30, సెప్టెంబర్ 2020, బుధవారం

రామాయణమ్.78

 

...

ఆ రాత్రి కీకారణ్యములో మొదటిరాత్రి వారు మువ్వురికి.

.

సాధారణమానవుడై జరిగిన విషయాలు తలచుకొని దుఃఖితుడయ్యాడు మరలా రామచంద్రమూర్తి.

.

లక్ష్మణా నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఏ తల్లిబిడ్డలను విడదీసినదో కానీ ఆవిడకు పుత్రవియోగము ప్రాప్తించినది.అంతటి మహాధార్మికుడైన మనతండ్రికి ఈ వయస్సులో ధర్మము,అర్ధము కంటే కామమే ప్రధానమైనదికదా ! .

.

ఈ లోకంలో ఎవడైనా తనకు అత్యంత విధేయుడైన కుమారుడిని ఒక ఆడుదాని మాటమీద విడిచేవాడుంటాడా?.

.

ముదిమివయస్సులో నేను దూరమయ్యానన్న దిగులుతో రాజు మరణిస్తాడు,భరతుడు రాజ్యాన్ని నిష్కంటకంగా ఏలుకుంటాడు.

.

చూడబోతే ఈ కైక నన్ను అడవులపాలుచేయడానికి,దశరధుడినిచంపడానికి,భరతుడిని రాజు చేయడానికే మన ఇంట చేరినదేమో అని అనిపిస్తున్నది.

.

కైక తనకు కలిగిన ఈ సౌభాగ్యముతో కన్నుమిన్నుగానక కౌసల్యా,సుమిత్రలను కష్టపెడుతుందేమో!

.

 లక్ష్మణా నీవు రేపు తెల్లవారగనే తిరిగి అయోధ్యకు వెళ్ళిపో! అనాధ అయిపోయిన నా తల్లిని రక్షించుము .

.

ఇది అమ్మకు దగ్గర ఉండి సేవ చేయవలసిన సమయము.

తల్లికి అనంతమైన శోకము కలిగిస్తున్నాను నేను.

 ఏ ఆడుదీ నా వంటి కొడుకును కనకుండుగాక, 

వ్యర్ధజన్ముడను నేను.

.

లక్ష్మణా నేను కోపిస్తే అయోధ్యనేమిటి,సమస్తభూమండలాన్నే స్వాధీనమొనర్చుకొనగలను .

,కానీ ఇది పరాక్రమము చూపే సందర్భముకాదు కదా!.

.

ఇలా అంటూ కంటినిండా నీరునింపుకొని దైన్యముతో ఇంకా ఏమీ మాటాడలేక అలాగే కూర్చుండిపోయాడు రాముడు.

.

 విలపిస్తున్న రాముడిని ఓదార్చాడు లక్ష్మణుడు.

.

అన్నా నీవే ఇలా దిగులుపడితే నేనూ ,వొదినగారూ ఏం కావాలి? నీవు దగ్గరలేక పోతే నేను గానీ ,సీతమ్మకానీ నీటినుండి బయటకు తీసిన మత్స్యములమైపోతామయ్యా! 

క్షణకాలము కూడా భూమిపై మనలేము.

.

శత్రుసంహారకుడవైన ఓ రామా ! నిన్ను విడిచి నా తల్లి సుమిత్రనుకానీ,శత్రుఘ్నుని కానీ,తండ్రినికానీ ఆఖరికి అది స్వర్గమైనా కానీ నేను వెళ్ళను.

.

సర్వలోకాలను ఆనందింపచేయువారలలో శ్రేష్ఠుడైన రాముడు(రామో రమయతాం శ్రేష్ఠః) తమ్ముడి మాటలతో తేరుకొని మనస్సును దృఢం చేసుకొని వనవాసము పూర్తిగావించుకొనుటకు సంకల్పించుకొన్నాడు.

.

అప్పుడు ఆ అన్నదమ్ములిరువురూ పర్వతచరియలపై నిర్భయముగా సంచరించే రెండు సింహాలలాగ ప్రకాశించారు.

.

NB

.

ప్రతి మనిషికి జీవితంలో ఇలాంటి ఘట్టాలు దాదాపు గా ఏదో ఒక సందర్బంలో ఎదురవుతూనే ఉంటాయి .మనసు నీరవుతూనే ఉంటుంది అయినా ఎన్నుకున్న మార్గంలో ముందుకు నడిచే వాడే ధీరుడు...

.

అనుకోలేదాయన అడవులకు వెళ్ళాల్సి వస్తుందని !


కానీ పిడుగులాంటి ఆ నిర్ణయం తనకు తనే చేసుకున్నాడు . మార్పును ఆహ్వానించాడు .ఆ మార్పుకు అలవాటుపడే క్రమంలో రాముడి మనస్సుకు దర్పణమిది! 

.

CHANGE MANAGEMENT!.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక


.

కామెంట్‌లు లేవు: