4, నవంబర్ 2020, బుధవారం

ఈ పద్యాన్ని గుర్తించండి

 ఈ పద్యాన్ని గుర్తించండి.


నరసింహ కృష్ణరాయా

దురమున నీ పేరిటేఱు తురకలఁజంపెన్

గరిరాజవరదుఁడంచును

గరిఘట లట మిమ్ముఁజూచి గ్రక్కున వచ్చెన్.


కృష్ణరాయా నీ పేరు గల ఏరు(కృష్ణా నది) వరదలు, తురకలు ను జంపెను.

ఏనుగుల రాజును (గజేంద్రుడిని) రక్షించితివని కాన, వారి(తురకల) ఏనుగులు మిమ్మల్ని జూచి మీకడ జేరినవి.


తురుష్కులు కృష్ణానది వరదలో కొట్టుకుపోగా వారి ఏనుగులు మాత్రం నీటి దాడికి తట్టుకుని కృష్ణదేవరాయల పంచన చేరినట్టు వృత్తాంతము.


అంటే రాయల కాలంలో రాయలు అక్కర్లేదు తన పేరు పెట్టుకున్న ఎవరైనా శత్రువు సైన్య మూకను మట్టి కరిపించగలరు అని.

కామెంట్‌లు లేవు: