4, నవంబర్ 2020, బుధవారం

రామాయణం మాసంస్కృతి"*

 🙏జైశ్రీమహాదేవ🙏

ఈ *మాట* ఏ దేశం అన్నదో మీకు తెలుసా? 

 *ఇస్లాం మామతం*

----కానీ---

*"రామాయణం మాసంస్కృతి"* 


👉 తెలీదా? అయితే చదవండి.


ఒకసారి పాకిస్తానీ నియంత జనరల్ జియావుల్ హక్ *ఇండోనేషియా* వెళ్ళాడు. 

అది ఒక ముస్లిం దేశమని అందరికీ తెలిసిన విషయమే. ఆ దేశ సైన్య శిక్షణానంతరం ఉండే Passing Out Parade కి జియావుల్ హక్ ని ముఖ్య అతిథి గా ఆహ్వానించారు. 


అయితే ఈ పరేడ్ మొత్తం 

*శ్రీ హనుమంతుని విగ్రహం* ముందు జరుగుతున్నది. అధికారులు ఒక్కొక్కరిగా స్వామి విగ్రహం ముందే శపథం స్వీకరిస్తున్నారు. ఇది చూసిన జియావుల్ కి ఒళ్ళు మండిపోయింది. 

అక్కడి సైన్యాధికారిని ఇదేమిటని అడిగాడు. అతను ఎంతో గర్వంగా, గౌరవంగా మాట్లాడుతూ౼౼

*"తాము మతాన్ని మార్చుకున్నామేగానీ ,* *మా సంస్కృతిని, పూర్వీకులను మార్చుకోలేదని సమాధానమిచ్చాడు.*


వాళ్ళు పరిరక్షిస్తున్న *సనాతన సంస్కృతి* మన భారతీయుల నుండి వారసత్వంగా గ్రహించినదే కదా! 

మతం మార్చుకున్నవాళ్లే తమ సంస్కృతి పరిరక్షణకై అంత శ్రద్ధ తీసుకుంటున్నపుడు సనాతన ధర్మ వారసులం, హిందువులం, భారతీయులమైన మనం, 

మన సంస్కృతీపరిరక్షణలో *ఇంకెంత శ్రద్ధ వహించాలి???* 

ముసుగు దొంగలు, దేశ ద్రోహులు సృష్టించిన *సెక్యులరిజం* అనే మాయలో, గోలలో పడిపోయిన భారతీయ హిందువులు - మతనిరపేక్షదేశం నుండి సంస్కృతీనిరపేక్ష దేశంగా ఎందుకు వెళ్ళిపోతున్నాము??? అత్యంత పురాతన, విశిష్ట,  దైవిక సంబంధమైన మన సంస్కృతిని మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇదెలాగో ఉదాహరణలతో మాట్లాడుకుందాం.

 *1950వ దశకంలో ఇండోనేషియాలో అంతర్జాతీయ రామాయణమహోత్సవం* జరిగింది. అందులో భాగంగా జరిగే ఒక నృత్య నాటికలో పాల్గొనుటకు కళాకారులను పంపమని ఆ దేశం ప్రపంచదేశాలకు ఆహ్వానం పంపింది. కొన్ని ముస్లిం దేశాలు కూడా కళాకారులను పంపాయి.

 కానీ *అప్పటి ప్రధాని నెహ్రూ -* *"మనది సెక్యులర్ దేశమనీ, అందువలన కళాకారులను పంపటం కుదరదు"* అని తెలిపాడు. అంటే *మన దేశ సంస్కృతీ పరిరక్షణ కన్నా ఆయన కి సెక్యులరిజం ఎక్కువైపోయింది.* 


ఇక మరో విషయాన్ని చెప్పుకుంటే -- *ఇందిరాగాంధీ* ఇంకొకపని చేసారు. మొరాకో రాజధానిలో జరిగే *అంతర్జాతీయ ముస్లిం సమ్మేళనానికి* అప్పటి *కేంద్రమంత్రి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ను పంపారు.*

 అసలు విషయమేమంటే - *మనకు అసలు ఆహ్వానం అందనే లేదు.* 

పైగా ఆవిడ  ఏమని సమర్థించుకున్నారో  తెలుసా? చాలా ముస్లిం దేశాలకన్నా మనదేశంలో *ముస్లింల జనాభా* ఎక్కువట, కాబట్టి పంపక తప్పలేదట. 

"మీరంతా తెలివైనవారు కాబట్టి నేను మొత్తం  విషయాన్ని వివరించనవసరం లేదు."


 కొంతకాలం కిందట *ఇండోనేషియా దేశం యొక్క విద్య మరియు సంస్కృతీ శాఖామంత్రి అనీస్ బాస్వేదన్* మనదేశం వచ్చారు. 

ఏమన్నారో చూడండి:-  - 

"మా దేశం రామాయణ ప్రదర్శనలకు పెట్టిందిపేరు. 

మా కళాకారులు సంవత్సరంలో రెండుసార్లు మీదేశంలోని వివిధ నగరాలలో పర్యటించి రామాయణ ప్రదర్శనలు చేయడానికి అనుమతించండి. 

మీ కళాకారులు కూడా మా దేశానికి రండి. 

ఇరుదేశాలు కలిసి ప్రదర్శనలు చేద్దాము. 

ఇరుదేశాల విద్యార్థులకు కూడా శిక్షణ ఇద్దాము. 

మా విద్యా విధానంలో రామాయణం పవిత్ర గ్రంధాన్ని చేర్చాము. అని అన్నారు. 

"ఈ విషయం మీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించిందా? లేదా? చెప్పండి. 

ఇండోనేషియా మొదటి రాష్ట్రపతి సుకర్ణో సమయంలో, పాకిస్థాన్ కు చెందిన డెలిగేషన్ ఒకటి అక్కడ పర్యటించింది. అపుడు వాళ్ళు *రామలీల* ప్రదర్శించడాన్ని చూసి షాక్ తిన్నారట. ఒక ముస్లిం దేశంలో రామలీలా? అని అడిగారట. దానికి ఇండోనేషియా పాలకులు సుకర్ణో సమాధానమేమిటో తెలుసా? - 


👉 *"ఇస్లాం మా మతం అంతే...*

*కానీ రామాయణం మా సంస్కృతి."* 


ఇండోనేషియా దేశపు *కరెన్సీ నోట్ పైన బొజ్జ గణపయ్య చిత్రం* ముద్రించారు.


 అటువంటి దేశాధ్యక్షుడికి, తమ సంస్కృతీ పరిరక్షణలో భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్న ఇండోనేషియా ముస్లింలకు శతకోటి ప్రణామాలు చేద్దాం. 

🙏🙏🙏🙏🙏

*ఈ వాస్తవాలు మన భారతీయ హిందూ సమాజానికి మేలుకొలుపు అవుతుందని, లౌకికవాదం, సెక్యూలరిజం వంటి మాటలు ముమ్మాటికీ హిందూ వ్యతిరేక పాలకుల కుట్రలు అని గుర్తించి, ఈ క్షణం నుండే దేవాలయం వైపుగా, మన సనాతన ధర్మ ఆచరణ దిశగా అడుగులు వేద్దాం. మన హిందూ ధర్మమే ఉత్తమ జీవన విధానమని, గొప్ప విజయాలకు, అభివృద్ధికి మూలమని నేటి కరోనా పరిస్థితులు ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశాయి. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి. 

*హిందువుగా గర్వంగా జీవిద్దాం.* 


🙏  ధన్యోస్మి  🙏

శ్రీమహాదేవపీఠమ్

కామెంట్‌లు లేవు: