30, సెప్టెంబర్ 2020, బుధవారం

త్రైలింగ_స్వామి

 







                  పుట్టింది తెలుగు దేశం లో అయినా ,ఆయన గడిపిన కాలమంతా కాశీ లోనే .ఆయన చూపించిన మహిమలు అపారం .వారు పొందిన సిద్దులనేకం .వారి దివ్య విభూతి అనంతం .ఆయనే త్రైలింగ స్వామి .అసలు పేరు శివ రామయ్య .విశాఖ పట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామం లో జన్మించారు .తండ్రి నరసింహారావు ,తల్లి విద్యావతి ,సంపన్న బ్రాహ్మణ కుటుంబం .ఆయన జననం 19 -12 -1607 తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడి మీద పడటం ఆమె చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు .చిన్నప్పటి నుంచి ఐహిక వాంచల మీద కోరిక లేదు .నలభై ఏళ్ళకు తండ్రి ,యాభై రెండో ఏట తల్లి చని పోయారు .శ్మశానాన్నే ఇల్లు గా చేసుకొని ఆస్తిని అంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి ,అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.


        స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానం లో బస్తుర్ చేరాడు ..అక్కడ భాగీరధి స్వామి తో పుష్కర తీర్దానికి వెళ్ళాడు .ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు .అప్పటికి అయ్యగారి వయస్సు డెబ్భై ఎనిమిది .గురు సమక్షం లో పదేళ్ళ సాధన చేసి అద్భుత శక్తుల్ని సంపాదించు కొన్నాడు .గురువు మరణించిన తర్వాత తీర్ధ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు ..అక్కడ స్వంత ఊరి వారు కని పించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళ లేదు ..రామేశ్వరం లో ఒక బ్రాహ్మణ బాలుడు చని పోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే ,గుండె కరిగి కమండలం లోని నీరు వాడి మీద చల్లాడు .వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్య పరచాడు ..ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీ రామ లింగేశ్వరుడే గణ పతి స్వామి అనుకోన్నారందరూ .అక్కడి నుండి నేపాల్ చేరాడు .అక్కడ అడవి లో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయన కు ఎదురు గుండా కదల కుండా కూచుని పోయింది .రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడై నాడు పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు .ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు .నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుక లిస్తే తీసుకో కుండా జంతు హింస చేయ వద్దని హితవు చెప్పాడు స్వామి .అక్కడి నుంచి టిబెట్ ,తరువాత మానస సరోవరం సందర్శించి ,దారిలో ఎన్నోఅద్భుతాలను చూపి హిమాలయాలలో చాలా కాలమ్ తపస్సు చేసి నర్మదా నదీ తీరం లో మార్కండేయ ఆశ్రమం లో ”ఖాఖీ బాబా”అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు ..ఒక రోజూ తెల్ల వారు జామున నర్మదా నది లో పాలు ప్రవహిస్తున్నట్లు ,ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు ఖాఖీ బాబా చూశారు .గణపతి లోని మహిమేమిటో గ్రహించారు .విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు.


              1733 లో . ప్రయాగ చేరారు .తపో నిష్టలో ఉండగా ఒక సారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తారణ భట్టా చార్య ఆశ్రమం లోకి పోదామని చెప్పినా కదల లేదు .దూరం లో ఒక పదవ మునిగి పోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు .అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగు తుంటే .దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు .శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడి లోను మహాశక్తులు అజ్ఞాతం గా ఉంటాయని వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు.


                  1737 లో కాశీ చేరారు దిగంబర గణ పతి స్వామి .అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు .కాశీ లో 150 ఏళ్ళు గడి పాడు .ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం .గడ్డాలు ,మీసాలు పెరిగి దీర్ఘ శరీరం తో దిశ మొలతో .మెడ లో పెద్ద రుద్రాక్ష మాల తో ,పెద్ద బాన పొట్ట తో కాశీ నగర వీధుల్లో సంచ రించే వాడు .గంటల సేపు గంగా జలం పై పద్మాసనం లో తేలి ఉండే వాడు .అలాగే గంటల కొద్దీ కాలమ్ నదీ గర్భం లో మునిగి ఉండే వాడు .అంటే కుంభక విద్య లో అద్భుత మైన నేర్పు ఆయనకు ఉండేదాన్న మాట ..కుష్టు రోగులకు సేవ చేసి వారి ని ఆదరించాడు బాబా .వెద వ్యాస ఆశ్రమం చేరి అక్కడ సీతా నాద బంద్యో పాద్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి ,హనుమాన్ ఘాట్ చేరాడు .ఒక మహారాష్ట్ర స్త్రీ రోజూ విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజూ చూస్తూ ఏవగించు కొనేది .ఆమె భర్త కు రాచ పుండు .ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించ మని కోరారు .కానీ తాను తూల నాడిన ఆయన దగ్గరకు వెళ్ళ టానికి సందేహించింది .చివరికి వెళ్లి కాళ్ళ మీద పడింది .ఆయన ఇచ్చిన విభూతి తో జబ్బు మాయ మైంది


                  కాశే మహా నగరం లో ఎందరో తెలుగు వారు ఉపాధ్యాయులు గా అధ్యాపకులు గా ఉన్నారు .వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు .ఆయనకు ”త్రైలింగ స్వామి ”అనే పేరు పెట్టారు .తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా .అప్పటి నుంచి ఆ పేరే స్థిర పడి పోయింది .1800 లో తన మకాం ను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవం కు మార్చారు.


ఎప్పుడూ మౌనమే ,ధ్యానమే ,తపస్సు యోగ సమాధే .అనుకే ఆయన్ను ”మౌన బాబా ”అన్నారు .కాశీ రాజు వీరిని తన పడవ లోకి ఆహ్వానిస్తే వెళ్ళారు .రాజు బ్రిటిష్ వారు బహుమతి గా ఇచ్చిన కత్తి ని స్వామి చూడాలని ముచ్చట పడితే ఇచ్చారు .అది పొరపాటున గంగలో జారి పడి పోయింది .రాజుకు కోపం వచ్చి తిట్టాడు .స్వామి తన చెయ్యి గంగా నది లో పెట్టి ఒకే రకం గా ఉండే రెండు కత్తులను తీసి అందు లో రాజుదేదో గుర్తించి తీసుకో మన్నాడు .రాజు గుర్తించ లేక పోతే తానె గుర్తించి చెప్పి ఇచ్చాడు .రెండో దాన్ని గంగలోకి విసిరేశారు స్వామి.


           దిగంబరం గా తిరగటం కొంత మందికి నచ్చక కేసు పెట్టారు .కోర్టు లో కేసు నడి చింది .ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వేశాడు .అలాగే తెచ్చారు .ఆయన మహిమలను అధికారులు ఆయన కు వివ రించారు .ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు .స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు .వెంటనే తన చేతి లో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు .మతి పోయింది మేజిస్ట్రేట్ కు .అయితే సుగంధ పరి మళం కోర్టు అంతా వ్యాపించింది .స్వామి మహిమ తెలిసి దిగంబరం గా తిరిగే హక్కు ఇచ్చాడు.

ఒక సారి ఒక ఆకతాయి దుండగులు కొందరు సున్న పు తేట ఇచ్చి పాలు అని చెప్పారు .శుభ్రం గా తాగేశాడు స్వామి . .వెంటనే మూత్ర రూపం లో దాన్ని అంతట్ని విసర్జించాడు.


                      శ్రీ రామ కృష్ణ పరమ హంస 1868 లో కాశీ వచ్చి నప్పుడు తన మేనల్లుడు హృదయ నాద్ తో కలిసి మౌన స్వామిని దర్శించారు .ఆయనకు బాబా నశ్యం వేసు కొనే కాయ కానుక గా ఇచ్చారు .స్వామిని ”నడయాడే విశ్వనాధుడు ”అని చెప్పారట పరమ హంస ..ఇంకో సారి అర్ధ మణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తిని పించారట .పరమ హంస స్వామిని” ఈశ్వరుడు ఏకమా అనేకమా ”అని ప్రశిస్తే -సమాధి స్తితి లో ఏకం అనీ ,వ్యావహారిక దృష్టి లో అనేకం అని సైగల తోనే చెప్పారు స్వామి .పరమ హంస స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు .ఇద్దరు మహా పురుషులే .పరమ హంసలే .ఒకరి విషయం రెండో వారికి తెలుసు .ఎన్నో అద్భుతాలు చేసిన రామ కృష్ణులు స్వామిని అంత గా గౌర విన్చా రంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది ..ఒక సారి రాజ ఘాట్ నుండి విద్యానంద స్వామి అనే యతి వీరిని దర్శించటానికికేదార్ ఘాట్ లో ఉన్న మన స్వామి దగ్గరకు వచ్చారు .ఇద్దరు గాడ్హం గా ఆలింగనం చేసుకొన్నారు .కాసేపట్లో అందరు చూస్తుండ గానే ఇద్దరు మాయమైనారు .అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు .తాను ఆయన్ను రాజ ఘాట్ లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.


            

     పంచ గంగా ఘట్టం లో చిన్న భూ గృహం నిర్మింప జేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండు నెలల గడువు కావాలని కోరితే మరణాన్ని వాయిదా వేసుకొని ,భక్తుడైన మంగళ దాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధి లో ఉంది ,తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనం లో కూర్చుండి ,బ్రహ్మ రంధ్రాన్ని చేస్దించుకొని 26 -12 -1887

న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమ వారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించు కొన్నారు .ఆయన శరీరాన్ని చెక్క పెట్టె లో పెట్టి ఆయన కోరిన విధం గానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహం లో వదిలారు .ఆ రోజూ నుండి ఈ రోజూ వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం పూజా జరుగు తాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్ లోని మఠం లో జరగటం విశేషం .పతంజలి యోగం లో విభూతి పాదం లో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు ,కుంభక యోగం లో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకొన్నారు .ఆయన సంస్కృతం లో రాసిన ”మహా వాక్య రత్నావళి ”కి వ్యాఖ్యను బెంగాలి లో రాశారు.


కాని మన తెలుగు వారి ద్రుష్టి ఇంకా దాని పై పడక పోవటం విచారకరం అంటారు బాధతో రామ రాజు గారు .280 సంవత్సరాలు జీవించి ,స్వచ్చంద మరణాన్ని పొంది ,యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్ప వృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగు వారై ఉండి ఉత్తర దేశం లో అందులోను కాశీ మహా క్షేత్రం లో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రైలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి .

కామెంట్‌లు లేవు: