19, సెప్టెంబర్ 2020, శనివారం

ఆయుర్వేదం నందు నీటి ప్రాముఖ్యత

 ఆయుర్వేదం నందు నీటి ప్రాముఖ్యత - సంపూర్ణ వివరణ -1 . 


 * సమస్త జలరాశి యందు గంగాజలం ప్రశస్తమైనది. ఆకాశం నుండి పడిన గంగాజలం సౌమ్యధాతువులను వృద్ధిచేసి వాతపిత్తశ్లేష్మాలను సమస్థితిలో ఉంచును. 


 * ఆశ్వయుజ మాసం వదిలిపెట్టి ఇతర మాసముల యందు సముద్రజలమును పానము చేయరాదు . 


 * శుశ్రుత సంహిత యందు వర్షబేధముల గురించి చక్కని వివరణ ఉన్నది. సన్నని వరి అన్నము ముద్ద పాసిపోకుండా ఉన్నదానిని అదేవిధముగా ఎక్కువ ఎండిపోకుండా ఉన్నదానిని గ్రహించి ఒక వెండిగిన్నెలో పెట్టి వర్షము పడున్నప్పుడు ఆరుబయట ఉంచవలెను . వర్షములో తడిచిన ఆ అన్నము రెండు ఘడియల తరువాత చూసిన వేసినది వేసినట్లు ఉండి మెత్తబడకుండా ఉండిన యెడల గంగోదకము వర్షించుచున్నదని తెలుసుకొనవలెను . అలా కాకుండగా రంగు మారి మెత్తబడిపోయినచో సముద్ర ఉదకం వర్షించుచున్నది అని తెలుసుకొనవలెను . ఇందులో గంగోదకం ప్రధానము . ఆశ్వయుజ మాసములో గ్రహించవలెను . 


 * సముద్రజలము అనగా సముద్రము వలన వర్షించబడు జలం అని అర్థము. సాముద్ర జలం నిలువచేయకూడదు. సముద్రజలము అయినను అశ్వయుజ మాసము నందు కురిసినది తాగిన గంగోదకం వంటి గుణము కలిగి ఉండును. 


 * అగస్త్యోదయము అనునది ఆశ్వయుజ మాసమున ఏర్పడును . విషపూరితమైన జలములు సైతం అశ్వయుజ మాసమునందు విషరహితముగా మారును . చంద్ర , వాయు , సూర్యుల స్పర్శ ఏర్పడిన తరువాత పృథ్వి యొక్క గుణమును బట్టి జలము శీత , ఉష్ణ , స్నిగ్ద , రుక్షాధి గుణములతో కూడినదిగా ఉండును. ఇవి దేశకాలాదులను బట్టి మారును . 


 * తవ్వబడిన పల్లము నందలి జలమును , రాతి ప్రదేశము నందలి జలమును , నిర్మలమైన వస్త్రముచే గ్రహించబడిన జలమును , వికృతి చెందని జలమును , బంగారు పాత్రలో లేక మట్టిపాత్రలో ఉంచిన జలమును అన్ని కాలముల యందు ఉపయోగించుకోవచ్చు. తెల్లటి వస్త్రము నుండి గ్రహించిన జలము బంగారు పాత్ర లో ఉంచిన జలం శ్రేష్టమైనది. 



         జలము గురించి మరికొన్ని అమూల్యమైన విషయాలు తరవాతి పోస్టు నందు వివరిస్తాను . 



   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: