19, సెప్టెంబర్ 2020, శనివారం

. జడులై నాకముఁ

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺




*231. జడులై నాకముఁ గోలుపోవు సురలం జంభారినిం బ్రోవఁగా వడుగై భూమి బదత్రయం బిడుటకై వైరోచనిన్ వేఁడి రెండడుగుల్ సాఁచి త్రివిక్రమస్ఫురణ బ్రహ్మాండంబుఁ దా నిండుచుం గడుమోదంబున నుండు వామనున కెక్కాలంబునన్ మ్రొక్కెదన్."*



*భావము:* జంభాసురుని సంహరించిన ఇంద్రుడు, దేవతలు, అశక్తులై స్వర్గాన్ని ఓడిపోయారు. విష్ణుమూర్తి వారిని కాపాడటానికి వామనావతాం ఎత్తి, విరోచనుని కొడుకు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల దానం ఇమ్మని అడిగి పుచ్చుకున్నాడు. త్రివిక్రమావతారం ఎత్తి రెండు అడుగులు వేయడంతోనే బ్రహ్మాండం అంతా నిండిపోయి ఆనందంగా ఉండే ఆ వామనుడికి ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటాను."




*232. అని యిట్లు శుకుండు రాజునకు వామనావతారచరితంబు చెప్పె"నని సూతుండు మునులకుం జెప్పిన విని, వార లతని కిట్లనిరి.*




*భావము:* అని ఈ విధంగా శుకబ్రహ్మ పరీక్షిత్తు మహారాజునకు వామనావతార చరిత్రను చెప్పెను" అని సూతమహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాగా వినిన వారు సూతునితో ఇలా అన్నారు.

కామెంట్‌లు లేవు: