30, సెప్టెంబర్ 2020, బుధవారం

*🌷అధికమాసం పౌర్ణమి విశేష పౌర్ణమి🌷*

 అధికమాసంలో వస్తున్న పౌర్ణమి రేపు, మీ కులదేవత అంటే ఇంటి దేవుడు ఎవరు ఉన్నారు ఆ దేవతా ఆరాధన విశేషంగా ఆరాధించాలి విగ్రహం ఉంటే పసుపునీళ్లు పాలతో అభిషేకం చేయాలి.. బియ్యంపిండి లేక గోధుమపిండి తో ప్రమిధలు చేసి పానకం వడపప్పు తో పాటు పరమాన్నం నైవేద్యం పెట్టాలి..


👉మీరు ఉపాసనలో ఉంటే ఆ ఉపాసిస్తున్న దేవతని అష్టోత్తరం సహస్రనామoతో అర్చించాలి జపం అధిక సంఖ్యలో చేయాలి. 


👉ఇవన్నీ చేయలేని వారు కూడా రేపు ఏదైనా ధానం చేసి అధికఫలితం పొందవచ్చు బ్రాహ్మణులకు స్వయంపాకం, బీదవాళ్ళకు భోజనం, మజ్జిగ ధానం చేయటం చాలా మంచిది రేపు పూజ చేస్తున్న వారు కూడా తోచినంత గా బీదవాళ్ళకు మీ పిల్లలతో ధానం చేయిస్తే మంచిది.


👉ముఖ్యంగా ఉద్యోగం సమస్యలో ఉన్నవారు లక్ష్మీదేవి కానీ శివయ్యకు కానీ పాలల్లో తెన కలిపి అభిషేకం చేసి ఉసిరికాయ , పానకం నైవేద్యంగా పెట్టి స్త్రోత్ర పారాయణం చేసి అవుకు ఏదైనా పండు తినిపిస్తే వారికి ఉన్న ఆ సమస్య గట్టెకుతుంది..


👉ముఖ్యంగా సంతానం లేని వారు కృషుడు కి పాలకోవ, పాలు, వెన్నెలో పటికబెల్లం కలిపి, అటుకులు తులసి ఇవన్నీ కృష్ణయ్యా కు నైవేద్యం పెట్టి సంతాన వేణుగోపాలస్వామి మంత్రం , మధురాష్టకం, అష్టోత్తరం ఇవన్నీ స్త్రోత్రం చేసి మీరు నైవేద్యంగా పెట్టిన పాలకోవ కొద్దిగా తీసుకుని తర్వాత ఆ ప్రసాదాన్ని గర్భవతి కానీ పసి పిల్లలకు కానీ పంచాలి. దంపతులు ఇద్దరు కలిసి గో పూజ చేయించు కుంటే సంతాన దోషం తొలగిపోతుంది.


👉మహావిష్ణువు కి విష్ణు సహస్రనామ పారాయణం పంచామృత అభిషేకం అర్చన తులసి, పచకర్పూరం వేసిన తీర్థం సమర్పించి పూజించాలి.


👉మనమందరం శివునికి, దుర్గమ్మకి, లక్ష్మీదేవికి, సుబ్రహ్మణ్యం స్వామికి, వినాయకుడి కి విశేషం గా అభిషేకం , అర్చన, స్త్రోత్రం, కుంకుమాపూజ, దీపాలంకరణ సేవతో పూజిస్తాము కాబట్టి ఎవరి ఓపిక, శ్రద్దను బట్టి కూడా వారు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవారు హోమం చేయించుకుంటే అధికమాసంలో అధికంగా ఫలితం ఉంటుంది..


👉పౌర్ణమి పారాయణ చేస్తున్న మా బంగారు తల్లులు యధాశక్తిన తల్లిని పూజించి అర్చించి వెన్నెల పారాయణ చేయండి. ఇది అధికమాసం లో.పౌర్ణమి కనుక ఇంటి దేవున్ని రేపు ఎంత ఉదయాన్నే పూజిస్తే అంత మంచిది అంటే సూర్యోదయం సమయానికి దీపారాధన చేసేయాలి..


రేపు పూజకు కావాల్సిన బియ్యంపిండి, అభిషేకం పదార్థాలు, పూజకు కావలసినవి, దీపాలు అన్ని ఈ రోజు సిద్ధం చేసుకోండి.. ప్రత్యేకంగా రేపు ఉదయం 3 గం (శివ /విష్ణు/ శక్తి) మీరు ఉపాసించే దేవతకు అభిషేకం విశేష ఫలితాలు ఇస్తుంది పూజించిన పర్వాలేదు కానీ ఘడియలు అప్పుడు ఉన్న లగ్న బలం మీకు ఎన్నో రెట్లు ఫలితం ఇస్తుంది పూజ తర్వాత ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కనుక వీలైతే ప్రయత్నం చేయండి


👉 ఇల్లు కొనాలి అనుకునే వారు ఇంటి పైన సమస్య ఉన్నవారు 108 సార్లు మణిద్వీపం పారాయణ రేపు పూర్తి చేసే విధంగా చేయాలి.


👉 ఏకవారం గురుచరిత్ర పారాయణ కూడా ఒక్కరోజులో చేసే వారు రేపు చేసుకోవచ్చు


*🙏శ్రీ మాత్రే నమః🙏* 

కామెంట్‌లు లేవు: