19, సెప్టెంబర్ 2020, శనివారం

శివామృతలహరి

    .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||


చెలువారన్ రజతాద్రిమందిరమునన్ శ్రీ గౌరితోఁ గూడి భా

సిలుదేవుండు శివుండదేల నిలుచున్ చిత్రంబుగా కాటిలో ?

కలరూపుంగని జ్ఞానియైన మనుజున్-కాలంబులున్ దేశముల్

సిలుగుల్ సౌఖ్యములంటవంచు దెలుపన్ శ్రీసిద్ధలింగేశ్వరా !

భావం; ( నాకు అర్ధమైన రీతిలో)


వెండికొండ పై శ్రీ గౌరీ సమేతముగా మణి మందిరములో దేదీప్యమానంగా వెలుగొందాల్సిన శివ మహాదేవుడు, 

ఆశ్చర్యకరంగా స్మశానంలో దర్శనమిస్తాడేమిటి?

అని ప్రశ్నించుకుంటే కాల స్వరూపుడైన మహా శివుణ్ణి ధ్యానించి,దర్శించుకుని,జ్ఞానం పొందిన మనుష్యుడికి 

కాలాలు, దేశాలు, సుఖాలు దుఃఖాలు ఏవీ అంటక, వాటికి అతీతుడు కాగలడని తెల్పటానికే కదా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: