27, ఆగస్టు 2020, గురువారం

# శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 # శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||
తారాసంగుని భంగి శీర్షముపయిన్ ధట్టించి కూర్చుండగా
నేరన్ ; మారుని గాల్చినట్టి నిటలాగ్ని స్థాన మాశింప; రం
గారన్ పన్నగహారమై నడత వక్రంబూన, నీ పాద మం
జీరంబై రవళించెదన్ సతతమున్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;
చంద్రుడిలాగా నీ నెత్తి మీద కూర్చోవాలి అనుకోవట్లేదు,
మన్మధుని దహించి వేసినట్టి ఉగ్రమైన నీ మూడో కన్ను స్థానమైన నీ ఫాల భాగాన్ని నేను ఆశించడం లేదు.
నీ మెడలో పడగవిప్పి విషం గ్రక్కే నాగు పాము స్థానాన్ని కూడా నేను కోరటం లేదు.నేను కోరుకునేది
నీ కాలికి కంకణం లాగా నీ పాదాల దగ్గర ఎప్పటికీ పడి ఉండేటట్లు ఇంత చోటు నాకు ప్రసాదించు స్వామీ, శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: