో ఉండలేను కదా ! " అనుకుని చివరకు రాజధానికి వెళ్ళి మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ మునిపుంగవులతో నివసించ సాగాడు.

భగస్వనుడు మునిపుంగవుడిని వివాహమాడుట

అక్కడ ఉన్న ఒక ముని స్త్రీలాగా మారిన రాజును చూసి మోహించి వివాహమాడారు. భగాస్వనుడు మునివలన స్త్రీగా అత్యంత బల సంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు. ఆ తరువాత అతడు నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో " కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను కనుక వీరు మీ అన్నదమ్ములు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి " అన్నాడు. తండ్రిమాట పాలించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు " నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భగాస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి " రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా ! అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు " అని వారిలో కలతలు రేపాడు. అలాగే భగాస్వనుడు స్త్రీగా ఉన్నపూడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగాడు. ఇది చాటుగా చూస్తున్న ఇంద్రుడు " అమ్మా నీవు ఎవరు ? ఎందుకిలా రోదిస్తున్నావు ? " అని ఏమీ ఎరుగని వాడిలా అడిగాడు. అప్పుడు ఆమె తాను యజ్ఞ ము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై " రాజా ! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను " అని చెప్పాడు. భస్వానుడు " దేవా ! అజ్ఞానంతో తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వాడినా ! కనుక నన్ను దయతో రక్షించు " అని వేడుకున్నాడు. ఇంద్రుడు " రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో " అన్నాడు. రాజు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకున్నాడు. ఇంద్రుడు " అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా ! " అని అడిగాడు. భగస్వానుడు " వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా ! " అని చెప్పాడు.. ఇంద్రుడు " రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను " అని " రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోప్గొట్టుకున్న పురుషత్వము ఇస్తాను " అన్నాడు. భగస్వానుడు " మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు. నేనిలా స్త్రీగానే ఉంటాను " అన్నాడు. ఇంద్రుడు " అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. స్త్రీగా ఉన్న భగస్వానుడు సిగ్గు పడి " మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను కనుక ఇలాగే ఉండి పోతాను " అన్నాడు. దేవేంద్రుడు నవ్వి అలాగే అగుగాక అని చెప్పి వెళ్ళాడు " అని చెప్పి భీష్ముడు " కనుక ధర్మనందనా ! నీవడిగిన ప్రశ్నకు నా సమాధనము ఇదే ! " అని భీష్ముడు చెప్పాడు


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1342


⚜  తమిళనాడు : తిరువత్తూరు - కన్యాకుమారి 


⚜  శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం 



💠 గోకర్ణ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పరుశురామ క్షేత్రంలో కన్యాకుమారిలోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయం జిల్లాలోని అనేక దేవాలయాలలో ఒకటి, ఇది దాని గొప్ప సంస్కృతి మరియు వారసత్వాన్ని జోడిస్తుంది.


💠 ఇది 2,500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని మరియు  పరశురాముడు ప్రతిష్టించిందని నమ్ముతారు.

వేదవ్యాసుడు రచించిన వైష్ణవ పురాణం అయిన పద్మ పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది.


💠 ఆదికేశవ పెరుమాళ్ ఆలయం  108 దివ్య దేశాలలో  68వ దివ్యదేశము 


💠 ఈ ప్రదేశాన్ని గతంలో వట్టర్ అని పిలిచేవారని నమ్ముతారు; 

ఆదికేశవ పెరుమాళ్ ఆలయం నిర్మించబడినప్పుడు, ఇది తిరువత్తర్ అని పిలువబడింది.



💠 మూలవర్ : 

ఆదికేశవ పెరుమాళ్ 

తాయార్: మరకతవల్లి నాచ్చియార్, పుష్కరణి: కదల్వాయి తీర్థం, 

వాట్టారు తీర్థం, రామ తీర్థం

విమానం: అష్టాంగ, అష్టాక్షర విమానం


💠 పద్మనాభుడు నాభి లోంచి ఉద్భవించిన బ్రహ్మ ఈ తిరువట్టార్ పెరుమాళ్ కి లేడు.  

నాభి స్థానములో నిలువెత్తు శ్రీదేవి భూదేవి విగ్రహములు దర్శనమిస్తాయి.

అనంత పద్మనాభుడు వీరికి తమ్ముడు అని ఇక్కడి వారి అభిప్రాయము. 

సన్నిధి కూడా తిరువనంతపురములో లాగే ఉంటుంది. 


💠 గర్భాలయమునకు  ముందు ఉండే మండపమునకు ఉదయ మార్తాండ మండపము అని పేరు.

ఈ మండపములో వేణుగోపాలుడు, చతుర్ముఖుడు, నమ్మాళ్వార్ ఆరు అడుగుల విగ్రహములు దర్శనము.  

ఇక్కడ సూర్యాస్తమయమున సూర్యుని కిరాణాలు స్వామి తిరుముగంను తాకును. 

చంద్రోదయం తో చంద్రుడు స్వామి దర్శనం చేసుకొనును. 


💠 ఒకప్పుడు బ్రహ్మ ఈ ప్రాంతములో యజ్ఞము తలపెట్టారు. 

ఈ విషయము సరస్వతి దేవికి చెప్పలేదు.దానితో ఆమెకు కోపము వచ్చింది. 

ఋత్వికులు మంత్రాలు ఉచ్చరిస్తుండగా స్వరస్వతి దేవి వారి మంత్రోచ్ఛారణ లో తప్పిదములు వచ్చినట్ట్లు చేయగ, యజ్ఞం  నుండి యజ్ఞ పురుషుని బదులు  కేసు, కేసి అనే రాక్షషులు పుట్టారు.

వీరు లోకాలను పీడించ సాగారు. 


💠 యజ్ఞ గుండము నుండి పుట్టినందువల్ల వారిని ఎవ్వరూ సంహరించలేకపోయినారు. 

విధాత శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. 


💠 పెరుమాళ్ ఇక్కడ కేసు అనే బ్రహ్మరాక్షసుడినితో ఏడు దినములు యుద్ధము చేసెను.

కేశు వధించబడలేదు. శ్రీమన్నారాయణునికి కోపము వచ్చి కేశును మహేంద్రగిరి నుండి విసిరి వేసి వాని గుండెలు పగిలేలా పాంచజన్యమును పూరించాడు. వాడు ఆ ధ్వనికి వెంటనే లేవలేకపోయాడు. 

ఇది ఆదిశేషుడు గమనించి వానిని తన శరీరముతో చుట్టివేసేను. 


💠 శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై శయనించేను.   

కేసు చెల్లెలు కేసి ఇది గమనించి తన స్నేహితురాలితో కలసి నదులుగా మారి పెను ప్రళయముగా వచ్చి ముంపునకు గురి చేయును. 

అప్పుడు పెరుమాళ్ భూదేవిని తన స్థలమును పైకి లేపమని ఆదేశించేను. పెరుమాళ్ కోపగించి కెశిని నది గానే ఇచ్చట ఉండమని శపించేను. 

అందువలన ఈ రెండు నదులు కోవిల చుట్టూ పెరుమాళ్ ని మ్రొక్కుతూ వెళ్తున్నట్టు వెళ్ళును. 

కానీ పెరుమాళ్ ని నీట ముంచ లేకపోయినవి  కానీ అది కేసు శారీరమును నీరు తాకడము వలన రాక్షసుడు మోక్షము పొందెను అందుకే ఈ పెరుమాళ్ ని ఆది కేశవ పెరుమాళ్ అని పేరు. 


💠 ఏడవ మరియు ఎనిమిదవ శతాబ్దాల నాటి ఈ ఆలయం మలై నాడులోని చారిత్రాత్మక పదమూడు దివ్య దేశాలలో ఒకటి. 

ఈ ఆలయం మూడు వైపులా నదులతో (కోథై నది, పహ్రాలి నది మరియు తమిరబరణి నది) చుట్టుముట్టబడిన సుందరమైన ప్రదేశం. 


💠 అనంతపద్మభన్/ఆదికేశవ పెరుమాళ్ రూపంలో ఉన్న విష్ణువు తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం కంటే పురాతనమైనదని నమ్ముతారు.


💠 తిరువనంతపురము వలె ఇచ్చట పెరుమాళ్ దర్శనము 3 ద్వారముల ద్వారా చేయాలి.


💠 విష్ణువు ఇక్కడ శయన స్థితిలో నివసిస్తున్నందున మరియు నదులతో చుట్టుముట్టబడినందున, ఈ ఆలయాన్ని "చేర రాజ్యం యొక్క శ్రీరంగం" అని పిలుస్తారు.


💠 ఆది కేశవ పెరుమాళ్ విగ్రహం బుజంగ శయనంలో ఒక పాముపై ఉంది మరియు 22 అడుగుల పొడవు ఉంటుంది. 

పద్మనాభస్వామి ఆలయంలోని విగ్రహం కూడా బుజంగ శయనంలో ఉంది మరియు 18 అడుగుల పొడవు ఉంటుంది. 

రెండు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండే విధంగా ఉంచబడ్డాయి, ఆది కేశవ పెరుమాళ్ పశ్చిమానికి ఎదురుగా మరియు పద్మనాభస్వామి తూర్పుకు ఎదురుగా ఉంది.


💠 ఈ ఆలయం ద్రావిడ శైలి నిర్మాణంలో చెక్క స్తంభాలు, తలుపులు మరియు పైకప్పులతో నిర్మించబడింది.  

ఇక్కడ ప్రధాన దేవత మరగతవల్లి నాచియార్ దేవితో పాటు శయన భంగిమలో ఉంది. 


💠 తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం మధ్య సారూప్యతలు ఉన్నప్పటికీ, తిరువత్తర్ ఆలయం పురాతనమైనది. భగవంతుని భారీ విగ్రహం 22 అడుగుల ఎత్తులో ఉంది, ఇది అనంత పద్మనాభస్వామి కంటే పెద్దది. 


💠 ఈ ఆలయంలో మరగతవల్లి తాయార్ దేవత విగ్రహం మరియు లక్ష్మీ నరసింహమూర్తికి ప్రత్యేక మందిరం కూడా ఉన్నాయి. 


💠 మార్చి నుండి ఏప్రిల్ వరకు మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు సూర్యకిరణాలు నేరుగా దేవతపై పడతాయని నమ్ముతారు.


💠 కన్యాకుమారి నుండి 45 కి.మీ, నాగర్‌కోయిల్ నుండి 26 కి.మీ దూరం


రచన

©️ Santosh Kumar

ఉత్తరద్వార దర్శనం

  🎻🌹🙏ఉత్తరద్వార దర్శనం ఎందుకు.....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. 





🌸అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటీ...


          🌹పౌరాణిక గాథ : 🌹


🌸పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. 


🌿అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదనా లేకపోలేదు.


🌸 వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరూ ఉంది.


🌿ఈరోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో,


🌸 వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో... ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్పడిందంటారు.


🌿 ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట.


🌹గాథ వెనుక తత్వం : 🌹


🌸మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్నీ సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానం అంటాము. 


🌿మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తరభాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి, సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ ఊర్థ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు.


🌸అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి... శాశ్వతమైన శాంతినీ, సత్యమైన జ్ఞానాన్నీ ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు. 


🌿అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా... తమలోని భక్తినీ, జ్ఞానాన్నీ వికసింపచేయమనీ వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి. 


🌸ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు... తమ మనసులోనే ఆ వైకుంఠ మూర్తిని దర్శించుకుని తమలోని  అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి.


🌿హైందవ సంప్రదాయం భక్తుని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించినా,


🌸 ఉత్తర ద్వార దర్శనంగుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా... ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది..స్వస్తీ...🚩🌞🌹🙏🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿