27, ఆగస్టు 2020, గురువారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*అష్టమ స్కంధము - పదిహేడవ అధ్యాయము*

*భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ఉపధావ పతిం భద్రే ప్రజాపతిమకల్మషమ్|*

*మాం చ భావయతీ పత్యావేవం రూపమవస్థితమ్॥6976॥*

కల్యాణీ, నీవు నీ పతియైన కశ్యపుని యందు నేను ఈ రూపమున పుత్రుడవైయున్నట్లు భావించి, పాప రహితుడైన ప్రజాపతిని సేవింపుము.

*17.20 (ఇరువదియవ శ్లోకము)*
********************


*నైతత్పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథంచన|*

*సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతమ్॥6977॥*

దేవీ! ఇతరులు ఎవ్వరైన అడిగినను  ఈ విషయమును చెప్పవలదు. దైవరహస్యమును ఎంత గోప్యముగా ఉంచిన, అంత సఫలమగును.

*శ్రీశుక ఉవాచ*

*17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏతావదుక్త్వా భగవాంస్తత్రైవాంతరధీయత|*

*అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోః॥6978॥*

*శ్రీశుకుడు పలికెను* ఈ విధముగా తెలిపి శ్రీహరి అచటనే అంతర్ధానమయ్యెను. అదితియు భగవంతుడు తన గర్భమున జన్మింపబోవుచున్నాడని తెలిసికొని, దుర్లభమైన ఈ వరప్రాప్తికి మిగుల సంతోషించెను.

*17.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్|*

*స వై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత॥6979॥*

*17.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ప్రవిష్టమాత్మని హరేరంశం హ్యవితథేక్షణః|*

*సోఽదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతమ్|*

*సమాహితమనా రాజన్ దారుణ్యగ్నిం యథానిలః॥6980॥*

అంతట అదితియు తాను ధన్యురాలైనట్లు భావించి మిక్కిలి భక్తితో తన పతిదేవుడైన కశ్యపుని సేవింపసాగెను. కశ్యపుడు తన తపోబలమువలన భగవంతుని అంశ తనలో ప్రవేశించినట్లు తెలిసికొనెను. త్రికాలజ్ఞానియైన ఆయనకు అన్ని విషయములును తెలియును. అతడు ఏకాగ్రచిత్తముతో తన తపస్సు ద్వారా చాల కాలము సంచితమైన వీర్యమును వాయువు అగ్నిని కట్టెయందు ఉంచినట్లు, అదితిగర్భమున ఉంచెను.

*17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనమ్|*

*హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః॥6981॥*

సనాతనుడైన శ్రీహరియే అదితిదేవి యొక్క గర్భము నందు స్వయముగా అధిష్ఠించియున్నాడు అను విషయము బ్రహ్మదేవునకు తెలిపెను. అప్పుడు ఆ హిరణ్యగర్భుడు భగవంతునియొక్క రహస్యనామములతో ఆ ప్రభువును  ఇట్లు స్తుతింపసాగెను-

*బ్రహ్మోవాచ*

*జయోరుగాయ భగవన్నురుక్రమ నమోస్తు తే|*

*నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః॥6982॥*

*బ్రహ్మదేవుడు పలికెను* - "సకల లోకములయందును ప్రశంసనీయుడైన పరమాత్మా! నీకు జయము అగుగాక! నీవు అనంత శక్తులకు అధిష్ఠాతవు. త్రిగుణములను నియమించువాడవు. వేదవేత్తలను ఆరాధించువాడవు. నీకు పదే పదే నమస్కారములు.

*17.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే|*

*త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే॥6983॥*

అదితికంటె పూర్వము పృశ్నిగర్భమున జన్మించిన వాడవు. వేదజ్ఞానముఅంతయు నీలోనే యున్నది. వాస్తవముగా నీవే విధాతవు. ముల్లోకములను నీ నాభియందే ఉన్నవి. ముల్లోకములకు అతీతమైన వైకుంఠలోకము నీ నివాసస్థానము. నీవు సకలజీవులలో అంతర్యామివై సర్వత్ర వ్యాపించియుందువు. పరమాత్మా! నీకు నమస్కారము.

*17.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*త్వమాదిరంతో భువనస్య మధ్యమనంతశక్తిం పురుషం యమాహుః|*

*కాలో భవానాక్షిపతీశ విశ్వం  స్రోతో యథాంతః పతితం గభీరమ్॥6984॥*

ప్రభూ! ఈ జగత్తునకు ఆదిమధ్యాంతములు నీవే. అనంతశక్తి గల పరమపురుషుడవు నీవే యని వేదములు వర్ణించుచున్నవి. లోతైన ప్రవాహము తనయందు పడిన గడ్డి మొదలగు వాటిని తీసికొనిపోయినట్లు, కాలస్వరూపుడవగు నీవు సంసార ప్రవాహమును అతివేగముతో నా శనమువైపు నడిపింతువు.

*17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం  ప్రజాపతీనామసి సంభవిష్ణుః|*

*దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం  పరాయణం నౌరివ మజ్జతోఽప్సు|*

దేవా! సకలచరాచర ప్రాణుల, ప్రజాపతుల ఆవిర్భావములకు నీవే మూలకారణుడవు. జలములయందు మునిగినవానికి నావ సహాయకారియైనట్లు, స్వర్గమునుండి వెళ్ళగొట్టబడిన దేవతలకు నీవే పరమ ఆశ్రయుడవు".

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశోఽధ్యాయః (17)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదిహేడవ అధ్యాయము (17)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదిహేడవ అధ్యాయము*

*భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*ఉపధావ పతిం భద్రే ప్రజాపతిమకల్మషమ్|*

*మాం చ భావయతీ పత్యావేవం రూపమవస్థితమ్॥6976॥*

కల్యాణీ, నీవు నీ పతియైన కశ్యపుని యందు నేను ఈ రూపమున పుత్రుడవైయున్నట్లు భావించి, పాప రహితుడైన ప్రజాపతిని సేవింపుము.

*17.20 (ఇరువదియవ శ్లోకము)*

*నైతత్పరస్మా ఆఖ్యేయం పృష్టయాపి కథంచన|*

*సర్వం సంపద్యతే దేవి దేవగుహ్యం సుసంవృతమ్॥6977॥*

దేవీ! ఇతరులు ఎవ్వరైన అడిగినను  ఈ విషయమును చెప్పవలదు. దైవరహస్యమును ఎంత గోప్యముగా ఉంచిన, అంత సఫలమగును.

*శ్రీశుక ఉవాచ*

*17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఏతావదుక్త్వా భగవాంస్తత్రైవాంతరధీయత|*

*అదితిర్దుర్లభం లబ్ధ్వా హరేర్జన్మాత్మని ప్రభోః॥6978॥*

*శ్రీశుకుడు పలికెను* ఈ విధముగా తెలిపి శ్రీహరి అచటనే అంతర్ధానమయ్యెను. అదితియు భగవంతుడు తన గర్భమున జన్మింపబోవుచున్నాడని తెలిసికొని, దుర్లభమైన ఈ వరప్రాప్తికి మిగుల సంతోషించెను.

*17.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*ఉపాధావత్పతిం భక్త్యా పరయా కృతకృత్యవత్|*

*స వై సమాధియోగేన కశ్యపస్తదబుధ్యత॥6979॥*

*17.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ప్రవిష్టమాత్మని హరేరంశం హ్యవితథేక్షణః|*

*సోఽదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతమ్|*

*సమాహితమనా రాజన్ దారుణ్యగ్నిం యథానిలః॥6980॥*

అంతట అదితియు తాను ధన్యురాలైనట్లు భావించి మిక్కిలి భక్తితో తన పతిదేవుడైన కశ్యపుని సేవింపసాగెను. కశ్యపుడు తన తపోబలమువలన భగవంతుని అంశ తనలో ప్రవేశించినట్లు తెలిసికొనెను. త్రికాలజ్ఞానియైన ఆయనకు అన్ని విషయములును తెలియును. అతడు ఏకాగ్రచిత్తముతో తన తపస్సు ద్వారా చాల కాలము సంచితమైన వీర్యమును వాయువు అగ్నిని కట్టెయందు ఉంచినట్లు, అదితిగర్భమున ఉంచెను.

*17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనమ్|*

*హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః॥6981॥*

సనాతనుడైన శ్రీహరియే అదితిదేవి యొక్క గర్భము నందు స్వయముగా అధిష్ఠించియున్నాడు అను విషయము బ్రహ్మదేవునకు తెలిపెను. అప్పుడు ఆ హిరణ్యగర్భుడు భగవంతునియొక్క రహస్యనామములతో ఆ ప్రభువును  ఇట్లు స్తుతింపసాగెను-

*బ్రహ్మోవాచ*

*జయోరుగాయ భగవన్నురుక్రమ నమోస్తు తే|*

*నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః॥6982॥*

*బ్రహ్మదేవుడు పలికెను* - "సకల లోకములయందును ప్రశంసనీయుడైన పరమాత్మా! నీకు జయము అగుగాక! నీవు అనంత శక్తులకు అధిష్ఠాతవు. త్రిగుణములను నియమించువాడవు. వేదవేత్తలను ఆరాధించువాడవు. నీకు పదే పదే నమస్కారములు.

*17.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే|*

*త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే॥6983॥*

అదితికంటె పూర్వము పృశ్నిగర్భమున జన్మించిన వాడవు. వేదజ్ఞానముఅంతయు నీలోనే యున్నది. వాస్తవముగా నీవే విధాతవు. ముల్లోకములను నీ నాభియందే ఉన్నవి. ముల్లోకములకు అతీతమైన వైకుంఠలోకము నీ నివాసస్థానము. నీవు సకలజీవులలో అంతర్యామివై సర్వత్ర వ్యాపించియుందువు. పరమాత్మా! నీకు నమస్కారము.

*17.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*త్వమాదిరంతో భువనస్య మధ్యమనంతశక్తిం పురుషం యమాహుః|*

*కాలో భవానాక్షిపతీశ విశ్వం  స్రోతో యథాంతః పతితం గభీరమ్॥6984॥*

ప్రభూ! ఈ జగత్తునకు ఆదిమధ్యాంతములు నీవే. అనంతశక్తి గల పరమపురుషుడవు నీవే యని వేదములు వర్ణించుచున్నవి. లోతైన ప్రవాహము తనయందు పడిన గడ్డి మొదలగు వాటిని తీసికొనిపోయినట్లు, కాలస్వరూపుడవగు నీవు సంసార ప్రవాహమును అతివేగముతో నా శనమువైపు నడిపింతువు.

*17.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం  ప్రజాపతీనామసి సంభవిష్ణుః|*

*దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం  పరాయణం నౌరివ మజ్జతోఽప్సు|*

దేవా! సకలచరాచర ప్రాణుల, ప్రజాపతుల ఆవిర్భావములకు నీవే మూలకారణుడవు. జలములయందు మునిగినవానికి నావ సహాయకారియైనట్లు, స్వర్గమునుండి వెళ్ళగొట్టబడిన దేవతలకు నీవే పరమ ఆశ్రయుడవు".

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశోఽధ్యాయః (17)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదిహేడవ అధ్యాయము (17)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
**********************

కామెంట్‌లు లేవు: