*గరుడ పురాణం_*10వ భాగం*
_*దేవపూజా విధానం - వజ్రనాభ మండలం విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ:-*_
_రుద్రదేవా! ధర్మార్థకామమోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజా! గ్రహదేవతల మంత్రాలివి:_
ఓం నమః సూర్యమూర్తయే ।
ఓం హ్రాం హ్రీం సః సూర్యాయనమః ।
ఓం సోమాయ నమః ।
ఓం మంగలాయ నమః |
ఓం బుధాయ నమః ।
ఓం బృహస్పతయే నమః ।
ఓం శుక్రాయ నమః ।
ఓం శనైశ్చరాయ నమః ।
ఓం రాహవే నమః ।
ఓం కేతవే నమః |
ఓం తేజశ్చండాయ నమః ।
_ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి._
_*శివపూజను ఇలా చేయాలి :*_
_ఓం హ్రాం శివాయనమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. ఓం హ్రాం శివమూర్తియే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రాం హృదయాయ నమః!, ఓం హ్రీం శిరయే స్వాహా! ఓం హ్రూం శిఖాయై వషట్ / ఓం హ్రీం కవచాయ హుం | ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్ ఓం హ్రః అస్త్రాయ నమః / అనే మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. తరువాత_
ఓం హ్రాం సద్యోజాతాయ నమః ।
ఓం హ్రీం వామదేవాయ నమః |
ఓం హ్రూం అఘోరాయ నమః ।
ఓం హ్రీం తత్పురుషాయ నమః ।
ఓం హౌం ఈశానాయ నమః ।
_అనే మంత్రాలతో ఆయన పంచముఖాలనూ పూజించాలి._
_*ఇలాగే విష్ణుదేవుని పూజించునపుడు ఓం వాసుదేవాసనాయ నమః మంత్రంతో విష్ణుని ఆసనాన్ని పూజించాలి. ఆ తరువాత*_
ఓం వాసుదేవమూర్తయే నమః|
ఓం అం ఓం నమోభగవతే వాసుదేవాయ నమః ।
ఓం ఆం ఓం నమోభగవతే సంకర్షణాయ నమఃl
ఓం అం ఓం నమోభగవతే ప్రద్యుమ్నాయ నమః |
ఓం అః ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః ।
_*అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి. అప్పుడు*_
ఓం భూః ఓం నమోభగవతే వరాహాయ నమః |
ఓం నారాయణాయ నమః । ఓం తత్సద్ బ్రహ్మణే నమః | ఓం హ్రూం విష్ణవే నమః ।
ఓం క్రౌం నమోభగవతే నృసింహాయనమః ।
ఓం కంటం పంశం వైన తేయాయ నమః ।
ఓం జం ఖం రం సుదర్శనాయ నమః |
ఓం ఖంఠంఫంషం గదాయై నమః ।
ఓం వం లం మం క్షం పాంచజన్యాయ నమః ।
ఓం ఘం ఢం భం హం శ్రియై నమః ।
ఓం గండం వంసం పుష్యై నమః ।
ఓం ధం షం వంసం వనమాలాయై నమః ।
ఓం సం దం లం శ్రీ వత్సాయ నమః ।
ఓం ఠం చం భం యం కౌస్తుభాయ నమః |
ఓం గురుభ్యో నమః |
ఓం ఇంద్రాది భ్యోనమః ।
ఓం విష్వక్సేనాయ నమః ।
_*అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలనూ, ఆయుధాలనూ, వాహనాదులనూ నమస్కారం చేస్తూ పూజించి శివపూజలో వలెనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి.*_
_శంకర దేవా! విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీ దేవి ప్రముఖమైనది. ఆమెనూ మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి._
ఓం హ్రాం హృదయాయ నమః । ఓం హ్రీం శిరసే నమః ।
ఓం హ్రూం శిఖాయై నమః ।
ఓం హ్రీం కవచాయ నమః ।
ఓం హౌం నేత్రత్రయాయనమః ।
ఓం హ్రః అస్త్రాయ నమః ।
_*సరస్వతీ దేవి యొక్క యెనిమిది శక్తులైన శ్రద్దాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి.*_
ఓం హ్రీం శ్రద్ధాయై నమః ।
ఓం హ్రీం బుద్ద్యై నమః |
ఓం హ్రీం కలాయై నమః ।
ఓం హ్రీం మేధాయై నమః |
ఓం హ్రీం తుష్యై నమః ।
ఓం హ్రీం పుష్యై నమః ।
ఓం హ్రీం ప్రభాయై నమః ।
ఓం హ్రీం మత్యై నమః ।
_*తరువాత క్షేత్రపాలునికీ, గురువుకీ, పరమ గురునికీ ఈ మంత్రాలతోపూజలు చేయాలి.*_
ఓం క్షేత్రపాలాయ నమః ।
ఓం గురుభ్యో నమః ।
ఓం పరమ గురుభ్యో నమః ।
_*తరువాత సరస్వతీదేవికి కమలవాసినీ రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి.*_
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి